Monday, 27 Jul, 2026

ఐదు రూపాయలే భోజనం

రాజస్థాన్ కోటా నగరానికి చెందిన స్వాతి శృంగి ‘ముస్కాన్ కి రసోయ్’ క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెడుతుంది. రాజస్థాన్ కోటా నగరానికి చెందిన స్వాతి 114 మంది వాలంటీర్ల తో కలిసి స్థానికుల ప్రోత్సాహంతో రోజుకు 1000 మందికి భోజనం పెడుతుంది. ఆ నగరం లోని మూడు ప్రాంతాల కౌంటర్లలో ఎంతోమంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులు స్వాతి పెట్టే ఐదు రూపాయల భోజనం చేస్తారు.

తొలి గిరిజన పైలట్

నీలగిరి కొండల్లోని బడుగర్‌ తెగ నుంచి వచ్చిన ఎం.ఎం జయశ్రీ తొలి గిరిజన పైలట్ గా చరిత్ర సృష్టించింది దక్షిణాఫ్రికా లోని ఉల్కన్ ఏవియేషన్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన జయశ్రీ ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ పొందింది. శిక్షణ కాలం లోనే 70 గంటలు ఆకాశంలో ప్రయాణం చేసిన జయ శ్రీ తానుండే కొండ ప్రాంతాల పిల్లలకు చదువు చెప్పేందుకు ఇష్టపడుతుంది.

వెలుగు నిచ్చింది

ఐ.పి.ఎస్ ఆఫీసర్ అనుకృతి శర్మ అనుకోకుండా చేసిన పని ఆమెను వార్తల్లో నిలిచింది. ‘పోలీస్ చౌపాల్’ సమావేశంలో వృద్ధురాలు నూర్జహాన్ తాను సంవత్సరాల తరబడి కరెంట్ లేక చీకట్లో బ్రతుకుతున్నానని వయసు మీరిన తర్వాత తనకు ఇప్పుడు ఏమీ కనిపించని స్థితి వచ్చిందని తన ఇబ్బంది చెప్పుకొంది. ఆమె కోరిన నెరవేర్చేందుకు ప్రభుత్వ సాయం కోరే అవకాశం లేక అనుకృతి స్వయంగా నూర్జహాన్ ఇంటికి కరెంట్ సదుపాయం కల్పించారు. ఈ ఇంట్లో వెలిగిన బల్బ్ ని నూర్జహాన్ […]

దేవాలయాలే ఎక్కువ

భారతదేశంలో రెండు మిలియన్లకు పైగా హిందూ దేవాలయాల మూడు లక్షల ముస్లిం మసీదులు ఉన్నాయి వాటిలో రెండువేల ఇరవై మూడు వేల దేవాలయాలు ఒక్క వారణాసి లోనే ఉన్నాయి.బహ్రెయిన్ వంటి దేశాల్లో ఉండే జనాభా కంటే భారత్ లో ఉండే దేవాలయాలే  ఎక్కువ.

అడవులు కాపాడండి

పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేస్తారు జార్ఖండ్ ఫారెస్ట్ అధికారి మమత ప్రియదర్శి. ప్రకృతి ప్రాముఖ్యత కాపాడుకునేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై డాక్యుమెంటరీ లు తయారు చేశారు. 347 గ్రామాలు స్కూళ్లలో లక్షల మందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అడివిలో బ్రతికే మూగజీవాలకు ఇబ్బంది కలిగించకుండా సర్దుకు పోవాలని అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రచారం కోసం ఎల్ ఈ డి స్క్రీన్ లో ఏర్పాటు చేశారు.

ఉపాధి మార్గం

పది రూపాయల ఖరీదు తో పసుపు సంచి ఉద్యమాన్ని ప్రజల్లోకి తెచ్చారు ఐ.ఎ.ఎస్ అధికారి సుప్రియ సాకు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాక తమిళనాడు లో పసుపు సంచుల తయారీ ని ప్రోత్సాహించారు సుప్రియ.ఎక్కడ చూసినా పసుపు సంచి దొరికే వెండింగ్ మిషన్ లు స్థాపించారు. పది రూపాయలు వేస్తే సంచి బయటకు వస్తుంది. ‘మీడుం మంజాపై’ పేరుతో ఈ పసుపు సంచుల ప్రచారం తమిళనాడు లో సక్సెస్ అయింది. వందల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

జానపద కళలకు కొత్త వెలుగు

జానపద కళలకు పూర్వ వైభవం ఇవ్వటం కోసం మిమెరాకి సంస్థ స్థాపించాను అంటుంది యోషా ఆమె స్థాపించిన స్టార్టప్ బాందిని అప్లిక్, బని, పట్టచిత్ర, బికనేర్ వంటి కళారూపాలకు కొత్త వెలుగు వచ్చింది.హ్యాండ్ బాగ్స్ పైన అందమైన కళారూపాలకు చిత్రించటం తో వాటికి అద్భుతమైన మార్కెట్ వచ్చింది. ఈమె మార్కెట్ చేసే బ్యాగ్ లు అమెరికా, యు.కె, ఆస్ట్రేలియా,హాంగ్ కాంగ్, సింగపూర్, దుబాయ్ లో అమ్ముడు పోతాయి. వందల మంది కళాకారులకు స్థిరమైన ఆదాయం వస్తోంది.

ఇది అవసరమైన బ్రేక్

డోపమై ఫాస్టింగ్ పేరుతో పుస్తకం రాశారు అమెరికన్ సైకియాట్రిస్ట్ అన్నా లెంబ్కే. ఆమె చెబుతున్న ప్రకారం మన చుట్టూ ప్రపంచంలో ఉండే ఎన్నో ఎక్కువ సౌకర్యాలు ఒత్తిడి పెంచుతాయి.వీటి తో మెదడులో డోపమైన్ పెరుగుతుంది. అందుకే జీవితంలో ఒక బ్రేక్ తీసుకోవాలి. అధిక నిద్ర తిండి అదేవిధంగా అదేపనిగా సోషల్ మీడియాలో తలదూర్చే ఎన్నో అలవాట్లు తగ్గించమని డిజిటల్ ప్రపంచం నుంచి కొద్ది రోజులు దూరంగా ఉంటే ఆరోగ్యం అంటున్నారు. ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం కాదు […]

ఉడిపి చీరకు కొత్త వెలుగు

‘కడికె ట్రస్ట్’ పేరుతో ఉడిపి నేత చీరలకు గొప్ప మార్కెట్ తెచ్చిపెట్టారు మమతా రాయ్.దక్షిణ కన్నడ ఉడిపి జిల్లాలోని నేత కళాకారులకు ఉడిపి చీరల నేత ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. సౌకర్యంగా కళాత్మకంగా కనిపించే ఈ ఉడిపి నేత చీర ఆదరణ తగ్గి కనుమరుగైపోయింది. పర్యావరణ హాని లేని సహజమైన రంగులద్ది తయారు చేసే ఈ నేత చీరలకు ఆన్లైన్ లో అమ్మకాలు పెంచి కళాకారులకు బతుకు తెరువు చూపారు మమత. కడికె ట్రస్ట్ ద్వారా […]

ఆధ్యాత్మిక రూపం

ఇంటి అలంకరణ లో డివోషనల్ సబ్జెక్టు ఎంచుకుంటున్నారు నిపుణులు పురాణ ఇతిహాసాల కళారూపాలు అలంకరణలో జోడిస్తే ఇంటి అందం వైయ్యింతలు అవుతోంది విశాలమైన హాల్లో దశావతారాలు,ఏనుగుల జట్టు సంగీత కళాకారుల మూర్తులను అమరిస్తే ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది.కృష్ణవతార ఘట్టాలు రాధాకృష్ణ పెయింటింగ్స్ కూడా ఇంటికి ఆధ్యాత్మిక దృష్టిని తెస్తాయి. వుడ్ కార్వింగ్ తో సెంటర్ టేబుల్స్ సెల్ఫ్ కార్నర్ టేబుల్స్ వాటి పైన చక్కని అవతార పురుషుల బొమ్మలు చాలా అందంగా ఉంటాయి.

సిలంబం యుద్ధ కళ గ్రేట్

ప్రాచీన యుద్ధ కళ సిలంబం నేర్చుకొని చీర కట్టు తో సిలంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఐశ్వర్య మణి వన్నన్ తమిళనాడు కు చెందిన ఈ యుద్ధ కళ ను ఏరికోరి నేర్చుకొన్నది ఐశ్వర్య కర్రలు,కత్తులు,దివిటీలు,లేడి కొమ్ముల వంటి ఆయుధాలని ఈ విద్య లో ప్రయోగిస్తారు. ఈ యుద్ధ కళ లో మహిళలకు శిక్షణ ఇవ్వడం కోసం మాయిషా స్టూడియో స్థాపించి పాఠశాల కళాశాల విద్యార్థినులను ప్రోత్సహిస్తోంది ఐశ్వర్య. 70 ఏళ్ళ వయసులో కూడా ఈ కళను […]

ప్రపంచ స్థాయి ప్రభావం

భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన ఫిట్నెస్ ఐకాన్స్ యోగ ఇన్ ఫ్లూయెన్సర్ లలో ఒకరు గా ఉంది శిల్పా శెట్టి. ఐదు పదుల వయసులో ఆమె తీరైన శరీరాకృతి ఎందరికో స్ఫూర్తి.ఆమె వ్యాయామం చేసే విధానం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారం గురించి ఎన్నో  డివిడిలు రిలీజ్ చేసింది శిల్ప. ఆమె యూట్యూబ్ ఛానల్ కు మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లున్నారు. మనసు, శరీరం, ఆత్మ పై యోగా వల్ల కలిగే ప్రయోజనాలు చెబుతోంది శిల్పా శెట్టి.

ఇలా చేస్తే ప్రయోజనం

హెన్నా పొడి లో మెంతులు పెరుగు మందార పొడి వంటివి కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు కు పోషణ అందుతుంది.మాడు పొడిబారి పోకుండా ఉంటుంది. ముందుగా టీ లేదా కాఫీ డికాషన్ మరిగించి అందులో హెన్నా పొడి మందార పొడి వేసి కలపాలి. దీనికి కోడిగుడ్డు తెల్లసొన చేర్చి కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో వెంట్రుకలు కడిగేసుకోవాలి. మరునాడు గాఢత  తక్కువగా ఉన్న షాంపూ తో తలస్నానం చేసే ప్రయోజనం ఉంటుంది.

సర్వర్ నుంచి సి ఈ ఓ వరకు

హబ్ స్పాట్ సిఈఓ యామిని రంగన్  ఇంజనీరింగ్ చదువుకున్న యామిని ఎం.ఎస్ చేయడం కోసం అమెరికా వెళ్లి సర్వర్ గా జాబ్ మొదలుపెట్టింది. చదువయ్యాక ఉద్యోగంలో చేరిన యామిని డ్రాప్ బాక్స్ వర్క్ డే వంటి ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల్లో పని చేశారు. తరువాత హబ్ స్పాట్ సి ఈ ఓ అయ్యారు. బిజినెస్ టైమ్స్ ఈమెను అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తించింది. యామిని వెంచర్ క్యాపిటలిస్ట్ గా అనేక కంపెనీ లో బోర్డ్ సభ్యురాలిగా […]

అమ్మాయిలకు కొత్త కోర్స్

కేరళ మలప్పురానికి చెందిన రిన్షా పట్టకల్ తొలి మహిళ డ్రోన్ పైలట్ గా చరిత్ర సృష్టించింది. మనదేశంలో ఏరియల్ సర్వైలైన్స్,అగ్రికల్చర్, వెదర్ మానిటరింగ్ వంటి డ్రోన్ ఆపరేషన్స్ కోసం డిజిపిఎ డ్రోన్ రిమోట్ పైలట్ సర్టిఫికెట్ తప్పనిసరి ఈ లైసెన్స్ దొరికిన తొలి కేరళ మహిళా డ్రోన్ పైలట్ గా సర్టిఫికెట్ అందుకున్న 18 సంవత్సరాల రిన్షా పట్టకల్ ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తి.

రాకెట్ ఉమెన్

అమోఘమైన చారిత్రక విజయాన్ని దేశానికి అందించిన చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ రీతు కరిధాల్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో లో పుట్టారు. రీతు. 1997 లో ఇస్రో లో అడుగు పెట్టారు మిషన్ ఎనాలసిస్ డివిజన్ లో ఉద్యోగి గా పనిచేశారు. మంగళయాన్ మిషన్ లో డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్ గా చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ గా ఉన్నారు.ఇక చంద్రయాన్-3 విజయం తనలో అంతులేని విశ్వాసాన్ని నింపిందని  చెబుతున్నారు రీతు. నా విజయం మాత్రం టైమ్  మేనేజ్మెంట్ అంటారామె.

ఈ వ్యాయామం మంచిదే

40 ఏళ్ళు వస్తూ ఉంటే వెయిట్ ట్రైనింగ్ మొదలు పెడితే ఆరోగ్యం అంటారు ఎక్సపర్ట్స్. ఈ ఎక్సర్సైజ్ తో బాడీ టోన్ అవుతుంది.తక్కువ  బరువులతో చేసే వ్యాయామాల తో అదనపు కొవ్వులు కరిగి ఫిట్ నెస్, స్ట్రెంగ్స్ పెరుగుతాయి. బరువు తగ్గి ఇంట్లో పనులు చేసుకోగలుగుతారు. అలాగే పిండి పదార్థాలు తక్కువగా మాంసకృత్తులు ఎక్కువగా తినాలి. రెండు నుంచి ఐదు కిలోల బరువుతో వ్యాయామాలు చేస్తే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

మెరిపించే కాఫీ మాస్క్

కాఫీ మాస్క్ తో మొహం మెరిసిపోతుంది అంటారు బ్యూటీ ఎక్సపర్ట్స్. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి కి అదే పరిమాణంలో తేనె కలిపి మొహానికి మాస్క్ వేసుకొని 28 నిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం పై ఉండే మృతకణాలు పోయి మొహం మెరిసిపోతుంది. అలాగే కాఫీ పొడి పాలలో కలిపి మాస్క్ వేసుకుంటే పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. అలాగే కాఫీ పొడి బ్రౌన్ షుగర్,కొబ్బరి నూనె మిశ్రమం కూడా ముఖాన్ని […]

పెడిక్యూర్ చాలా అవసరం

పాదాలకు ఇన్ఫెక్షన్ లు రాకుండా పెడిక్యూర్ చేయించు కోమంటున్నారు ఎక్సపర్ట్స్. సర్వ సాధారణంగా ఎదురయ్యే పాదాల పగుళ్లు పోతాయి. అలాగే మసాజ్ తో రక్తప్రసరణ మెరుగై గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి ఆర్థరైటిస్ నొప్పులు రావు. వెరికోసిస్ వైన్స్ వంటివి రాకుండా ఉంటాయి. పాదాలకు చేసే మసాజ్ లు శరీరం మొత్తం ఒకే రకమైన ఉష్ణోగ్రత కొనసాగుతుంది. లింఫ్ నోడ్స్ లోని టాక్సిన్స్ పోతాయి మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.

మహిళలకు ప్రోత్సాహం

పారిశ్రామిక దిగ్గజం కుమార మంగళం బిర్లా కూతురు అనన్య బిర్లా సింగర్, రైటర్, యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్ స్వతంత్ర మైక్రోఫిన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాలలో మహిళ వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తోంది. స్వతంత్ర స్టార్టప్ కు ‘గోల్డ్ అవార్డ్’ వచ్చింది. 2016 నుంచి గ్లోబల్ లగ్జరీ ఇన్ ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ ఇ కై ఏషియా కు సి ఈ ఓ గా బాధ్యతలు తీసుకున్నది. ఫోర్బ్స్ ఆసియాస్ ఉమెన్ జాబితాలో అనన్య పేరు చోటు చేసుకున్నది.