• ప్రసవ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలకు వయసు ప్రధాన కారణమని చెన్నయ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఒబెస్ట్ట్రిస్ట్ ,కస్తూర్బా గాంధీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం రిపోర్ట్ వెల్లడించింది. కస్తూర్భా గాంధీ హాస్పిటల్ వైద్యం కోసం వచ్చిన 3480 మంది గర్భిణీల్లో 35 దాటిన 250 మంది హై రిస్క్ మెటర్నల్ మెడిసన్ తీసుకున్నట్లు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లో 30 నుంచి 35 ఏళ్ల మధ్యనే మహిళలు తొలిసారిగా గర్భం దాల్చుతున్నారని జీవితంలో స్థిరపడటం కోసం పిల్లలు కనటాన్ని వాయిదా వేసుకుంటున్నారని రిపోర్ట్ చెప్తోంది. అయితే 35 దాటినా తర్వాత గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయని అంతేగాకుండా జీవన శైలి పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

    వయసు దాటితే రిస్క్ ఎక్కువే

    ప్రసవ సమయంలో ఎదురయ్యే అనేక సమస్యలకు వయసు ప్రధాన కారణమని చెన్నయ్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ ఒబెస్ట్ట్రిస్ట్ ,కస్తూర్బా గాంధీ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఒక…

  • కాదేదీ కవిత కనర్వం. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ........... అంటూ శ్రీ శ్రీ, కవితా వస్తువు ఏదైనా పర్లేదన్నాడు. ఆ శ్రీశ్రీ బాటలోనే ఈ అభినవ శ్రీశ్రీ ఎడ్గార్ ఆర్టిస్ట్. తినే పళ్ళు, వాటి తొక్కలు, కూరలు, ఆకు కూరలు, పక్షులు ఈ కలతో ఒకటేమిటి కనిపించే ప్రతిదాన్ని వాడేసి కొత్త కొత్త డ్రెస్ డిజైన్స్ తాయారు చేస్తున్నాడు. సగం బొమ్మ గిస్తాడు ఆ బొమ్మకు డ్రెస్ డిజైన్ వివిధ వస్తువులతో చేసేస్తాడు. ఎడ్గార్ అమెరికన్ ఫ్యాషన్ చిత్రకారుడు, తను తాయారు చేసిన డిజైన్లను సోషల్మీడియా లో షేర్ చేస్తే వేలాది అభిమానులు ఎడ్గార్ డిజైన్ స్టైల్ చూసి ఫాన్స్ అయ్యారు.

    తొక్కలో పూల రెక్కలతో

    కాదేదీ కవిత కనర్వం. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ……….. అంటూ శ్రీ శ్రీ, కవితా వస్తువు ఏదైనా పర్లేదన్నాడు. ఆ శ్రీశ్రీ బాటలోనే ఈ అభినవ శ్రీశ్రీ ఎడ్గార్…

  • రాగులుని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. ఈ చిన్ని గింజల్లో కాల్షియం ఐరెన్, ప్రోటీన్, ఇతర అనేక ఖనిజాలు లభిస్తాయి. కొవ్వు పదార్ధాలు వుండవు కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఆహారం. రాగుల లోని ఫాలి ఫెనాల్స్, ఫైబర్ డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుతాయి. పిచు జీర్ణ వ్యవస్థకు దోహద పడుతుంది. రాగుల్లో వుండే ఐరన్ రక్తహీనతను తగ్గించి హీమోగ్లోబిన్ పెంచుతుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడేవాళ్ళు వాటికి బదులు రాగుల మొలకల వాల్ల సి-విటమిన్ కూడా శరీరానికి అందుతుంది.రాగుల్లో ప్రోటీన్లు పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఈ రాగుల్ని జావలాగా కానీ దోసెల్లో కానీ ఏ రూపంలో తీసుకొన్నా ప్రయోజనకరమే!

    రాగులు ఎంతో మంచి ఆహారం

    రాగులుని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. ఈ చిన్ని గింజల్లో కాల్షియం ఐరెన్, ప్రోటీన్, ఇతర అనేక ఖనిజాలు లభిస్తాయి. కొవ్వు పదార్ధాలు వుండవు కాబట్టి…

  • ఇప్పుడు అందరి ఇళ్ళల్లో వంట కాస్త తినటానికి విలుగానే వుంటుంది. యుట్యూబ్ ఓపెన్ చేస్తే అన్న కుకరీ ప్రోగ్రాంలే. చూసి చూసి అందరికి వంట వచ్చేసిందనుకుంటా. ఎలాగో ఇళ్ళల్లో వండుకుంటాం ఇక పిల్లల పుట్టిన రోజులు, పెళ్ళి రోజు, కొత్త సంవత్సరం లాంటి ప్రత్యేక దినాలోస్తే హాయిగా ఇంట్లోనే నిమిషాల్లో బేక్ చేసుకోండి అంటూ కేక్ మౌల్డ్స్ కూడా వచ్చాయి. అచ్చం బేకరీల్లో వివిధ రూపాల్లో పిల్లలకి ఇష్టమైన కేక్స్ ఉన్నట్లే. కేక్ మౌల్డ్స్ లో అల్యూమినియం నాన్స్టిక్ కేక్ ప్యాన్లు, సిలికాన్ అచ్చులు కూడా వచ్చాయి. ఈ అచ్చుల్లో నెయ్యి కానీ బేకింగ్ స్ప్రే కానీ పూసి కేక్ మిక్స్ ని ఇందులో పోసి ఓవెన్ లో బేక్ చేసి ప్లేట్లో వంచేస్తే చాలు మనం ఏ ఆకారంలో కేక్ మిక్స్ ని పోసామో, అలా కార్లు, సీతాకోకచిలుకలు, ఇళ్ళు అచ్చు గుద్దినట్టు ప్లేట్లో కనిపిస్తాయి. ఇక మనకి నచ్చేలా క్రీమ్ తో ఐసింగ్ చేస్తే చాలు. చక్కని కేక్ రెడీ........... ఏ ఫుడ్ కలర్ వాడకుండా శుభ్రంగా మన ఇంట్లోనే!!!!!!!!!!!

    అచ్చులోంచి కేకొస్తుంది

    ఇప్పుడు అందరి ఇళ్ళల్లో వంట కాస్త తినటానికి విలుగానే వుంటుంది. యుట్యూబ్ ఓపెన్ చేస్తే అన్న కుకరీ ప్రోగ్రాంలే. చూసి చూసి అందరికి వంట వచ్చేసిందనుకుంటా. ఎలాగో…

  • వెంటిలేటర్ ఆన్ మరాఠీ సినిమా కోసం ప్రియాంక చోప్రా స్వయంగా పాడిన బాబా సాంగ్ కు రెండు రోజుల్లో ఆరు లక్షల హిట్స్ వచ్చాయి. ఈ సినిమా నిర్మాత ప్రియాంకనే. అయితే ఆమె ఈ సినిమాలో నాటించ లేదు. పాట చాలా బాగుంది. 'నాన్న నీ మనసు లోని బాధను నేనెప్పుడు అర్ధం చేసుకో లేదు. నేనిలా జీవించాలి చెప్పు నేనెటు వైపు వెళ్ళాలి నాకేమి తెలియడం లేదు. నిన్నిలా అడుగుతుంది నీ ప్రియమైన కూతురు. నువ్వు నా జీవితానికి నిజమైన అర్ధం ఇచ్చావు నాన్న....... దయచేసి ఆగు........... వెళ్ళిపోకు. పాట ఇలా సాగుతుంది తండ్రి వెంటిలేటర్ మీద వున్నప్పుడు కూతురు పాట ఇది. 4 నిముషాల 12 సెకెండ్లు వున్న ఈ పాట నెట్లో ఎంతో మంది విని ఇష్టపడ్డారు.

    ప్రియాంక పాటకు ఆరు లక్షల హిట్లు

    వెంటిలేటర్ ఆన్ మరాఠీ సినిమా కోసం ప్రియాంక చోప్రా స్వయంగా పాడిన బాబా సాంగ్ కు రెండు రోజుల్లో ఆరు లక్షల హిట్స్ వచ్చాయి. ఈ సినిమా…

  • ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కి ఇదీ అంటూ ప్రత్యేకమైన కారణం ఏదీ లేదు. హార్మోన్స్ మార్పులే ఇందుకు కారణం ఒక రకంగా పేర్కొనాలి. ప్రొజెస్టరాన్ , ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగటం వల్ల యాంగ్జయిటీ మూడ్ స్వింగ్స్ చిరాకు వంటివి వస్తాయి. ఆహారంతో ఈ లక్షణాలని చాల మటుకు అదుపు చేయచ్చు. కాల్షియం ఎక్కువగా వుండే పెరుగు పాలు ఆకుకూరలు చీజ్ పి.ఎమ్ .ఎస్ లక్షణాలని తగ్గిస్తాయి. చక్కెరతో చేసిన పదార్ధాల కెఫైన్ లు తీసుకోకూడదు. రెడ్ మీట్ జంక్ ,గుడ్లు ,లివర్ ,డ్రై ఫ్రూట్స్ తాజా ఆకుకూరలు వంటి జంక్ ఐరన్ అధికంగా వుండే పదార్ధాలు తినాలి. కాల్షియం విటమిన్ డి, సప్లమెంట్స్ కూడా డాక్టర్ సలహాలైతే తీసుకోవచ్చు. స్ట్రెస్ , యంగ్జయిటీ నిద్ర సరిగా ఉండకపోవటం తలనొప్పి నీరసం మూడ్ స్ట్రింగ్స్ ఉండచ్చు. డాక్టర్ ప్రిస్కిప్షన్ రెండు తీసుకుని ఆహరం రెండు అవసరమే.

    పి.ఎం.ఎస్ కు చెక్

    ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కి ఇదీ అంటూ ప్రత్యేకమైన కారణం ఏదీ లేదు. హార్మోన్స్ మార్పులే ఇందుకు కారణం ఒక రకంగా పేర్కొనాలి. ప్రొజెస్టరాన్ , ఈస్ట్రోజెన్…

  • ఈ 19 సంవత్సరాల కౌధియా డియోపిస్ సెనెగల్స్ కి చెందిన మోడల్. ఈమె అందానికి సరికొత్త నిర్వచనం కారు నలుపు శరీర ఛాయ తెల్లని పళ్ళు ఒతైనా నల్లని రింగుల జుట్టు తో ఈమె సోషల్ మీడియా లో సంచలనం. శరీరం తో నలుపు వర్ణానికి కారణం మెలనిన్. ఈ నలటమ్మాయి తనను తానూ మెలనిన్ గాడెస్ గా చెప్పుకుంటుంది. ఈ అందమైన నల్లని రంగువల్లనే ప్రపంచమంతా ఫేమస్. పారిస్ ,న్యూయార్క్ లో మోడల్ గా పనిచేస్తున్న ఈమె శరీర వర్ణానికి సంబంధించిన ఓ క్యాంపైన్ ద్వారా మీడియా కంటబడింది. ఈమె ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో పెడితే రెండు లక్షల మంది ఫాలోవర్లు అవటంతో ఈమె ఇన్స్టాగ్రామ్ స్టార్ అయింది. తెల్లని తెలుపు సన్నని శరీరం మాత్రమే అందం అని పేర్చుకున్న గోడల్ని ఈ మెలనిన్ గాడెస్ లు చాలా మంది వస్తే బాగుండు.

    ప్రపంచమంతా ఫేమస్ ఈ శ్యామ సుందరి

    ఈ 19 సంవత్సరాల కౌధియా  డియోపిస్ సెనెగల్స్ కి చెందిన మోడల్. ఈమె అందానికి సరికొత్త నిర్వచనం కారు నలుపు శరీర ఛాయ  తెల్లని పళ్ళు ఒతైనా …

  • ఏ పెళ్లి కయినా వెళితే భోజనాలు అయినాక కిళ్ళీలు లేదా మౌత్ ఫ్రెషనర్ల మిశ్రమం కనిపిస్తుంది. సోంపు గింజలతో పాటు కొబ్బరి తురుమూ దోస గింజలు ,సౌర పప్పు ,మెత్తటి వక్క పలుకు ,కుంకుమ పువ్వు ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలు కలిపి ఇచ్చే ఆ మిశ్రమంలో ప్రధాన పాత్ర సోంపు గింజలకే. జీలకర్ర లాగే వుండే ఈ సోంపును డెజర్ట్లు ,స్వీట్లతో వాడతారు. బెంగాలీలయితే వాళ్ల కూరల్లో బేకరీ ఉత్పత్తులు సోంపు గింజల్ని వేస్తారు. ఇది మంచి ఔషధమే కాదు అద్భుతమైన పోషకాలు కూడా ఉన్నాయిట. కాపర్ ,ఐరన్ , కాల్షియం వంటి ఖనిజాలు A ,B,C,E విటమిన్లు సోంపు గింజల్లో పుష్కలంగా దొరుకుతాయి. సోంపు గింజల్ని నమిలితే లాలాజలంతో నైట్రేట్ల శాతం పెరిగి బీ.పీ నియంత్రణలో వుంటుంది. ఇందులో ఎక్కువగా వుండే పొటాషియం బీ.పీ కి గుండె ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. నోటి సువాసన కోసం కాకుండా సోంపు అలవాటుగా రోజూ తిన్నా మంచిదే.

    మంచి వాసనే కాదు ఆరోగ్యం కూడా

    https://scamquestra.com/21-finansovye-afery-questra-world-i-atlantic-global-asset-management-agam-questraworldes-atlanticgames-31.html

  • ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి దేవిని ఎంతో ఆశ్చర్యంగా చూసారు. ఢిల్లీ లో ఉన్న సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో టైర్లకు పంచ్ కు వేస్తూ కనిపిస్తుంది. 75 ఎకరాల్లో ఉన్న ఈ ట్రాన్స్ పోర్ట్ నగర్ లో సుమారు 70,000 ట్రక్కులు పార్క్ చేయచ్చు. 20,000 ట్రక్కులు తిరుగుతుంటాయి. టైర్లకు పంచర్లు వేసేందుకు స్థిరపడిన శాంతి దేవి అన్ని వాహనాల టైర్లకు పంచర్లు వేయగలరు. చాలా మంది మగవాళ్ల కంటే నేను బెటర్ మెకానిక్ ని కాకపోతే నేనా పనిచేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తారు. అంటుందామె. ఆటో మొబైల్ రంగంలోకి ముఖ్యంగా ఇప్పటివరకు స్త్రీలు అడుగుపెట్టని రంగంలోకి ఆడవాళ్ళూ ప్రవేశించి ఆ హద్దులు చెరిపేయాలి. ఇదిగో కళ్ళ ముందే స్ఫూర్తి దాత శాంతి దేవి.

    మహిళా మెకానిక్ శాంతి దేవి ఒక్కరే

    ఇండియా లో మొట్టమొదటి మహిళా ట్రక్ మెకానిక్ శాంతి దేవి శారీరిక మైన కష్టంతో కూడిన ఈ వృత్తిలో భర్త తో పాటు పాలుపంచు కుంటే శాంతి…

  • బాల నటిగానే వెండి తెరకొచ్చిన రెజీనా కసాండ్రా కృష్ణ వంశీ నక్షత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. చిన్నప్పుడు సైకాలజీ చదవాలి అనుకునేదట. చెన్నయ్ లోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో బి. ఏ సైకాలజీ తీసుకొందిట. కానీ ఇటు సినిమాల్లో బిజీ అయిపోయింది. కానీ ఎప్పుడు ఎదుటివాళ్ళ కష్టాలు పంచుకోవాలనే అనుకుంటుందిట. ఇప్పటికీ రెజీనా మూడు స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తోందిట. హైద్రాబాద్ లోని పాఠశాలల్లో పిల్లలకు క్రీడా నైపుణ్యాలు నేర్పే లైఫ్ ఈజ్ ఎ బాల్ సంస్థ పాఠశాలల్లో పిల్లలకు ఇంగ్లీషు విలువలతో కూడిన విద్య నేర్పించే లైఫ్ ఫర్ ఎ చేంజ్ సంస్థ మూడోది ఆదిత్య మెహతా ఫౌండేషన్ కోరుకున్న దాని కోసం ఎంతైనా కష్టపడతానని చెప్పే రెజీనా తన బిజీ షెడ్యూల్స్ తో కూడిన జీవితాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుని సమయం మిగుల్చుకుని ఈ సేవ సంస్థలతో కలిసి పనిచేస్తానని చెపుతోంది. ఇప్పుడు తెలుగు చక్కగా నేర్చేసుకుందిట కూడా.

    సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్న రెజీనా

    బాల నటిగానే వెండి తెరకొచ్చిన రెజీనా కసాండ్రా  కృష్ణ వంశీ నక్షత్రంలో ప్రస్తుతం నటిస్తోంది. చిన్నప్పుడు సైకాలజీ చదవాలి అనుకునేదట. చెన్నయ్ లోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో…

  • వేలకు వేలు కర్చు పెట్టి కార్పోరేట్ కాలేజీలోచదివిస్తున్న ఉన్నత విద్య కోసం సీటు తెచ్చుకోలేని విద్యార్ధుల కోసంశివాంగి స్టొరీ. కాన్పూర్కి అరవై కిలో మీటర్ల దూరంలోని దేహా గ్రామంలో పుట్టిన శివాంగి తండ్రి తో పాటు దిన పత్రికలు, మాగజైన్లు అమ్ముతుండేది. ఆనంద కుమార్ నడుపుతున్న సూపర్ ౩౦ విద్యా కార్యక్రమం గురించి తలుసుకుని ఆయన్ను కలిసింది. పేద కుటుంబాల పిల్లల్ని ఐఐటి ఇంజనీర్లుగా తీర్చి దిద్దే కార్యక్రమం అది. శివాంగి ఆ కార్యక్రమానికి ఎంపికైనది. కోచింగ్ పూర్తి చేసుకుని ఐఐటి లో సీటు సంపాదించింది. మంచి కార్పోరేట్ ఉద్యోగం సంపదిన్చేసింది కూడా. ఈ అమ్మాయి విజయగాధను ఆనంద్ కుమార్ ఆమె ఫోటోలు, ఆమె ఇంట్లో వాళ్ళ ఆనందోత్సాహాలు పోస్ట్ చేస్తే వేలకొద్ది లైక్లు షేర్లు వచ్చాయి.

    ఆ శివాంగి ఇప్పుడు ఐఐటి గ్రాడ్యుయేట్

    వేలకు వేలు కర్చు పెట్టి కార్పోరేట్ కాలేజీలోచదివిస్తున్న ఉన్నత విద్య కోసం సీటు తెచ్చుకోలేని విద్యార్ధుల కోసంశివాంగి స్టొరీ. కాన్పూర్కి అరవై కిలో మీటర్ల దూరంలోని దేహా…

  • జీవితం లో తగిలిన ఒక్కో గాయం స్వర్ణలతకు బలమే ఇచ్చాయి. ప్రతి నైపుణ్యాన్ని ఒడిగ పెట్టింది. నాట్యం, పాట, ఈత లాంటి ఎన్నో కళాకారులతో పాటు పన్నెండు భాషలు నేర్చుకుంది. ఇంత నేర్చిన స్వర్ణలత ముల్టిపుల్ స్కిర్లోసిన్ బాధితురాలు. చక్రాల కుర్చికే పరిమితం మైన స్వర్ణలత జేవితం మాత్రం విశాలం. వికలాంగుల కోసం స్వర్ణ ఫౌండేషన్ స్థాపించింది. కాలం కూడ పట్టుకోలేని పక్షవాత బాధితులు బెంగుళూరు, పూణే, చెన్నై లోని విద్యార్ధులు కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల కోసం వందల ప్రసంగాలు చేసింది. ఇద్దరు పిల్లల తల్లి స్వర్ణలత దివ్వాంగుల కోసం సారధి క్యాబ్ డిజైన్ చేసింది. తాగునీరు, మరుగుదొడ్డి వసతులున్న క్యాబ్లు ఇవి. దివ్వంగులకు వైద్యం, చదువు కోసం, ప్రభుత్వ ప్రేవైట్ సంస్థల్లో ప్రత్యేక వసతుల కోసం పోరాటం చేస్తూనే వుంది స్వర్ణలత.

    ఎంత విశాలం ఈమె జీవితం

    జీవితం లో తగిలిన ఒక్కో గాయం స్వర్ణలతకు బలమే ఇచ్చాయి. ప్రతి నైపుణ్యాన్ని ఒడిగ పెట్టింది. నాట్యం, పాట, ఈత లాంటి ఎన్నో కళాకారులతో పాటు పన్నెండు…

  • మిరపకాయ కొరికి చూస్తే కారం మండుతుంది. కానీ ఈ బుల్లి బఠానీ లాంటి మిరపకాయలు తింటే కంటే కొంటె దిమ్మ తిరిగిపోతుంది. అజిచరపితా గా పిలిచే ఈ బుల్లి మిరపకాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఎంత అంటే కిలో 17 లక్షల నుంచి 23 లక్షల వరకు ధర పలుకుతాయి. ఉత్తర పేరు అడవుల్లో దొరికే వీటిని ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా రైతులు వ్యాపార పంటగా పండించడం మొదలు పెట్టారు. తింటే తట్టుకోలేనంత కరంగా వుంటాయి కానీ వంటలకు గొప్ప రుచి ఇస్తాయట. కాస్త చల్లగా వుండే వాతావరణం మాత్రమే వీటిని సాగుచేసేందుకు అనుకూలంగా ఉంటుందిట.

    ఈ మిరపకాయ ఖరీదు కేజి 17 లక్షల పైనే

    మిరపకాయ కొరికి చూస్తే కారం మండుతుంది. కానీ ఈ బుల్లి బఠానీ లాంటి మిరపకాయలు తింటే కంటే కొంటె దిమ్మ తిరిగిపోతుంది. అజిచరపితా గా పిలిచే ఈ…

  • చాలా సహజంగా చెప్పుకోవలసిన విషయాలు వార్తల్లో చదువుతున్నాం. ఒక అత్తగారు మనుమరాలిని ఇచ్చిన కోడలికి కారు బహుమతిగా ఇచ్చింది. కడుపులో వున్నది ఆడపిల్ల అని తలియగానే చంపేసే సంప్రదాయపు రోజుల్లో వున్నాం కనుక ఇది ఆ అత్తగార్నే అభినందించవలసిన వార్త రాష్ట్ర ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన ప్రేమా దేవి ఉత్తర్ ప్రదేశ్ లోని హామీద్ పూర్ జిల్లా లో వుంటారు. ఆమెకు ఒక్కడే కొడుకు. కోడలు ఖుష్బు చక్కని పాపాయిని కన్నది. ఇక వాళ్ళ ఇంట్లో పండగోచ్చింది. బంధు మిత్రులకు పార్టీ ఇచ్చారు. తన ఇంటికి చక్కని బంగారు తల్లిని తెచ్చిన కోడలికి ప్రేమా దేవి అందమైన కారుని బహుమతిగా ఇచ్చారు. ప్రేమా దేవి గురించి ఈ కధ వింటే ఆడపిల్లను వద్దు అనుకునే కుటుంబాలకు బుద్ది వస్తుందేమో!

    మా మంచి అత్తగారు

    చాలా సహజంగా చెప్పుకోవలసిన విషయాలు వార్తల్లో చదువుతున్నాం. ఒక అత్తగారు మనుమరాలిని ఇచ్చిన కోడలికి కారు బహుమతిగా ఇచ్చింది. కడుపులో వున్నది ఆడపిల్ల అని తలియగానే చంపేసే…

  • బ్రీతింగ్ వ్యయామాలు చేయడం వాల్ల రోజంతా ఉత్సాహంగా వుంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో ప్రతి వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది మానసిక ఏకాగ్రత శరీర పటుత్వం పెరుగుతాయి. రక్తపోటు తగ్గుతుంది. డీప్ బ్రీతింగ్ వ్యయామంతో ఎండార్ఫన్స్ విడుదలై నొప్పుల నుంచి ఉపసమనం కలుగుతుంది. రిలాక్సేషన్ పెరుగుతుంది. లింఫాటిక్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. హాని కారక టాక్సిన్లు విడుదల చేసే ఈ వ్యవస్థ సరిగ్గా పని చేయడం వాల్ల శరీరం శుభ్ర పడుతుంది. తప్పకుండా ఈ ఎక్స్ ర్ సైజులు గురించి శిక్షణ తీసుకుని ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే ఫలితం వుంటుంది.

    కండరాలల శక్తిని పెంచే వ్యయామం ఇది

    బ్రీతింగ్ వ్యయామాలు చేయడం వాల్ల రోజంతా ఉత్సాహంగా వుంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో ప్రతి వ్యవస్థ పని…

  • యే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య తో పోటీ పడి నటించింది కదా అనుష్క. ఓ పాటలో ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించిందట ఆమె. “చన్న మేరియో” అనే పాటలో అనుష్క ధరించిన లెహంగా బరువు పదిహేడు కేజీలు. అందుకు సరిపోయే నగల బరువు మూడు కిలోలు. ఈ ప్రత్యేక నగల్ని మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. పాటలో రాణీలా అనుష్క హుందాగా కనిపించేందుకు మల్హోత్రా ఈ లేహంగాను నృరోస్కీ, జర్దోసీ, విలువైన రాళ్ళు, అద్దాలతో అందంగా రూపొందించాడు. పై దుపట్టా కూడా ఖరీదైందీ, బరువైందే. ఈ పాట చిత్రీకరణ నాలుగు రోజులు జరిగింది. అనుష్క రెండంతస్తుల మేడ లోని మొత్తం 30, 40 మెట్లు ఎక్కేదిగా నృత్యం చేసింది. ఇరవై కేజీల బరువుతో సన్నగా, నాజుగ్గా వుండే అనుష్క ఎంత కష్ట పడిందో. అయితేనే పీకే, సుల్తాన్, యే దిల్ హై ముష్కిల్ అన్నీ ఆమెకు పేరు తెచ్చినవే.

    ఇరవై కేజీల బరువైన కాస్ట్యుమ్స్ తో

    యే దిల్ హై ముష్కిల్ లో ఐశ్వర్య తో పోటీ పడి నటించింది కదా అనుష్క. ఓ పాటలో ఇరవై కేజీల బరువున్న దుస్తులు, నగలు ధరించిందట…

  • ఇమాకైథల్ అంటే మణిపూర్ భాషలో తల్లులు నిర్వహించే మార్కెట్ అని అర్ధం. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో వుంది చారిత్రాత్మక మార్కెట్ ఇమాకైథల్. ఇది మణిపూర్ మహిళల శక్తికి చిహ్నమే కాదు ఆసియాలోనే అతి పెద్ద మహిళల మార్కెట్. 16వ శతాబ్దంలో ఏర్పాటైనట్లు భావిస్తున్న ఈ మార్కెట్ లో 500 మంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పెళ్ళయిన మహిళలు మాత్రమే ఇక్కడ వ్యాపారం నిర్వహించవచ్చు. ఇక్కడ వ్యాపారం కోసం మహిళలు కేవలం 40 రూపాయలు చెల్లిస్తే చాలు. వీళ్ళకి యూనియన్ వుంది. సభ్యులకు రుణాలిస్తుంది కూడా. ఇది కేవలం మార్కెట్ మాత్రమే కాదు మణిపూర్ మహిళల జీవన దర్పణం. 16వ శతాబ్దంలో జీవనోపాధి కోసం మగవాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల, ఇంకా యుద్దాల్లో పాల్గొనడం వల్ల ఆడవాళ్ళ కోసం ఇమాకైథల్ ఏర్పడిందని చెప్తారు. ఈ మార్కెట్ మహిళలు ఆంగ్లేయుల నుంచి తమ సరుకులను రక్షించుకొనేందుకు తుపాకులను పట్టుకొని పోరాటం చేశారు ఆ పోరాటం నూపిలాన్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ పోరాటం లో ప్రాణాలు ధారపోసిన మహిళల గుర్తుగా ఇంఫాల్ లో ఒక మ్యూజియం వుంది.

    ఇది మణిపూర్ మహిళల శక్తికి ప్రతీక

    ఇమాకైథల్ అంటే మణిపూర్ భాషలో తల్లులు నిర్వహించే మార్కెట్ అని అర్ధం. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో వుంది చారిత్రాత్మక మార్కెట్ ఇమాకైథల్. ఇది మణిపూర్ మహిళల…

  • కొన్ని మాటలు అనుభవంతో చెప్పినవి విని తీరాలి. చెప్పినవాళ్ళు ఏ వృత్తిలో వున్నారు వాళ్ళ అనుభవం ఏమిటన్న లెక్కలు అనవసరం. సమంత తిరుగులేని టాప్ స్టార్. ఎన్నో సినిమాల్లో కొన్ని వందల మందితో పని చేసిన అనుభవం ఆమెది. జనతా గ్యారేజ్ తో ఒక సక్సెస్ సంపాదించుకొన్న సమంత, ‘సమయo’, ‘ డబ్బు‘ ఈ రెండూ ఒక్కటే. ఉన్నప్పుడు విలువ తెలియదు అవి దూరమైతే తిరిగి రావు అంటోంది. నేను ఖాళీ, నేను బిజీ అన్న రెండు పదాలకు నేను పెద్దగ ప్రాధాన్యత ఇవ్వను. ఖాళీగా ఉన్నమనుకొంటూనే చేతి నిండా పని పెట్టుకోవచ్చు. చేయాల్సిన పని చాలా ఉన్నా ఖాళీ గా ఉండవచ్చు. ఖాళీనా, బిజీనా అన్నది పనిని మనం ఎంత ఆస్వాదిస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి వుంటుంది. డబ్బుని, సమయాన్ని వాడుకోవడం తెలియాలి అది తెలిస్తే రెండింటికీ కొరత వుండదు అంటోంది సమంత. కరక్టే కదా పని వుంటే పని ఎక్కువైందనీ, పనిలేకపోతే పనిలేక ఇబ్బందిగా వుందని చెబుతుంటాం! మరి సమంత కరక్టే కదా!

    డబ్బు, సమయం రెంటినీ కరెక్ట్ గా వాడాలి

    కొన్ని మాటలు అనుభవంతో చెప్పినవి విని తీరాలి. చెప్పినవాళ్ళు ఏ వృత్తిలో వున్నారు వాళ్ళ అనుభవం ఏమిటన్న లెక్కలు అనవసరం. సమంత తిరుగులేని టాప్ స్టార్. ఎన్నో…

  • మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార వేసి ఆ తరువాత కాఫీ పొడి, వేడి నీళ్ళు పోస్తే కాఫీ టేస్టీ గా వుంటుందట. ఇలా ట్రై చేసి వుందం కదా. ఇంకోటి కోడి గుడ్డు సొనలో కొన్ని పాలు లేదా టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి ఆమ్లెట్ వేస్తే రుచిగా వుంటుంది, చూసేందుకు కూడా బావుంటుంది. కాలీఫ్లవర్ వండేప్పుడు ఓ టేబుల్ స్పూన్ పాలు పోస్తే కాలీఫ్లవర్ రంగు మారదు. బెండ కాయలు వేయించేప్పుడు పెరుగు ఓ స్పూన్ కలిపితే వేపుడు కరకరలాడుతుంది. ముక్కలు అతుక్కోవు. మిక్సీ లో ఇడ్లీ పిండి రుబ్బితే ఇడ్లీలు గట్టిగా వస్తుంటే ఇడ్లీ రవ్వ వేడి నీళ్ళలో నాననివ్వాలి. వెల్లుల్లి, అల్లo పేస్టు ఎక్కువగా మిగిలిపోతే అందులో కాస్త వేడి నూనె పోసి కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. పకోడీ పిండి కలిపాక అందులో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే పకోడీలు కరకరలాడతాయి.

    ఈ టిప్స్ తో వంట అదుర్స్

    మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార…

  • మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం గనుల్లో పని చేయాలనే నిర్ణయించుకొన్నారు. మైనింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోసం దరఖాస్తు చేస్తే ఒక్క కాలేజీ కూడా ఈమెకు సీటు ఇవ్వలేదు. చదువు విషయంలో లింగ వివక్షకు తావుండకోడదని వాదిస్తూ ఆమె హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. 1996 లో ఆమెకు అడ్మిషన్ దొరికింది. నాగపూర్ లోని రామ్ దేవ్ బాబా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మైనింగ్ ఇంజనీర్ గా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. అదే కాలేజీ లో లెక్చరర్ గా కొనసాగుతున్నారు డాక్టర్ చంద్రణీ ప్రసాద్ వర్మ. మొట్ట మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్. అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఇప్పటికీ మహిళలకు అనుమతి ఇవ్వడం లేదనే చంద్రణీ వర్మ ఆవేదన. మైనింగ్ రంగంలోకి చంద్రణీ వర్మని స్పూర్తిగా తీసుకొని మరింత మంది మహిళలు వస్తే బావుంటుంది.

    మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్

    మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం…