Saturday, 25 Jul, 2026

గళం విప్పిన సుచిత్రా కృష్ణమూర్తి

దాదాపు 18 సంవత్సారాల తర్వాత సావన్ బర్స్ సినిమాలో మళ్ళీ గళం విప్పారు సుచిత్రా కృష్ణమూర్తి. ప్రసిద్ద దర్శలకుడు శేఖర్ కపూర్ తో విడిపోయాక, కూతురు కావేరీ కపూర్ ను పెంచుతూ ఆమె పాకు దూరంగా ఇన్నేళ్ళు గడిపారు . ఒంటరి తల్లిగా కావేరీని పెంచేందుకు ఆమె చాలా కష్టడ్డారు. కావేరీ కూడా చక్కగా పాడుతోంది. కూతురు ప్రోత్సహాంతో మళ్ళీ కేరీర్ మొదలు పెట్టారు కవితా కృష్ణమూర్తి .ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ఫలప్రదం కావాలని ఆకాంక్షిద్దాం.

జాజిపూవంత అందంగా అనుష్క

అనుష్క ఎప్పుడూ అందంగానే ఉంటుంది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్కచాలా కాలం పాటు అలా బొద్దుగానే కనిపించింది. ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క ఇప్పుడు చాలా సన్నగా, మునుపటి కంటే కూడా ఇంకా అందంగా కొత్త లుక్ తో సామాజిక మధ్యమాల్లో కనిపించింది. శ్రద్ధగా నిపుణుల సమక్షంలో బరువు తగ్గేందుకు దృష్టి పెట్టిన అనుష్క ఫోటోలు ట్విట్టర్ లో కనిపించాయి. త్వరలో ఆమె ఒక కొత్త చిత్రంలో నటించబోతుంది. […]

చదువు విలువ తెలియ లేదు

కెరీర్ కాస్త ముందుగా మొదలు పెట్టేశానని ఇప్పుడు కాస్త దిగులుగా ఉంది. కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. వేగంగా నిర్ణయం తీసుకొని 17 సంవత్సరాలకే సినిమాల్లోకి వచ్చాను. మాది సినిమా కుటుంబం కావటంతో చదువు గురించి ఆలోచించ లేదు. కానీ నా కోడుకు తైమూర్ విషయంలో అలా జగరకుండా జాగ్రత్తాపడతాను .వాడిని చదవు ,ప్రపంచజ్ఞానం వచ్చేలా తీర్చీ దిద్దుతాను అంటోంది కరీనా కపూర్. సైఫ్ తరపు వాళ్ళు గొప్ప చదువులు చదివారు. ఆక్స్ ఫర్డ్ ,కేంబ్రిడ్జి […]

నా పొరపాట్లు నాకు తెలుస్తాయి

ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఫర్ ఫెక్ట్ కాదు. తప్పులు చేస్తునే ఉంటారు. మనలోని లోపాలు మనకు తెలియక పోవచ్చు. ఒక్క సారి మన కంటపడవు కూడా. నాకు నా తప్పులు తెలుసుకోవటం ఇష్టం. విమర్శలు స్వీకరించటానికి నేనెప్పుడు సిద్ధం. కానీ అదేంటో ప్రతి సారి నేను తప్పు చేసిన నాకు తెలిసిపోతుంది. నా హిట్ చిత్రాల్లో కూడా నేను చేసిన పొరపాట్లు నాకు తెలుసు. ఎవ్వరు విమర్శించకుండానే నన్ను నేను సరి దిద్దుకొగలను అంటోంది తమన్నా. […]

నేను తృప్తి పడను

అన్ని సాధించేశాం అని తృప్తి కళాకారులకు కలిగితే ఆ జీవితం అయిపోయినట్లే. ఎప్పటికప్పుడు ఏదో వెతికి వెంటాడాలి. దానిని అందుకునేలా శ్రమించాలి అప్పుడే మనం,ఆ కళ నిలబడి ఉంటుంది అంటుంది తమన్నా . నేను ఎప్పుడు ఏదో ఒక దాని గురించి అన్వేషణ కోనసాగిస్తాను. ఇంకా ఏదో చేయాలని కొత్త దనం సృష్టించాలనే ఆలోచనతో ఉంటాను కనుక నా సక్సస్ అదే అంటుంది తమన్నా. ఒకప్పుడు కధానాయకలు అంటే పాటలకే పరిమితం అనుకునే రోజుల్లో నాకు నటనకు […]

మంచి పాత్రల కోసం చూస్తున్న

కెరీర్ ఆరంభలోనే అక్కినేని కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములతో నటించటం చాలా ఆనందంగా ఉంది ,సవ్యసాచి వెంటనే మజ్నూ చేశాను. సవ్యసాచి కంటే మజ్ను కోసం ఎక్కువ కష్టపడ్డాను.నా కష్టం సినిమాలో తెలుస్తుంది అంటోంది నిధి అగర్వాల్ .ఇప్పుడే కేరీర్ ప్రారంభించాను.కనుక ఎలాంటి పాత్రలు చేయాలో నిర్ణయించుకోలేదు. సినిమా ఒప్ఫుకునే ముందర నాపాత్ర ఏమిటన్నది చూస్తాను కానీ ఎక్కువ గ్లామర్ రోల్స్ వస్తున్నాయి.అందంగా కనిపిస్తూనే అభినయానికి ప్రధాన్యత ఉన్న సినిమాలు వస్తే బావుంటుంది. చిన్నప్పటి నుంచి యాక్టర్ […]

మళ్ళీ కెమెరా ముందుకు

కొంతకాలంగా క్యాన్సర్ కు చికిత్స తీసుకొంటున్న సోనాలి బింద్రే మళ్ళీ ఆరోగ్యంగా కెమెరా ముందుకు వచ్చారు. ఒక యాడ్ ఫిలింలో నటించేందుకు గాను ఆమె షూటింగ్లో పాల్గొన్నారు. ప్రస్తుతం నా మనసులో భావాలకు రూపం ఇవ్వటం చాలా కష్టం. కెమెరా ముందు నిలబడి భావోద్వేగాలు పలికంచటంలో ఉన్న ఆనందం అనుభవం చాలా గొప్పది అన్నారు సోనాలి బింద్రే. ఎంతో కాలం విరామం తర్వాత నేను షూటింగ్ చేస్తున్న . గత కొద్ది నెలలుగా నా భావోద్వేగాలు నా […]

మహిళల ఆరోగ్యానికి పెరుగు

చలికాలం ముగింపుకు వస్తూ వేసవి ఎండ చురుక్కుమంటూ తగలటం మొదలు పెట్టాక ఇక గడ్డ పెరుగును తప్పని సరిగా భోజనంలో భాగంగా చేసుకోమంటున్నారు డాక్టర్లు. మంచి విషయంలోనే కాదు ఆరోగ్యపరంగానూ పెరుగు చాలా గొప్ప మేలు చేస్తుంది. పెరుగులో ఉండే పోషకాల ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది. రోజు పెరుగు తింటే వేసవిలో మేనిలో మంచి నిగారింపు వస్తుంది. చర్మంలో తేమ ఉండేలా సాయపడుతుంది. పెరుగులో పోటాషియం ,మెగ్నిషియం ఎక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు […]

వాళ్లు సమాజాన్ని ప్రేమిస్తారు

కళల్లో ప్రావీణ్యత ఉన్న వాళ్ళకి సమాజానికి ఏదో చేయాలన్న తాపత్రయం కూడా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. అలాగే కళలను ఇష్టపడేవాళ్లకి ,కళలను ప్రేమించే వారికి సామాజిక కార్యకలాపాల పట్ల సానుకూల దృక్పథం, సహనం ఉంటాయి. రక్తదానం ,డబ్బు విరాళంగా ఇవ్వటం ,పొరుగువారికి సహాకరించటం ,తెలియని వారికి దారి గుర్తులు వివరంగా విసుగులేకుండా చెప్పటం. అదనంగా పొరపాటు గా తమ చేతికి ఏ క్యాషియరో ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చి వేయటం ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా ఉండటం వంటి […]

తీసి పారేయద్దు

కూరలో కనబడితే ఏరి పారెస్తారుగాని నిజానికి కరివేపాకు సుగుణాల రాశి.ఇందులో కాల్షియం, ఐరన్ ఎంతో పుష్కలంగా ఉంటాయి.ఎ,బి,బి2,సి,ఇ విటమినులు లభిస్తాయి. ఫోలిక్ యాసిడ్ దోరుకుతుంది. చెడు బాక్టీరియాను కణాలను దెబ్బతిసే ప్రీ రాడికల్ ను నాశనం చేయగలదు. రక్త హినత గల వారు కరివేపాకు తిసుకుంటే వెంటనే ఫలితం తెలుస్తుంది. మధుమేహం ఉన్న రోగులకు ఇది అవసరం .జుట్టుకు మేలు చేస్తుంది. రోజు కరివేపాకు జ్యూస్ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వెబ్ సీరీస్ కూడా నచ్చుతాయి

హీరోయిన్ గా చక్కని కేరియర్ సాగుతుండగానే వెబ్ సీరీస్ లో నటించడం మొదలుపెట్టింది కైరా అద్వానీ. ఈ విషయం గురించి చెబితే సినిమాకి అభిమానులు ఉన్నట్లే వెబ్ సీరీస్ కి కూడా ఉన్నారు. నా లక్ష్యం ప్రేక్షకుల మనసును గెలుచుకోవడమే. వెబ్ సీరీస్ లు కూడా తప్పనిసరిగా నచ్చుతాయి. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్ నాకు స్వయంగా ఫోన్ చేసి నేను లవ్ స్టోరీస్ అనే వెబ్ సీరీస్ చేస్తున్నాను. అందులో పాత్రను తానే డైరెక్ట్ చేయబోతున్నాను […]

మీటు నన్ను తాకింది

మీటు గురించి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ నేను కాస్టింగ్ కౌచ్ భారీనపడి ఎనిమిది నెలలు పని పోగోట్టుకొన్ననని చెప్పింది అదితీ రావ్ హైదరీ. కెరీర్ ఆరంభించిన కొత్తలో నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని పరిశ్రమలో ఇలాంటివి జరుగుతాయని ఊహాకు అందలే. ఒక్క సంఘటన నన్ను చాలా బాధించింది. ఓ ప్రాజెక్ట్ విషయంలో అడ్జెస్ట్ అయితే ఛాన్స్ ఇస్తామన్నారు. నేను వద్దనేసి వచ్చేశాను. ఓ ఎనిమిది నెలలు నేను పని కోల్పోయాను. కొత్త అవకాశాలు రానందుకు చాలా […]

కథకే ప్రాధాన్యత

కథనాయికగా నటించటం సంతోషంగా ఉంది. ఈ చిత్రం కథనం పేరుకి తగ్గట్టే కథనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ప్రేక్షకులు థ్రిల్ అయిపోతారు. ఇందులో సహాయ దర్శకురాలి పాత్రలో కనిపిస్తాను .టీజర్ కు మంచి స్పందన వచ్చింది అంటోంది అనసూయ. ఆమె కథనాయికగా నటిస్తున్న కథనంలో అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనసూయ,రణధీర్ ,ధన్ రాజ్ ,వెన్నల కిషోర్, పృధ్వీ నటిస్తున్నా ఈ సినిమా వినోదం మిలితమైన సరికొత్త థ్రిల్లర్ అంటున్నారు.

ఎక్కడో ఒక చోట నేనుంటా

నేను నటించిన ప్రతి పాత్రలోనూ ఎక్కడో ఒక చోట నేనుంటాను కానీ అలా ఉండటం తప్ప ఏ దశలోను నా ఇష్టం వచ్చినట్లు నటించాలనుకోను. నా పాత్రను దర్శకుడు చెప్పినట్లు నటిస్తూ పోతాను అంతే. నా మనసుకి తెలుస్తుంది. ఆ పాత్రలో నా ఛాయలు నా అలవాట్లు ఆలోచనలు ఉన్నాయని కానీ నేను స్వతంత్రించి అవన్ని నా పాత్రలోకి లాగాలని చూడను.నాకు తెలిసిందే కదా అని పాత్రను ఎక్కువ చేయటం ,తగ్గించటం ఏదీ లేదు. ఏ పాత్రైనా […]

మామి అధ్యక్షురాలిగా దీపికా

బాలీవుడ్ అగ్ర కథానాయక దీపికా పదుకోనేకు కొత్త గౌరవం దక్కింది.మామి(ముంబై అకాడమీ ఆప్ మూవింగ్ ఇమేజ్ )చిత్రోత్సోవాలకు ఆమె కొత్త అధ్యక్షురాలిగా నియమితురాలయ్యారు. గత నాలుగేళ్ళుగా అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావ్ ఈ పదవిలో ఉన్నారు. ఇది నాకు దక్కిన గౌవరం. అంత కంటే గొప్ప బాధ్యత .సినిమా ప్రేమికులను సినీ ప్రముఖులను ఒక్కచోట చేర్చే మామి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళతాను అంటోంది దీపికా.

ముక్తాబెన్

1912 జులై రెండున గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలోని అంకాడియాలో జన్మించిన ముక్తాబెన్ మెనెంజైటిస్ తో ఏడేళ్ళ వయసులోనే దృష్టి లోపం వచ్చింది.అయినా చదువు పట్ల ఆ పేక్షతో బిఎ పూర్తి చేసింది.ఉపాధ్యాయ శిక్షణ పొంది, బ్రేయిలీ రీడింగ్ ,బ్రేయిలీ రైటింగ్ నేర్చుకున్నారు. కవిత్వం, కథలు రాశారు. అంధుల సమస్యల కోసం కృషి చేశారు.ఆమె సేవాలను గుర్తించి సురేంద్ర నగర్ కు చెందిన వినోద్ కె.షా తన ఆస్తిని ఆమెకు విరాలంగా ఇచ్చారు. ‘ప్రజ్ఞచక్షు మహిళా సేవా […]

స్వతహాగా డ్యాన్సర్ ని

మిస్టర్ మజ్ను లో నేను పోషించిన నిఖి పాత్రకు నాకు చాలా ప్రశంసలు దక్కాయి. డాన్స్ పరంగా కూడా నా తోలి చిత్రం నుంచి కూడా మంచి పేరు వచ్చింది .నాగ చైతన్య తో చేసిన సవ్య సాచి లో కూడ నాకు మంచి ప్రమోషన్ వచ్చింది. స్యతహగా నేను డాన్సర్ ని. చిన్నప్పటి నుంచి నటిని అవ్వాలని ఉండేది . అమ్మా నాన్న నన్ను ప్రోత్సహిస్తు కథక్ నృత్యాలు నేర్పించారు. ఒక వైపు మోడలింగ్ చేస్తు […]

చిత్రా మద్గల్

పోస్ట్ బాక్స్ నెంబర్ 203 నలసోపర్ హిందీ నవలకు ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకడమి అవార్డు 2018 వచ్చింది. హింది రచయిత్రి చిత్రా మద్గల్ రాసిన ఈ నవల ఇతివృత్తం ఒక హిజ్రా కు సంభంధించినది. ఈ సమాజంలో హిజ్రాలు కూడా అందరివంటి వారే అని భావనను తిసుకోచ్చేందుకుగాను ఈ నవల రాశాను అంటారు చిత్రా. చైన్నైకి చెందిన చిత్రా మద్గల్ ముంబాయ్ లో ఎస్.ఎన్.డిటి మహిళ విశ్వవిధ్యాలయంలో హింది సాహిత్యంలో ఎమ్.ఎ పీ.హేచ్.డి చేశారు. […]

డాక్టర్ ఎం. లీలావతి

సుప్రసిధ్ధ మళయాళి రచయిత్రి ఎం. లీలావతి సంస్కృతం నుంచి శ్రీమన్ వాల్మికి రామాయణాన్ని ఇంగ్లిష్ లో కి అనువాదం చేసినందుకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. కేరళ లోని త్రిశుల్ కి చెందిన లీలావతి ప్రభుత్వ కాలేజీ లో పనిచేసి పదవి విరమణ పోందారు .ఆమె కళాశాలకు గాను ఎన్నో అవార్డులు అందుకున్నారు 1980 లో ఈమె రచించిన వర్ణ రాజి కి కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించింది. 1986 లో కవిత […]

నర్తకి నటరాజ్

తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంలో సత్కరించారు నర్తకి నటరాజ్ ని. ఆ తర్వాత నాలుగేళ్ళు సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు నటరాజ్.1964 మధ్రైలో జన్మించారు నటరాజ్.తాంజావూరు నాట్యకారులు కిట్టప్ప పిళ్ళై నటరాజ్ కి నాట్యం నేర్పారు.దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.ఎన్నో అవమానాలు సహించి ఇంత ఎత్తుకు ఎదిగిన నటరాజ్ పద్మశ్రీ పురస్కారంతో ఈ గౌరవం దక్కించుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా విజేతగా నిలిచారు.