దివ్యాంగులకు ఆసరా

దివ్యాంగులకు ఆసరా

దివ్యాంగులకు ఆసరా

సుధీక్షన్ ఫౌండేషన్ ద్వారా రహదారి భద్రతపైన అవగాహన కల్పిస్తారు విజయవాడకు చెందిన చిగురు పాటి విమల ఆమె ఇరవై ఏళ్ళ కొడుకు సుదీక్షన్ 2006 లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన కొడుకు పరిస్థితి ఏ పిల్లవాడికి రాకూడదని రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకొన్నారు విమల. అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన పేదలకు కుత్రిమ అవయవాలు అమర్చే ఏర్పాటు చేస్తారు. రెండు తెలుగు రాష్టాలకు చెందిన ఐదు వేల మందికి కుత్రిమ అవయవాలు అమర్చారు. ఈ ఫౌండేషన్ ద్వారా . ముఖ్యంగా దివ్యాంగుల కోసం నా సమయం ఖర్చు చేస్తాను అంటారు విమల.