• ఇది మల్లెల మాసం. ఎండల్లో దొరికే అద్భుతమైన పూలు ఇవి ఈ సువాసనల మల్లెలలో సౌందర్య పోషణ చాలా ఈజీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు కూడా మల్లెలు ఎండబెట్టి పొడి చేయాలి. అందులో పాలు ముల్తాని మట్టి, ఓట్స్ కలపాలి. దీన్ని ముఖానికి రాసి మర్దనా చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. అలాగే కొన్ని బంతి రేకులు, గులాబీ పువ్వులు కలిపి ముద్దగా చేసి అందులో కాస్త పెరుగు కలిపి పుతలా వేసుకోవచ్చు. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎండ కారణంగా పేరుకొన్న నలుపుదనం పోతుంది. అలాగే గులాబీ రేకుల్ని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. అందులో కాస్త గోధుమ పిండి, పెరుగు కలిపి నిగారింపుతో వుంటుంది. ఈ పూత వల్ల చర్మానికి తేమ అంది మృదువుగా మారుతుంది. మందార ఆకుల్ని ఎండ బెట్టి పొడిగా చేసి ఆ పొడిలో పెరుగు చందనం కలిపి ముఖానికి మెడకి ప్యాక్ వేసుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఈ పూల ప్యాక్ లు పార్లర్ వేసిన ఫేస్ ప్యాక్ ల కంటే బాగా పని చేస్తాయి.

    మల్లెల ప్యాక్ తో మోహంలో కాంతి

    ఇది మల్లెల మాసం. ఎండల్లో దొరికే అద్భుతమైన పూలు ఇవి ఈ సువాసనల మల్లెలలో సౌందర్య పోషణ చాలా ఈజీ, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లు రావు…

  • ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్ చేయక పొతే చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. బొప్పాయిలో వుండే ఎంజైమ్స్ ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. రెండు చెంచాల గుజ్జు లో కొద్దిగా ఆలివ్ నూనె, చెక్కర కలిపి ఫేస్ ప్యాక్ లా వేసుకోని కడిగేస్తే ముఖం పై పేరుకున్న మురికి పోతాయి చెక్కని మెరుపు వస్తుంది. కొబ్బరి నూనెలో కొంచ చెక్కర , అర చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకి మర్దనా చేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. పావు కప్పు ఓట్స్ పొడిలో పెరుగు, పసుపు, గులాబీ నీళ్ళు కలిపి ఈ మిశ్రమంతో మొహం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. రెండు చెంచాల కాఫీ పొడి లో బాదాం నూనె, కొబ్బరి నూనె కలిపి పూతలా వెయ్యాలి. తడి చేతుల్లో మర్దనా చేస్తే చల్లని నీళ్ళతో మొహం కడిగేసుకోవాలి. కాఫీ పొడి నిర్జీవంగా మారిన చర్మానికి జీవం ఇస్తే బాదాం నూనె తెమ అందిస్తుంది. బియ్యం పిండి, తేనె కలిపిన మిశ్రమంతో మాస్క్ వేసుకుని కడిగేసాక, మాయిశ్చురైజర్ రాస్తే చర్మం చాలా మృదువుగా కనిపిస్తుంది.

    ఇవన్నీ మంచి ఫేస్ ప్యాక్ లు

    ఎండ, గాలి, దుమ్ము ముఖచర్మం పైన ఎంతో ప్రభావం చూపెడతాయి. ఈ కాలంలో మురికి దుమ్ము ధూళి చర్మం పైన పేరుకు పోతాయి. అవి వెంటనే క్లీన్…

  • ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని ఏ పైన్ అనే ఎంజైమ్ మొహానికి తక్షణం మెరుపులిస్తుంది. గుజ్జులో అరచెంచా గంధం, కలబంద గుజ్జు కలిపి రాసి పదే పది నిమిషాల్లో చల్లని నీళ్ళతో కడుక్కొని చుస్తే. ఏ పార్టీకొ వెళితే ప్రత్యేకంగా కనబడేంత మేరుపోస్తుంది. అలాగే గుజ్జులో తేనె, పెరుగు, రోజ్వాటర్ కలిపినా సేమ్ ఎఫెక్ట్. అలాగే ఓట్స్ కూడా మంచి సౌందర్య పోషకమే. ఓట్స్ ఓ గుప్పెడు వేడి నీళ్ళల్లో నానబెట్టి గంధం పెరుగు వేసి కలిపి ఫేస్ పాక్ వేసినా చెక్కని కళే. పాలు కూడా మంచి ఎఫెక్ట్ ఇస్తాయి. పాలు గంధం, బొప్పాయి గుజ్జు, తేనె కలిపి ఫేస్ పాక్ వేస్తె ఎంత అందం మొహం పైకి వస్తుందో న్యాయంగా చూసి తలుసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు వాడకుండా వచ్చేదే అసలైన అందం.

    మొహం వెన్నెల కాంతితో మెరవాలంటే

    ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా, పార్లర్ కు పోకుండా ఎలాంటి రాసాయినాలు వాడకుండా ఇప్పటికిప్పుడు మొహం మెరిసిపోవాలంటే బొప్పాయి గుజ్జుని మనసులో తలచుకోవాలి. బొప్పాయి లోని…