Saturday, 15 Aug, 2026
ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారం ఇటీవల మధుమేహం తర్వాత ఎక్కువమంది మహిళల వెన్ను నొప్పి తోనే. శారీరిక బలహీనత మానసిక వత్తిడి కూర్చునే భంగిమ సరిగాలేక పోవటం ఇలా కారణాలు ఏమైనా నడుము కింది భాగంలో వెన్నునొప్పి తో బాధపడేవాళ్లు సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతుంది. ప్రతి పదిమందిలోను ఎనిమిదిమంది దీని బారిన పడుతున్నారని అధిక బరువు ఎత్తటం క్షణం కూడా తీరిక లేని అనేక పనులు పదే పదే చేస్తూ ఉండటం కూడా మరో ముఖ్య కారణమని పరిశోధకులు చెపుతున్నారు . ఇందులో రెండు రకాల్ని ఒకటి దీర్ఘ కాలికంగా వస్తూ పోతుందని ఒకటి ఉదయం పూట ఎక్కువగా ఉంటుందనీ విశ్లేషించారు. తొలిదశలోనే కారణం తెలుసుకుని బరువులు ఎత్తటం ,దించటం ఆపాలనీ యోగా చేయాలనీ కూర్చునే భంగిమలు మార్చుకోవాలని వాటి ద్వారా దీన్ని నివారించుకుంటే మంచిదని చెపుతున్నారు. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నెప్పి తీవ్ర స్థాయికి చేరుతుందని అది దీర్ఘకాలికంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు . నడుం నొప్పి కదా ఒక మాత్రతో పోతుందని ఆలస్యం చేయద్దంటున్నారు

ఈ నొప్పికి మందులెందుకు

చాలామందికి నడుం నొప్పే సమస్య. ఈ ఇబ్బంది తలెత్తగానే హాస్పిటల్ కు ప్రదక్షిణలు,ఆపరేషన్లు అయిపోతున్నాయి.లేదా మందులు మింగడం వెన్నుపూసకు ఇంజక్షన్లు చేయించుకోవడం. కానీ ఇది జీవనశిలి సమస్య అంటున్నారు.ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.అదే పనిగా కూర్చుని ఉండటం టీవి చూడటం ఊబకాయం వంటివి ఈ వెన్ను నొప్పికి కారణంగా చెబుతున్నారు.ఆ సమస్యలన్ని తగ్గించుకుంటే వెన్నునొప్పి తగ్గిపోతుంది అంటున్నారు.అలాగే ఎక్కువసేపు ఇంట్లో అయినా అటు ఇటు నడుస్తూ ఉండటం చిన్నపాటి వ్యాయామాలు చేయడంతో ఈ సమస్య తగ్గించుకోవచ్చు అంటున్నారు.

Leave a Reply