• బాలీవుడ్ హీరోయిన్స్ దీవాలీ నగలలో వెలిగిపోతున్నారు.పండుగ పేరు చెప్పితే కొత్త నగలు వచ్చి వాలతాయి. పైన ధనత్రయోదసి దీపావళి కలసి వచ్చాయి. వరుసగా కూర్చున్న హారాలు, పెద్ద పాల్కో చోకర్ సెట్లు, బంగారు పూసల హారాలు, ఎప్పటికి ఎవ్వర్ గ్రీన్ అనిపించే డిజైన్స్ ధరించిన మన తారలు పండుగకు కొలువు తీరారు. ఖరీదైన నగల లోనే కాదు ఇమిటేషన్ జువెలరీ తో కూడా వాళ్ళు ఈ సాంప్రదాయ వేడుకలో, ఎన్నెన్నో కొత్త, పాత నగల తో మెరుపులు మెరిపించారు. ఒక్కసారి ఇమేజిన్ చేస్తే మీకే తెలుస్తోంది. కొత్త నగల్లో ఏ డిజైన్స్ వచ్చాయో.

    దీవాలీలో నగల వెలుగులు

    బాలీవుడ్ హీరోయిన్స్ దీవాలీ నగలలో వెలిగిపోతున్నారు.పండుగ పేరు చెప్పితే కొత్త నగలు వచ్చి వాలతాయి. పైన ధనత్రయోదసి దీపావళి కలసి వచ్చాయి. వరుసగా కూర్చున్న హారాలు, పెద్ద…

  • సీజన్ కోట భోజనం ఉంటుందా అంటే ఉంటుంది. ఉదయం టిఫీన్ గా రెగ్యులర్ టీఫిన్ స్థానంలో తయారయిన ఓట్ మిల్ ఆహార పదార్ధాలు తీసుకొవాలి. కాఫీ స్థానంలో జింజర్ టీ తాగాలి. ముడి బియ్యం తొ వండిన అన్నంతో రాకరకాల కూరగాయలు కలిపి చేసిన్ కూరలు తినాలి. చలి కాలంలో నిమ్మకాయ చేసే మేలు అంత ఇంత కాదు. సాయంత్రం వేళలో పల్లీలు,బాదం పప్పు తినాలి. ఇక రాత్రి వేళలొ తినే భొజనంలొకి వండేవి ఆలివ్ అయిల్ ఉండేలా చూసుకొవాలి. చివరగా డిన్నర్ ముగించే ముందు వెన్న తీసిన గోరు వెచ్చటి పాలు తీసుకోవాలి. ఈ కాలం వ్యయమానికి అనుకూలంగా ఉంటుంది. చలికాలంలో సమయం వృధా చేయకుండా వ్యయమానికి సమయం కేటాయించాలి.

    వింటర్ లో ఇలా తినాలి

    సీజన్ కో భోజనం ఉంటుందా అంటే ఉంటుంది. ఉదయం టిఫీన్ గా రెగ్యులర్ టీఫిన్ స్థానంలో తయారయిన ఓట్ మిల్ ఆహార పదార్ధాలు తీసుకొవాలి. కాఫీ స్థానంలో…

  • మొహం గురించి శరీరం గురించి ఫిట్నెస్ గురించి చాలా సార్లు మాట్లాడుకుంటాం. శ్రద్ధ తీసుకుంటాం గానీ శంఖం లాంటి మెడకోసం ఎప్పుడూ ఆలోచించం. శరీరాన్ని మెదడునీ కనెక్ట్ చేసేది మెడ. చూసేందుకు చిన్నగా ఉన్నా విభిన్న గ్రూపులు కలిసిన పన్నెండు కండరాలుంటాయి మెడలో. సరైన పోశ్చర్ లేకపోయినా సరిగ్గా కూర్చోకపోయినా మెడ చాలా త్వరగా ప్రభావితం అవుతుంది. మెడను బలోపేతం చేయగలిగే స్ట్రెంగ్త్ నింగ్ ఎక్సర్ సైజులు అనేకం ఉన్నాయి. నెక్ ఎక్సర్ సైజులు సింపుల్ వే అయినా మెడను బలంగా ఉంచుతాయి. నిపుణుల పర్యవేక్షణలో సరిగ్గా నేర్చుకుని ప్రతి రోజూ పది నిమిషాలు నెక్ ఎక్సర్ సైజులు చేయమంటున్నారు డాక్టర్లు.

    శంఖం లాంటి మెడ కోసం

    మొహం గురించి శరీరం గురించి ఫిట్నెస్ గురించి చాలా సార్లు మాట్లాడుకుంటాం. శ్రద్ధ తీసుకుంటాం గానీ శంఖం లాంటి మెడకోసం ఎప్పుడూ ఆలోచించం. శరీరాన్ని మెదడునీ కనెక్ట్…

  • గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ తాజా సర్వే లో, శుభ్రత అంటే టాయిలెట్స్ అటాచ్డ్ బత్రూమ్స్ లో కంటే కిచెన్ రూమ్ లోనే బాక్టీరియాల ప్రమాదం 20 శాతం ఎక్కువగా వుందని తేల్చింది. మాములుగా చేతులు కదగకుండా బాక్టీరియా పోదు భరించ లేనంత వేడి నిటితో కడగాలి. అది అసాధ్యం కనుక యాంటీ బాక్టీరియల్ లిక్విడ్ లో కడుక్కోమంటున్నారు చేతుల్న. గిన్నెలనన్నీ 65 డిగ్రీల వేడి నీళ్ళల్లో పడేసి శుభ్రం చేయాలి. కిచెన్లో వాడే టవల్స్ పై 75 శాతం బాక్టీరియా వుంటుంది. కిచెన్ క్లీనింగ్ టవల్స్ ఇల్లు తుడిచిన క్లాత్ లు మరిగే నీళ్ళల్లో ముంచాలని సర్వే సర్వే రిపోర్ట్లు హెచ్చరిస్తున్నాయి. యాంటీ బాక్టీరియల్ సర్ ఫేస్ వైప్స్ లో వంటింటి కప్ బోర్డ్స్ శుభ్రం చేస్తే 99.9 శాతం బాక్టీరియా నశిస్తోందిట.

    కిచెన్ లోనే శుబ్రత ఎక్కువ

    గ్లోబల్ హైజీన్ కౌన్సిల్ తాజా సర్వే లో, శుభ్రత అంటే టాయిలెట్స్ అటాచ్డ్ బత్రూమ్స్ లో కంటే కిచెన్ రూమ్ లోనే బాక్టీరియాల ప్రమాదం 20 శాతం…

  • పదేళ్ల కాలం చేసింది శూన్యం

    గృహనిర్భంద చట్టం వచ్చి అక్టోబర్‌  26 వ తేదీకి సరిగ్గా పదేళ్లు .ఈ చట్టం  అమల్లోకి వచ్చాక ఆరేళ్ల తర్వాత  వెలువడిన  బిబిసి నివేదిక ప్రకారం  భారత…

  • సాధారణంగా స్నానాల గదుల్లో లూఫా లుంటాయి. దీన్ని వాడేసి అలా పక్కన పడేస్తే బాక్టీరియా చేరిపోయి అనవసరమైన ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు డాక్టర్లు. తడిగా వుంచకుండా వాడాక శుభ్రంగా కడిగేసి ఎండలో వుంచండి అంటున్నారు. ప్రతి మూడు నెలకొకసారి తప్పనిసరిగా లూఫా మార్చాలి. వేడినీళ్లలో నిమ్మగడ్డ నూనె ,కొబ్బరి నూనె వేసి అందులో లూఫా ని వుంచితే తేలిగ్గా ఫంగస్ సూక్ష్మ జీవులు పోతాయి. ఈ నూనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. బ్లీచింగ్ వేసిన నీళ్లలో కడిగి పొడి బట్టలు చుట్టి ఎండలో పెట్టి వాడుకోవటం మంచిది.

    లూఫా విషయంలో శ్రద్ధ అవసరం

    సాధారణంగా స్నానాల గదుల్లో లూఫా లుంటాయి. దీన్ని  వాడేసి అలా పక్కన పడేస్తే బాక్టీరియా చేరిపోయి అనవసరమైన ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు  డాక్టర్లు. తడిగా వుంచకుండా  వాడాక శుభ్రంగా…

  • దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి అటు దీపాలు పెట్టడానికి వెళ్ళినా ఏ సమస్య లేకుండా ఉంటాయంటున్నారు డిజైనర్లు. క్రేప్,సిఫాన్,జార్జెట్ చీరలు కట్టుకొవచ్చు. కాస్తా అడంబరంగా అనిపించాలంటే కంచి,గద్వాల చీరల్లో లెనిన్ ను ఎంచుకోవచ్చు.చేనేత రకాలైన ఖాదీ,కంచి,పట్టు,లెనిన్ వేరు వేరు దారాలతొ చేసిన పసుపు,గులాబి,కాషాయం లాంటి లేత రంగులని ఎంచుకుంటే ఆకట్టుకునేల కనిపిస్తాయి.ఇంకా ఖరీదుగా ఉండాలంటే చీరల పైన అద్దాలు,ఎంబ్రాయిడరి డిజైన్ లు చేయించండి.పండుగ అంత మీ చుట్టునే ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. సాద్యమైనంత వరకు పండుగరోజు బంధు మిత్రులను కలుసుకోండి. మంచి వంటలు,కబుర్లతో పండుగను ఎంజాయి చేయండి. దీపావళి పేరుతో టపాసుల జోలికి మాత్రం వెళ్లకండి.

    దీపావళి కి ఇలా డిజైన్ చెయించుకోండి

    దీపావళి పండుగ వస్తుంది కదా ఈ పండుగకు జిగేల్ మనే చీరలు వద్దు నూలు లేదా చేనేత చీరలు ఎంచుకుంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూజలొ కట్టుకుని అటునుంచి…

  • స్టైయిల్‌ ఐకాన్‌ ప్రియాంక చోప్రా

    అంతర్జాతీయంగా  పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొన్న  ప్రియాంకా చోప్రా లాస్‌ ఏంజెల్స్‌ లోని  హెట్టి సెంటర్‌లో జరిగిన  ఇన్‌స్టయిల్‌  అవార్డ్‌ల వేడుకలు బ్రేకవుట్‌  స్టయిల్‌ ఐకాన్‌ పురస్కారాన్ని అందుకొంది…

  • ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగటం ఒకరు అవునంటే ఇంకొకరు కాదనటం వైవాహిక బంధంలో సర్వసాధారణం. కానీ తరచూ ఇలా వాదించుకోవటం గొడవలు పడటం ఆరోగ్యానికి మంచిది కాదని చెపుతున్నారు కాలిఫోర్నియా యూనివెర్సిటీ శాస్త్రజ్ఞులు. ఇటువంటి అర్గ్యూ మెంట్ల వాళ్ళ రోగనిరోధక వ్యవస్థ ప్రతి స్పందనకు అణిచి వేసుకున్నట్లు అవుతుందని పరిశోధకులు చెపుతున్నారు. రక్తంలో వుండే సహజ కిల్లర్ సెల్స్ శరీరాన్ని రుగ్మతలనుంచి కాపాడతాయి. అయితే ఈ ఘర్షణలు వాగ్వివాదాలు గొడవల సమయం తో ఇవి వెలికి వస్తాయి. వివాదాలు తారాస్థాయికి చేరితే వారి రక్తంలో అదనపు కిల్లర్ కణాలు ఉండాల్సివస్తాయి. ఈ తగువులతో ఆరోగ్యం సంక్షేమం తప్పనిసరిగా ప్రభావితం అవుతొందని అధ్యయనాలు చెపుతున్నాయి.

    అర్గ్యూ మెంట్ల తో అనారోగ్యం

    ప్రతి చిన్న విషయానికీ వాదనకు దిగటం ఒకరు అవునంటే ఇంకొకరు కాదనటం వైవాహిక బంధంలో సర్వసాధారణం. కానీ తరచూ ఇలా వాదించుకోవటం గొడవలు పడటం ఆరోగ్యానికి మంచిది…

  • అధిక బరువు నియంత్రించుకునే క్రమంలో ఆరోగ్యవంతమైన మార్గాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతిరోజు రెండు సర్వింగ్స్ పండ్లు, మూడు సర్వింగ్స్ కూరలుగా భోజనం వుండాలి. అలాగే శరీరంలో కొవ్వులు కరిగించేందుకు ఉసిరి, గుగ్గులు పనికి వస్తాయి. అలోవెరా స్థూల కాయాన్ని నియంత్రించటంలో సహకరిస్తుంది. వెజిటబుల్ సూప్స్ ఇతర కూరల్లో నల్ల మిరియాల పొడి కలపాలి. ఇది పదార్ధాల రుచి పెంచుతుంది. అదనపు బరువు నియంత్రిస్తుంది. బరువు తగ్గే ప్రక్రియలు యాపిల్ ,సిడార్,వెనిగర్ లు కూడా పనికివస్తాయి. డైటీషియన్ బోర్డు కోసం అడిగేటప్పుడు ఏ విషయాల గురించి తెలుసుకోవాలి.

    బరువు తగ్గించే టిప్స్

    అధిక బరువు నియంత్రించుకునే క్రమంలో ఆరోగ్యవంతమైన మార్గాలు తెలుసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతిరోజు  రెండు సర్వింగ్స్ పండ్లు, మూడు సర్వింగ్స్ కూరలుగా భోజనం వుండాలి. అలాగే శరీరంలో కొవ్వులు…

  • బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ మెదడుకు వ్యాయామం కావాలంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముఖ్యంగా నగర జీవితంలో స్త్రీలకు ఇల్లు ఆఫీసు తప్ప వేరే జీవితం లేకుండా పోతుంది. మెదడుకి ఉత్సాహం తేవాలంటే ప్రకృతి తో సంబందం పెట్టుకోవాలి. బంధువులు, మిత్రులతో చెక్కని స్నేహం చేయాలి. మనస్పూర్తిగా మాట్లాడాలి. అప్పుడే వత్తిడి వుండదు అంటున్నాయి అధ్యాయనాలు. ఫజిల్స్, ఆటలు, ముఖ్యంగా పుస్తక పథనం మెదడులోని కణజాలన్నీ చురుగ్గా వుండేలా చేస్తాయి. సమయమంతా ఇంటి పనికీ, ఆఫీసు పనికీ పరిమితం చేసి అలసి పోయిన్న ఆడవాళ్ళు ఒక్క నిమిషం మెదడుకి విశ్రాంతి ఎలా విశ్రాంతి ఇస్తున్నారో గమనించండి.

    మెదడుకు వ్యాయామం ఇస్తున్నారా?

    బ్రిస్క్ వాక్, స్విమ్మింగ్, ఏరో బిక్స్ తో శరీరానికి వ్యాయామం సరే. కానీ మెదడుకు వ్యాయామం కావాలంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముఖ్యంగా నగర జీవితంలో స్త్రీలకు ఇల్లు…

  • అయోడైజ్డ్ ఉప్పు వాడకండి కళ్ళు ఉప్పు కు మారండి అంటున్నారు డాక్టర్లు. సోడియం,క్లోరైడ్,అయోడిన్ అనే మూడు రసాయనాలతో ఈ అయోడైజ్డ్ ఉప్పు తయారు చేస్తారు. ఉప్పు కోసం చేసె బ్రహ్మండమైన ప్రచారం తో ఇది ఆరోగ్య కరమని చక్కని స్పటికాల్లా మెరిసిపోతుందని ప్రచారం జరుగుతుంది. కాని ఇది కర్మాగారాలలో తయరయ్యె ఉప్పు . అసలైన ఉప్పు అంటే సముద్ర జలాలను ఎండబెడితే వచ్చేది. ఇందులో 72 రకాల సహజ సిద్దమైన ఖనిజ,లవణాలున్నాయి. ఇందులో కుడా క్లొరైడ్,అయోడిన్,సోడియం ఉంటాయి కాని సహజసిద్దంగా ఉండి తెలిగ్గా కరిగిపొతాయి.ఈ రాళ్ళ ఉప్పు తో మూత్రపిండాల్లో రాళ్ళు ఎర్పడవు. రాత్రి వేళలొ పిక్కల నొప్పులు,కండరాలు మొద్దుబారటం తిమ్మిర్లు లాంటివి వస్తే ఒక అరగ్లాసు నీళ్ళలో చెంచా కళ్ళు ఉప్పు వేసి తాగితే ఐదు నిమిషాల్లొ ఆ నొప్పులు మాయం అవుతాయి. రాళ్ళ ఉప్పు వాడకంతొ అధిక రక్త పోటు సమస్యకు శాస్వత విముక్తి లభిస్తుంది. బీపి సాధరణ స్థితిలో ఉండాలంటే రాళ్ళ ఉప్పు వాడాటం,మిరప కాయలు వాడటం,అరటి కాయలు తినటం అనివార్యం. రాతి ఉప్పుతో శరీరంలో 90 శాతం నీళ్ళు నిలుస్తాయి. వీలైతే ఈ పాత కాలపు కళ్ళు ఉప్పు పై దృష్టి పెట్టండి.

    అయోడైజ్డ్ ఉప్పు తో ఎంతో నష్టం

    అయోడైజ్డ్ ఉప్పు వాడకండి కళ్ళు ఉప్పు కు మారండి అంటున్నారు డాక్టర్లు. సోడియం,క్లోరైడ్,అయోడిన్ అనే మూడు రసాయనాలతో ఈ అయోడైజ్డ్ ఉప్పు తయారు చేస్తారు. ఉప్పు కోసం…

  • మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను ఎంచుకుంటాం. ఒక్కసారి పేరు చదివిన మన కళ్ళు ...మోసపొయే వస్తువులు ఒక అక్షరం అటు ఇటుగా ఉండి మనం షాపింగ్ బ్యాగ్ లో దూరి పొతాయి. మార్కెట్ లో ఉన్న అన్ని ప్రముఖ బ్రాండ్ల డిటర్జంట్లు,చాక్ లెట్స్,ఫేస్ క్రీంలు అన్నింటికి నకిలీ బ్రాండ్ లు ఉన్నాయి. ఉదహరణకు కోల్గెట్ తీసుకొండి అచ్చం అదే ప్యాకింగ్ మధ్యలొ నీలి రంగు అక్షరాలలో coolgate అని ఉంటుంది.colgate అనుకుని కనురెప్ప పాటులో మోసపోతాం. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లేట్ అదే ప్యాకింగ్ తో డైరీ మిల్క్ అని ఉంటుంది. రేపర్ చించి నోట్లో పెట్టుకుంటే రుచి మారిందని అది నకిలీ అని చూసే వరకు తెలియదు. పల్లెటుళ్ళలొ ఉండే చాల మంది చదువుకున్న వాళ్ళు కాస్తా పరిశీలన ద్రుష్టి ఉన్న వాళ్ళు కనిపెడతారెమో గాని ఇక చదువుకోని వాళ్ళు అది గమనించక చెప్పేదాక వీలులెనంతగా మోసపోతారు. ఇక పల్లెటుళ్ళలొ పేరు,ప్యాకింగ్ ఒక్కటిగా ఉండే సరుకులు తేలికగా వెళ్ళిపోతాయి.వస్తువు పేరు చివరలో ఉండే ఆంగ్ల అక్షరం ఒక్కటి తప్పుగా కనిపిస్తుంది. కానీ చదువుకున్న వాళ్ళు కుడా తొందరలో గమనించకుండ తిసేసుకుంటారు. ఈ నకిలీ బ్రాండ్స్ విలువ 15 వేల కోట్లు ఉంటుందని అంచనా. భారత్ లోను చైనా లొనో అయితే ప్రముఖ బ్రాండ్ ఉన్న షాపులు అచ్చం అలాగే ఉండే అక్షరాలు, లొగోలు అటు ఇటు గా మార్చి అదే పేర్లతో రన్ చేస్తుంటారు. పిజ్జాహాట్ ఉందనుకోండి పిజ్జాహిట్ అంటారు. లగో కలర్ షాపు రూపం అన్ని మోసమే. ఈ బ్రాండ్స్ చూసి కొనుక్కోవాలి మరి

    ఇది అసలా? నకిలీ నా?

    మార్కెట్ లొ దొరికే మంచి మంచి బ్రాండ్స్ ను బట్టి మనం వస్తువులను ఎంచుకుంటాం. ఒక్కసారి పేరు చదివిన మన కళ్ళు …మోసపొయే వస్తువులు ఒక అక్షరం…

  • కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని పక్కన పడేశారు. అని తిట్టటం లాగా అన్నమాట. కానీ నిష్టురాల సంగతి ఎలా వున్నా ప్రతీ కారపచ్చడి తాలింపులో మంచి వాసన కోసం కరివేపాకు రెబ్బలు వేసి తినేటప్పుడు తీసి పక్కన పారేస్తా. ఇక చారు కయితే కరివేపాకు తోనే అంతటి కమ్మని వాసన. ఇలా ఏరి పారేసే కరివేపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఫైబర్ ,కాల్షియం , పాస్ఫరస్ C.A ,B,E విటమిన్లు,కార్బోహైడ్రేట్స్ ,కరివేపాకులో లభిస్తాయి. గుండె సక్రమంగా పనిచేయాలంటే కూడా కరివేపాకే ఔషధం. చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కరివేపాకులో తగ్గిపోతాయి. కరివేపాకులో గోరువెచ్చని నీరు పోసి ముద్దచేసి ఆ ముద్ద ఇన్ఫెక్షన్లు ఉన్న చోట రాస్తే నిమిషాల పైన ఫలితం తెలుస్తుంది. మజ్జిగ లో మిరియాల పొడి ,ఉప్పు , కరివేపాకు కలిపి తాగితే నిజంగా అదే ఔషధం లాంటిది. ఎండా కాలం లో ఇది ప్రాణదాత లాంటిది. ఆకులే కాదు కరివేపాకు వేరు కూడా గాయాలను తగ్గించగలదు. కరివేపాకు కడిగి ఎండపెట్టి మిరపకాయలు,చింతపండు , ఉప్పు కలిపి చేసే కరివేపాకు కారంలో రోజూ ఒక్క ముద్ద అన్నం తింటే ఆరోజు తిన్న ఎక్కువైన భోజనపు బరువును తగ్గించగలదు. పిల్లలు ,పెద్దవాళ్ళు కుడా కూరల్లో వాడిన కరివేపాకు ఏరి పారేయకుండా సన్నగా తరిగి కూరల్లో వేస్తె ఎంతో ఆరోగ్యం.

    రుచి దొరికాక పడేయకండి. ఇది ఔషధం

    కూరల్లో కరివేపాకు లాగా తీసిపారేసారు. అని నిష్టురంగా అంటుంటారు. రుచికోసం కరివేపాకు వేసి దాని అవసరం తేరిపోయాక తీసి పక్కన పెట్టినట్టు మమ్మల్ని మీ అవసరాలకు వాడుకుని…

  • మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం ముందుగా స్నాక్స్ తినాలి. ఏదీ తినకుండా వర్కవుట్స్ చేస్తే ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ముందుగా ప్రతి వర్కవుట్ తర్వాత స్ట్రెచింగ్ చేస్తే శరీరం కూలవుతుంది. కూర్చునే ఉద్యోగాల చేసేవాళ్ళు ప్రతి 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. కొన్నిసార్లు టైట్ డెడ్ లైన్స్ వుంటే అలారం గంటకోసారి ఫోన్ లో సెట్ చేస్తే వెంటనే లేచి తిరిగే అలవాటు అవుతుంది. ఇలా కొన్నాళ్ళు గంటకు సరి లేచి తిరిగే అలవాటు తో ఎనర్జీ స్థాయిలు ఎంత పెరుగుతాయో ఆశ్చర్యం వేస్తుంది కదూ. క్రమం తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలి. లేకపోతే నిద్రలేమి ప్రభావం శరీరం పైన వుంటుంది. అప్పుడు ఎప్పుడు కుదిరితే అప్పుడో 20 నిముషాలు విశ్రాంతి తీసుకున్నా నష్టమేం లేదు. శరీరం ఆ విశ్రాంతిని అర్ధం చేసుకోగలదు. బ్రేషింగ్ తర్వాత నోరంతా నీటిని నింపుకుని కుదుపుతూ పుక్కలించటం చేస్తే నోటిలో ఉన్న చెడు బాక్టీరియా పోయి నోరు శుభ్రపడుతుంది. రాత్రి పడుకోవటానికి రెండు గంటల ముందే తినే ఆహరం ఎదో తినేయాలి. లేదా తిని తినగానే నడక చేరితే అదనపు క్యాలరీలు చేరటం లేదా క్యాలరీలు కరిగాక పోవటం జరుగుతుంది. ఆరోగ్యం కోసం సమయం లేదనవద్దు. కేటాయించి తీరాలి అంతే.

    షార్ట్ కట్స్ తో ఆరోగ్యం సాధ్యం

    మంచి ఆరోగ్యానికి షార్ట్ కట్స్ అనేవి ఏవీ ఉండవు. అందుకోసం కేవలం కష్టపడాలి. హెల్త్ ఫిట్ గా  ఉండే ఎక్సర్సైజు లు చేయాలి. పెరఫార్మేన్స్ మెరుగుదల కోసం…

  • టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో చూసినా పుదీనా ఘుమఘుమలుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వంటకాలతో ఈ హెర్బ్ వాడతారు. కూరల పొడులు, సలాడ్లు, బిర్యానీ లు , చట్నీలు ,జెల్లీలు ,క్యాండీలు ,ఐస్ క్రీమ్ లు కూడా పుదీనా విరివిగా ఉపయోగిస్తారు. వాటర్ మింటీ ,స్పియర్ మింట్ లీ కలిపి పెప్పర్, మింట్ సృష్టించారు. ఈ హైడ్రేటెడ్ పెప్పర్ మింట్ తో అనేక ప్రయోజనాలు. ఇది బ్రిత్ ఫ్రెష్నర్. నీళ్లలో ఒక్క చుక్క పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని తాగితే అజీర్ణం ,వికారం , గ్యాస్ సమస్యలు నిమిషంలో పోతాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలుంటాయి. మూడ్ ను అనుకూలంగా మార్చే గుణం వుంది. ఎండిన పుదీనా ఆకుల పొడితో పళ్ళు తోమితే చక్కగా తెల్లగా మెరిసిపోతాయి. సాధారణ జలుబులు తగ్గిస్తుంది. పుదీనా ఆకుల్ని ఐస్ క్యూబ్స్ గా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. లెమన్ టీ, లెమనేడ్ కోసం ఈ క్యూబ్స్ ని వాడుకోవచ్చు. ఘాటైన వసంతో మంచి ఫ్లేవర్ గల మింట్ లో ఔషధ గుణాల కోసం ఒక పుస్తకం రాయచ్చు. ఇన్ని వస్తువుల పుదీనాతో తయారై కార్పొరేట్ ప్రపంచంతో అమ్ముడుపోతున్నాయంటే పుదీనా ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవచ్చు. పుదీనా ఎస్సెన్షియల్ ఆయిల్ నుంచి తీసే మెంథాల్ ను కాస్మొటిక్స్ లో పెర్ఫ్యూమ్స్ వాడతారు.

    ప్రకృతి ఇచ్చిన వరం పుదీనా

    టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో చూసినా  పుదీనా ఘుమఘుమలుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వంటకాలతో ఈ హెర్బ్ వాడతారు.…

  • కోపం అన్నీ అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని ఇటీవల పరిశోధనలు చెపుతున్నాయి. కోపం ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ విడుదల అవుతాయి. ఇవి పుండ్లు ,గాయాలు మానకుండా చేస్తాయట. మామూలు స్థాయి కంటే ఎక్కువ కోపం వున్నవాళ్లకే ఈ ప్రాబ్లమ్. కాలిన గాయాలతో బాధపడుతున్న 300 మందికి పైన పరిశోధనలు నిర్వహించి ఈ విషయం గుర్తించారు. వారిలో అకారణంగా ఉద్రేక పడేవారిలో గాయాలు మానేందుకు ఇరవై రోజులు సమయం పడితే శాంతంగా వుండేవాళ్ళలో నాలుగైదు రోజుల్లోనే గాయాలు మానటం ప్రారంభించాయట. ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకుంటే ఒక గాయాలే కాదు ఇంకేమన్నా అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండచ్చు అంటునాన్రు పరిశోధకులు. ఈ కోపం వల్లనే నాడీ వ్యవస్థ పై శ్రీఘ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. ఈసారి కోపం వచ్చినప్పుడు గమనించండి. తీవ్రమైన కోపం వస్తే వళ్ళు వణికి పోతుంది. పల్స్ రేట్ అధికంగా వుంటుంది. కోపం కొంచెం అదుపులో ఉంచుకోవటం ఉత్తమం అంటున్నారు పరిశోధకులు.

    శాంతములేక సౌఖ్యము లేదు

    కోపం అన్నీ  అనర్ధాలకు మూల కారణం అన్న విషయం తెలిసిందే అయితే శరీరంలో ఏర్పడ్డ గాయాలు తొందరగా మానక పోవటానికి కోసం ఒక ముఖ్య కారణం అని…

  • మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ అధ్యయనాలు గ్రూప్ కు మైండ్ ఫుల్ మెడిటేషన్ ఎనిమిదివారాల శిక్షణ రెండో గ్రూపు కు రిలాక్సేషన్ ట్రైనింగ్ లు ఎనిమిది వారాలు మూడో గ్రూప్ కు ఏ ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తూ కొన్నాళ్లు పరిశోధనలు నిర్వహించారు. వాళ్లందరికీ ఎన్నో రకాల పనులు ఇచ్చారు. ఈ మల్టీ టాస్కింగ్ వేగాన్ని ఖచ్చితంగా చేసే తీరుని సమర్ధతని నిపుణులు అంచనా వేశారు. అందరికంటే ముందు మైండ్ ఫుల్ మెడిటేషన్ ట్రైనింగ్ తీసుకున్నవారున్నారు. ఈ గ్రూప్ సభ్యులు ఎక్కువ సేపు దేని పై ధ్యానం వుంచగలిగారు . బహుళ పనులు చేయగలిగారు. బహుళ పనులు చేస్తూ ఆ వృత్తిని జయించగలిగారు. ఎలాంటి శ్రమ వత్తిడీ లేకుండా ఎంతో సమర్ధవంతంగా పనులు చేశారట. ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చాలా అవసరం. అంచేత ధ్యానం చేయటం వాళ్ళ కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధ్యాన ఫలాలు పోందండని చెపుతున్నారు పరిశోధకులు.

    ధ్యానంతో మల్టీ టాస్కింగ్ సులభం

    మెడిటేషన్ మెళకువల్లో శిక్షణ పొందినవారు ఉద్యగాన్నో వృత్తి నో  ఎక్కువసేపు ఏకాగ్రత తో కొనసాగించగలరని వారి జ్ఞాపకశక్తిని మెరుగ్గా వుంటుందని  తాజా అధ్యయనాలు చెపుతున్నాయి.  ఈ   అధ్యయనాలు…

  • మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు. బచ్చల కూర లో ఇనుము నైట్రేట్ లు పుష్కలంగా వుంటాయి. ఈ కూరను వండాక మళ్ళి నేరుగా వేడి చేయకూడదు. వేడి నీళ్ళ గిన్నెలో వుంచి వేడెక్కేలా చేయాలి. అలాగే ఉడికించి లేదా కూర చేసిన గుడ్లు కూడా మళ్ళి వేడి చేస్తే అందులోని పోషకాలు పోతయి. చికెన్ కూడా అంతే, వండాక మళ్ళి మళ్ళి వేడి చేస్తే మాంసకృతులు పోతాయి సరి కదా జీర్ణ సంబందమైన సమస్యలు వస్తాయి. బంగాళా దుంప కూర కూడా వేడి చేసి తింటే విషపదార్ధాలు శరీరంలోకి చేరినట్లే. మాంసకృతులు పుష్కలంగా అందించే పుట్ట గొడుగు కూర కూడా ఫ్రిజ్ లో వుంచి, సాయంత్రం వేడి చేసి తినాలి అని చుస్తే అనారోగ్యాలు తధ్యం . సాధ్యమయినంత వండిన కూరలు మళ్ళి మళ్ళి వేడి చేసి తినడం వల్ల నష్టమే.

    వండినవి మళ్ళి వేడి చేస్తే నష్టం

    మిగిలిపోయిన ఆహార పదార్ధాలు, టైమ్ లేక ఉదయం సాయంత్రం కోసం ఒకే సారి వేడి చేసి తినేస్తాము కానీ అన్నింటినీ అలా వేడి చేయొద్దు అంటారు డైటీషియన్లు.…

  • ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్ లో కనుక కూర్చోకపోతే శరీరంలో అన్ని భాగాల పైన వత్తిడి ఏపీడీ ఇతర భాగాల్లో నొప్పులు వచ్చి శరీరం అలసిపోతుంది అని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. కూర్చునే కుర్చీ లేదా డ్రైవింగ్ సీట్ లో నడుము వెనక రోల్ చేసిన టవల్ లేదా చిన్న దిండు పెట్టుకుంటే వెన్ను సమంగా ఆనుతుంది. అలాగే ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు నిఠారుగా నడుస్తూవుంటే మంచిది. హ్యాండ్ బ్యాగ్ లేదా లాప్ టాప్ బ్యాగ్ ఒకే భుజానికి తగిలించుకోకుండా రోజుకోవైపు మార్చి తగిలించుకోవాలి. అలసి పోతున్నామన్న కారణంగా వర్కవుట్స్ మానేయవద్దు. వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. ఎండార్ఫిన్లు విడుదలై మానసికమైన సంతోషం వస్తుంది. ఆరోగ్య వంతమైన అలవాట్లు మంచి నిద్ర పోషకాలు శరీరానికి తగినంత శక్తిని ఇస్తాయి. .

    సరైన పోశ్చర్ లో కూర్చుంటే సుఖం

    ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్ లో కనుక కూర్చోకపోతే  శరీరంలో అన్ని భాగాల పైన వత్తిడి ఏపీడీ ఇతర…