Wednesday, 29 Jul, 2026

పప్పమ్మల్‌ కు పద్మశ్రీ

కోయంబత్తూర్ కు చెందిన 105 సంవత్సరాల పప్పమ్మల్‌ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కోయంబత్తూరు సమీపంలోని తక్కెంపట్టి అనే గ్రామంలో భవానీ నది ఒడ్డున ఉన్న రెండున్నర ఎకరాల పొలం పప్పమ్మల్‌ సొంతం. గత 50 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తమిళనాడులో పేరు తెచ్చుకున్నారు ఆమె.అరటి చెట్లు పండించడంలో ఆమె ఎక్సపర్ట్స్. ఇప్పటికీ ఆమె తన పొలంలో అరటి పండిస్తోంది. తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీ అనుభవాలు వినేందుకు తరచూ ఆహ్వానిస్తారు. మా నాయనమ్మ చిన్న కిరాణా కొట్టు […]

అదితి గోరూర్

యు.ఎస్ లోని అమెరికా రాయబారికి పాలసీ అడ్వైసర్ గా అదితి ఎంపికయ్యారు. ఆమె జార్జ్‌టౌన్ యునివర్సిటీలో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ లో ఎం.ఎ చేశారు. మెల్ బౌర్న్ యూనివర్సిటీ లో ఆనర్స్ లో లా చదివారు అదితి. నైజీరియాలోని లోగోస్ లో పుట్టారు. ఇండియా ఒమన్  ఆస్ట్రేలియాలో పెరిగారు. యు. ఎస్ లో స్థిరపడ్డారు. అతిథి భారత సంతతికి చెందిన అమెరికన్. ఇంతకు ముందు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ విభాగంలో నిపుణురాలిగా ఉన్నారు. అతిథి బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ […]

సుమతీ రామ్మోహన్ రావ్

దేశంలోనే తోలి మృదంగ విద్వాంసురాలిగా పేరు ప్రఖ్యాతలు గణించిన మృదంగ మహారాణి దండమూడి సుమతి రామ్మోహన్ రావ్ కు పద్మ పురస్కారం లభించింది. కేవలం పురుషులకే పరిమితమైన మృదంగం పై ఒక అమ్మాయి చేతుల లయ బద్దంగా విన్యాసాలు చేసి దేశ విదేశాల్లో ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. దండమూడి సుమతి రామ్మోహన్ 10 వ సంవత్సరం లోనే తోలి ప్రదర్శన ఇచ్చారు. మృదంగం లో డిప్లొమా కోర్స్ చేశారు. దండమూడి రామ్మోహన్ రావు దగ్గర శిష్యురాలిగా చేరి ఆయన్నే […]

బుల్లి రచయిత్రి

అభిజిత రాసిన ‘హ్యాపినెస్ ఆల్ అరౌండ్’ పుస్తకాన్ని గుర్ గావ్ లోని ప్రసిద్ధ పబ్లిషింగ్ సంస్థ ఇన్ విన్సిబుల్ ప్రచురించింది. ఇంతకీ అభిజిత వయసు ఏడేళ్లు ఆమె తండ్రి ఆషిష్ గుప్తా తల్లి అనుప్రియ గుప్తా. అభిజిత రాసిన పుస్తకం విపరీతమైన ఆదరణ పొంది ఆమె వరల్డ్ ఎంగెస్ట్ ఆథర్ అనే గుర్తింపు పొందింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ వారు అభిజిత ను గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్ గా గుర్తించారు. ఇన్ విజిబుల్ సంస్థ […]

రజినీ బెక్టర్

మిసెస్ బెక్టర్ సంస్థ స్థాపించిన రజినీ బెక్టర్ పద్మశ్రీ లభించింది. రజినీ లాహోర్ లో పుట్టి పెరిగారు. దేశ విభిజన తర్వాత ఆమె కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది. డిగ్రీ పూర్తి చేసిన రజనీ కుకీలు, ఐస్ క్రీమ్ ల తయారీ లో శిక్షణపొందారు. 1978 నుంచి ఆమె దాన్ని బిజినెస్ గా వృద్ధి చేశారు. కొన్నేళ్ళకే ఆ ఉత్పత్తులు ఉత్తర బారతావణి లో ప్రత్యేకత చాటాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్ లోకి అడుగుపెట్టిన మెక్ […]

బిరుబాల రభా

మూఢాచారాలు దురాచారాలపై పెద్ద పోరాటం చేశారు బిరుబాల రభా. అస్సాంలోని గోల్ పారా జిల్లాలోని తుకురియా అనే గిరిజన గ్రామం ఆమెది. ఆమె కొడుక్కి అనారోగ్యం చేస్తే అది ఒక మంత్రగత్తె పని అని ఇరుగుపొరుగు చెప్పారు.ఎంతో భయపడింది బిరుబాల కానీ అదంత మోసమని తేలిపోయింది. ఆమెకు మంత్రగత్తెల పేరుతో వారికి జరిగే అన్యాయాలపై స్థానిక మహిళలను బృందంగా చేసుకుని ప్రజల్లో అవగాహన తేవటం మొదలుపెట్టింది.ఎన్నో అవమానాలు దౌర్జన్యాలు ఎదుర్కొంది ఈ పోరాటంతో మంత్రగత్తెలన్న పేరుతో మహిళలపై […]

కాంచన్ పరులేకర్ 

70 ఏళ్ల కాంచన్ పరులేకర్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వద్దనుకున్నారు స్వయం సిద్ధ సంస్థ ద్వారా గత 30 ఏళ్లుగా 6500 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు.మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించిన తన తల్లిదండ్రులు చేసే సామాజిక సేవ వారసత్వంగా అందుకొన్నారు.ఎం. ఏ డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తిచేసి బ్యాంక్ మేనేజర్ గా పనిచేసిన కాంచన్ పరులేకర్ 1992 లో స్వయం సిద్ధ లో పని చేసేందుకు పూనుకొన్నారు. బేకరీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు బ్యూటీ […]

కెప్టెన్ ప్రీతి చౌదరి 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సైనిక దళానికి చెందిన మహిళ కాంతి కాంటింజెంట్ కమాండర్ కెప్టెన్ ప్రీతి చౌదరి సైనిక కవాతకు నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ షిల్కా ఆయుధ  వ్యవస్థకు కెప్టెన్ ప్రీతి ముందుండి నడిపించారు.ఈ వ్యవస్థకు శత్రు స్థావరాలను రెండు కిలోమీటర్ల దూరం నుంచే మట్టుపెట్టే సామర్ధ్యం ఉంది.ఆధునిక రాడార్లు, డిజిటల్ ఫైర్ కంట్రోల్ కంప్యూటర్స్ తో ఆధునీకరించిన షిల్కా ఆయుధ వ్యవస్థ భూమి పై రెండు కిలోమీటర్లు […]

సింధూ తాయి 

వెయ్యి మంది పిల్లలను పోషించే సింధూ తాయి కి పద్మశ్రీ లభించింది. పన్నెండేళ్ల కే  పెళ్లయింది.20 ఏళ్లకు ముగ్గురు పిల్లల తల్లయింది.గర్భిణీగా ఉన్న సింధు ని భర్త తరిమేస్తే పశువుల కొట్టంలో పురుడుపోసుకుంది. స్మశాన వాటికలో తలదాచుకుని శవాలకు పెట్టే పిండాల ని ఆహారంగా తీసుకున్న సిందు తాయి, బిచ్చమెత్తుకుంటున్న ఊరూరా తిరిగే  సింధు తాయి 40 ఏళ్ళ తరువాత తన బిడ్డ కే కాదు వేయి మందికి అనాధ పిల్లలకు అమ్మ అయింది. ఆమె చక్కగా […]

సంగీత సరస్వతి చిత్ర 

ఇరవైకి పైగా భాషల్లో పాతిక వేలకు పైగా పాటలు పాడిన చిత్ర  2005లో పద్మశ్రీ పొందారు కేరళ లోని త్రివేండ్రం లో సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన చిత్ర చిన్న వయసులో సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం తో సహా 20 భాషల్లో పాడారు.ఆరు జాతీయ, ఎనిమిది ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడు తాజాగా పద్మవిభూషణ్ అందుకొన్నారు చిత్ర.

శాంతి దేవి 

బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో రాయగడ్ జిల్లాలోని పద్మపురం సమీపంలో సేవ సమాజ్ ఆశ్రమాన్ని స్థాపించారు శాంతి దేవి.ఒడిస్సా లోని బాలేశ్వర్ లో 1934 లో జన్మించారు. శాంతి దేవి కుటుంబంలో అందరూ సమాజ సేవలోనే ఉండటం తో ఆమె కూడా ఆ మార్గాన్ని ఎంచుకున్నారు సామాజిక సేవ కార్యకర్త రతన్ దాస్  ను వివాహం చేసుకున్నారు కొరాపుట్ జిల్లా లోని సంకల్ పదార్ గ్రామంలో కుష్టు రోగులకు సపర్యలు చేస్తూ తన సేవా కార్యక్రమాలకు శ్రీకారం […]

జయ పరాశర్, అంకిత పరాశర్

స్టెమ్ మైండ్స్ కో ఫాండింగ్ డైరెక్టర్స్ జయ,అంకిత జయ తల్లి అంకిత కూతురు. రోగుల ఆరోగ్య సంరక్షణ ను తమ చేతుల్లోకి తీసుకునే రోబోలను సృష్టించారు. ఆరోగ్యానికే కాదు పిల్లల చదువులకు అవసరమైన రోబోటెక్ టెక్నాలజీ పోగ్రామ్ రూపొందిస్తున్నారు. ఆసుపత్రిలో నర్స్ లాగా సేవలందించే రోబో రూపకల్పన చేశారు. ఈ ఇద్దరిని ఐక్యరాజ్యసమితి యు.ఎస్ ఉమెన్ ఆసియా-పసిఫిక్ సంస్థ ప్రామిసింగ్ సొల్యూషన్స్ విజేతలుగా గుర్తించింది. జయ పరాశర్, అంకిత పరాశర్. కోవిడ్ సమయంలో అవసరమైన ఆవిష్కరణలు చేశారు.

శివి కపిల్

ఏంపథీ డిజైన్ లాబ్స్ సి.ఇ.ఒ శివి కపిల్ బెంగుళూరు లో ఉన్న ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణ రంగానికి అవసరమైన పరిష్కారాలు అందిస్తుంది.కరోనా సమయంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవటానికి అవసరమైన వేరబుల్ మోనిటరింగ్ డిజైన్ క్రియ ను కనిపెట్టింది ఏంపథీ సంస్థ డిజైన్ క్రియ వెనుక స్ఫూర్తి ప్రేరణ శివి కపిల్ నే. కోవిడ్ తన విశ్వరూపం చూపిస్తున్నప్పుడు. కరోనా వల్ల మాకేమైనా అవుతుందో మీరేమైనా మాకు సహాయపడగలరా అని గర్భిణీల […]

వసంతి పళనివేల్

సెరాజెన్ బయోథెరపీటిక్స్ కో ఫౌండర్,సి.ఇ. వసంతి పళనివేల్.ఈమె నేతృత్వంలో సెరాజెన్ వైద్య పరిశోధనా సంస్థ శ్వాసకోశాల అస్వస్థతకు ప్లాస్మా చికిత్సను కనిపెట్టింది మహిళల్లో సంతాన సాఫల్యత పై శాస్త్ర అధ్యయనాలు జరిపే సెరాజెన్ కరోనా చికిత్సలో వినూత్న వైద్య పరిష్కారాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మంచి ఫలితాలు సాధించింది. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఎంపిక చేసిన శక్తివంతమైన మహిళల లో ఒకరుగా ఉన్నారు వసంతి.

నీకు నేను తోడుంటా !  

31 సంవత్సరాల లూసియానా రెబెల్లో గర్భాశయ కాన్సర్ తో బాధ పడుతోంది.ఇందుకు గానూ కీమో థెరపీ  తీసుకొంటుంది. ఆ సందర్బంగా తల నున్నగా షేవ్ చేయాల్సి ఉంది. లుథియానా తల్లి కూతురికి షేవ్ చేస్తూ తన తలను కూడా షేవ్ చేసుకోవటం మొదలు పెట్టింది. తల్లి భావోద్వేగ నిర్ణయంతో కూతురు షాక్ తో కనీళ్ళతో చూస్తూ ఉండి పోయింది. కనీళ్ళతో ఉన్న కూతురితో నువు ఒంటరి దానివి కాదు నేను నీకు తోడుగా ఉన్నాను. మన మనిద్దరం […]

అమేయకు పురస్కారం

విశాఖ పట్టణానికి చెందిన అమేయ లగుడు ప్రధాన మంత్రి బాల పురస్కార్‌ అందుకొన్నాది. ఆరేళ్ళ వయస్సులో విశాఖ పట్నం కళా భారతి ఆడిటోరియంలో రెండు గంటల నలభై ఐదు నిముషాల పాటు నిర్విరామంగా నృత్య ప్రదర్శన ఇచ్చింది అమేయ. ఈ ప్రదర్శనతో ఒకేసారి తొమ్మిది రికార్డులు నమోదయ్యాయి. ఇందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా ఉంది. అమేయ ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇప్పటి వరకు దేశ విదేశాల్లో వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది.

ప్రెసిడెంట్ ఆనంద వల్లి

స్వీపర్ ఆనంద వల్లి కేరళ లోని కొల్లం జిల్లా,పఠనాపురం పంచాయతీ ప్రెసిడెంట్ గా పాలన ఇవ్వబోతోంది. పఠనాపురం పంచాయతీ S.C, S.T, మహిళలకు కేటాయించిన సీట్లు మొత్తం 13 వార్డలున్నాయి. వాటిలో తలవూరు నుంచి మహిళా రిజర్వేషన్ అభ్యర్థిగా కాక, S.C, S.T జనరల్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఆనంద వల్లి. మెజారిటీ సీట్లున్న పార్టీలోని వార్డు మెంబర్ గా ఆనంద వల్లి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు. తాత్కాలిక స్వీపర్ గా పదేళ్లు చీపురు పట్టి […]

ట్రాన్స్ న్యూస్

ప్రియా బాబు ట్రాన్స్ ఉమెన్ యాక్టివిస్ట్ కౌన్సిలర్ అలాగే ట్రాన్స్ న్యూస్ అన్న పత్రిక ఎడిటర్ కూడా ఆరేళ్ల క్రితం ప్రియా ముగ్గురు స్నేహితులతో మధురైలో ట్రాన్స్‌ జెండర్‌ రిసోర్స్ సెంటర్ ప్రారంభించారు.గత నవంబర్ 1వ తేదీ నుంచి ట్రాన్స్ న్యూస్ ఆన్ లైన్ పత్రిక కూడా వెలువడింది.ఇప్పటి వరకూ నాలుగు సంచికలు వచ్చాయి .పత్రిక నడిపేందుకు కావలసిన ఫండింగ్‌ను ఇచ్చేందుకు ‘హై–టెక్‌ అరై’ అనే ఆయిల్‌ సీల్‌ను ఉత్పత్తి సంస్థ ఇస్తోంది. త్వరలోనే హిందీ, మరాఠీ, […]

జయతీ ఘోష్

ఐక్యరాజ్య సమితి హై లెవల్‌ అడ్వైజరీ బోర్డ్‌ టీమ్ లో భారతదేశ ఆర్ధిక వేత్త జయతీ ఘోష్ కు స్థానం లభించింది.  జె.ఎన్‌. టియు లో చదివి అక్కడే పాఠాలు చెప్పారు జయతీ. ఎకనమిక్స్‌లో ఎం.ఎ., ఎంఫిల్‌ ఆమె. పిహెచ్‌.డిని ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చేశారు. ప్రస్తుతం ఆమ్‌హర్ట్స్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌’లో ఎకమిక్స్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు జయతి. ఇప్పుడు యు.ఎన్‌. హై–లెవల్‌ అడ్వయిజరీ బోర్డ్ సభ్యులుగా ఎంపికయ్యారు.

ప్రతి నాయకుల పాత్రలే వస్తాయి

ఆర్షియా తను విట్ల యక్షగానాన్ని సాధన చేసింది. ముస్లిం మతానికి చెందిన మహిళగా యక్షగానం నేర్చుకునేందుకు ప్రదర్శించేందుకు వీలు లేదని అన్నారు పెద్దలు. కానీ ఆర్షియా తన పదవ ఏటనే యక్షగానం పై ప్రేమలో పడ్డారు పట్టుబట్టి నేర్చుకున్నది. ఆమె మొదటి నుంచి ప్రతి నాయకుల పాత్రలే పోషిస్తూ వస్తోంది. నిషంబసుర రక్త బీజసుర వంటి పాత్రలు ఎన్నో చేశాను వాటితోపాటు శ్రీనివాస కళ్యాణం సుదర్శనోపాక్యానా శాంభవీ విజయం దేవతల పాత్రలు దర్శించాను ఎక్కువగా రాక్షసుల పాత్రలే నాకు […]