Tuesday, 28 Jul, 2026

విజయ నాదం

కోవిడ్ వారియర్ గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రశంసలు అందుకొన్న ఎస్.ఐ ఇందుమతి భారత మహిళ ఫుట్ బాల్ జట్టు తరఫున ఆడుతోంది మైదానం లో చిరుత లాగా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ఇందుమతి చెన్నై నగర వీధుల్లో అల్లరి మూకల్ని అదుపులో పెడుతూ కోవిడ్ కేసులు భారీగా ఉన్నప్పుడు జనాన్ని అప్రమత్తం చేస్తూ తీరిక లేకుండా ఉంటుంది. ఎంతో పేదరికం నుంచి వచ్చిందామె ఒక కూలీ కూతురు. స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో ఫుడ్ […]

ఇన్ ఫ్లుయన్సర్

ఇండీ వైల్డ్ అనే సంస్థ స్థాపించి గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలకు ఉచితంగా నెలసరి ఉత్పత్తులు అందిస్తోంది. ప్రముఖ ఫ్యాషన్ ఇన్ ఫ్లుయన్సర్ దీపా ఖోస్లా. చెన్నయ్ లో స్థిరపడిన ఈ పంజాబీ అమ్మాయి నెదర్లాండ్స్ లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిగ్రీ,లండన్ లో మాస్టర్స్ చేసింది. మూడుసార్లు కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన దీపా మొదట్లో ఒక ఫ్యాషన్ షో లో రంగు తక్కువ అని తిరస్కారాని గుర్తించి ఆ తరువాతే ఆమె ఎంతో […]

ఈ భార్యాభర్తల కృషే కారణం

కరోనా మహమ్మారి ని అదుపు చేసే కోవాగ్జిన్ టీకా కనిపెట్టి భారత్ కు అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత సాధించారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సి.ఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా ఆయన భార్య సుచిత్ర కు దక్కింది. కోవాగ్జిన్ టీకా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఎన్నో దేశాల్లో గుర్తింపు సంపాదించింది. భార్యాభర్తలు ఉమ్మడిగా పట్టుదలగా చేసిన కృషికి ప్రభుత్వ మద్దతు ప్రభుత్వ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తల సహకారంతో కోవాగ్జిన్ టీకా సాధ్యం అయింది.

మొదటి మహిళ గైడ్

దాదాపు 1300 చదరపు కిలో మీటర్లు ఉండే రణథమ్‌బోర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కు మొదటిసారి ఒక గైడ్ గా ప్రవేశించింది. సూరజ్ భాయ్ మీనా అన్న హేమరాజ్‌ ప్రోత్సాహం తో అతని లగే ఫారెస్ట్‌ గైడ్ అయింది మీనా. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఇప్పుడు 80 పులులు ఉన్నాయి.ఈ ఫారెస్ట్‌ కు వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్లు, బర్డ్‌ వాచర్స్, ప్రకృతి ప్రేమికులువస్తూ వుంటారు. వీరికి,తరుచుగా అడవిని సందర్శించే ఫారెస్ట్ టూరిస్ట్ లకు ఇంగ్లీష్ లో అడవిని పరిచేయగలరు మీనా. […]

స్త్రీలు ఎప్పుడూ సమర్థులే

ఆర్మీ లో లాజిక్ సిక్స్ ఆఫీసర్ గా లేహ్ ఆ ప్రాంతంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు సైనికులకు గుండు సూది మొదలుకొని మిసైల్స్ వరకు అందించవలసిన బాధ్యత నాదే నా భర్త కెప్టెన్ సంజీవ్ త్యాగి. ఉద్యోగంలో చేరేసరికే నాకు కొడుకు వాడిని కూడా ఆఫీస్ కు తెచ్చుకునే కార్గిల్ యుద్ధ క్షేత్రంలో పని చేశాను చేతిలో రైఫిల్ చేతిలో పసిబిడ్డ కడుపులో మరో బిడ్డ తో ఆ యుద్ధ భూమిలో పనిచేశాను అంటున్నారు కెప్టెన్ యాషికా […]

సరికొత్త చరిత్ర

పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిన్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పాకిస్తాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు  ఆయేషా మాలిక్. 1966లో జన్మించిన మాలిక్, ప్యారిస్,న్యూయార్క్, కరాచీలోని పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. లాహోర్ లోని పాకిస్తాన్ కాలేజీ ఆఫ్ లా లో లా చదివారు హోవార్డ్ లా స్కూల్ నుంచి ఎల్,ఎల్,ఎమ్ చేశారు.

‘షావుకారు’ కు పద్మశ్రీ

వెండితెర కథానాయక క్యారెక్టర్ నటి షావుకారు జానకి ని తమిళనాడు ప్రభుత్వం పద్మ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆమె వయస్సు 90 ఏళ్ళు 70 ఏళ్లుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాష చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు జానకి. 1931 డిసెంబర్ 12న కాకినాడ సమీపంలోని పెద్దాపురం లో జన్మించారు. నాయక కృష్ణ కుమారి జానకి స్వయానా చెల్లెలు. 400 పైగా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి తెలుగు తమిళ ప్రేక్షకుల అభిమాన నటి.

మహిళ సంక్షేమం ధ్యేయం

102 సంవత్సరాల శకుంతల చౌదరి ని తాజాగా పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం. 1947 లో కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో చేరి అసోమ్ విభాగాన్ని నడిపించారు. ఆచార్య వినోబా భవే నెలకొల్పిన అసోమ్. అరుణాచల్ సరిహద్దుల్లో ఉన్న ‘మైత్రీ ఆశ్రమ్‌’ బాధ్యతలు స్వీకరించారామె. పశ్చిమ బెంగాలో ‘గోహత్య నివారణ్‌ మూవ్‌మెంట్‌’లో భాగస్వామి అయ్యారు. ఇన్నేళ్ల జీవితంలో ప్రజా శ్రేయస్సు కు ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ కోసం పనిచేస్తూ ప్రజలకు ఆడంబరాలకు దూరంగా […]

మహిళా అంతర్జాతీయ మాస్టర్ మౌనిక

గుంటూరు కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో 3వ విమ్‌ నార్మ్‌ సాధించటం ద్వారా ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయింది. కోనేరు హంపి నాకు స్ఫూర్తి అంటుంది మౌనిక అండర్‌–7 నుంచి అండర్‌–20 వరకు రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాల్లోనూ విజేతగా నిలిచాను. మూడుసార్లు సీనియర్‌ ఉమెన్స్‌లోనూ టైటిల్‌ సాధించాను. 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్‌  ఓపెన్‌లో తొలి విమ్‌ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఓపెన్‌లో […]

శాంతి నిచ్చే వర్క్ వుట్స్

ఎక్సర్ సైజ్ చేయకుంటే శరీరం ప్రజెంట్ కావటం కాదు మెదడు అక్కడే ఉండాలి. అది శరీరంలో కండరాలకు విశ్రాంతి ఇవ్వటమే కాదు మనశ్శాంతి ఇచ్చేదిగా వర్క్ వుట్స్ వుంటేనే హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. నా వర్క్ వుట్స్ లో ఫన్ ఉంటుంది. ఫన్ స్టయిల్ లో సోల్ డాన్స్ చేస్తా అంటుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమె ఫిట్ నెస్ విషయంలో అందరికంటే ముందే ఉంటుంది. శరీరాన్ని సాధన చేస్తూ ఉంచుకోవటం లాంగ్ గేమ్ లాంటిది. ఫిట్ […]

నృత్యానికి పురస్కారం

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ పద్మజా రెడ్డి ని పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది ప్రభుత్వం కృష్ణాజిల్లా పద్మజా రెడ్డి స్వస్థలం కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. సామాజిక అంశాలపై ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ప్రజలు అవగాహన తీసుకోవాలనే ఉద్దేశంతో సొంత నృత్యా రీతుల్ని రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హంస పురస్కారం  శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందాయి. 2015 లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. కాకతీయ పేరుతో తెలుగువారి చరిత్రను […]

మరో సాహసం  

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా బచేంద్రి పాల్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఈ వయసులో మరో సాహసయాత్ర కు సిద్దం అవుతున్నారామె. 50 ఏళ్లు దాటిన తొమ్మిది మంది మహిళలతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు సాహసయాత్ర చేయబోతున్నారు ఈ యాత్ర ఐదు నెలలు సాగుతుంది 4625 కిలో మీటర్ల ఈ సాహస యాత్ర మార్చి 8న ప్రారంభమై ఆగస్టు లో ముగుస్తుంది. […]

స్నేహితులే బలం

భారత జట్టు లో చాలా కీలకమైన స్థానంలో ఉంది సంధ్య రంగనాథన్  కడలూరు జిల్లా లో పుట్టింది సంధ్య జిల్లాస్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెరిసింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంది. ఫుట్‌బాల్ అంటే ప్రాణం పెట్టేది స్నేహితులు, దాతల ప్రోత్సాహంతో పోటీలకు వెళ్ళేది. చివరికి జాతీయ జట్టుకు ఎంపికైంది. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన జాతీయ క్రీడలలో మూడు మ్యాచ్ ల్లో ఏకంగా 12 గోల్స్ చేసి సత్తా […]

ఎంపికలో మార్పు అవసరం

ఈ చలి రోజుల్లో క్రీమ్ ఆధారిత మాయిశ్చరైజర్ ను ఎంచుకోవటం మేలు షియా బట్టర్, పొద్దుతిరుగుడు, రోజ్ హిప్ నూనెలున్న క్రీమ్ ను ఎంచుకోవాలి. హైలురోనిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో ఉన్న వాటిని రాత్రివేళల్లో రాస్తే వృద్ధాప్య ఛాయలు దగ్గరకు రావు. అలాగే రెటినాల్ గుణాలున్న క్రీమ్ లు రాయాలి. జిడ్డు చర్మం వారికి నీటి ఆధారిత క్రీమ్ లు మంచివి మొటిమలు సమస్య రాకుండా పెట్రోలియం జెల్లీ వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా జింక్ […]

సుస్వరానికి ‘పద్మం’ 

మీ సంతృప్తి కోసం సంగీతాన్ని సాధన చేయండి, అవార్డులు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటారు ప్రభా ఆత్రే గురువు గా ప్రయోగాలు చేసిన సంగీత కర్తగా అధ్యాపకురాలిగా పాటలు ఆమె జీవితం తో పెనవేసుకుపోయింది. పజిల్స్ దగ్గర నుంచి భజనల వరకు ఆమె నిష్ణాతురాలు కానీ గాన శైలి లేదు. ఆల్ ఇండియా రేడియో కళాకారిణిగా, సంగీత కళాశాల అధ్యాపకురాలిగా రచయిత్రిగా స్వర కర్త గా ఆమె వృత్తి జీవితం ఎంతో వైవిధ్యం తో సాగింది. […]

నన్ను చూసి ఊరే మారింది

సూరజ్ బాయ్ మీనా రణతంబోర్ నేషనల్ పార్క్ మొదటి మహిళా నేచరలిస్ట్. రాజస్థాన్ లోని బూరీ పహాడి ఈమె సొంత ఊరు. అమ్మాయిలంటే వంట ఇంటికే అనే ఊరు నుంచి బయటికి వచ్చి పని చేస్తోన్న మొదటి మహిళ. పులులు, సింహాల మధ్య పని చేసే ధైర్యశాలి. జంతువుల గొంతు పాదాల గుర్తులు ఆధారంగా వాటిని కనిపెట్టగల నేర్పుగల అమ్మాయి. రథం బోర్ నేషనల్ పార్క్ లో గైడ్ గా పని చేసే అన్న సూరజ్ బాయ్ […]

అక్షరాస్యత కు కృషి

56 ఏళ్ల రాబియా కు పద్మ శ్రీ వరించింది పసితనం చక్రాల కుర్చీకే పరిమితం అయినా పల్లెటూర్లో చదువు రాని గృహిణులకు పాఠాలు చెప్పారు కేరళ లో ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె స్ఫూర్తి ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు రాబియా పోలియో తో నడవ లేకపోయినా ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుకొని స్త్రీలకు చదువు నేర్పింది. ‘చలనం’ అనే […]

మధుర్ కు పద్మం

ఈ సంవత్సరం పాక శాస్త్ర విభాగంలో రచయిత్రి మధుర్ జాఫ్రీ కి పద్మభూషణ్ పురస్కారం దక్కింది మధుర్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటి మర్చంట్ ఐవరీ సంస్థ అధినేత జేమ్స్ ఐవరీ ని పెళ్లాడి, తమ సంస్థ తీసిన అనేక సినిమాల్లో నటించారు. రంగస్థలం సినిమా, టివి పాకశాస్త్రం రంగాల్లో, భారత్ ఇంగ్లాండ్ అమెరికాల మధ్య సాంస్కృతిక సంబంధాలు పెంచటంతో ఆమె చేసిన సేవలకు బ్రిటన్ ప్రభుత్వం 2014లో కమాండర్ ఆమె బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం తో […]

నేటి తరానికి ఫైనాన్స్ పాఠాలు

యువతకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగించే పర్సనల్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సూత్రాలని సులభంగా నేర్పాలనే లక్ష్యంతో ఇండియా- హాంకాంగ్‌ వేదికగా ‘ఇన్‌వెస్టోఏసియా’ సంస్థని స్థాపించారు స్మృతితోమర్‌.ఈ సంస్థ ద్వారా విదేశీయులు మన మార్కెల్లో  సులభంగా పెట్టుబడులు పెట్టొచ్చు. మనం కూడా చైనా, కొరియా, జపాన్‌ వంటి దేశాల్లో ఏ చిక్కులు లేకుండా పెట్టుబడులు పెట్టొచ్చు.స్మృతితోమర్‌ ఎన్‌ఐటీ భోపాల్‌ నుంచి బీటెక్‌ చేశారు.లాటిన్‌ అమెరికాలోని అతిపెద్దదైన సిటీబ్యాంక్‌ బెనామెక్స్‌లో పనిచేసి . బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతలో నైపుణ్యం […]

ఈ ఆలోచనే అమూల్యం

భూకంపాల పై రీసెర్చ్ చేసిన కాంచన అగర్వాల్ అతిసూక్ష్మ కంపనాలను పసిగట్టే రియల్ టైమ్ ఆటోమేటిక్ పి-వేవ్ డిటెక్టర్ ను తయారు చేసింది. దీని ద్వారా భూకంపాల గురించి కనీసం రెండు నిమిషాల ముందే ప్రజల్ని అప్రమత్తం చేయవచ్చు. అలాగే తీవ్ర నష్టాలను  కలిగించే అణు శక్తి రియాక్టర్ లు రవాణా వంటివి నిలిపివేయవచ్చు. ఆవిష్కరణకు 2019 జపాన్ అంతర్జాతీయ పోటీలో స్టూడెంట్ ట్రావెల్ గ్రాంట్ అవార్డ్ ను ఐ.ఐ.టి మద్రాస్ 2020 సదస్సులో బెస్ట్ ప్రజెంటేషన్ […]