Saturday, 11 Jul, 2026

అమ్మ రూపం అతి సుందరం

తమిళనాడులోని మధురై లో ఉన్న మీనాక్షి దేవాలయం దక్షిణ భారత సంస్కృతికి ఒక ప్రధాన కేంద్రంగా లక్షలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది.ఈ దేవాలయం 15 ఎకరాల విస్తీర్ణంలో అపూర్వమైన నిర్మాణ శైలిలో ఒక సుందర నగరంలా ఉంటుంది.ప్రధాన దేవత మీనాక్షి.ఆమె మధురై ప్రాంత పాలకురాలు శక్తికి సంతానోత్పత్తికి ఆమె అధిదేవత.రోజువారీ ఆచారాలు పూజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారు.అత్యంత ముఖ్యమైన ఆచారం రాత్రిపూట జరిగే పల్లియారై పూజ.ఒక పల్లకిలో సుందరేశ్వరుని,మీనాక్షి మందిరానికి విశ్రాంతి కోసం తీసుకుపోయే పూజ చాలా భక్తితో నిర్వహిస్తారు .ఇతర ప్రధానమైన పండుగలలో ఆవని పండుగ నవరాత్రి లలో ఉన్నాయి. దేవతను తొమ్మిది రూపాల్లో అలంకరిస్తారు మధుర మీనాక్షి దేవాలయం సాటిలేని ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రం .భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఇదొకటి.మీనాక్షి దేవి రూపం అత్యంత సుందరం.

Leave a Reply