• ఈ సింక్ పిల్లలక్కూడా

    ఎన్నో మంచి కార్పోరేట్ భవనాలు, స్టార్ హోటళ్ళు ఎన్నో వచ్చాయి మన దేశంలో. కానీ పిల్లలతో ఎక్కడికైనా వెళితే పిల్లల కోసం వుండే ప్రత్యేకమైన సౌకర్యాలు ఏవీ…

  • నిమ్మకాయలు వాడుతూనే వున్నాం. ఎప్పుడూ కోశాక ఒక్క అరముక్క మిగిలిపోతూ వుంటుంది. దాన్ని అలా వదిలేయకుండా బూట్లలో పడేయండి. దుర్వాసన రాకుండా వుంటుంది. బీట్ రూట్, స్ట్రాబెర్రీలు, నేరేడు వంటివి చేతులకి మరకలు అంటే లా చేస్తాయి. ఈ మరకలు పోయేందుకు నిమ్మచాక్క రుద్దాలి. ఒక బంగాళ దుంప పేస్టులా చేసి ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం సహజంగా బ్లీచ్ అవుతుంది. టేబుల్ స్పూన్ పసుపు, కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ పాదాలకు రాసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు పగుళ్ళు తగ్గుతాయి. ఆర చెక్క నిమ్మరసం పెరుగు మొఖానికి రాసి 20 నిమిషాలు ఆగి కడిగేస్తే మొటిమలు రాకుండా ఉంటాయి. ఎక్స్ ట్రావర్జిన్ ఆయిల్. ఈ తరహా ఆలివ్ ఆయిల్ లో వున్న మోనో అసాచ్యురేటెడ్ కొవ్వులో హానికరమైన కొలెస్ట్రోల్ తగ్గిస్తాయి. రైస్ బ్రాడ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ కూడా మంచివే.

    వాళ్ళ ఆరోగ్యానికి మూలం ఇదే

    నిమ్మకాయలు వాడుతూనే వున్నాం. ఎప్పుడూ కోశాక ఒక్క అరముక్క మిగిలిపోతూ వుంటుంది. దాన్ని అలా వదిలేయకుండా బూట్లలో పడేయండి. దుర్వాసన రాకుండా వుంటుంది. బీట్ రూట్, స్ట్రాబెర్రీలు,…

  • ఇవాల్టి తరం అమ్మాయిలకు పెద్దగా ఆర్ధిక ప్రణాళికలు వేసుకోవడం రానట్లేనని, ఉద్యోగినులు ఇప్పటికీ పి.పి.ఎఫ్, ఫిక్సడ్ డిపాజిట్ల బంగారం వంటి సంప్రదాయ పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తారని ఒక సర్వే చెపుతుంది. ఎక్కువ రాబడి ఇచ్చే మ్యుచువల్ ఫండ్స్, ఇతర మదుపు పధకాలు ఎన్నో వున్నాయి. పొడుపు, మదుపు రెండు ఉద్యోగ ప్రారంభంలో మొదట పెట్టాలి. పాతికేళ్ళ వయస్సులో నెలనెలా మూడు వేళ రూపాయిలు కడితే పదవీ విరమణ వయస్సు వచ్చేసరికి మూడు కోట్ల రూపాయిల పెన్షన్ ఇచ్చే పడకాలున్నాయి. నలబై ఏళ్ళ మహిళ ఈ ప్లాన్ కోసం ప్రయత్నం చేయాలంటే కనీసం నెలకు 40 వేలు దాచి పెట్టాలి. అందుకే సరైన సమయంలోపు ప్రారంభించాలి. ప్రతి ఉద్యోగానికి కనీసం ఆరు నెలల జీతం ఎంత వుంటుందో అంత డబ్బు సేవ చేసి పెట్టుకుని తర్వాతే పొడుపు గురించిఆలోచించాలి. ఏదయినా ప్రమాదం జరిగినా ఉద్యోగం పోయినా, కొత్త జాబ్ వెతుక్కునేదాకా ఆ డబ్బు కాపాడుతుంది.

    సేవింగ్స్ మొదలు పెట్టారా లేదా?

    ఇవాల్టి తరం అమ్మాయిలకు పెద్దగా ఆర్ధిక ప్రణాళికలు వేసుకోవడం రానట్లేనని, ఉద్యోగినులు ఇప్పటికీ పి.పి.ఎఫ్, ఫిక్సడ్ డిపాజిట్ల బంగారం వంటి సంప్రదాయ పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తారని ఒక…

  • ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి ప్రాంతానిది. ఆమ్రపాలి అనే ఎరుపు రంగు పండు ఉత్తర్ ప్రదేశ్ ది. బంగిన పల్లి ఆంధ్రప్రదేశ్ సైజు, తీపిలో దీన్ని దాటే పాండే లేదు. చిన్న సైజులో వుండే చేసా ముల్సన్ ప్రాంతానిది. వాసన రుచి కలిగిన రసం పండు ఇది. టెంకె చిన్నదిగా వుండే దుస్సేహ్రీ మంచి రంగు, వాసనతో పీచు తక్కువగా వుంటుంది. పంచదార వంటి తియ్యదనంతో పలుచని పై చర్మం వున్న హిమసాగర్ బెంగాలీ మామిడి. నీలం అనే హైదరాబాద్ మామిడి. మల్లోవా అనే తమిళనాడు పండు పసుపు రంగు పీచుతో కండ బావుంటుంది. తోతాపూరి అనేది చిలక ముక్కు మామిడి ఇది ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో దొరుకుతుంది. దీన్నే చిత్తూరు మామిడిలో ప్రతేకం. ఈ రసం పండు రుచి అద్భుతం. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ సృష్టిస్తూనే ఉన్నారు.

    ఎన్ని రకాలా? దేని రుచి దానిదే

    ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి…

  • ఇది సెల్ఫీల యుగం. ఏ ప్రదేశమైనా, షాపింగ్ సినిమా హాల్, పళ్ళ మార్కెట్ , రోడ్డు పక్కని ఛాట్ తింటున్నా సరే సెల్ఫి లేకుండా పని జరగదు. మనం ఎప్పుడూ ఎక్కడ ఏం చేస్తున్నామో, ఎంతగా సంతోష పడిపోతున్నామో అవతలి వాళ్ళకు తెలియాలి. అందుకే సెల్ఫి, ఇప్పుడీ ఫోటో తీసేటప్పుడు తగిన వెలుతురు ఉండేలా చూడాలి. అప్పుడే ఆ జ్ఞాపకంతో పాటు ముఖం కుడా చెక్కగా వుంటుంది. శరీర చాయ కూడా బాగుంటుంది. వెలుతురుకు దూరంగా వుండే సెల్ఫీ అస్పస్టంగా వుంటుంది. ఇలాంటి ఫోటోలకు అలంకారణ అక్కర లేదు. వీలైనంత సహజంగా వుండాలి. ముఖంలో రకరకాల భావాలు చుపెట్టాలంటే మాత్రం సెల్ఫీ అసహజంగా వుంటుంది. ముఖాన్ని కాస్త పక్కకు పెట్టాలి. సన్నగా కనబడాలంటే ఫోన్ దూరంగా వుంచి తీసుకోవాలి. లేదా ఇంటి దగ్గరే ఒక ఫోటో సెషన్ ప్లాన్ చేయాలి. అప్పుడే ఏ యాంగిల్ మోహ బావుంటుందో తెలిసిపోతుంది. ఒక్కరి కంటే ఎక్కువ మంది వుంటే కాస్త పొడుగ్గా వున్న వాళ్ళకి ఫోన్ ఇస్తే బాగా వస్తుంది. ఇక ఎత్తయిన ప్రదేశాలు, జలపాతాలు, సముద్రాలూ, నడి రోడ్లో సెల్ఫీ కోసం ఉపయోగించకుండా ఉంటేనే మంచిది.

    ఏ యాంగిల్ లో బావుంటారు?

    ఇది సెల్ఫీల యుగం. ఏ ప్రదేశమైనా, షాపింగ్ సినిమా హాల్, పళ్ళ మార్కెట్ , రోడ్డు పక్కని ఛాట్ తింటున్నా సరే సెల్ఫి లేకుండా పని జరగదు.…

  • కొన్ని రిపోర్ట్స్ బావుంటాయి. వీటిని అనుసరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటిదే ఇది. వ్యాయామం ఎప్పుడూ చేస్తే బెస్టు అన్న విషయం పైన ఎప్పుడూ సందేహలుంటాయి. ఈ విషయం గురించి, వ్యాయామం వల్ల కణజాలంలో జరిగే మార్పుల మీద అద్యాయినం చేసాక, ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అధిక బరువున్న వాళ్ళని ఖాలీ కడుపుతో 60 నిముషాలు, బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న రెండు గంటల తర్వాత 60 నిమిషాలు వాకింగ్ వంటి ఎక్సర్ సైజులు చేస్తే వ్యాయామ ప్రభావంతో తేడా స్పష్టంగా ఉంటుందిట. రక్త నమూనాలు పరిక్షిస్తే శరీరంలోని అడిపోజ్ టిష్యూ, తిన్న తర్వాత, తిన్నాక, తిన్న రెండు గంటల తర్వాత వేర్వేరుగా స్పందిస్తున్నట్లు తేలింది. కనుక ఏమీ తినకుండా ఓ గంట పాటు వ్యాయామం చేయగలిగితే ఫలితం పొందవచ్చు.

    పరగడుపున వ్యయామం బెస్ట్

    కొన్ని రిపోర్ట్స్ బావుంటాయి. వీటిని అనుసరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటిదే ఇది. వ్యాయామం ఎప్పుడూ చేస్తే బెస్టు అన్న విషయం పైన ఎప్పుడూ సందేహలుంటాయి. ఈ విషయం…

  • ప్రతి మనిషి ఈ ప్రపంచంలో కేరింగ్ యాటిట్యూడ్ తో వుంటే మనుషులు సుఖశాంతులతో జీవిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ యాటిట్యూడ్ చాలా అవసరం. మన పట్ల మనవారి పట్ల చూపించే ఓ దృక్పదం చేసే వాళ్ళకి ఆ జాగ్రత్త పొందిన వాళ్ళకి ఎంతో భద్రత అనిపిస్తుంది. మనుష్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు పెరుగుతాయి. ఈ దృక్పధాన్ని కుటుంబ సభ్యులు స్నేహితుల జీవితంలో స్నేహితులందరికీ చర్య తో మాటలతో ప్రదర్శించగలగాలి. ఇంట్లో సంతోషంగా ఉండకపొతే బయటా ఉండలేం. మనస్పూర్తిగా ఎదుటి మనిషి ప్రదర్శించే ఈ కేరింగ్ దృక్పదంతో జీవితం సంతోష పూరితంగా వుంటుంది. మనుషులు ఒక్కలపట్ల ఒక్కళ్ళు పూర్తి ప్రేమతో ఆనందంతో ప్రవర్తిస్తే ఏం చేసినా మనస్పూర్తిగా చేస్తే ఆ చర్య యొక్క స్వభావం కుటుంబాన్ని ఆనందం తో ఉంచుతుంది. అందుకే కుటుంబ సభ్యుల మధ్య క్షమాగుణం, ఆప్యాయత, ప్రేమ కేరింగ్ వుండాలి.

    కేరింగ్ యాటిట్యూడ్ చాలా అవసరం

    ప్రతి మనిషి ఈ ప్రపంచంలో కేరింగ్ యాటిట్యూడ్ తో వుంటే మనుషులు సుఖశాంతులతో జీవిస్తారు. ప్రతి ఒక్కరికి ఈ యాటిట్యూడ్ చాలా అవసరం. మన పట్ల మనవారి…

  • వేసవిలో సూర్యుని ప్రతాపం తీవ్రంగా వుండి శరీరానికి హాని చేస్తుంది. ఎర్రని ఫ్యాన్ లు క్యాష్ లకు చర్మం గురవ్వుతుంది. సున్నితమైన చర్మం గలవారికి ఈ సమస్య ఎక్కువగా వుంటుంది. సాధ్యమైనంత వరకు ఎండకు ఎక్స్ పోజ్ కాకుండా వుండటం మొదటి మార్గం. ఒక వేళ బయటకు వెళ్ళవలసి వస్తే వీలైనంత సన్ స్క్రీన్ అప్లయ్ చేయాలి. ప్రతి నలుగు గంటలకు ఒక్క సారి రీ అప్లయ్ చేస్తూ వుండాలి. చర్మం దాదాపు కవర్ చేయగల కాటన్ వస్త్రాన్ని ధరించాలి. రాత్రి వేళ అలోవీరా జెల్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం పై ప్రభావం తగ్గుతుంది. శరీరమే కాకుండా చర్మము డీహైడ్రేషన్ కు లోనవ్వుతుంది. చమటకు చర్మం తో హైడ్రేషన్ తగ్గుతుంది. మరింత సన్ బర్నింగ్ కు గురవ్వుతుంది. పెదవులు పగులుతాయి. అంచేత దాహం తో నిమిత్తం లేకుండా ప్రతి అరగంటకు మంచి నీళ్ళు తాగాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటివి తాగాలి. వేసవిలో గల దుమ్ము ప్రభావానికి జిడ్డు కాలుష్యం ఎక్కువ. ఇవి మొటిమలు రావడానికి కారణం అవ్వుతాయి. బయట నుంచి రాగానే ముఖం మెడ వాష్ చేసుకోవాలి.

    కాటన్ వస్త్రాలే ధరించాలి

    వేసవిలో సూర్యుని ప్రతాపం తీవ్రంగా వుండి శరీరానికి హాని చేస్తుంది. ఎర్రని ఫ్యాన్ లు క్యాష్ లకు చర్మం గురవ్వుతుంది. సున్నితమైన చర్మం గలవారికి ఈ సమస్య…

  • వేసవి వస్తే, సెలవులు మొదలైతే పిల్లలూ, పెద్దల ద్రుష్టి సమ్మర్ వెకేషన్ పైనే వుంటుంది. సంవత్సరపు బడలిక తీరేలా, ఏ బరువు బాధ్యత పట్టించుకోకుండా సొంత ఊరికో, లేదా ఏదైనా టూరో వెళ్ళాలి అనుకుంటారు. ఇది ముందే ప్లాన్ చేసుకుంటే రూమ్ రిజర్వేషన్లు మంచి ప్రదేశాలు వెతుక్కుని పెట్టుకోవడం ఆహారపు ఏర్పాట్లు ఎన్నో ఉంటాయి. ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో వేలాడి ప్రయాణపు పాకెజీలు కనిపిస్తున్నాయి. ఈ కుటుంబ ట్రిప్స్ వల్ల కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని వారి నడుమ ప్రేమ వసివాడదని నిపుణులు చెప్పుతున్నారు. ప్రతి రోజు ఇంటరాక్ట్ అయ్యేందుకు వీలుకాని ఈ బిజీ రోజుల్లో ఇలాంటి వెకేషన్ ట్రిప్స్ ఫ్రీగా రిలాక్స్డ్ గా కబుర్లు చెప్పుకునే వీలుంటుంది. అలాగే మంచి హోలీడే ఆప్షన్ లోనూ బస ఏర్పాట్లు ప్రయాణ సౌకర్యాలుచూసి పెట్టుకుంటే ఇలాంటి టిప్స్ తో జేవిత కాల మధుర స్మృతుల్ని పదిలపరుచుకునే వీలుంటుంది. మళ్ళి ఏడాది పాటు పని చేయగల కొత్త ఉత్సాహం వస్తుంది.

    సెలవుల్లో సరదాగా జాలీ ట్రిప్

    వేసవి వస్తే, సెలవులు మొదలైతే పిల్లలూ, పెద్దల ద్రుష్టి సమ్మర్ వెకేషన్ పైనే వుంటుంది. సంవత్సరపు బడలిక తీరేలా, ఏ బరువు బాధ్యత పట్టించుకోకుండా సొంత ఊరికో,…

  • వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత మాత్రం కోల్పోతాయి అయితే వండటం వల్ల బీటాకెరోటిన్, లికోపెన్ వంటి కాన్సర్ తో పోరాడగల వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి. మైక్రోవేవ్ లో కూరగాయలు వుడికే వాసన వచ్చేదాకా అంటే ఏడు నుంచి పది నిముషాలు. క్యారెట్స్, బంగాళ దుంపలు వంటివి ఐడు నిముషాలు ఉడికిస్తే సరిపోతుంది. కూరగాయల్ని పల్చని స్లైసులుగా కట్ చేస్తే త్వరగా వుడుకుతాయి. ముక్కలు వుడికించే ముందే బాగా వేడి చేస్తే త్వరగా కూర ముక్కలు వేడిగా అయిపోతాయి. ఎక్కువ పోషకాలు పోవక్కరలేదు. తరచూ కలియబెడుతూ వుండాలి. ఒకటి రెండు నిమిషాలకు రుచి చూడాలి. ప్యాన్ అడుగున ఏదైనా లిక్విడ్ మిగిలిపోతే మళ్ళి కలియబెట్టాలి. కూరగాయలు ఉడికించిన నీటిని ఎప్పుడు వృధా చేయకూడదని. ఆ నీటితో చారు వంటివి చేసుకున్న ప్రయోజనమే.

    వండే సమయం తగ్గిస్తే చాలు

    వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత…

  • శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు హాని జరిగి ఆస్టియో ఆర్దరైటిస్ రోగాల భయం చాలా మందిలో వుంటుంది. కానీ పరుగెత్తడం వల్లనే కర్డిలేజ్ ఆరోగ్యంగా వుంటుంది. దీని వల్ల మోకాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దృఢమైన కండరాళ్ళు లిగ్మెంట్లకు పరుగె అవసరం. ఇవి మోకాళ్ళ పై వత్తిడి తగ్గించి ఆస్టియో ఆర్ధరైటీస్ రాకుండా కాపాడతాయి. సరైన పడరక్షకులువేసుకోకుండా పరుగేడితేనే హాని జరుగుతుంది. పరుగెత్తే సమయంలో వత్తిడి తట్టుకోగల సహజగుణం మోకాళ్ళకు వుంటుంది. ఆర్ధరైటీస్ వచ్చే అవకాశమే లేదు. మనస్పూర్తిగా ఇష్టపడుతూరోజుకు ఒక అరగంట రన్నింగ్ చేసిన మంచి ఫలితం వుంటుంది. శరీరం చక్కని సౌష్టవం యవ్వన రూపంలో వుంటుంది.

    చక్కని రూపం సౌష్టవం కోసం

    శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు…

  • ఒక సర్వే లో 22 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత ముఖ్యంగా ఆడపిల్లల్లో డిప్రెషన్ కు కారణం సరైన ఆదాయ వనరులు లేకపోవడమే నని తేలింది. 65 శాతం మందికి చేతిలో ఒక్క పైసా కుడా వచ్చే దారి లేకపోవడమే నని రిపోర్టులు చెప్పుతున్నాయి. కనీస సదుపాయాలు చుట్టూ అందరికి చేతుల్లో వుండే గాడ్జేట్స్, ఇతర వస్తువులు, మంచి దుస్తులు ఎవీ కొనుక్కో లేకపోతున్నామనే భాధ యువతను కుంగదీస్తుందిట 64 శాతం మందికి ఈ లేమి పట్ల తీవ్ర అసహనం అసంతృప్తితో నిద్ర వుండదు. మగవాళ్ళతో పోలిస్తే ఈ డిప్రెషన్ స్త్రీలకే ఎక్కువని సర్వే తేలింది. ఇక పెద్దవాళ్ళతో తమంకు దొరికిన వసతులతో సరిపెతుకోలేక డిప్రెషన్ పాలవ్వుతున్నారని రిపోర్ట్ నివేదిక. ముఖ్యమైన విషయం పల్లెలు, చిన్న పట్నాలతో పోలిస్తే నగరాల్లో వుండే యువత ఎక్కువగా డిప్రెషన్ కు గురవ్వుతున్నారని మన దేశంలోనే ఈ సమస్య కొంత తీవ్ర స్థాయిలో వుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

    ఆర్ధిక సమస్యే డిప్రేషన్ కి కారణం

    ఒక సర్వే లో 22 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత ముఖ్యంగా ఆడపిల్లల్లో డిప్రెషన్ కు కారణం సరైన ఆదాయ వనరులు…

  • అస్తమానం చదువులో మునిగి తేలే పిల్లల్ని కాస్త రిలాక్స్ డ్ గా వుంచడం కోసం హాబీల వైపు మళ్ళించమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఫజిల్స్, వర్డ్ గేమ్స్ పిల్లల మెదడుకు పదును పెడతాయి. చిన్న వయస్సు నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక సుడోకు, చెస్ వంటి ఆటల పట్ల శ్రద్ధ చూపిస్తారు. మెదడును చైతన్య పరచే ఈ ఆటలు సమస్య పరిష్కరించుకునే సమాధ్యంతో పాటుఇతర సవాళ్ళ ను ఎదుర్కొనే శక్తి ని కూడా ఇస్తాయి. మాతృ భాషతో పాటు ఇంకో భాష నేర్చుకునే దిశగా ప్రోత్సహించాలి. దేశ విదేశాల నాణాలు, పోస్టల్ స్టాంపులు సేకరించే ఆసక్తి కూడా మంచిదే. పిల్లలు ఎప్పుడైనా సంగీత వాయిద్యాలని పలకరించడానికి ట్రై చేస్తే ఆశ్చర్యపోవద్దు. పిల్లల్లో ఐక్యును విద్యావిషయ సమాధ్యాన్ని పెంచే శక్తి సంగీతానికి వుంది. పిల్లలకు అవసరమైన దేహదరుడ్యం లేకపోతె నీరసం తో చదువు పట్ల శ్రద్ధ చూపలేకపోవచ్చు. దేహ పుస్టి క్రిడల్ని ప్రోత్సహించాలి. ఒక టీమ్ గా ఆడే ఆటల వల్ల నాయకత్వ లక్షణాలు కుడా పెరుగుతాయి. పిల్లల్ని సక్రమంగా పెంచమంటే వాళ్ళలో దాగి వున్న సృజనాత్మకమైన విషయాలను వెలికి తీసి ప్రోత్సహించడమే.

    పిలల్ని ఎన్నో నేర్చుకోనివ్వండి

    https://scamquestra.com/sozdateli/8-konstantin-mamchur-38.html

  • తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు తగ్గించుకోవడం రెండూ వెర్వేరు విషయాలంటారు శిక్షకులు. ఎనభై శాతం ఆహారపు అలవాట్లు బరువు తగ్గించే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. వ్యాయామం కేవలం ఇరవై శాతమే పనిచేస్తుందిట. జిమ్, జాగింగ్, వర్కవుట్స్ ఏవైనా కానీ బరువు తగ్గించే ప్రక్రియలో ఉపయోగ పాడేది ఇంతే. శరీరంలో జీర్ణక్రియలు అత్యంత చురుకుగా ఉంచేందుకు అద్భుతమైన పద్దతి రోజుకు ఐదు నుంచిఆరు సార్లు కొద్ కొద్దిగాది తినడం, భోజనం చేస్తున్నప్పుడు టీవి చూస్తున్నామా అదుపు కాస్త తగ్గినట్లే, ఫోన్ మాట్లాడామా ఇంకొంత బాటింగ్, కబుర్లు ఎదో ఒక్కటి చేస్తూ ఆహారం తింటే అన్ లిమిటెడ్ గా కడుపులోకి పంపిస్తున్నట్లే. బరువు తగ్గాలంటే తగ్గించి తింటేనే, రుచికి ప్రాధాన్యత తగ్గిస్తేనే, వర్కఔట విషయంలో బద్దకించక పోతేనే ఫలితం దక్కేది.

    మూడు విషయాల్లో కఠినంగా వుండాలి

    తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు…

  • ఏదైనా ఒక వ్యాసనం ప్రభావం మెదడు పైన ఎలా వుంటుందో చేసిన పరిశోధనలో మత్తు పదార్ధాలకు బానిసైన వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టేక్స్ భాగం మార్పుకు గురైనట్లు, ఇంటర్నెట్ వ్యాసనానికి గురైన వారిలోనూ అదే మార్పులు గమనించారు. మెదడులో మాటలు జ్ఞాపక శక్తి కండరాళ్ళ కదలిక భావోద్వేగాల కేంద్రాలతో 10 నుంచి 20 శాతం కుచించుపోవడం ఇంటర్నెట్ వ్యసన పరుల్లో గమనించారు. మత్తుపనీయాలు తీసుకునే వారిలో శారీరక వ్యాయామం లేకపోవడం నిద్ర లేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. వాటివల్ల శరీరంలో, మెదడులో మార్పులు వస్తాయి. అటువంటి పరిస్థితులే నెట్ అడిక్షన్ లో కూడా కనిపించాయి. వీడియో గేమ్లు, కంప్యుటర్, ఇంటర్నెట్ వాడకం పెరిగితే మరింత డిప్రేషన్ పెరుగుతుంది. ఒత్తిడికి గురవ్వుతారు. గర్భిణీ స్త్రీలలో పిల్లలకు పాలిచ్చే స్త్రీలు సెల్ ఫోన్ ఇంటర్నెట్ వ్యసనానికి లోనై వుంటే దాని ప్రభావం గర్భస్థ శిశువు, పసి పిల్లల పైన వుండటం గమనించారు. పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు సెల్ ఫోన్ మేసేజ్లు ఇవ్వొద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.

    ఇంటర్నెట్ వ్యసనం మత్తుపానీయం లాంటిదే

    ఏదైనా ఒక వ్యాసనం ప్రభావం మెదడు పైన ఎలా వుంటుందో చేసిన పరిశోధనలో మత్తు పదార్ధాలకు బానిసైన వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టేక్స్ భాగం మార్పుకు గురైనట్లు,…

  • గర్భిణీల న్యూట్రిన్స్ ఎక్కువగా వుండే ఫుడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యం బావుంటుంది అని డాక్టర్లు చెప్పుతున్నారు. మన దేశం లో దాదాపు 90 శాతం మంది ప్రోటీన్స్ లేని ఆహారమే తీసుకుంటున్నారు. శరీరం బరువును బట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్, బీన్స్ లో ప్రోటీన్స్ ఎక్కువ. మెదడు అభివృద్ధికి చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పాలల్లో ఐరన్ అధికంగా వుంటుంది. పుట్టే బిడ్డలో కండరాళ్ళు, ఎముకల అభివృద్ధి జరగాలంటే కాల్షియం వుండాల్సిందే. సూర్య రశ్మి ద్వారా కూడా కాల్షియం వుండాల్సిందే. సూర్యరశ్మి ద్వారా కూడా కూడా కాల్షియం అందుతుంది. కాకపొతే ఎంత సేపు ఎండలో తిరగాలి సరైన లెక్కలు లవు గనుక, కాల్షియం వుండే డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్, నారింజ పండ్లు, చేపలు తినాలి. సాధారణంగా ఈ రోజుల్లో గర్భినిలుగా వున్న అమ్మాయిలు రేగ్యులర్ డాక్టర్ చెకప్ లు, డైట్ ల గురించి తెలుసుకొంటూనే వుంటారు కానీ డాక్టర్ సలహాలు పాటించకపోతేనే నష్టం. ఆ విషయంలో గుర్తు చేసేందుకే ఈ గర్భిణీల ఆహారం గురించి ప్రస్తావించడం.

    గర్భిణీలకు పోషకాహరం

    గర్భిణీల న్యూట్రిన్స్ ఎక్కువగా వుండే ఫుడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యం బావుంటుంది అని డాక్టర్లు చెప్పుతున్నారు. మన దేశం లో దాదాపు 90 శాతం మంది…

  • కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల నుంచి తుంచేసి ఎందినవో, కాస్త వాడిపోయినవో తీసేసి మిగతా తాజా ఆకుల్ని పేపర్ టవల్ లోనో లేదా శుబ్రమైన నూలు గుడ్డలో కానీ చుట్టేసి పెట్టేయాలి. రెండు రోజులు శుబ్రంగా బాగుంటాయి. ఆలుగడ్డ, ముల్లంగి, చిలకడ దుంప, అయితే కట్ చేసి ఫ్రిజ్ లో పడితే రంగు మారిపోతుంది, మృదుత్వం కూడా పోతుంది. తేమ కూడా తగ్గిపోయి మృదుత్వం పోతుంది, రుచి మారిపోతుంది. ఇలాంటి వాటిని గిన్నెలో నీళ్ళు పోసి అందులో వదులుగా ముత పెట్టి వుంచాలి. క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకలి వంటివి కట్ చేసి గాలి తగలని బాక్స్ లో పెట్టి వున్నా కవర్ లో పెడితే తాజాగా వుంటుంది. అరటి పండ్లు, కర్భుజా, ఉల్లిపాయలు, అవకాడో, వెల్లుల్లి ఉల్లి వంటివి ఫ్రిజ్ లో పెడితే వీటి వాసన మిగతా కురగాయలకు పట్టి చాలా సార్లు కడిగి వండుకోవాల్సి వస్తుంది.

    కూరగాయలన్నీ కలిపి ఫ్రిజ్ లో పెట్టొద్దు

    కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల…

  • చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే రసాయినాలు కలుపుతారు. ఇందులో చక్కెర ఎక్కువే. అలా దాహం తీరేలా చలువ చేసేలా కావాలంటే ఫ్రెష్ గా కొట్టిన కొబ్బరి నీళ్ళు తాగచ్చు. ఇంట్లో అయితే ఉప్పు జీలకర్ర వేసిన పచ్చి మామిడి రసం కుడా వాడదెబ్బకు ప్రత్యామ్నాయమె అవ్వుతుంది. ఎక్కువ చమట పోస్తుంది కనుక చమట తో పాటు కీలకమైన కొన్ని పోషకాలు పోతాయి. సోడియం పొటాషియం వంటివి శరీరం కోల్పోతుంది. వీటి పని శరీరంలో జీవక్రియలు తిన్నగా జరిగేలా చూడటం. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకుంటే నిస్సత్తువ లేకుండా వుంటుంది. అన్నం, చపాతిలు తేలికగా అరిగే ఆకుకూరలు, తాజాగా వుండే మాంసాహార పదార్ధాలు మంచివే. పళ్ళ రసం, చెరుకు రసం ఇవి కూడా తీయగానే తగేయడం ఉత్తమం.

    ఎండల్లో వాడిపోకుండా ఇవే రక్షణ

    చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే…

  • కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ ప్రియులకు కూడా అద్భుతం అనిపిస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ తినరు. పిల్లలు తింటే తిడతారు. ఇవన్నీ అర్ధం లేని భయాలు అని కొట్టి పరేస్తుందో రిపోర్ట్. ఎంతో మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కేవలం ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చారట. ఆ అంతమందికి అద్భుతమైన జ్ఞాపక శక్తి, మెదడు తెలివి తేటలు పెరిగిపోయాయట. అంతేనా కఠినమైన ఫజిల్స్ ఇట్టే పూర్తి చేసారంటున్నారు. పరిశోధకులు. ఇది కొట్టి పారేసే విషయం మాత్రం కాదు. ఎందుకంటే అసలే ఎండలు. అందులో ఐస్ క్రీమ్ ఈ రిపోర్టును ఏదయితే అది అయ్యిందిలే అని నమ్మి ఐస్ క్రీం హాయిగా తినేయమని చెప్పడం బెస్ట్ అనిపిస్తుంది. నోట: పళ్ళ డాక్టర్ ని ఓసారి కలసి మాట్లాడి మరీ తినండి.

    ఐస్ క్రీం తో ఎంతో చురుకుతనం

    కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో…

  • ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత మంది ఎప్పుడూ చాలా సన్నగా ఓపిక లేనట్లు ఉంటారు. బరువు పెరగాలి అనుకుంటారు. అయితే వాళ్ళు తినే పదార్ధాలు ఎంపిక చేసుకోవాలి. బరువు పెరగాలి అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా తీసుకోవాలి. పండ్లు, నట్స్, బీన్స్, అనేక కురగాయాల్లో మంసాల్లో ఇవి లభిస్తాయి. తగినంత ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అవసరం. చేపలు, అవిసెగింజలు చాలా మంచివి. తప్పకుండా తినాలి కుడా. కాల్షియం కావాలి. అంటే ఓ అరలీటర్ పాలు లేదా రెండు కప్పుల పెరుగు తీసుకోవాలి. క్యాలరీల మోతాదు ఎక్కువ వుంటే బరువు పెరగడం సాధ్యం అవుతుంది. ఆహారం తీసుకుంటేనే శరీరం పుష్టిగా ఆరోగ్యవంతంగా తయ్యారవ్వుటుంది. ఈ తీసుకునే ఆహారం వల్ల చర్మం మెరుపు వస్తుంది. వార్దక్య భయాలు కుడా దూరంగా పోతాయి.

    బరువు పెరగాలి అనుకుంటే

    ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత…