Wednesday, 05 Aug, 2026
ఇటలీలో ప్రజలు సన్నగా నాజూగ్గా ఉంటారట. దానికి కారణం వాళ్ళు ఆహారం తీసుకునే పద్దతి అంటారు ఎక్స్ పర్ట్స్. మనం తినే ఆహారంలో రకరకాల కూరలు, అన్నం, పప్పు, పులుసు ఇలా ఉంటాయి. వీటిని అన్నంతోనో, ఇంకో రావ్వతోనో కలుపుకు తినటాం. నంజుకోవడం అనేది మన అలవాటు. కానీ ఇటలీ వాళ్ళు అలా కాదు. ఆకు ఐటమ్స్ వుంటే అన్నింటినీ విడివిడిగానే తింటారట. అలా ఒకసారి ఒక ఐటెం తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. పరిమితంగా తిని ఆపేస్తారు. మన దేశంలో రకరకాల రుచులు కలిపి అవసరానికి మించి తినటం కనుక పొట్ట పెరుగుతుంది. అలాగే వాళ్ళకున్న మంచి అలవాటు కండరాల్లను చెక్కని రూపంలో ఉంచుకునేందుకు కండరాల్ల నొప్పులు రానివ్వరు. ఆలివ్ నూనె, కర్పూరం కలిపి శరీరం పై మర్దనా చేసుకోవడం . ఈ మర్దనా వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యం, కండరాల్ల రూపం బావుంటాయి. అలసట లేని వ్యాయామం ఇది.

ఇదీ సమస్యే

చాలాసార్లు తోచక ఏదైనా తినాలని పిస్తూ వుంటుంది. సెలవు పూట ఇంట్లో ఉంటే తిండి కోసం నిమిషానికోసారి ఫ్రిజ్ డోర్ తెరవటం,డబ్బాలు వెతకటం కామన్ కానీ ఇలాటి ఆకలి లేని తిండికి అలవాటుపడితే అధిక బరువు,అనారోగ్యం తప్పదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒక్కసారి మనకు బాగో లేకపోతే తియ్యగా ఏదైనా తినాలనిపిస్తుంది. వంటరిగా ఉన్నా ఆ కాన్ ఫ్యూజన్ తో ఏదోకటి తినేస్తారు. అప్పుడు ఏం తింటున్నం,ఎంత తింటున్నం అన్నా స్పృహ ఉండదు. ఏదో ఒకటి కోరుకోవటం అంతే. ఈ అధిక తిండికి మూలం మనసే. ఈ విషయం గ్రహించుకొని మరోసారి వత్తడి అనిపించినా, విసుగ్గు ఉన్నా తిండి జోలికి వెళ్ళకుండా ఇంకో వ్యాపకం ఎంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a Reply