Tuesday, 28 Jul, 2026

మట్టి బొమ్మల ఆర్టిస్ట్

అంజలి ఖన్నా పుదుచ్చేరి లోని గోల్డెన్ బ్రిడ్జ్ లో సిరామిక్ కుండల తయారీ నేర్చుకున్నారు. ముంబై లోని ఆలీ బాగ్ లో ఆమె సిరామిక్ స్టూడియో ఏర్పాటు చేశారు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ పాటరి ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ మధ్యకాలంలో ఆమె ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సిరామిక్స్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ఈ సిరామిక్ కళారూపాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

వాసన వదలాలంటే

వేసవిలో చెమట తో శరీరం దుర్గంధం సహజం దీన్ని వదిలించుకోవడం కోసం సరైన డియోడరెంట్ ఎంచుకోవాలి స్వేదం ఎక్కువగా విడుదల అవుతుంది కనుక రెండు పూట్ల దుస్తులు మార్చుకోవాలి దుస్తులు ఉతికే నీళ్లలో వెనిగర్ కలిపి ఉతికితే వాసన పోతుంది సల్ఫర్ ఎక్కువగా ఉండే బ్రొకోలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీలు తీసుకోకూడదు. ఉపయోగించే పెర్ ఫ్యూమ్ లేదా కోలన్ ఆల్మండ్ ఆయిల్ లేదా ఇతర ఎసెన్షియల్ ఆయిల్ కలిపి వాడితే సుగంధం ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.

బవుల్ పాటకు ప్రచారం

రీనా దాస్ ప్రఖ్యాత బవుల్ గాయని. పశ్చిమ బెంగాల్ లోని ఒక మారుమూల పల్లెలో జన్మించిన రీనా దాస్ కుటుంబంలో అందరూ బవుల్ గాయకులే పెళ్లి అయ్యాక రీనా దాస్ భర్త దివాకర్ దాస్ ప్రోత్సాహంతో సంగీతం నేర్చుకుంది. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర ల్లో నివసించే జానపద సంగీతం బవుల్ ఈ బవుల్ పాటల్లో భక్తి ప్రధానం 35 సంవత్సరాలు గా రీనా దాస్ 5 వేలకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. […]

ఆవు పాల వ్యాపారి  

పరాగ్ మిల్క్ ఫుడ్స్ పేరుతో డైరీ ప్రొడక్ట్స్ ప్రారంభించిన అక్షాలి షా నవతరం విజేత ఆమెకు పూణే లో గో క్షేత్రం ఉంది. ఇక్కడ మానవ రహితంగా ఆవుల నుంచి పాలను సేకరించి ప్యాక్ చేసి విమానాల ద్వారా ఖాతాదారులకు చేరుస్తారు. మార్కెట్లో ఆవు పాల కంటే వీటికి రెట్టింపు ధర ఉంటుంది. పరాగ్ సంస్థ నుంచి గోవర్ధన్ పేరుతో నెయ్యి అమ్ముతారు ఫ్లేవర్డ్ మిల్క్,పెరుగు ఇలా అన్ని ఉత్పత్తుల తో సంస్థ నుంచి అమ్మకాలు సాధిస్తోంది.అవతార్ […]

అరుదైన కళాకారిణి

బెంగాల్ నాటక రంగంలో ఆధునిక దోరణులు పరిచయం చేసిన నటిగా పేరు తెచ్చుకుంది.బినోదిని దాసి.1847 లో కోల్ కత్తా నేషనల్ థియేటర్ తరఫున తొలిసారిగా ఒక సీరియస్ డ్రామా లో నటించింది బినోదిని 12 వ ఏటా మొదలుపెట్టిన నటనను 23 వ యేటా స్వస్తి పలికిన బినోదిని జీవిత చరిత్ర రాసుకున్న తొలి దక్షిణాసియా నటిగా ప్రసిద్ధికెక్కింది. ఆమె జీవిత చరిత్ర అమర్ కథ నటి బినోదిని పేరుతో బెంగాలీ సినిమా వచ్చింది.ఇప్పుడు ఆమె జీవితం […]

సెంగోల్ ఎక్కడ?

తమిళనాడు కు చెందిన శాస్త్రీయ నృత్యకారిణి పద్మ సుబ్రహ్మణ్యం సెంగోల్ రాజదండం గురించి ప్రధాని మోదీకి లేఖ రాయడం వల్లనే ధర్మానికి న్యాయానికి చిహ్నమైన ఆ సెంగోల్ ని కనుక్కోగలిగారు బ్రిటిష్ వారి నుంచి అధికారం బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు తమిళనాడు సాంప్రదాయం ప్రకారం ఈ రాజదండాన్ని 1947 ఆగస్టు 14న నెహ్రూ అందుకున్నారు. దాన్ని ఆయన అలహాబాద్ మ్యూజియాలకు చేర్చారు. రెండేళ్ల క్రితం ఈ రాజ దండం గురించిన వార్త చదివిన పద్మ సుబ్రహ్మణ్యం దీన్ని […]

నిరంతర పోరాటం లక్ష్యం

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాది గా సృష్టించారు 27 ఏళ్ల పద్మా లక్ష్మి కేరళలోని కొచ్చి లో జన్మించిన పద్మా లక్ష్మి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని న్యాయవాద వృత్తి లోకి ప్రవేశించారు.  ఇది సరికొత్త అధ్యాయానికి నాంది అంటూ కేరళ న్యాయ శాఖ మంత్రి ఎ.రాజీవ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ట్రాన్స్ జెండర్ ల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెబుతున్నారు పద్మా లక్ష్మి.

ఈ హ్యాండ్ బ్యాగ్స్ మరీ స్పెషల్

రస్కీ పేరుతో బనానా బెస్ట్ లెదర్ ప్రొడక్ట్స్ తో మార్కెట్ లో అడుగు పెట్టింది శివాని పోపట్. తన బ్యాగులు యాక్ససరీస్ కు ముందు క్రూయాలిటీ ఫ్రీ అనే వాక్యం చేర్చి ఎంతో మందికి దగ్గర అయింది. శివాని. పర్యావరణ హితం కోరుతూ ఆమె ప్రారంభించిన ఈ కంపెనీతో చాలా త్వరలో పాదరక్షలు కూడా తేబోతోంది.వినియోగదారులు ఇష్టపడే లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లో రస్కీ కూడా ఒకటి.

బామ్మ ది గ్రేట్

ఆస్కార్ విన్నింగ్ టీవీ సీరియల్ ‘డి కుమార్స్ ఎట్ నంబర్ 42 లో మీరా స్వాల్ పోషించిన సుశీల అనే భామ పాత్ర సూపర్ హిట్. ఆమె ప్రతిష్టాత్మకమైన ‘భాస్టా’ ఫెలోషిప్ కు ఎంపికైంది. రచయిత్రిగా మీరా రాసిన ‘అనితా అండ్ మి’ పుస్తకానికి ఎంతో గుర్తింపు లభించింది. రచయితల తొలి పుస్తకానికి ఇచ్చే ప్రఖ్యాత బెట్టీ ట్రాస్క్ అవార్డు గెలుచుకుంది.ఆమె చక్కని గాయని.పంజాబ్ గ్రామీణ ప్రాంతాలలోని జానపదాలు చక్కగా.61 సంవత్సరాల మీరా బహుముఖప్రజ్ఞశాలి.

ఇది మరీ సౌకర్యం

ప్యాంట్ కి షర్ట్ కి జేబు లున్నట్లే అందమైన చీరకు ఈ  ప్యాకెట్ కుట్టేస్తున్నారు డిజైనర్లు. పూసలు,అద్దాలు జరీ దారాలతో పాకెట్ క్లాత్ ఎంబ్రాయిడరీ చేసి దాన్ని చీరకు జత చేస్తున్నారు. ఒక్కసారి జాకెట్,పాకెట్ ఒకే ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసి స్టయిల్ లుక్ తీసుకొస్తున్నారు. షర్ట్స్ బ్యాగ్ తప్పనిసరి అవసరమైన అమ్మాయిలకు ఈ ప్యాకెట్ శారీస్ అనువుగా ఉంటున్నాయి.ఫోన్,డబ్బులు పెట్టుకొని వెళ్లేందుకు వీలుగా ఉండటం తో ఈ ప్యాకెట్ స్టయిల్ ట్రెండ్ అయిపోయింది.

నృత్యమే జీవితం

చెన్నయ్ కు చెందిన రాణీ రామస్వామి భారత నాట్య కళాకారిణి మూడు దశాబ్దాల క్రితం అమెరికా లోని మినియా పోలీస్ లో రాగమాల డాన్స్ కంపెనీ కి శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ జాతీయ అంతర్జాతీయ కళాకారులతో కలిసి పని చేస్తోంది రాణీ రామస్వామి ఆమెతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు అపర్ణ అశ్విని కూడా ఆమె తోడుగా ఈ ప్రయాణంలో ఉన్నారు. హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన రిటన్ ఇన్ వాటర్ నృత్యరూపకం వాళ్ల ముగ్గురికి […]

మల్టిపుల్ రింగ్స్

కొన్ని శుభ సందర్భాల్లో అన్ని వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటారు అదే ఇప్పుడు మల్టీ రింగ్, లేదా స్టాకింగ్ రింగ్ స్టేట్ మెంట్ పీస్ అయిపోయింది. బెస్ట్ స్టాకింగ్ ఐడియాలు చూస్తే ఇన్ని రకాల ఉంగరాలు చేయచ్చు అని ఆశ్చర్యం వేస్తుంది. అద్భుతమైన క్రియేటివిటీ తో ఈ ఉంగరాలు బాలీవుడ్ అందాల తారలు అందరూ ఇష్టపడేలా చక్కని డిజైన్లతో వచ్చాయి. ఈ కాలపు అమ్మాయిలు కూడా ఫ్యాషన్ కోసం స్టాకింగ్ రింగ్స్ ని తప్పనిసరిగా ధరిస్తున్నారు.

చుండ్రు తగ్గుతుంది

షాంపూల కంటే కుంకుడు కాయలు వంద రెట్లు మంచివంటున్నారు ఎక్సపర్ట్స్. వీటిలో ఉండే యాంటీ మైక్రోబియల్ యాంటీ ఫంగల్ గుణాల వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది.కుంకుడు రసం లో మెంతిపిండి, మందార ఆకులు కలిపి రెండు రోజులకొకసారి   తలస్నానం చేస్తే చుండ్రు సమస్య శాశ్వతంగా పోతుంది. వీటిలో ఉండే ఇలాంటి అలర్జీ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మొటిమలు మచ్చలు పోగొడతాయి.

ఓ అమ్మ కదా

తన బిడ్డలను తనకు అప్పగించాలని నార్వే ప్రభుత్వం పై సాగరిక చక్రవర్తి చేసిన పోరాటం ఇప్పుడు రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలు ‘మిసెస్‌ ఛటర్జీ వర్సస్‌ నార్వే’ సినిమాగా వచ్చి విజయం సాధించింది. భారతదేశంలో అలవాటైన పద్ధతిలో చేత్తో అన్నం తినిపించడం పాపాయి పక్కన పడుకోవడం వంటివి బ్యాడ్ పేరెంటింగ్‌ రిపోర్ట్ చేసి నార్వే లో పిల్లల సంరక్షణ సభ్యులు పిల్లలను పోస్టర్ పేరెంటింగ్ లో ఉంచారు. దూరమైన పిల్లల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సాగరిక […]

ఆమెదే తొలి అడుగు

బెంగళూరుకు చెందిన అదితి అశోక్  ఐదేళ్ల వయసులోనే క్రీడారంగంలో అడుగుపెట్టింది బెంగళూరు గల్ఫ్ క్లబ్ కర్ణాటక గల్ఫ్ అసోసియేషన్ తరఫున ఎన్నో పోటీల్లో పాల్గొన్నది తాజాగా ఎల్.పి.జి.ఏ ప్రపంచ ర్యాంకింగ్ టాప్ 50 లోకి ప్రవేశించింది.ఆ ఘనత అందుకున్న తొలి భారతీయురాలు అదితి.

ప్రకటనల్లో మహిళ కోణం  

రీడిఫ్యూజన్ బ్రాండ్ సొల్యూషన్ సంస్థ ఆల్ విమెన్ యాడ్ ఏజెన్సీ ప్రారంభించింది టిస్టా సేన్. దానికి డైరెక్టర్ చైర్ పర్సన్ తన్వి గోయిల్  ఈ సంస్థలో అందరూ మహిళా ఉద్యోగులే ఒక నివేదిక ప్రకారం ఎన్నో బ్రాండ్ లకు మహిళలే ఎక్కువ కొనుగోలు దారులు. ప్రకటనల్లో స్త్రీ కోణాలను సృజించటం వ్యాపార, వాణిజ్య రంగాల్లో కొత్త వరవడి సృష్టించటం తమ లక్ష్యం అంటారు.

స్త్రీల కోసం పింక్ పార్కులు

ఢిల్లీ లోని 250 వార్డుల్లో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉన్న పింక్ పార్కులు రానున్నాయి. ఈ పార్కుల్లో అందరూ స్త్రీలే పని చేస్తారు. పదేళ్లు దాటిన మగ పిల్లలకు ఇందులో ప్రవేశం లేదు. పిల్లల ఆరోగ్యం కోసం తమకు కాస్త విరామం ఆహ్లాదం కోసం స్త్రీలు ఈ పార్కుల్లో హాయిగా స్వేచ్ఛగా ఉండచ్చు. సిసి టీవీలు కాపలా తప్పనిసరిగా ఉంటాయి.

వేసవిలో రక్ష

ఈ వేసవిలో ఆరోగ్యపరంగా కీరదోస ఎంతో మేలు చేస్తుంది. అధిక శాతం నీటితో డిహైడ్రేషన్ సమస్యకు గొప్ప పరిష్కారం. పీచు ఎక్కువగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి పొట్ట, పేగులు శుభ్రపడతాయి. ఇందులో క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయి భయపెట్టే రొమ్ము, అండాశయ క్యాన్సర్ ల నుంచి రక్షణ ఇస్తుంది.

ఆర్.జె కేరాబాయి  

72 సంవత్సరాల కేరాబాయి ఫేమస్ రేడియో జాకి మహారాష్ట్ర లోని మహాస్వాద్ లో ఉంటుంది. మన్ దేశీ అనే కమ్యూనిటీ రేడియో ద్వారా చక్కగా పాడుతుంది. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం లో కూడా పాల్గొన్నది. యుఎస్ ఇంటర్నేషనల్ బ్రాడ్ కాస్టర్ వాయిస్ ఆఫ్ అమెరికా తారాబాయ్ జీవితాన్ని వాటర్ ఫర్ గోల్డ్ పేరుతో రూపొందించింది. ఇంటి పనులు,వంట పనులు, పొలం పనులు చేస్తూ కనిపించే తారాబాయి ఆశువుగా కవిత్వం కూడా చెబుతుంది.

తీయని వ్యాపారం

జాగర్ కేన్ పేరుతో నాణ్యమైన బెల్లం పొడి వ్యాపారం చేస్తోంది నవనూర్ కౌర్. చక్కెర కు ప్రత్యామ్నాయం బెల్లమే అని చెప్పే నవనూర్ కౌర్  తయారు చేసే బెల్లం 9 నెలలు నిల్వ ఉంటుంది ఆమె జన్మస్థలం లుధియానా. ఆమె బ్రాండ్ జాగర్ కేన్. గత ఏడాది రెండు కోట్ల టర్నోవర్ సాధించింది. పంజాబ్ లోని 22 జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది.