WoW
సైనిక రంగంలో మహిళలు
భారతదేశ సైనిక విభాగాల్లోని మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతించడంతో యుద్ధ విమానాల హైలెట్స్ గా మహిళలు శిక్షణ పూర్తి చేసుకుని యుద్ధానికి సిద్ధం అయ్యారు తాజాగా సైనిక దళాల్లో తొలిసారిగా ఐదుగురు మహిళలకు కర్నల్ ర్యాంక్ ఇచ్చారు. వచ్చే సంవత్సరం నుంచి అమ్మాయిలకు సైనిక స్కూల్ లలో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. కోరుకొండ సైనిక దళాలలో పది సీట్లు కేటాయించడం జరిగింది. సైనిక స్కూల్ లలో చదువుకొని శిక్షణ పొందిన ఆడపిల్లలు నేషనల్ డిఫెన్స్ అకాడమీ […]
గ్రాండ్ లుక్ తో లెహంగా
లెహంగా ఎప్పటికీ మారని ఫ్యాషన్ లో ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో వేడుకల్లో ఇండో వెస్ట్రన్ స్టయిల్ లో లెహంగా యువతను ఆకట్టుకుంటోంది. ప్లెయిన్ బెల్స్ స్లీవ్స్ టాప్ ప్రింటెడ్ లెహంగా ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ అంటారు డిజైనర్స్. ఎంబ్రాయిడరీ మెరుపులు జోడించి ప్యాచ్ లు జతచేసి పువ్వులతో నింపి చక్కటి ప్రింట్లు సమకూర్చి లెహంగా కు కొత్త హంగులు తీరుస్తున్నారు డిజైనర్స్. పూర్తిగా ఎంబ్రాయిడరీ తోనూ వెస్ట్రన్ పెప్లమ్ టాప్ తో జత చేస్తే వేడుకల్లో […]
ఎందరికో స్ఫూర్తి
కోల్ కతా కు చెందిన 35 ఏళ్ల యోగా టీచర్ అర్పితా రాయ్ జీవితం గొప్ప స్ఫూర్తి. ఒక ప్రమాదంలో రెండు కాళ్ళు పోగొట్టుకొన్న అర్పిత కు కృత్రిమ కాలు అమర్చారు ఎంతో బాధను భరించి ఆమె యోగా ప్రాక్టీస్ చేసింది. ఇన్ స్టా లో ఆమె ఆసనాల ఫోటోలతో ఎంతోమంది అభినందనలు అందుకుంది అర్పితా. మోకాళ్ళ దగ్గర పూర్తి నియంత్రణ ఉంటే తప్పించి యోగాసనాలు కష్టం. అలాంటిది అర్పితా కృత్రిమమైన కాళ్లతో ఉద్దండులను మరిపించేలా యోగాసనాలు […]
బొగ్గు గనుల్లో తొలి మహిళ
అండర్ గ్రౌండ్ మైనింగ్ విధులను స్వీకరించిన తొలి మహిళ ఆకాంక్ష కుమారి. కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో 50 ఏళ్లుగా నడుస్తున్న కోల్ ఇండియా లిమిటెడ్ కు అనుబంధ సంస్థ ఆయన సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కు ఆకాంక్ష చురీ మైన్స్ లో అండర్ గ్రౌండ్ కార్యకలాపాలకు నియమించారు. రాంచీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే చురీలో ఆకాంక్ష అని చేయనున్నది జార్ఖండ్లోని హజారీబాగ్ కు చెందిన ఆకాంక్ష బిట్స్లో మైనింగ్ ఇంజనీరింగ్ […]
ఈమె చాలా ప్రత్యేకం
గుజరాత్ లోని వడోదరా కు చెందిన శ్వేతా పర్మార్ లైసెన్స్ డ్ ఉమెన్ స్కై డ్రైవింగ్ గతంలో స్కై డ్రైవింగ్ నేర్చుకున్న మహిళల్లో రేచల్ థామస్, షీతల్ మహాజన్, అర్చన సర్దన ఉన్నారు ఇప్పుడు వారి సరసన 28 ఏళ్ల శ్వేతా పర్మార్ చోటు చేసుకున్నారు ఇందుకోసం శ్వేతా 8 అంచల కోర్సును 29 సార్లు స్కై డ్రైవింగ్ ను చేసి, రాత పరీక్షలు రాసి సర్టిఫికేట్ పొందింది. ఇలాంటి సర్టిఫికెట్ పొందిన భారతీయ మహిళగా రికార్డు […]
సరికొత్త ఆలోచన
New Blue pottery పేరుతో దిశారీ మాథుర్ సిరామిక్ వ్యర్థాలతో సాంప్రదాయ అచ్చులు ఉపయోగించి అందమైన సిరామిక్ వస్తువులు తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. జైపూర్ బ్లూ పాటరీ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన దిశరీ మాథుర్ సిరామిక్ ఆర్ట్ తో ఒక విన్నూత ప్రక్రియను కొనసాగిస్తోంది. దిశారీ సవన్నా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ లో ఇంటీరియర్ డిజైనర్ గా డిగ్రీ పొందింది లండన్ లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ఇంపీరియల్ కాలేజ్ […]
ఈ జామ్ లు ఎంతో రుచి
భూయిరా జామ్ ఫ్యాక్టరీ స్థాపించారు బ్రిటిష్ ఇండియన్ లినెట్. కాశ్మీర్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హిమాచల్ ప్రదేశ్ లో స్థిరపడ్డారు లినెట్. అక్కడ అధికంగా ఉండే ఆప్రికాట్ పీచ్, యపిల్, కివి పండ్ల తో జామ్ తయారు చేసేవారు. రసాయనాలు వాడకుండా యాపిల్ జ్యూస్ పంచదార వినియోగించి లినెట్ తయారుచేసే జామ్ ల రుచి అందరికీ నచ్చాయి. 76 టన్నుల పండ్లతో 48 రకాల పండ్లు తయారుచేస్తున్నారు. రోజుకి ఆ ఫ్యాక్టరీలో 850 జామ్ […]
జ్ఞాపక శక్తి అద్భుతం
నిముషంలో 93 దేశాలకు చెందిన విమానాలను,అదీ తోకను చూసి గుర్తుపట్టిన ఆరేళ్ళ ఆర్నా గుప్తా అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓ చోటు దక్కించుకొంది హరియానా లోని పంచకులకు చెందిన ఆర్నా రెండేళ్ళ వయసు నుంచే తన ప్రతిభను నిరూపించుకోవటం మొదలు పెట్టింది. ఒక్కసారి చూసినా విన్న తన మెదడులో వాటిని నిక్షిప్తం చేసుకోగలరు ఆర్నా. గత సంవత్సరం 120 మంది ప్రముఖుల పేర్లను 92 సెకన్ల లో చెప్పి రికార్డ్ సృస్టించింది ఆర్నా.
బుల్లి రచయిత్రి
అభిజిత గుప్తా తన ఏడేళ్ల వయసులో ప్రపంచపు అతి పిన్న వయస్కురాలైన రచయితగా గుర్తింపు పొందింది. అభిజిత మైథిలీ శరణ్ గుప్తా,శియారాం గుప్తా ల మనమరాలు కోవిడ్ సమయంలో ఈ పాప ‘హ్యాపినెస్ ఆల్ వరల్డ్’ పేరిట రాసిన కవితలు ప్రశాంసాలు పొందాయి. ఇంటర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమె పేరు పొందుపరిచారు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆమెను గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్ గా గుర్తింపును ఇచ్చారు.
మెహందీ తో రికార్డ్ ఆదిత్య
12 నిమిషాల్లో మెహందీ తో ప్రపంచపు వింతలను వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది కోజికోడ్ కు చెందిన అమ్మాయి ఆదిత్య. కేరళలోని కోజికోడ్ కు చెందిన ఆదిత్య మెహందీ పెట్టటం లో శిక్షణ ఏమి పొందలేదు బొమ్మలు డిజైన్ లు గీయడం పట్ల ఆసక్తితో చారిత్రక కట్టడాల శిల్పాలు గీసేందుకు ప్రయత్నం చేసేది పెళ్ళిళ్ళు వేడుకల్లో మెహేంది తో ఈ కట్టడాల డిజైన్లు డబ్బు సంపాదన కోసం వేసేది. ఏదైనా కొత్తగా […]
ఈ కుండీలే స్పెషల్
షై బు య్ ఇండియా పేరుతో ఎకో-ఫ్రెండ్లీ కుండీలు తయారుచేసే అమ్ముతోంది చండీఘర్ కు చెందిన 25 ఏళ్ల అమ్మాయి అట్మాన్ సంధు మట్టి పీచు ఫైబర్ గ్లాస్ తో ఎకో-ఫ్రెండ్లీ కుండీలో తయారుచేసింది సంధు . స్థానిక కళాకారులు వాటి పైన వేసిన పెయింటింగ్స్ తో ఆ కుండీలకు చక్కని రూపం వచ్చింది. వ్యర్థంగా పోయే మెటీరియల్స్ నే వాడి తయారుచేసిన ఈ కుండీలు కస్టమర్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
టీకానే అద్భుత ఆయుధం..అవగాహన కోసం యువతి సాహసం
కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్ వేయించుకోవడమే కీలకం. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరిస్తూ వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇదే విషయానికి మరింత ప్రచారం కల్పించేలా సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన కొండి ప్రియాంక బైక్ రైడ్ను ఎంచుకుంది. ‘టీకానే మనకున్న అద్భుత ఆయుధం’ అంటూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం మొదలుపెట్టింది..గతేడాది అక్టోబరులో హైదరాబాద్ నుంచి కేదార్నాథ్ వరకు దాదాపు 4వేల పైచిలుకు కిలోమీటర్లు ఒంటరిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించింది. ఆ […]
చింపాంజితో మహిళ ప్రేమాయణం..
కొందరు జంతుప్రేమికులు కుక్కలు, పిల్లుల నుంచి పులి వంటి క్రూరమృగాలను కూడా పెంచుకుని వార్తల్లో నిలుస్తారు. మరికొందరైతే.. పెంపుడు జంతువులను ఇంట్లో మనిషిగా భావించి.. పుట్టినరోజు వేడుకలను కూడా చేస్తారు. అయితే ఓ మహిళ ఏకంగా చింపాంజితోనే ప్రేమలో పడింది. నాలుగేళ్లు దానిని కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న జూ అధికారులు.. ఆమెపై నిషేధం విధించారు. బెల్జియానికి చెందిన ఆది టిమ్మర్మన్స్ జంతు ప్రేమికురాలు. తరచూ ఆమె ‘యాంట్వెర్ప్ జూ’కు వెళ్తుండేది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న […]
ఇవి అందాల సరస్సులు
నెలవంకల్లా ఒంపులు తిరిగిన ఇసుక తిన్నెల మధ్యలో ఆకుపచ్చగా ప్రతిబింబించే నీటి కొలనులు. ఇంత అందమైన ప్రకృతి ప్రసాదం బ్రెజిల్ లోని నేషనల్ పార్క్ లెంకోయిస్ మారనేన్సిస్ లో ఉంది. ఇది నిజానికి ఎడారి. అయితే వర్షం నీరు ని ఇసుక మధ్యని చోటు చేసుకొంటుంది. పోలాల్లో చిన్న వంపుల్లా కనిపించే ఇవన్నీ పెద్ద పెద్ద చెరువులు. వర్షాకాలంలో వేల మంది పర్యాటకులు ఈ అందాల సరస్సుల్లో జలకాలాడేందుకు వస్తారు.
కనువిందుగా ఫ్లోరల్ ప్రింట్స్
పూల పూల డిజైన్లు దుస్తులు, చెప్పులు బ్యాగులు ఫ్యాషన్ ట్రెండ్ లో ఉంటాయి. కెన్ స్కాట్ అనే అమెరికన్ డిజైనర్ నిండు రంగులు ప్రింట్ లు ఐకానిక్ మోటిఫ్స్ తో ఫ్లోరల్ ప్రింట్స్ కి శ్రీకారం చుట్టాడు. పూల షర్టులు పూల గౌన్లు ప్యాంట్లు టాప్స్ హాఫ్ హ్యాండ్ షర్ట్ లు ఫుల్ హ్యాండ్ షర్ట్ లు, చెప్పులు, బ్యాగ్ లు ఎటుచూసినా రంగులే. సాయం వేళల్లో పార్టీ డ్రెస్ లు ట్రాక్ సూట్లు సిల్క్ షర్ట్ […]
అపూర్వ గౌరవం
ఉమెన్ ఇన్ ఆడియో బుక్ లో మన దేశం తరఫున సాజిదా ఖాన్ కు చోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఆడియో ఇంజనీర్ ల విశేషాలతో బ్రిటన్ లోని ఒక సంస్థ ఈ పుస్తకాన్ని రూపొందించింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆడియో ఇంజనీర్ కి ముఖ్య పాత్ర సౌండ్ ఎఫెక్ట్స్ రికార్డింగ్ సౌండ్ డిజైన్ చేయాలి. అలాగే ఒక పాట రికార్డ్ చేయాలంటే కొన్ని వందల ట్రాక్స్ వినాలి. మెలోడీ బీట్స్ లైవ్ ఇన్ స్ట్రుమెంట్స్, […]
సంపన్న గాయని రిహన్నా
అమెరికన్ పాప్ సింగర్ రిహాన్నా తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ఓ నివేదికలో ఫోర్బ్స్ ‘రిచెస్ట్ లేడీ మ్యూజీషియన్’గా సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నారు. ఎంత చక్కగా పాడగలరో అంత సమర్థవంతంగా వ్యాపారం చేస్తూ అత్యంత సంపన్న సంగీత విద్వాంసురాలు గా నిలబడింది. రిహన్నా పాటలు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ సింగిల్స్ గా నిలిచాయి. 2017లో ‘ఫెంటీ బ్యూటీ’ పేరుతో బ్యూటీ ఉత్పత్తులను మార్కెట్ చేసింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 1.7 బిలియన్ డాలర్ల గా […]
అంతుపట్టని గ్రామం
మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న మలానా గ్రామం పురాతన ప్రజాస్వామ్య గ్రామం. ఇక్కడి ప్రజల రూపం భాష అలవాట్లు అన్నీ ప్రత్యేకమే. ఈ గ్రామవాసులు మేము జమదగ్ని మహర్షి వారసులం అని చెబుతారు. గంజాయి పంట పండిస్తారు. ఇది వాళ్ళ తరతరాల పంట గనుక ప్రభుత్వం కూడా పట్టించుకోదు. బయట ప్రపంచానికి దూరంగా ఉంటుందీ గ్రామం. హిమాచల్ ప్రదేశ్ లోని కుటా లోయకు ఈశాన్యంగా ఉండే పార్వతి లోయ గుండా ప్రవహిస్తుంది మలానా […]
అర ఎకరానికే 43 బస్తాల వరి పండించిన మహిళా రైతు
తమిళనాడుకు చెందిన ఆ మహిళా రైతు మాత్రం ఏకంగా అర ఎకరానికే 43 బస్తాల వరి పండించి రికార్డు సృష్టించింది. అవును, మీరు విన్నది నిజమే. ఓ మహిళే ఈ ఘనతను సాధించింది. అది కూడా ఆమె ఓ ఉపాధ్యాయురాలు కావడం విశేషం. ఆమె పేరు ప్రసన్న. తమిళనాడులో నివాసం. ఓ ప్రైవేటు పాఠశాలలో సైన్స్ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. అయితే చిన్నప్పటి నుంచి ప్రసన్నకు వ్యవసాయం అంటే ఎంతగానో ఇష్టం. ఆమె తండ్రి కూడా ఆమె ఇష్టాన్ని […]
ఇంజినీరింగ్ అద్భుతం ఈ చీనాబ్ బ్రిడ్జి
చీనాబ్ బ్రిడ్జి బహుశా ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైలు వంతెన గా చెప్పొచ్చు. ఈ సంవత్సరం పూర్తి కానున్న ఈ బ్రిడ్జి మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్తి చేస్తోంది. జమ్ము కాశ్మీర్ లో చీనాబ్ నదిపైన నిర్మిస్తున్న ఈ వంతెన ఇంజినీరింగ్ అద్భుతం. సాధారణంగా రైలు వంతెన నిర్మించాలంటే కింద నుంచి స్తంభాలు కట్టి వాటిపైన పట్టాలు వేస్తారు. కానీ ఈ చీనాబ్ బ్రిడ్జి కి అసలు స్తంభాలే లేవు. చీనాబ్ నది ఒక […]
