Gagana
రికార్డ్ బ్రేక్
యంగెస్ట్ కమర్షియల్ పైలట్ రికార్డ్ సాధించింది సాక్షి కొచ్చర్. ఆమెకు 19 సంవత్సరాలు హిమాచల్ ప్రదేశ్ పర్వానూ లో పుట్టిన సాక్షి అమెరికాలో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ తీసుకుంది. సోలో ఫ్లయిట్ నడిపింది. చదువు పూర్తయ్యాక పైలట్ ఉద్యోగం చేస్తానంటుంది సాక్షి.
ఉపేక్షించేది లేదు
ఒలంపిక్ లో మల్ల యుద్ధ విజేత సాక్షి మల్లిక్.రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వేధింపులపై రెజ్లర్ల ఉద్యమం చేపట్టింది .ఇప్పటికే ఆయన పైన ఎన్నో లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి.తోటి క్రీడాకారులైన బజరంగ్ పూనియా వివేక్ పోగల్ లతో కలిసి సాక్షి మాలిక్ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఆమె సేవకు ఎన్ని మార్కులు
దివ్యాంగుల కోసం కలం పట్టుకొనే వీలు లేని కండరాల సమస్య ఉన్న వారి కోసం 35 ఏళ్ల పుష్ప ఎన్.ఎం ఇప్పటికీ 1086 పరీక్షలు రాసింది దివ్యాంగులకు, అందులకు సెరిబ్రల్ పాల్సీ ఉన్నవాళ్లకు పరీక్షలు రాయాలంటే వాళ్లకు లేకరాలుగా ఉండాలంటే ఓపిక కావాలి. ఒక ప్రశ్న 30,40 సార్లు వివరంగా చదివి చెప్పాలి. పది, ఇంటర్, డిగ్రీ, పిహెచ్డి బ్యాంక్ పరీక్షలు రాసింది పుష్ప. 2019 లో రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారం […]
స్త్రీలకు సాయం
రూబీ సిన్హా డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రారంభించారు ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామిక వేతలకు ఇదో జ్ఞాన కేంద్రం. మహిళా పారిశ్రామిక వేత్తలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు ఈ ఫ్లాట్ ఫామ్ పరిష్కారాలు సూచిస్తుంది.ఈ సేవకు గాను రూబీ సిన్హా బ్రిక్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉమెన్ వర్టికల్ అధ్యక్షురాలిగా నియమకం అయ్యింది.
అంతా సహజమే
రాధేశ్యామ్ సినిమాతో మళ్లీ వెండితెర ప్రవేశం చేసిన భాగ్యశ్రీ వయసు 54 ఏళ్ళు. ఇద్దరు పిల్లల తల్లి అంటే నమ్మలేనంత అందంగా ఉంటారామె. అందం రహస్యం మాత్రం న్యూట్రిషన్ ఫిట్ నెస్ కోర్స్ లు చేసి సహజమైన ఆహారం వైపే దృష్టి పెట్టటం వల్లనే అందాన్ని కాపాడుకో గలిగాను అంటుంది భాగ్యశ్రీ. పాలు,తేనె, కలబంద, పెరుగు తో ఫేస్ ప్యాక్ లు కాయగూరలు వ్యాయామం తోనే యవ్వనం సాధ్యమే అంటుంది భాగ్యశ్రీ.
ఇష్టం తోనే జీవితం
ఆకాంక్ష మోంగ ట్రావెల్ బ్లాగర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లింక్డ్ ఇన్ లో పనిచేసింది.ఉద్యోగం వదిలేసి కంటెంట్ క్రియేటర్ గా మారిన ఆకాంక్ష 12 దేశాలు తిరిగింది. ఆరుగురు సభ్యులతో ఆమె ఏర్పాటు చేసిన ‘ట్రావెల్ ఏ మోర్’ ఎంతో మందిని ఇన్ స్పయిర్ చేసింది.మనకు ఏ విషయం పైన పాషన్ ఉంటే దానితోనే జీవించాలి శ్వాసగా అంటుంది ఆకాంక్ష మోంగ.
ప్రిన్సెస్ ఫ్రొమ్ ది స్లమ్స్
లివ్ యువర్ ఫెయిరీ టేల్ షార్ట్ ఫిలిం లో నటించిన మలీషా ఖర్వార్ ముంబై ధారావి లోని మురికివాడ లో పుట్టింది మలీషా ను అమెరికన్ నటుడు రాబర్ట్ హోప్ మ్యాన్ ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రిన్సెస్ ఆఫ్ ది స్లమ్స్ పేరుతో ప్రజాదరణ పొందిన మలీషా ప్రఖ్యాత స్కిన్ కేర్ కంపెనీ ఫ్యాషన్ ఎసెన్షియల్స్ కు ప్రమోటర్ గో ఫ్రెండ్ మీ అనే అకౌంట్ లో మురికివాడ ముచ్చట్లు తన ఆశలు చెప్పే మలీషా కు […]
పేడ బొమ్మలు
ఈ ప్రపంచంలో ఏ వస్తువు నిరూపయోగం కాదు ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ కు సమీపంలోని రాజన్ పూర్ గ్రామంలో ప్రైమరీ టీచర్ పూజా గంగ్వార్ ఆవు పేడ తో అందమైన కళాకృతులు చేస్తుంది పూజ. బొప్పాయి పాలు అవిసె గింజల నూనెతో పాలిష్ చేసే ఈ కళాకృతులు ఐదారేళ్ళ పాటు చక్కగా ఉంటాయి.వాల్ హ్యాంగింగ్స్, నేమ్ ప్లేట్స్, పెన్ హోల్డర్స్ ముఖ్యంగా ఆధ్యాత్మిక చిహ్నాలు బాగా అమ్ముడవుతాయి. ఇప్పుడీ ఆవు పేడ బొమ్మల తయారీలో […]
పాత కాగితాల బొమ్మలు
బోన్ డిసీస్ తో నడవలేని రాధిక పాత న్యూస్ పేపర్ల తో మెటల్ వైర్లతో ఎన్నో అందమైన బొమ్మలు తయారు చేస్తుంది. సంగీత కారులు,దేవతలు, నవ దంపతులు ఇలా రకరకాల బొమ్మలు సోషల్ మీడియాలో చూపెట్టి అమ్మేస్తోంది.వేరే ప్రచారం అంటూ లేకపోయినా సోషల్ మీడియా పోస్టులే ఆర్డర్ లు తెచ్చి పెడతాయి. రాధిక మోటివేషనల్ స్పీకర్ కూడా తన స్ఫూర్తి దాయకమైన ఉపన్యాసాలతో ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తుంది రాధిక. ఈమెది తమిళనాడులోని కోయంబత్తూరు.
వంటరిగా గుహలో
ఒక ఆరోగ్య ప్రయోగం లో భాగంగా స్పెయిన్ అథ్లెట్ 50 ఏళ్ల బీట్రిజ్ ఫ్లామిని 500 రోజులు 260 అడుగులు లోతు గుహలో ఒక్కతే గడిపి బయటకు వచ్చింది.2021 నవంబర్ 21న స్పెయిన్ లోని గ్రనాడ పట్టణం సమీపంలోని ఒక గుహలో అడుగుపెట్టి ఒకటిన్నర సంవత్సరం ఒంటరిగా గడిపిన బీట్రిజ్ కదలికలు కనిపెట్టేందుకు శాస్త్రజ్ఞులు ఈ ప్రయోగం చేశారు. ఆమె ద్వారా వచ్చిన రీడింగ్స్, వెలుతురు, చీకటిని బట్టి మానవ శరీరం మానసిక స్థితుల్లో వచ్చే మార్పు […]
సైకిల్ అమ్మ
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణ కు చెందిన జ్యోత్స్న కాగల్ ను సైకిల్ అమ్మాయి అంటారు. ఆమె వయసు ఇప్పుడు 74 ఏళ్లు 1968 నుంచి ఆమె సైకిల్ తొక్కుతోంది. మెరుపు వేగంతో సైకిల్ పై వెళుతూ ఆమె గోకర్ణ లోని మహాబలేశ్వర్ లో కో ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలుగా పనులు చక్కబెట్టుకునేది. ఇప్పుడు ఆమె శరవేగంగా సైకిల్ పై వెళుతూ వీధుల్లో కనిపిస్తుంది. సైకిల్ సవారీ నా ఆరోగ్యం నా సక్సెస్ అని చెప్పే […]
జ్ఞాపకం శాశ్వతం
రెజిన్ ఆర్ట్ బై షెల్లీ పేరుతో ప్రేమ కానుకలను జ్ఞాపిక లుగా భద్రపరిచి ఇస్తోంది.హైదరాబాద్ కు చెందిన షెల్లీ ప్రేమకు గుర్తుగా అందిన గులాబీలు, ప్రసవం అయ్యాక మిగిలిన బొడ్డుతాడు వంటిది చిన్న పెండెంట్ లుగా మార్చి ఇస్తుంది షెల్లీ.వధూవరుల పూలమాలను వాల్ క్లాక్స్ గా, కాఫీ టేబుల్ బుక్ గా మర్చి ఇస్తుంది జీవితం లో మధుర క్షణాలను శాశ్వతం చేసుకోగలిగేది ఈలాగే అంటుంది షెల్లీ.
ఆపిల్ తొక్కతో వస్త్రాలు
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు అంజనా. అమెరికాలో చదువుకున్న అంజనా పర్యావరణ రహిత ఫ్యాషన్ ఉత్పత్తులు తయారు చేస్తారు.ఆపిల్ తొక్కతో మెత్తటి లెదర్ మెటీరియల్, తర్వాత అనాసతో ఫైబర్ తీయటం ప్రారంభించారు. ఈ మెటీరియల్ తో ఆమె తయారు చేసిన దుస్తులకు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉంది.
పర్యావరణ హితం
వాడి పడేసే పూల వ్యర్థాలతో అగర్బత్తీలు, సబ్బులు తయారు చేసే వ్యాపారానికి పెట్టుబడి పెట్టారు ఆలియా భట్. ప్రకృతి ఆరోగ్యకరమైన జీవితానికి మధ్య సమతుల్యతను అర్థం చేసుకునేందుకు కో ఎక్సిస్ట్ అనే కార్యక్రమాన్ని బీట్ ప్లాస్టిక్ సొల్యూషన్ అనే హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఆలియా.
ఆలోచనే సంచలనం
నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనిక షెర్గిల్ మోనిక హై అండ్ మైట్ 50 పవర్ ఫుల్ పీపుల్స్ జాబితాలో ఆమె పేరు కనిపిస్తుంది ఈ క్వీన్ ఆఫ్ కంటెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా ప్రయాణం మొదలుపెట్టి నెట్ ఫ్లిక్స్ వరకు వెళ్ళింది. మోనిక ఎంపిక చేసిన ది ఎలిఫెంట్ విష్పర్బ్ ఆస్కార్ పురస్కారం అందుకుంది. మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసిన కాంతారా హిందీ వర్షన్ సక్సెస్ అయింది .
మొదటి అడుగు ఆమెదే
నిషా సోలంకి హర్యానా లో తోలి మహిళ అగ్రి డ్రోన్ పైలెట్ డ్రోన్ ద్వారా వేల ఎకరాల్లో సురక్షితంగా పురుగు మందులు చలాటంలో రైతులకు సహాయం చేస్తుంది.కర్నాల్ లోని మహారాజ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఫార్మా మెషనరీ పవర్ ఇంజనీరింగ్ కోర్స్ చదివింది. రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ కోర్స్ చేసింది. డ్రోన్ ద్వారా పురుగుమందు చెల్లితే రైతుకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. 25 కిలోల బరువైన అగ్రి డ్రోన్ తో పొలాల్లో పురుగు మందు చల్లె నిషా […]
బిడ్డకు పాలిచ్చే చోటే లేదా ?
బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు పాలిచ్చేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఉండాలని తన తొమ్మిది నెలల కొడుకు అయినా అవ్యన్ పేరుపైన కోర్ట్ లో పిల్ దాఖలు చేసింది. ఢిల్లీ వాసి న్యాయవాది నేహా రస్తోగి. ఫ్లైట్ లో తన బిడ్డకు ప్రశాంతంగా పాలిచ్చే వీలు దొరకగా పోవటంతో నేహా రస్తోగి ఈ అంశంపై పోరాటం మొదలు పెట్టింది.ఆమె వేసిన కేస్ తోనే ప్రభుత్వం ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లోని ప్లేస్ లో […]
మట్టి బొమ్మల ఆర్టిస్ట్
అంజలి ఖన్నా పుదుచ్చేరి లోని గోల్డెన్ బ్రిడ్జ్ లో సిరామిక్ కుండల తయారీ నేర్చుకున్నారు. ముంబై లోని ఆలీ బాగ్ లో ఆమె సిరామిక్ స్టూడియో ఏర్పాటు చేశారు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ పాటరి ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ మధ్యకాలంలో ఆమె ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సిరామిక్స్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ఈ సిరామిక్ కళారూపాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
బవుల్ పాటకు ప్రచారం
రీనా దాస్ ప్రఖ్యాత బవుల్ గాయని. పశ్చిమ బెంగాల్ లోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన రీనా దాస్ కుటుంబంలో అందరూ బవుల్ గాయకులే పెళ్లి అయ్యాక రీనా దాస్ భర్త దివాకర్ దాస్ ప్రోత్సాహంతో సంగీతం నేర్చుకుంది. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర ల్లో నివసించే జానపద సంగీతం బవుల్ ఈ బవుల్ పాటల్లో భక్తి ప్రధానం 35 సంవత్సరాలు గా రీనా దాస్ 5 వేలకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. […]
ఆవు పాల వ్యాపారి
పరాగ్ మిల్క్ ఫుడ్స్ పేరుతో డైరీ ప్రొడక్ట్స్ ప్రారంభించిన అక్షాలి షా నవతరం విజేత ఆమెకు పూణే లో గో క్షేత్రం ఉంది. ఇక్కడ మానవ రహితంగా ఆవుల నుంచి పాలను సేకరించి ప్యాక్ చేసి విమానాల ద్వారా ఖాతాదారులకు చేరుస్తారు. మార్కెట్లో ఆవు పాల కంటే వీటికి రెట్టింపు ధర ఉంటుంది. పరాగ్ సంస్థ నుంచి గోవర్ధన్ పేరుతో నెయ్యి అమ్ముతారు ఫ్లేవర్డ్ మిల్క్,పెరుగు ఇలా అన్ని ఉత్పత్తుల తో సంస్థ నుంచి అమ్మకాలు సాధిస్తోంది.అవతార్ […]
