• సాధారణంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ మెటర్నిటీ సెలవులను జాగ్రత్తగా లెక్కపెట్టి తొమ్మిదవ నెల వచ్చే వరకు పని చేస్తారు. ఇలా చేయటం వల్ల ప్రసవం తర్వాత బిడ్డతో ఎక్కువగా గడిపేందుకు వీలవుతుందని కష్టం ఓర్చుకుని పని చేస్తారు. కానీ ఉద్యోగినులు తమ ఆలోచన మార్చుకుని తీరాలి. ఆరవ నెల దాటిన దగ్గర నుంచి ఎక్కువ సేపు కూర్చోవటం రాత్రి పూత పొద్దుపోయే వరకు పనిచేయటం వంటివి గర్భస్థ శిశువుకు ఇబ్బంది పెడతాయి. పైగా డెస్క్ ముందర కదలకుండా అదే పొజిషన్ లో గంటల తరబడి కుర్చీలో ఇరుకుగా ఇబ్బందిగా కూర్చోవటం పొట్టలో పాపాయికి చిరాకే సాయంత్రవేళ కూడా త్వరగా ఆహారం తీసుకుని విశ్రమించటం చాలా మంచిది. రాత్రి పది తర్వాత ఎటువంటి పనైనా అదీ కంప్యూటర్ ముందు కూర్చుని శ్రద్ధగా చేయవలిసిన ఆఫీస్ పనియైన చేయద్దనే హెచ్చరిక. ఆఫీస్ లో గంటల తరబడి కూర్చోవటం పొట్ట పైన వత్తిడి పడుతుంది. గంటల తరబడి పని అదీ మళ్ళీ రాత్రిపూట చేసే పనివల్ల మానసిక వత్తిడి ఈ రెండిటి ప్రభావం కడుపులో పిల్లల ఎదుగుదల పైన ఉంటుంది. ఒత్తిడి కి గురైన తల్లులకు బరువు తక్కువ పిల్లలు పుడుతున్నారని వైద్యులు గ్రహించిన అంశం.

    గర్భిణీలు ఉద్యోగం చేస్తుంటే

    సాధారణంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తమ మెటర్నిటీ సెలవులను జాగ్రత్తగా లెక్కపెట్టి తొమ్మిదవ నెల వచ్చే వరకు పని చేస్తారు. ఇలా చేయటం వల్ల  ప్రసవం తర్వాత…

  • మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. వాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. 'బెస్ట్ కంపెనీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా' పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 350 కంపెనీల అవతార గ్రూప్ ఇండియా అండ్ వర్కింగ్ మదర్ మీడియా గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టాప్ వంద కంపెనీల్లో మహిళా ఉద్యోగినులు 25 శాతంగా ఉన్నారు. వంద శాతం ప్రసూతి సెలవు అనంతరం వచ్చిన తల్లులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇచ్చారు. వంద శాతం లైంగిక వేధింపుల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 2015 లో 18 శాతం కంపెనీలు ఉద్యోగినులకు ఆరు నెలల వేతనంలో ప్రసూతి సెలవలు ఇచ్చారు. 70 శాతం బిడ్డను దత్తత టీయూస్కున్న తల్లులకు 28 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చారు. పని ప్రదేశంలో మహిళలు స్వేచ్ఛగా హాయిగా పనిచేసే వాతావరణం సృష్టిస్తున్నాయి బెస్ట్ కంపెనీలు.

    ఉద్యోగినులకు అదనపు సౌకర్యాలిస్తున్న కంపెనీలు

    మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు.…