Gagana
అత్యున్నత పురస్కారం
అలనాటి అందాల తార వహీదా రెహమాన్ ని ఆమె 85 వ ఏటా 2021 సంవత్సరపు దాదాసాహెబ్ పాల్కే అవార్డు వరించింది.ఆమె పుట్టిన ఊరు చెంగల్పట్. రోజులు మారాయి తెలుగు సినిమాలో ‘ఏరువాక సాగారో ‘ పాట లో డాన్స్ చేసి సినీ రంగంలో గుర్తింపు పొందిన వహీదా భారతీయ చలన చిత్ర రంగంలో తిరుగులేని తారగా నిలబడింది.ఆమె నటనకు మూడు ఫిలింఫేర్ అవార్డులు ఒక జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డు లభించింది.
సేవే జీవిత లక్ష్యం
చక్కని రచనలతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్న సుధా మూర్తి కెనడా ఇండియన్ ఫౌండేషన్ గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఏటా తమ రంగాల్లో చెరగని ముద్ర వేసిన భారతీయులను ఎంపిక చేసి ఈ పురస్కారాన్ని అందిస్తారు.ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించి పేదల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విద్య, వైద్య సహకారం గ్రామీణాభివృద్ధి కళలు సంస్కృతి సాధించే శిక్షణ ఇవ్వడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు సుధా మూర్తి.
నర్గీస్ మొహమ్మది కి నోబెల్
ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదీ కి అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ఇరాన్ లో మహిళల అణిచివేత మానవ హక్కులపై అవగాహనా,అందరికీ స్వేచ్ఛ మరణశిక్ష రద్దు కోసం చేస్తున్న ఆమె పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గీస్ ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్లు సర్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహ్రాన్ లోని ఎనిక్ జైల్లో ఉన్నారు.
ఉన్నత పురస్కారం
సిద్రా ఫాత్మా అహ్మద్ ఈ ఏడాది పులిట్జర్ సెంటర్ వార్షిక బ్రేక్త్రూ జర్నలిజం పురస్కారం అందుకున్నది ఈ పురస్కారం కింద 12 వేల డాలర్లు ఫాత్మా అందుకుంటున్నారు. ఆమె దర్శకత్వం వహించిన కెన్ ఇండియా అడాప్ట్ టు ఎక్స్స్ట్రీమ్ హీట్’ అనే చిత్రానికి జూలియట్ రిడ్డెల్తో కలిసి దర్శకత్వం వహించారు. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు… దేశంలోని వివిధ వర్గాల పని పరిస్థితుల మీద, ఉత్పాదకత మీద చూపుతున్న ప్రభావం గురించి వివరాలు ఉన్నాయి.రైతులు వ్యవసాయ కార్మికులు […]
మెంటలిస్ట్
ఇండియాలో ఏకైక ఫిమేల్ మెంటలిస్ట్ సుహాని షా స్టేజ్ పైన 5000 కు పైగా ప్రదర్శనలు ఇచ్చిందామె. సాంప్రదాయ మెజీషియన్ ల దేశంలో ఉండకుండా ఆధునిక ఆహార్యం తో ఆమె కనికట్టు చేస్తుంది.ఆమె కు గోవా లో హిప్నో క్లినిక్ ఉంది. దురలవాట్లను మాన్పించటం లో వ్యక్తులకు సహాయపడుతుంది.సాధన తో సాధించిన స్కిల్ ఇది చెప్పే సుహాని షా మైండ్ రీడింగ్ చేయగలరు నగరాల్లో ఆమె షో లు నడుస్తుంటాయి.
అన్నదాత
రైతులకు మేలు చేసే వరి వంగడాలు సృష్టించే డాక్టర్ స్వాతి నాయక్ నార్మన్ ఇ బోర్లాగ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 500 పైగా వరి విత్తనాలు తయారు చేసేందుకు పదివేలకు పైగా ప్రయోగాలు చేశారు. ఒరిస్సా లోని మయూర్ భంజ్ జిల్లాలో కరువు లేని తట్టుకోగల సహా బాగి దన్ పేరుతో తెచ్చిన వరి వంగడం దేశవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న రకంగా నిలిచింది.
సహజ నటి
సర్కారు బడిలో చదువుతున్న తన్మయి సోల్ ‘వాజక్’ అనే చిన్న సినిమాలో నటించింది. కేరళ కు చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన తన్మయి. తండ్రి ఫోటోగ్రాఫర్ ఈ పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయికి ఉత్తమ బాల నటి అవార్డు వచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఎప్పుడు స్టేజి పైన నటించని తన్మయి తన మొదటి ప్రయత్నం తోనే జాతీయ నటి అయిపోయింది.
దళితవాడ నుంచి ప్రయాణం
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక పారిశుద్ధ్య కార్మికురాలి కూతురు రోహిణి గౌరీ డాక్టరేట్ చేసి దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తండ్రి తో చెప్పిన రోహిణి గౌరీ ఎంతో కష్టపడి ఎం బి ఏ పూర్తి చేసింది.స్విజర్లాండ్ లో డాక్టరేట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన మానవ హక్కుల మండలి సమావేశానికి హాజరైంది. ఐరాస వరకు ఆమె చేసిన ప్రయాణం అమ్మాయిలకు గొప్ప స్ఫూర్తి.
ప్రతి చోట విజయమే
ఝార్ఖండ్ లోని రామ్ చట్టి అనే పల్లెటూరు లో పుట్టింది దీపికా కుమారి. తండ్రి ఆటో డ్రైవర్ తల్లి చిరుద్యోగి ఆర్చర్ అవ్వాలనే కోరికతో రాంబో లోని అర్జున్ ఆర్చర్ అకాడమీలో చేరింది.నెలకు కాస్త గా దొరికే ఉపకార వేతనం తోనే శిక్షణ పూర్తి చేసింది. విల్లు విద్య లో చేయితిరిగిన క్రీడాకారిణి అయింది. ఒలంపిక్స్ లో పాల్గొన్నది వరల్డ్ కప్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో సన్మానించింది పేదరికం […]
దేశ సేవ లక్ష్యం
భోజపురి నటుడు రవి కిషన్ ముద్దుల కూతురు ఇషితా శుక్ల భారతీయ సైన్యంలో చేరింది. కేంద్ర ప్రభుత్వం యువతులను సైన్యంలో చేర్చుకునేందుకు అగ్నిపత్ ప్రవేశపెట్టింది. ఇషితా అలాగే సైన్యంలో చేరి మూడేళ్లుగా శిక్షణ పొందుతోంది.ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొన్నది ఇషితా.ఆమె వయసు 21 ఏళ్ళు. దేశానికి సేవ చేయడం నా లక్ష్యం అంటుంది ఇషితా శుక్ల.
వెజిటేబుల్ బామ్మ
కోయంబత్తూర్ దగ్గర తొప్పంపట్టి పూంగానగర్ కు చెందిన 86 ఏళ్ల నంజమ్మాళ్ ను వెజిటేబుల్ బామ్మా అంటారు. 200 కుటుంబాలు ఉన్న ఆ ఊర్లో ఓ సారి రక్త పరీక్షలు చేస్తే అందరికీ రక్తహీనతే సమస్య. అప్పుడు బామ్మ ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ కూరగాయలు, పండ్ల మొక్కలు వేసి వాటి సంరక్షణ బాధ్యత తనే తీసుకుంది. సొంతంగా సేంద్రియ ఎరువు తయారు చేసి అందరి ఇండ్ల పెరట్లో చల్లుతుంది. నంజమ్మాళ్ ను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల […]
పాటలంటే శ్రద్దా !
శ్రద్దా కపూర్ చక్కని నటే కాదు మంచి గాయని కూడా చిన్నతనం నుంచి సంగీతం లో శిక్షణ తీసుకున్నది ఆషికి-2 లో సొంతంగా పాటలు పాడుకుంది. ఏక్ విలన్,హోప్ గర్ల్ ఫ్రెండ్ లో పాడిన పాటలు ఆల్ టైమ్ ఫేవరెట్స్ గా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.ఇటు నటిగా అటు గాయనిగా ఆమె ప్రయాణం విజయవంతం.
కల్తీ చాలా ప్రమాదం
ట్రీ హౌస్ పేరుతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లో కొన్ని వేల మందికి సహజ రంగుల తయారీపై శిక్షణ ఇస్తోంది మన్య చెరబుద్ది. పిల్లలకు వాడే దుస్తులపై కల్తీ రంగుల వాడకం ప్రమాదం కనుక సహజ రంగులతో డై చేయమని చెబుతోంది మన్య. ఆకులు, పువ్వులు, కూరగాయలు,పండ్ల తోనే సహజమైన రంగులు ఎలా తయారు చేసుకోవాలో ట్రీ హౌస్ లో పాఠాలు చెబుతోంది. ఈ ఆన్ లైన్ వర్క్ షాప్ లో చాలా తక్కువ ఫీజు […]
వ్యాపారం కూడా ఇష్టం
మంచి భోజనాలు ఇష్టపడే నటి భూమి పెడ్నేకర్ ఇన్వెస్టర్ కూడా క్రోమ్ ఆసియా గ్రూప్ కాయ పేరుతో గోవాలో బోటిక్ హోటల్ ప్రారంభించింది ముంబై లో పుట్టిన భూమికి కళలు, పర్యావరణం చాలా ఇష్టం.పర్యావరణ సంరక్షణ అంశాలపై పని చేస్తున్న భూమి ఫోర్స్ ఇండియా 2018 30 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించింది. మంచి బ్రాండ్ తో కలిసి ప్రయాణం ఎంతో సంతోషంగా ఉంది. నాకు నచ్చిన వ్యాపార సూత్రం ఒకటి వ్యాపారంలో నష్టం రాకూడదు […]
వందల మందికి ఉపాధి
ఆపిల్ జోన్ పేరుతో ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించింది రమా బిష్ట్ ఉత్తరాఖండ్ కు చెందిన రామ్ ఘడ్ లో ప్రారంభమైన ఈ ఆపిల్ జోన్ లో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళ బృందాలు పని చేస్తాయి. పండ్లు, మూలికలు సరఫరా చేస్తారు .మూలిక ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతాయి. ఆమె కృషికి గుర్తింపు గా మా నంద శక్తి సమ్మాన్ పురస్కారం ఉత్తరాయణి మేళా అవార్డు వంటివి ఎన్నో దక్కాయి. వందల మంది మహిళలు […]
నా భర్త అడుగుజాడల్లో నేను
చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి శిక్షణ పూర్తి చేసింది దేబశ్రీ బెనర్జీ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న దేబశ్రీ భర్త మేజర్ సుబ్రోతో అధికారి 2022 లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటనతో చెల్లించి పోయినా దేబశ్రీ వీరుడి భార్యగానే కాకుండా దేశం గర్వపడే వ్యక్తుల్లో ఒకరుగా ఉండాలనుకొన్నది. శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్ గా విధుల్లోకి వచ్చారు దేబశ్రీ అధికారి.
లేడీ బస్ డ్రైవర్
అంతర్రాష్ట్ర సర్వీసుల్ని నడుపుతున్న తొలి మహిళా డ్రైవర్ సీమ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ టి సి లో ఆమె పనిచేస్తుంద. సిమ్లా నుంచి చండీగఢ్ వరకు నడిచే జ్వాలా బస్ డ్రైవర్ సీమ. 2016 లో ఆర్టీసీ సిబ్బంది కోసం టాక్సీ నడిపే పనితో ఆర్టీసీ లో అడుగు పెట్టింది సీమ. తరువాత బస్ స్టీరింగ్ సీమ చేతికి వచ్చింది. రూల్స్ పాటించడం అతివేగంతో నడపకపోవడం యాక్సిలేటర్ మీద బ్రేక్స్ పైన నియంత్రణ తో ఉండటం […]
తేలికగా పాఠాలు
పిల్లలకు సరళమైన మార్గం లో విద్య నేర్పేందుకు ఎందరో ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. జార్ఖండ్ ధన్ బాద్ కి చెందిన రోష్ని ముఖర్జీ ఫిజిక్స్,బయాలజీ కాన్సెప్ట్ లు సులభతరం చేసి పాఠాలు చెబుతూ కొన్ని వేల పాఠాలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారామె. పాఠశాలల్లో చెప్పే విద్య తేలికగా అర్థమయ్యేలా 9 నుంచి 12, 5 వ తరగతి మధ్య ఉన్న విద్యార్థులకు ఈ పాఠాలు చెబుతోంది. కొన్ని వేల మంది విద్యార్థులకు ఈమె విద్యాదాత.
కళాకారులకు ఉపాధి
దక్షిణ కర్ణాటక లోని మల్లూరు అనే గ్రామంలో వూరి మీదుగా ప్రవహించే ‘నుగు’ అనే నది పేరుతో నుగు హ్యాండీ క్రాఫ్ట్ ప్రారంభించారు సోనాలి శర్మ. భారతదేశంలోని హోటళ్ళు, రెస్టారెంట్స్ కోసం ఒక ప్రత్యేకమైన సిరామిక్ హ్యాండ్ క్రాఫ్ట్ వేర్ టేబుల్ వేర్ తయారు చేశారు.గ్రామీణ హస్త కళాకారులు తయారు చేసే ఈ పింగాణి పళ్లేలు, కప్పులు, గ్లాసులకు ఎంతో పెద్ద మార్కెట్ ఉంది.100 శాతం రీసైకిల్ చేయగల మెటీరియల్ తో వీటిని రూపొందిస్తారు వందల మంది […]
భలే సర్పంచ్
90 ఏళ్ల వయసులోనూ గ్రామ సర్పంచ్ గా విధులు నిర్వహిస్తూనే ఉంది వీరమ్మాళ్ అమ్మ. తమిళనాడు మదురై ప్రాంతంలోని అరిట్టపట్టి గ్రామానికి సర్పంచ్ అయినా ఆమె రోడ్లు, త్రాగునీరు,పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు వంటి సకల సౌకర్యాలు ఆ గ్రామానికి తీసుకువచ్చింది. ఆమె చేసిన మంచి పనుల వల్ల ఆ గ్రామానికి జీవవైవిద్య వారసత్వ ప్రదేశం గా గుర్తింపు వచ్చింది ప్రదేశంగా గుర్తింపు వచ్చింది. వీరమ్మాళ్ ఇప్పటికీ ఉదయం లేచి తన ఇంటి పనులు పొలం పనులు చేసుకుని తర్వాత […]
