Wednesday, 05 Aug, 2026
తాజా పండ్ల రసాలు అలసిన శరీరం సేద తీరడానికి కొత్త శక్తిని ఇచ్చేందుకు పనికి వస్తాయి. అవి పండ్లే కానక్కరలేదు. కాయిగురల రసాల్లోనూ ఆ శక్తే వుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువే వుంది. మనిషికి ఆరోగ్యానిచ్చే ఎన్నో పోషకాలు విటమిన్లు పుష్కలంగా వున్న క్యారెట్లును ముక్కలుగా తినడమే కాదు జ్యూస్ గానూ బావుంటుంది. కప్పు క్యారెట్ రసంలో 94 కాలరీల శక్తి వుంటుంది. ప్రకృతి సిద్ధమైన చక్కెర లభిస్తుంది. రొజువారీ అవసరమైన సి-విటమిన్ లో నాలుగోవ వంతు ఇ- విటమిన్ లో సగం లభిస్తాయి. క్యా రెట్ రసంలో బి-6 విటమిన్ లో 39 శతం ధేయామిన్ లో 20 శాతం రిబో ఫ్లోవిన్ లో 12 శాతం వుంటుంది. నరాలు, ఎముకల వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది. కండరాళ్ళ సంక్షోబానికి పనికి వచ్చే మెగ్నీషియమ్ లో 10వ వంతు క్యారేట్ రసం ద్వారా లభిస్తుంది. శరీరం మరింతగా విటమిన్లు ఖనిజాలను పోషణం చేసుకో గలుగుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. టమాటాలు, అనాసలు, బత్తాయిలో, కమలాలు, ఎర్ర ద్రాక్షలు, నిమ్మకాయలు వంటివి శరీరానికి అవసరమైన సి-విటమిన్ ను అధిక స్తాయిలో అందిస్తాయి.

 మేలైన పానీయాలు 

శరీరంలో మలినాలు పోవాలంటే రోగ నిరోధక శక్తి పెరగాలంటే పోషకాలు లభించే మంచి పానీయాలు తీసుకోవాలీ బత్తాయి అల్లం దాల్చిన చెక్క కలిపిన పానీయం శరీరానికి మెరుపునిస్తుంది.బత్తాయిని సన్నటి చక్రాల్లా తరిగి చల్లని నీళ్లలో వేయాలి. దానిలో అల్లం ముక్క ఐదారు పుదీనా ఆకులు దాల్చిన చెక్క వేసి నాననివ్వాలి.బత్తాయి నుంచి సి  విటమిన్, జింక్, క్యాల్షియం ఖనిజాలు దాల్చిన చెక్క లోని పోషకాలు శరీరంలోని రక్త సరఫరాని మెరుగుపరుస్తాయి.అలాగే చల్లని నీళ్లలో కీర దోస ముక్కలు వేసి పుదీనా ఆకులు, సన్నగా తరిగిన నిమ్మకాయ స్లైసులు వేసి రెండు మూడు గంటలు నాననిస్తే ఈ పానీయం శరీరం చల్లబరుస్తుంది.

Leave a Reply