Thursday, 06 Aug, 2026
పెండ్లి నిస్చియం అయ్యాక సామంత ఎప్పుడూ వార్తల్లోనే వుంటుంది. ప్రస్తుతం రాజుగారి గది-2 లో నటిస్తోంది. ఏడాది నుంచి కొత్తగా సినిమాలు ఎం చేయలేదు. కానీ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా వుంటుంది. తన అనుభవాల్ని, ఆలోచనల్ని పంచుకోవడంలో చాలా బోల్డ్ గా వుంటుంది. తన కెరీర్ లో ఇంత విరామం తీసుకోవడం ఇదే తొలిసారని, అయినా తనేం ఖాలీగా లేనని చెపుతుంది సామంత. చేతిలో పనేం లేకపోతె నాకు పిచ్చెక్కుతుంది. షూటింగ్ లో ఒక్క రోజు విరామం వున్న ఎలా సద్వినియోగం చేయాలా అని ఆలోచించేదాన్ని. ఇన్నాళ్ళ సుధీర్ఘ విరామం ఎప్పుడూ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరపు సమయాన్ని నా మానసిక ఆనందం కోసం వెచ్చించాను. నా గురించి లోతుగా అలోచించుకునేందుకు ఈ సమయం తోడ్పడింది. సినిమాల బిజీలో ఎం పోగొట్టుకొన్నాను అదంతా సంపాదించుకొనే వీలు కలిగింది. ఇలా అప్పుడప్పుడు మనలోకి, మన కోసం మనం ప్రయాణం చేయడం చాలా అవసరం అంది సామంత. నిజమే ఇలాంటి బిజీ సెలబ్రెటీనోటి గుండా ఒక విరామంలో మన గురించి మనం ఆలోచించుకుని మన కోసం మనం సంతోష పడాలని వినవస్తే లాభమే. ఎక్స్ పర్ట్స్ కూడా ఇదే చెప్పారు. కాస్త విరామం తీసుకొమ్మని.

మొక్కలు నాటేద్దాం

కావేరి నది పరిరక్షణ కోసం మొక్కలు నాటుదాం. ఆసక్తి ఉన్నా వాళ్ళు విరాళాలు ఇవ్వండి. అందరం కలిస్తే లక్ష మొక్కలు నాటగలం 42 రూపాయల విరాళంతో ఒక మొక్క నాటవచ్చు అంటు సోషల్ మీడియా వేదికగా పిలుపు ఇచ్చింది సమంత చక్కని సినిమాల్లో నటించటం మాత్రమే కాదు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సేవకు సిద్ధం అవుతోంది సమంత. కావేరి పరిరక్షణ కోసం సద్గురు జగ్గీ వాసు దేవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంబించారు ఈ పనికి సమంత మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ప్రత్యూష ఫౌండేషన్ పేరిట సేవలు అందిస్తోంది సమంత. చక్కగా మొక్కలు నాటేందుకు నడుం బిగిచింది.

Leave a Reply