• కోన్ ఐస్ క్రీమ్ తినేసాక చివరగా కోన్ కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు, పాలు, పాయసం, తాగాక కప్పుల్ని కూడా అలాగే తినేయచ్చు. చివరికి కేక్ ముక్కని కూడా నేరుగా గిన్నెతో కలిపి తినేయచ్చు. అదెలాగంటే కుల్ఫీలు ,చాక్లేట్లు ,గోధుమ ,జొన్న ,రాగి , చీజ్ , మాంసం , కూడా గిన్నెల్లాగా చేసే మిషన్లోచ్చాయి. వాఫిల్ బౌల్ మేకర్ దానిపేరు. మనక్కావలిసిన రకం పిండి నాన్ వెజ్ ,స్వీట్ ,ఏదైనా టేస్టీ గా కలిపేసి ఇందులో ఆ పిండి పెట్టేసి మూత వేసేసి స్విచ్ నొక్కితే వెంటనే కాస్త పిండి పెడితే ఆ పిండి కాస్తా గిన్నె ఆకారం లోకో కోన్ ఆకారం లోకో కూడా మనం ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్న రకం రూపంలోకో మారిపోయి వచ్చేస్తాయి. ఇక చాక్లేట్ గిన్నెలకున్న పాపులారిటీ ఇంకా వేటికీ లేదుట. కరిగిన చాక్లేట్ ని వేరే అచ్చుల్లో పూసి కూడా ఈ గిన్నెల్ని తయారు చేయచ్చు. కూరలు ,సలాడ్లు, సూప్ లు , కోసం రకరకాల పిండి మాంసం కలిపి గిన్నెలను చేసేయచ్చు. రకరకాల ప్యాకింగులతో పర్యావరణనికి సమస్యలు లేకుండా చేసే ఇలాంటి వస్తువుల వల్ల చాలా ప్రయోజనం.

    తినేసే గిన్నెలొచ్చాయి

    కోన్ ఐస్ క్రీమ్  తినేసాక చివరగా కోన్  కూడా బిస్కెట్ ఫ్లేవర్ తో తినేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు అచ్ఛంగా అలంటి వడ్డించే గిన్నెలొస్తున్నాయి. సూప్ లు,…

  • వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట మానేసినా ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. చలికి నొప్పులొస్తాయి. చలిగాలులకు శరీరం ప్రభావితం కాకుండా నిండుగా చెమట పట్టే దళసరి వస్త్రాలు ధరించాలి. నేరుగా చలిలోకి పరుగు తీయకుండా ఇంట్లో వార్మ్ అప్ చేయాలి. అప్పుడు శరీరం వ్యాయామం కోసం సిద్ధం అవుతుంది.ఎండ తీవ్రత లేకపోయినా సన్ స్క్రీన్ రాసుకుని తీరాలి. లేకపోతే చర్మం చలికి పగిలి పాడవుతుంది. ఉదయాన్నే కాకపోతే సాయంత్రం కాస్త ఎండా వుండగానే వ్యాయామం పూర్తి చేసినా మేలే. ఎంతయినా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగింగ్ మానక పోవటమే హాయి.

    చల్లగా వున్నా సరే మానకండి

    వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట  మానేసినా  ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల  లాభం కంటే నష్టమే …

  • పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో జామపండు పిజ్జా రెండు ఒకటే. ఏది ఇష్టమో దాన్ని కోరుకుంటారు. ఖరీదు బట్టి కాదు. వాళ్ళ తల్లి తండ్రుల ఆసరా స్నేహం వాళ్లతో కలిసి గడిచే సమయం కావాలి. ఎదిగే వయసులో వాళ్ళకి ప్రోత్సాహం కావాలి. రెండు మార్కులు తక్కవొస్తే పర్లేదు ఈ సారి వస్తాయి లెద్దూ అనే ప్రేమ కావాలి. పెళ్లిళ్లు పేరంటాలకు పిల్లల్ని తీసుకుపోయినట్లే స్నేహితులు బంధువుల ఇళ్లలో జరిగే విషాదాలు కూడా వాళ్ళకి తెలియాలి. పుట్టిన రోజుకి ఫ్రెండ్స్ కిజిఫ్టు ఇమ్మని చెప్పటం కాకుండా ఎవరైనా అనారోగ్యాల తో వుండే దగ్గరుండి తీసుకుపోయి స్నేహితుల బాధను పంచుకునే అలవాటు చేయాలి. మనం దేన్నీ ఇస్తే దాన్నే అమూల్యమనుకుంటారు.

    కష్టం , సుఖం , తెలుసుకోనివ్వండి

    పిల్లల్ని బాగా పెంచటం అంటే ఖరీదైన వస్తువులు దుస్తులు ఖరీదైన పెంపకపు పోకడలు కాదు. చిన్న పిల్లలకు ఈ ప్రపంచంలో వస్తువుల ఖరీదు తెలియదు. వాళ్ళ దృష్టిలో…

  • ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న మహిళలపై చేసిన ఒక అధ్యయినంలో మహిళల్లో 70 శాతం మందికి ఈ ప్రాబ్లం ఉన్నట్లు తేలింది. ఇది పగటి నిద్ర వల్ల కాదని ఈ నిద్ర లేమి స్థూలకాయం, హైపర్ టెన్షన్ ల తో సంబంధం కలిగి వుందని పరిశోధనలు తేల్చాయి. స్థూలకాయం ఉన్న మహిళల్లో 31 శతం మంది సరైన నిద్ర పట్టకపోవడం, గురక, నిద్ర మధ్యలో మెలకువ వంటి సమస్యలు వున్నాయిని అధ్యయినం తేల్చింది. అన్నింటికీ కారణమైన శరీరపు బరువుని ఎలాగైనా తగ్గించుకోమని రేపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి.

    స్త్రీలకి ఈ సమస్య సహజమే

    ఇప్పటి దాకా అచస్ట్రక్టివ్ స్లీప్ అప్లియా అంటే గురక పెట్టడం, పగటి వేల నిద్ర, నిద్ర లేమి పురుషులకే వుంటాయి అనుకుంటున్నారు. 20 నుంచి 70 సంవత్సరాల…

  • ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను ఎడిపిస్తున్న పోకిరిలను వదిలించుకునేందుకు లాథిలు పట్టుకున్నారు. ఆడ పిల్లలల ను మోటార్ సైకిళ్ళ పై వచ్చి వేధించడంవాళ్ళని తాకి వేగంగా పారిపోవడం చేస్తుంటే గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. లాభం లేకపోయింది. దాని తో ఆడపిల్లల తల్లి దండ్రులు ఆడపిల్లలను స్కూల్ వద్దు ఇంట్లోనే కూర్చోమన్నారు. అలా అయితే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని భాలికలు లాతీలు పట్టుకుని గుంపులుగా స్చూలుకు పోవడం మొదలు పెట్టారు. చేతిలో కర్రలతో ధైర్యంగా స్చూల్కు బయలు దేరుతున్న అమ్మాయిలను చూసి పోకిరీలు ఫరార్!

    కర్ణాటకలో బదులు చెప్పిన అమ్మాయిలు

    ఊరికే భయాపడిపోవడం మానేసి చేయాల్సిన పని చేసాక అమ్మయిలు కర్ణాటక రాష్ట్రంలో చెలగాలి జిల్లాలోని రాషి వారా గ్రామంలో 14, 15 వయస్సు ఆడ పిల్లలు తమను…

  • బంగాళా దుంప పైన ఆకుపచ్చ రంగు మొలక రావటం చూస్తూ ఉంటాం. ఇలా ఆకుపచ్చ రంగుతో కనపడే చుక్కల్ని గ్లైకొల్కలాయిడ్స్ జి. ఏ అంటారు. చీడపీడలు, పురుగుల నుంచి తనను తానూ రక్షించు కునేందుకు మొక్క వీటిని సమకూర్చుకుంటుంది. ఈ జి.ఏ లో దుంపల చర్మం అడుగుదాకా ఉంటాయి. కాన్స్ లోతుగా కట్ చేసి ఆకుపచ్చదనం తీసేయాలి. రెస్టారెంట్ లో బంగాళా దుంప కూర తినేటప్పుడు ఈ విషయం గుర్తుతెచ్చుకొండంటున్నారు నిపుణులు. ఇంట్లో వాడుకునేట్టపుడు ఒకటీ అరా ఆకుపచ్చ మచ్చలు కనిపిస్తే అంతవరకు తీసేసి లేదా దుంపలో ఎక్కువచోట్ల కనిపిస్తే నిక్షేపంలా దాన్ని పారేయండి. అవి విషతుల్యం అంటున్నారు.

    ఆకుపచ్చ రంగొస్తే పారేయండి

    బంగాళా దుంప పైన ఆకుపచ్చ రంగు మొలక రావటం చూస్తూ ఉంటాం. ఇలా ఆకుపచ్చ రంగుతో కనపడే చుక్కల్ని గ్లైకొల్కలాయిడ్స్  జి. ఏ అంటారు. చీడపీడలు, పురుగుల…

  • అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా రెండు లక్షల 75 కిలోల స్వచ్ఛమైన వెండి వాడతారట. కాజు, డిజార్ట్స్, సుగుంధ ద్రవయాలు డ్రై ఫ్రూట్స్ , తమలపాకులు, మౌత్ ఫ్రెషనర్లు, ఈ సిల్వర్ ఫాయిల్ లంకారణలో కనిపిస్థాయి. కెన్నీ మేఘాలయ వంటకాల్లో కూడా వీటిని ఉపయోగిస్తూ వుంటారు. ఇవి మంచివా కాదా అంటే చెప్పటం కష్టం. కమర్షియల్ గా వాడే ఫాయిల్ చెప్పటం కష్టమే. ఇంట్లో చేసుకునే మిఠాయిలు పైన ఈ ఫాయిల్ వాడుదలుచుకుంటే దీన్ని వేళ్ళ మధ్య నలిపితే సవచమైన దైతే మెరుపులుఅతుక్కుని కనిపిస్తుంది. కల్తీ అయితే చేతులకు అతుక్కుపోతుంది. బూడిద లాగా రాలుతుంది.

    స్వీట్ సిల్వర్ ఫాయిల్

    అనేక భారతీయ వంటకాల్లో సిల్వర్ ఫాయిల్ అలంకరించిన మిఠాయిలు కనిపిస్తారు. ఈ వంటకాల సిల్వర్ ఫాయిల్స్ కోసం మన దేశంలో ప్రతి ఏటా  రెండు లక్షల 75…

  • ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్. దంపతులు పాల్గొన్నారు.నిర్వాహకులు కైలాసాన్ని తలపించే ఏర్పాట్లు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఇంద్ర కరణ్ రెడ్డి, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఎల్.వి. రమణ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    కోటి దీపోత్సవంలో కె.సి.ఆర్. దంపతులు

    ఎన్టీఆర్ స్టేడియం లో భక్తి టీవి నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సి.ఎం. కె.సి.ఆర్.…

  • ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు. నట్స్ లో పీచు, ప్రోటీన్లు, ఖనిజాలు ఎక్కువే. కానీ వీటిని తీపి పదార్ధాలతో కలిపి తీసుకోకూడదు. పండ్లతో కలిపి, ఓట్స్ తో కలిపి తినాలి. పండ్లు జీవ క్రియల వేగాన్ని మెరుగుపరుస్తాయి. కానీ వీటిని ఉదయం వేళ అల్పాహారంతోనో, మధ్యాహ్నం భోజనం అయ్యాక తినాలి. భోజనానికి ముందు తినకూడదు. నెయ్యి భోజనానికి రుచి ఇస్తుంది.కానీ నేతితో బ్రెడ్, పరోటాలు కాల్చకూడదు. అప్పుడు దానిలోని పోషక విలువలు పోతాయి. చపాతీలు, పరోటాలు కాల్చాక వాటిపై రాస్తే రుచి, ఆరోగ్యం. సాంబారు, పప్పు తాలింపుగా నెయ్యి వాడితే వాటికి అదనపు రుచి వస్తుంది.

    కొన్నింటిని అన్నింటితో కలపద్దు

    ఆరోగ్యం కోసం ఏం తినచ్చో ఏం తాగచ్చో నిరంతరం సలహాలు వింటూనే వుంటాం. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాపడితే అలా తినకూడదు అంటారు డైటీషియన్లు.…

  • మనం తీసుకొనే ఆహారం ఎప్పుడూ మనం చేసే పనిపైనే బాలన్స్ అవుతూవుంటుంది. స్త్రీల జీవన సరళిలో ఇంటి పని, చేస్తే ఉద్యోగం, పిల్లల్ని కనడం, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడం వంటి అనేక పనులు కలిసి వుంటాయి. అలా తీరిక లేని పనులు చేసే స్త్రీలు వాళ్ళు తీసుకునే ఆహారం, చేయాల్సిన వ్యాయామం పట్ల దృష్టి పెట్టరు. సమయం పాటించని ఆహారపు అలవాట్లు, శరీరానికి తగినంత పోషణ, వ్యాయామం ఇవేవీ వుండని కారణంతోనే వాళ్ళు ఫిట్ నెస్ తో వుండరు. పెళ్ళయి పిల్లలున్న చాలామంది ఆడవాళ్ళు బరువు పెరిగే కనిపిస్తుంటారు. అందుకే డైట్ లో ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. వయసు కనిపించకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామాలు కూడా చేయాలి. ఆఫీస్ లో పని మధ్యలో కాసేపు నడవడం, మెట్లు ఎక్కి దిగటం, స్ట్రెచింగ్ ఎక్సర్సైజులు చేయడం చాలా అవసరం. తరచూ స్పా కు వెళ్ళటం, క్రమం తప్పని హెల్త్ చెకప్స్, మంచి పుస్తకం చదువుకోవడం, పచ్చని ప్రకృతిలో కాసేపు నడవటం ఇవన్నీ చేస్తేనే ఫిట్ గా వుంటారు.

    ఫిట్ నెస్ మంత్రాన్ని మర్చిపోతున్నారు

    మనం తీసుకొనే ఆహారం ఎప్పుడూ మనం చేసే పనిపైనే బాలన్స్ అవుతూవుంటుంది. స్త్రీల జీవన సరళిలో ఇంటి పని, చేస్తే ఉద్యోగం, పిల్లల్ని కనడం, ఇంట్లో పెద్దవాళ్ళని…

  • మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు 1982 నుంచి 2015 వరకు గుండెకు, గుడ్డుకు వున్న సంబంధంగురించి పరిశోధన చేశారు. మూడు లక్షల ఎనిమిది వేల మందిని పరీక్షించారు. మొత్తానికి పరిశోధన సారాంశం ఏమిటంటే గుడ్డు తినడం గుండెకు మంచిదే అంటున్నారు పరిశోధకులు. అధిక క్వాలిటీ ప్రోటీన్లున్న గుడ్డు తినడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే సమస్య తగ్గుతుందంటున్నారు. ఒక గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్లుంటాయి. విటమిన్ A, D, E లతో పాటు యాంటి ఆక్సిడెంట్లు వుంటాయి. వీటిలోని ప్రోటీన్లు బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు అవిశలు, గ్రీన్ టీ, గుడ్డు, పెరుగు, పాలు నిత్యం తీసుకోమంటున్నారు.

    గుండెకు మేలు చేసే గుడ్డు

    మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు 1982 నుంచి 2015 వరకు గుండెకు, గుడ్డుకు వున్న సంబంధంగురించి పరిశోధన చేశారు. మూడు లక్షల ఎనిమిది వేల మందిని పరీక్షించారు. మొత్తానికి…

  • రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు 10 గ్రాములు తీసుకొంటున్నారని తేలింది. ఇలా ఉప్పు పైన నియంత్రణ లేకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. భారతీయ వంటకాల్లో ఎన్నో దినుసులు, పులుపులు, కారాలు ఎక్కువే. వండే కూరల్లో, పులుసుల్లో టమాటాలు, చింతపండు, ఉల్లిపాయలు వీటికి తోడుగా ఉప్పు వాడటం తప్పదు. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆహారం వండే సమయంలో ఉప్పు వేయకండి. సహజంగా అన్నీ ఉడికాక రుచి చూసుకొని కావలసినంత ఉప్పు జోడించమంటున్నారు. సహజంగా కూరగాయల్లో వుండే ఉప్పు సరిపోతుందంటారు. ఉడికించకుండా, ఆవిరిపైన ఉడకబెట్టి గ్రిల్లింగ్, మైక్రోవేవ్ చేయటం బెస్ట్ అంటారు. రోజుకి ఐదు గ్రాములకు మించి ఉప్పు వాడద్దని WHO హెచ్చరిస్తుంది.

    ఉప్పు వాడటం తగ్గిస్తే బెటర్

    రోజుకి 5 గ్రాముల ఉప్పుకు మించి తీసుకోవడం ఆరోగ్యరీత్యా ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు చెబుతున్నాయి. అయితే తాజాగా చేపట్టిన సర్వేలో దానికి రెట్టింపుగా ఒక్కొక్కరు…

  • గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలో చేపలు తినడం వల్ల పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు, ఆస్థమా, ఎగ్జిమాలు ఎక్కువగా వుండవంటున్నారు పరిశోధకులు. పిల్లలు విషయంలో జరిగిన మరో పరిశోధనలో 11 నెలల వయసు లోపే ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుండే చేపలు, గుడ్లు తినిపించడం వల్ల అలర్జీలు నియంత్రించవచ్చని తేలింది. గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలోనూ స్త్రీలు చేపలు తింటే పిల్లలకు ఫ్యాటీ యాసిడ్ అందుతుందని పరిశోధకులు గుర్తించారు. పిల్లల ఆరోగ్యాన్నీ మెరుగు పరిచేందుకు గానూ పిల్లలకు పాలిస్తున్నంత కాలం తల్లులను చేపల్ని తినమనే సలహా ఇస్తున్నారు పరిశోధకులు.

    తల్లులు చేపలు తింటే పిల్లలకు మేలు

    గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లలకు పాలిచ్చే సమయంలో చేపలు తినడం వల్ల పిల్లల్లో ఆహార సంబంధ అలర్జీలు, ఆస్థమా, ఎగ్జిమాలు ఎక్కువగా వుండవంటున్నారు పరిశోధకులు. పిల్లలు విషయంలో జరిగిన…

  • ఇల్లులాగే ఆఫీస్ కూడా మనల్ని ఎంతో ఆనందపెడుతోంది. ఆఫీస్ బయటి ప్రపంచంలో మన ఉనికి. మనం చేసే పనికి ఒక విలువ. ఒక మంచి జీవిత విధానం. మరి ఇలాంటి ఆఫీస్ పనిని చైతన్యవంతంగా మొదలు పెట్టమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆఫీస్ కు రాగానే మొట్టమొదట సవాల్ గా వుండే పనినే మొదలుపెట్టాలి. ఉదయాన్నే పనిచేయగలిగే శక్తి సామర్ధ్యాలు ఏకాగ్రత ఎక్కువగా ఉంటాయి. కష్టమైనా పనిని వ్యక్తిచేస్తే తర్వాత తేలికైన పనులకు మిగిలిన సామర్ధ్యం వినియోగం అవుతుంది. ముందుగా ఆఫీస్ లో అడుగుపెట్టగానే తోటి ఉద్యోగులను నవ్వుతూ పలకరించడం అలవాటుగా ఉంచుకోవాలి. ఆపలకరింపు అందరిమధ్య ఒక సద్భావన ను తీసుకొస్తుంది. ఎప్పుడూ ఆలస్యంగా రాకూడదు. ఇది చిన్న విషయం కాదు. ముందు మనకే మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ మొదలై మన సామర్ధాన్ని దెబ్బ తీయటం కాకుండా మానసిక వత్తిడి పెంచుతోంది. ఆఫీసంటే మన కెరీర్ మన భవిష్యత్తు.

    ఆఫీస్ అంటే మన కెరీర్ మన భవిష్యత్తు

    ఇల్లులాగే ఆఫీస్ కూడా మనల్ని ఎంతో ఆనందపెడుతోంది. ఆఫీస్ బయటి ప్రపంచంలో మన ఉనికి. మనం చేసే పనికి ఒక విలువ. ఒక మంచి జీవిత విధానం.…

  • కలలు కనండి కానీ నిజం చేసుకునే కలలే కనండి అన్నారు కలాం. కానీ డాక్టర్లు ఇప్పుడు పగటి కలలు కనండి పర్లేదు అంటున్నారు. జీవితంలో ఎన్నో వత్తిడి సందర్భలోస్తాయి. మనసు గందరగోళంగా ఉంటుంది. మానసిక వత్తడి అనేకానేక సమస్యలకు మూలం. సరిగ్గా ఇందుకే ఆ వత్తడిని అధిగమించేందుకు చక్కగా పగటికలలు కనండి. ఓ పెద్ద ఇల్లు కొన్నామనో ఆడి కార్లో ప్రయాణం చేస్తూ అమెరికా వెళ్లే ప్లైట్ పట్టుకోబోతున్నామనో ఏకంగా ట్రంప్ పర్సనల్ సెక్రటరీగా జాబ్ వచ్చిందినో ఎదో ఒకటి మనసుకు స్వాంతన ఇచ్చే కల. అబద్దమైన మన మనసులో చింతను దూరం చేసే కల కనమంటున్నారు. ఈ ఊహలు నిజంగా మనల్ని ఒక తీవ్రమైన బాధ నుంచి విముక్తులను చేస్తే అదే అబద్దపు కల యూయూహ అయితేనేం ఊహా శక్తి వుండాలే కానీ ఎన్నెన్ని పగటి కలలు రావు....... ఏమంటారు?

    పగటి కలలు కంటే మంచిదే

    కలలు  కనండి కానీ  నిజం చేసుకునే కలలే కనండి అన్నారు కలాం. కానీ డాక్టర్లు ఇప్పుడు పగటి కలలు  కనండి పర్లేదు అంటున్నారు. జీవితంలో ఎన్నో వత్తిడి…

  • కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి కూరలో నూ ప్రతి కాంబినేషన్ లోనూ ముల్లంగిని తీసుకుంటేమూత్రపిండాలు పని తీరు శుభ్ర పడుతుందంటారు డాక్టర్లు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావని చెపుతున్నారు. ముల్లంగిలో విటమిన్-సి, ఫాస్పరస్ బి-కాంప్లెక్స్ అధికంగా వుంది చెర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి తేమ అందుతుంది. ముల్లంగి రసం శరీరంలో ఇన్ ఫెక్షన్లు పోగొట్టి అలసట దూరం చేస్తుంది. శ్వాస సంబందమైన సమస్యలున్న, అలర్జీలు చేధిస్తున్న ముల్లంగిలోని పోషకాలు తగ్గిస్తాయి.

    ముల్లంగి తో ఎంతో మేలు

    కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి…

  • మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న చాల మంది తల్లిదండ్రులను వేదిస్తు ఉంటుంది. నిజం చెబితే అధికారం ప్రయోగిస్తారనే భయంతో పిల్లలకు అబద్దాల వైపు దారి చూపెడుతుంది. ఈ భయన్ని తమ పట్ల గౌరవం అనుకుంటారు పెద్దలు. హోం వర్క్ లేదనో,ఏం పగల కొట్టలేదనో,ఎవర్ని కోట్టలేదనొ తన్నులు తిన్నాకా పిల్లలు మోరపెట్టే మాటలే. మనం పిల్లల ను శిక్షించేది వాళ్ళ బాగు కోసమే అని వారికి అర్ధమయ్యెలా ప్రవర్తించాలి. నిజం చెబితే నాకు ఇష్టం ఒకవేళ తప్పు చేసిన నిజం చెప్పారు గనుక అర్ధం చేసుకుని గౌరవిస్తాను. ఆ తప్పు ఎందుకు చేశారో చెబితే అది కరక్టా కాదా అన్నది ఇద్దరం కలిసి ఆలోచిద్దాం అన్న భరోసా మనం పిల్లలకు కల్పిస్తే వాళ్ళు అబద్దాలు అడారు. పిల్లలు ఎలా ఉండాలో చెప్పే ముందు మనం ఆచరించి జీవిస్తే వాళ్ళు తప్పే చేయరు ఏమంటారు

    పిల్లల అబద్దాలకు మనమే కారణం…

    మనం ఏంత ప్రేమ గా పెంచిన పిల్లలు ఎందుకు అబద్దాలు ఆడతారనే ప్రశ్న చాల మంది తల్లిదండ్రులను వేదిస్తు ఉంటుంది. నిజం చెబితే అధికారం ప్రయోగిస్తారనే భయంతో …

  • ఎన్నోళ్లు గానో లేదా ఎన్నేళ్లు గానో క్రంచ్ ఇతర వ్యాయామాలు చేస్తున్న ఉదరం సమంగా లేదూ అంటే తప్పనిసరిగా ప్రయత్న లోపం ఉందనే అర్ధం. నడుం చుట్టూ వుండే కొద్ది పాటి కొవ్వు ఆకృతిని దెబ్బతీస్తుంది. స్త్రీలకైనా పురుషులకైనా పొట్ట ప్లాట్ గా సమంగా ఉంటేనే బావుంటుంది. నాజూకైన నడుం వల్ల అనారోగ్య సమస్యలు రావన్న గ్యారెంటీ ఏదీ లేదు. కానీ ఫ్లాట్ అబ్స్ గలవారికి మిగతా వారితో పోల్చితే 25 శాతం తక్కువగా గుండె జబ్బుల అవకాశాలు ఉంటాయి. 35 శాతం తక్కువ హార్ట్ ఎటాక్స్ వస్తాయని 41 శాతం తక్కువగా బీ.పి వస్తుందని 40 శాతం కిడ్నీ కాన్సర్ అవకాశాలు తగ్గుతాయని గాల్ స్టోన్స్ అవకాశాలు 60 శాతం తక్కువనీ ఆస్ట్రియో ఆర్థరైటిస్ అవకాశాలు 34 శాతం తక్కువనీ అధ్యయనాలు చెపుతున్నాయి. ఆరోగ్య సమస్యలు తక్కువే ఆరోగ్య అవకాశాలు ఎక్కువే కనుక ఎక్కువసేపు కూర్చునే ఉండకుండా మంచు వ్యాయామం నడక వదలకుండా ఉంటే చాలు.

    నాజూకైన ఉదరంతో ఆయుష్షు ఎక్కువ

    ఎన్నోళ్లు గానో లేదా ఎన్నేళ్లు గానో క్రంచ్ ఇతర వ్యాయామాలు చేస్తున్న ఉదరం సమంగా లేదూ అంటే తప్పనిసరిగా ప్రయత్న లోపం ఉందనే అర్ధం. నడుం చుట్టూ…

  • గర్భవతి అయ్యాక అమ్మ వాడే మందులన్ని పాపాయి కి కుడా చేరతాయి కాబట్టి సురక్షిత మైన మందులే సూచిస్తారు డాక్టర్లు. తోలి మూడు నెలల్లో పాపయికి వాడే సంభాందిత మందులలో లోపాలు లేకుండా ఉండేందుకు ఒక్క ఫోలిక్ యాసిడ్ మాత్రమే ఇస్తారు. ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఎంటటే ఈ సమయంలో సోంత వైద్యం చేయక పోవడం మంచిది. భారతీయ మహిళలలో జీవనశైలిలో ఎక్కువగా విటమిన్ డి,క్యాల్షియం తక్కువగా ఉండి ఎముకలు బలహీనంగా ఉంటాయి. శారీరక ఫీట్ నెస్ చాల తక్కువ ఈ సమయంలో ఎక్కువ యోగా,వ్యయామం చేయాలి. సరైన పోజిషన్ లొ కుర్చుని,నిలబడాలి.చాలినంత విశ్రాంతి,నిద్ర ఉండాలి.సౌకర్యాంగా ఉండే పరుపు పైన ఎదో ఒక వైపు తిరిగి పడుకోవాలి. అమ్మతనాన్ని అమ్మగా ఆస్వాదిస్తు డాక్టర్ల నుంచి సలహాలు,సూచనలు తీసుకొంటు ముద్దులు మటగట్టే పాపాయి ని ఈ లోకంలొకి తీసుకురావలి. గర్భవతి కాగానే డాక్టర్ల సలహాలు సూచనలు తీసుకుని పరీక్ష లు చేయించుకోవాలి.

    చిన్నారి కి స్వాగతం కోసం…

    గర్భవతి అయ్యాక అమ్మ వాడే మందులన్ని పాపాయి కి కుడా చేరతాయి కాబట్టి సురక్షిత మైన మందులే సూచిస్తారు డాక్టర్లు. తోలి మూడు నెలల్లో పాపయికి వాడే…

  • ముంబై స్పాట్ బిలియన్ మార్కెట్ లో అంతర్జాతీయ ట్రెండ్ అనుసరిస్తూ పసిడి ధర 10 గ్రాముల రేటు 31 వేలు దాటి పోయింది. రాజధాని ఢిల్లీ లో పది గ్రాముల బంగారం ధర 900 పెరిగి 31750 రూపాయిలు పలికింది. కాగా కిలో వెండి ధర 1390 రూపాయిలు పెరిగి 47370 రూపాయిలుంది. రానున్న రోజుల్లో కూడా బంగారం, వెండి ధర పెర్గుతూనే ఉంటుందని బులియన్ తట్రేడర్లు చెపుతున్నారు. ముంబాయి, హైదరాబాద్ వంటి నగరాల్లో బంగారం రోజువారి అమ్మకాలు రెండింతలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర ని 12000 వరకు అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేసారు

    31 వేలు దాటిన బంగారం ధర

    ముంబై స్పాట్ బిలియన్ మార్కెట్ లో అంతర్జాతీయ ట్రెండ్ అనుసరిస్తూ పసిడి ధర 10 గ్రాముల రేటు 31 వేలు దాటి పోయింది. రాజధాని ఢిల్లీ లో…