ఉదయం అల్పాహారానికి మధ్యాన్న భోజనానికి మధ్య ఒక అరటి పండు తింటే శరీరంలో పేరుకొనే అదనపు సోడియం ను మూత్రం ద్వారా బయటికి పంపిస్తుంది అంటారు డాక్టర్లు.ఒక అరటి పండులో 400 నుంచి 450 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది.ప్రాసెస్ట్ పదార్థలు,చిరుతిళ్ళు,నిల్వ పచ్చళ్ళు తినడం ద్వారా అవసరానికి మించిన ఉప్పు శరీరంలో చేరుతుంది.ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.ఈ ఉప్పును బయటికి పంపేందుకు అరిటిపండే మంచి మందు అంటున్నారు డాక్టర్లు.














