శుభా అయ్యంగార్ కి పద్మశ్రీ!
దృష్టి పేరుతో ఎయిర్పోర్ట్ వెదర్, రన్వే విజిబులిటీ సిస్టమ్ అభివృద్ధి చేసి విమాన కార్యకలాపాలకు తోడ్పడే వ్యవస్థ రూపొందించినందుకుగాను పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు శుభా వెంకటేష్.ఈ సాంకేతికత పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు రియల్ టైం రన్వే విజువల్ రేంజ్ అందిస్తుంది. దృశ్యాలు అస్పష్టంగా ఉన్నప్పుడు టేక్ ఆఫ్ లాండింగ్ సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఈ దృష్టి సహాయపడుతుంది. దీన్ని భారతదేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలో భారత వైమానిక దళంలో ఉపయోగిస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా నేషనల్ ఏరోస్పేస్ లేబరేటరీస్ లో పనిచేసిన ఎయిర్పోర్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగానికి నాయకత్వం వహించారు.
