Sunday, 26 Jul, 2026

అభిరుచే వ్యాపారం

క్రిమికా గ్రూప్స్ అండ్ కంపెనీస్, అండ్ మిసెస్ బెక్టర్ ఫుడ్ స్పెషాలిటీస్ అధినేత రజనీ బెక్టర్ లూధియానా కు చెందిన వ్యాపారవేత్త వంటలపైన ఇష్టంతో క్రీమికా ఐస్ క్రీమ్స్ తో వ్యాపారం ప్రారంభించారు. మెక్ డోనాల్డ్ ఫుడ్ చైన్ కు కావలసిన బన్ ల తయారీ కాంట్రాక్ట్ ఆమెదే ఏడు వేల కోట్ల టర్నోవర్ తో నడిచే ఆమె ఫుడ్ ఇండస్ట్రీ కి అంతులేనన్ని ప్రశంసలు దక్కాయి. 1990 నుంచి విజయ పథంలో సాగుతున్న ఆమెను ప్రభుత్వం […]

అమ్మే మోడల్

రమణి పీతాంబరన్ తన 68 వ ఏట మోడలింగ్ లో అడుగు పెట్టారు. పెంపుడు కొడుకు రాజీవ్ ఫ్యాషన్ డిజైనర్. అతను డిజైన్ చేసిన చీరలకు తల్లిని మోడల్ గా చేసుకున్నాడు. ఆమెను దృష్టిలో పెట్టుకొని ఈ రాజీవ్ డిజైన్ చేసిన చీరలు పాపులర్ అయ్యాయి.ముఖ్యంగా రమణి  పీతాంబరన్ మోడల్ గా ఇంకా ఎక్కువ పాపులారిటీ పొందారు. ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె సెలబ్రిటీ. భూతకాలమ్, ట్రాన్స్ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. దేనికైనా […]

అందాల డిజిటల్ సుందరి

శతావరి ని డిజిటల్ మీడియా మేధావి అంటారు రాహుల్ చౌదరి సృష్టించిన జరా శతవరి కృత్రిమ మేధస్సు తో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 2023 నుంచి సి ఎం హెచ్ బయో కేర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా 8000 నుంచి ఫాలోవర్స్ తో తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది. హార్మోన్ సమస్యల నుంచి కుంగుబాటు వరకు ఎన్నో అంశాలపై మహిళలకు అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం మిస్ ఎ ఐ […]

ముత్యాల జాకెట్లు

ఏదైనా వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించాలి అంటే ముత్యాల ఎంబ్రాయిడరీ జాకెట్లు ఎంచుకోండి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. కుందన్లు, అద్దాలు, జర్దోసి అల్లికలు కాసుల బిళ్ళలు నగల నగిషీలతో ఎంబ్రాయిడరీ బ్లౌజులు కు బ్లవుజు చక్కగా ముస్తాబయింది ఈ పెరల్ ఎంబ్రాయిడరీ బ్లవుజులు రెడీమేడ్ గా కూడా దొరుకుతున్నాయి. రకరకాల ఆకారాల్లో ముత్యాలు ఎంచుకొని చక్కని ఎంబ్రాయిడరీ పనితో జాకెట్లు నయా ట్రెండ్.

సర్పంచ్ నుంచి కేంద్ర మంత్రి

37 సంవత్సరాల వయసులో భర్తను పోగొట్టుకుని సింగిల్ పేరెంట్ గా ఉంటూ సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగింది మహారాష్ట్ర ఎం పి రక్షా ఖడ్సే. మహారాష్ట్ర లోని నాసిక్ లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న రక్షా ఖడ్సే రాజకీయ కుటుంబం లో నిఖిల్ రక్షా  ను పెళ్లాడింది. 2013 శాసనసభ ఎన్నికల్లో 500 కోట్ల తేడా తో ఓడిపోయినందుకు నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నారు. మామగారైన అయిన ఏక్ నాథ్ ఖడ్సే ప్రోత్సాహంతో రక్షా […]

లారీ లో దేశ యాత్ర

కేరళలోని ఎట్టుమనూర్ కు చెందిన జెలజా రతీష్ 2018 లో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. లారీ డ్రైవింగ్ తో కేరళ నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేసిన జెలజా మహారాష్ట్ర నేపాల్ వరకు వెళ్ళింది. తనతో పాటు వంట సామాగ్రి కూడా తీసుకుపోయిన జలజా చేసే వంటల వీడియోలు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు చూస్తుంటారు. ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

75 ఏళ్లకు నటిగా గుర్తింపు

పల్లెటూరి అమ్మ గా నటించిన 75 ఏళ్ల వయసులో దేశం మొత్తానికి అభిమాన నది అయింది అభా శర్మ. తండ్రి పోయాక తల్లిని చూసుకునే బాధ్యత తీసుకొని అభా వివాహం చేసుకోలేదు.35 ఏళ్లకే ఆమెకు అనారోగ్యం తో పళ్ళు ఊడిపోయాయి శరీర అవయవాలు కంపించే వ్యాధి వచ్చింది. అయినా అభా నాటకాల్లో నటిస్తూనే ఉంది. అమెజాన్ వెబ్ సిరీస్ పంచాయిత్ సీరియల్ లో పల్లెటూరి ముసలమ్మ గా నటించి అందరి అభిమానం సంపాదించింది అభా శర్మ.చిన్నతనం నుంచి […]

ఎవరెస్ట్ నా కల

నేపాల్ లో వృత్తి రీత్యా ఫోటో జర్నలిస్ట్ అయినా పూర్ణిమ శ్రేష్ఠ.13 రోజుల్లో మూడు సార్లు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ప్రపంచంలోనే మొదటి మహిళగా రికార్డ్ సాధించింది. 33 ఏళ్ల పూర్ణిమ 2018 లో పర్వతారోహణ మొదలు పెట్టింది. 2022 లో కాంచన గంగ మకాలు ను అధిరోహించింది.ఇకపై తాను మౌంటె నియర్ గా గైడ్ గా పనిచేయాలనుకొంటోంది పూర్ణిమ.వృత్తి రీత్యా ఎవరెస్ట్ మారథాన్ కవర్ చేసే   అసైన్మెంట్ సమయంలో పర్వతారోహణ పరిచయం అయ్యి తానే […]

ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం

‘గో డూ గుడ్‌’ స్టార్టప్‌ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్‌ మెటీరియల్ తయారు చేస్తుంది ఖుష్బూ గాంధీ ముంబైలో పుట్టి పెరిగిన ఖుష్బూ నిఫ్ట్‌లో మెటీరియల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సు చేసింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా చేస్తున్న ఈ వ్యాపారంలో ఇప్పటికి వరకు, ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలతో సింగిల్ యూజ్ ప్లేట్లు తయారు చేశారు. సి వీడ్ (సముద్రపు నాచు), తో ప్రింటింగ్ కోసం ఉపయోగపడే ఇంక్ తయారు చేశారు. నా ప్రయోగాలు నాకు లాభం […]

మహిళా చైతన్యం లక్ష్యం

ఐక్యరాజ్యసమితి గర్ల్ ఆఫ్ మూమెంట్ కు ఇండియా కంట్రీ మేనేజర్ అదితి అరోరా ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాల్లో ఎంతో మంది మహిళలను న్యాయ దారులుగా తీర్చి దిద్దడం లో కీలకపాత్ర పోషించింది.ఈ గర్ల్ ఆఫ్ ఈ సంస్థ ద్వారా అదితి మహిళల మానసిక ఆరోగ్యం దగ్గర నుంచి ఉపాధి అవకాశాల వరకు ఎన్నో అంశాల పైన పనిచేస్తుంది. స్టోరీ టెల్లింగ్ లో శిక్షణ ఇస్తుంది. పీరియడ్ పావర్టీ ని దృష్టిలో ఉంచుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. […]

ఆర్థిక సలహాదారు

ఫిన్ ఫ్లూయన్సర్ గా (ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూయన్సర్ గా) సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సాక్షి జైన్ కు జార్ఖండ్ రాష్ట్రం రాంచి కి చెందిన సాక్షి సి.ఎ చదివింది. మహిళల్లో ఆర్థికాంశాల పట్ల గల సందేహాలు తీర్చగలిగితే వాళ్ళు చక్కని ఆర్థిక వేత్తలవుతారు అని ఊహించింది సాక్షి ఇన్‌స్టా లో ఫినాన్స్ గురించిన పాఠాలు చెప్పటం మొదలు పెట్టింది.ఆమె టార్గెట్ స్కూల్ ఫైనల్ చదివిన మహిళలు. కానీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు కూడా సాక్షిని […]

జీవితం నేర్పిన పాఠాలు

‘గురు’ సినిమా నటి రితికా సింగ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కిక్ బాక్సర్ కూడా. పూర్తి పేరు రితికా మోహన్ సింగ్. ముంబైలో పుట్టి పెరిగిన రితికా దక్షిణాది సినిమా అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు తీసుకుంది. మూడేళ్ల వయసు లో కరాటే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన రితికా కుటుంబంలో అందరూ బాక్సింగ్ ఫీల్డ్ కు చెందిన వారే.సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నా కరాటే మరచిపోదు అలాగే మోటివేషనల్ స్పీకర్ కూడా.ఆమె జీవితానుభవాలే […]

కలంకారి పట్టు

కలంకారి అతి ప్రాచీనమైన సాంప్రదాయ కళ క్రీస్తు శకం 18వ శతాబ్దం నుంచే బ్లాక్ ప్రింటింగ్ విధానం మొదలైంది.ఇతిహాస గాధలు, పూలు, తీగలు సహజ రంగులనే వినియోగిస్తూ చేసే కలంకారి అద్దకం శ్రీ కాళహస్తి మచిలీపట్నం కేంద్రంగా దేశ విదేశాల్లో ప్రఖ్యాతి చెందింది. చరిత్రకారులు చెబుతున్నట్లుగా మూడు వేల ఏళ్ల క్రిందట మన నేలపైన ఉన్న కలంకారి కళ లో ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు రంగులో డిజైన్లు వేసేవారు. ప్రస్తుతం పట్టు చీరల పైన కూడా […]

అందాల సంగనేరి కాటన్స్

శరీరానికి హాయి నిచ్చే మెత్తని స్టయిలిష్ చీర కట్టుకోవాలి అనిపిస్తే సంగనేరి ప్రింట్స్ వైపు చూడాలి.జైపూర్ కి ఆరు కిలోమీటర్ల దూరం లో ఉన్న సంగనేర్ గ్రామం లో తయారయ్యే బ్లాక్ ప్రింట్ చీరె ఇది. గత 500 ఏళ్లుగా ప్రాచుర్యంలో ఉంది. చెక్క పైన చక్కని డిజైన్స్ వేస్తారు ఈ ప్రత్యేక కళానైపుణ్యానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా లభించింది. కూరగాయలు,పండ్ల నుంచి తయారు చేసే రంగులతో అచ్చులు వేసే తెల్లని చీరలు ఎంతో స్పెషల్.

ప్రాణదాత

కమల్ రణదివె భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త లుకేమియా, రొమ్ము, గొంతు, క్యాన్సర్ లకు కారణాలను గుర్తించడం లో కీలక పాత్ర పోషించిన బయో మెడికల్ పరిశోధకురాలు. ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు కుష్టు వ్యాధికి టీకా తయారు చేయడం లో విశిష్ట పాత్ర పోషించారు.1917 నవంబర్ 8 న మహారాష్ట్రలోని పూణే లో జన్మించిన కమల్ రణదివె బ్రిటన్ యూనివర్సిటీ లో చదువుకున్నారు.1982 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ గౌరవ పురస్కారం […]

తొలి మహిళా పైలట్

భారత నౌకాదళం లో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు అనామిక బి.రాజీవ్ ఐ ఎన్ ఎస్ రాజాలీ హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందిన అనామిక అరక్కోణం లోని నౌకాదళ ఎయిర్ స్టేషన్ లో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అని అందుకున్నారు అనామిక. సి కింగ్స్, ఏ ఎల్ హెచ్ ధ్రవ్స్ చేతక్స్,వంటి హెలికాప్టర్ లు నడిపేందుకు అర్హత సాధించిన మొదటి అమ్మాయి. […]

కాదంబినీ గంగూలీ

దేశంలో రెండవ మహిళ వైద్యురాలిగా కాదంబినీ గంగూలీ తన పేరు నమోదు చేసుకున్నారు దక్షిణాసియా నుంచి పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి మహిళ వైద్యురాలు. 1886లో కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేశారు కాదంబినీ.1889 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు మహిళల్లో కాదంబినీ ఒకరు.వైద్య చికిత్స లో నూతన ఆవిష్కరణలు చేశారు.తూర్పు భారతదేశం లోని బొగ్గు గనుల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమం కోసం విశేష […]

మిల్లెట్స్ బేబీ ఫుడ్

ఇంజనీరింగ్ చదివి భారత సైన్యం కోసం రాకెట్స్ డిజైన్ చేసిన జ్యోతి శ్రీ వాస్తవ్ పిల్లల పోషకాహారం తయారు చేసే కంపెనీ ప్రారంభించారు.  ‘లిటిల్ చెర్రీ ఫుడ్స్’ పేరుతో నడుస్తున్న ఈ కంపెనీ ద్వారా మిల్లెట్స్ తో చేసే బేబీ ఫుడ్ అమ్ముతారు. ఆయుర్వేదం లో పేర్కొన్న ఎన్నో మూలికలతో పిల్లలకు మేలు చేసే ఈ ఆహారం తయారు చేస్తారు. చిరుధాన్యాల తో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తల్లిపాలలోని గుణాలు కూడా వీటిలో ఉంటాయని పిల్లల ఎదుగుదలకు […]

నీరా పై పరిశోధన

భారతదేశ శాస్త్రీయ రంగాలలో బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో పి హెచ్ డి పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త కమలా సోహాని. 1912 లో జన్మించిన కమల కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. రాయల్ ఇన్స్టిట్యూట్ బయో కెమిస్ట్రీ విభాగానికి ప్రొఫెసర్. తాజా తాటికల్లు పై పరిశోధనలు చేశారు. పోషకాహార లోపం తో బాధపడే పిల్లలకు నీరా ఇవ్వచ్చునని ఆమె పరిశోధనలు చేసి తేల్చారు. నీరా పై ఆమె చేసిన పరిశోధనలకు రాష్ట్రపతి అవార్డు లభించింది. శాస్త్ర సాంకేతిక […]

అనీ ఫ్రాంక్ డైరీ

14 సంవత్సరాల యుద్ధ బాలిక ANNE FRANK రాసిన The Diary of a young girl పుస్తకం ప్రపంచంలోని అన్ని భాషల్లోకి తర్జుమా అయింది 1941-45 మధ్య 60 లక్షల మంది యూదులను యువకులను నిర్మూలించాడు హిట్లర్ ఒక యూదు కుటుంబం తన స్నేహితుల ఇంటి  రహస్య గదిలో రెండేళ్ల 35 రోజులు గడిపాక, పట్టుబడి కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో మరణిస్తారు. ఆ కుటుంబంలోని బాలికే అన్నా.రెండేళ్ల కాలంలో అన్నా రాసిన డైరీ ఈ పుస్తకం […]