Thursday, 20 Aug, 2026
ఇటలీలో ప్రజలు సన్నగా నాజూగ్గా ఉంటారట. దానికి కారణం వాళ్ళు ఆహారం తీసుకునే పద్దతి అంటారు ఎక్స్ పర్ట్స్. మనం తినే ఆహారంలో రకరకాల కూరలు, అన్నం, పప్పు, పులుసు ఇలా ఉంటాయి. వీటిని అన్నంతోనో, ఇంకో రావ్వతోనో కలుపుకు తినటాం. నంజుకోవడం అనేది మన అలవాటు. కానీ ఇటలీ వాళ్ళు అలా కాదు. ఆకు ఐటమ్స్ వుంటే అన్నింటినీ విడివిడిగానే తింటారట. అలా ఒకసారి ఒక ఐటెం తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. పరిమితంగా తిని ఆపేస్తారు. మన దేశంలో రకరకాల రుచులు కలిపి అవసరానికి మించి తినటం కనుక పొట్ట పెరుగుతుంది. అలాగే వాళ్ళకున్న మంచి అలవాటు కండరాల్లను చెక్కని రూపంలో ఉంచుకునేందుకు కండరాల్ల నొప్పులు రానివ్వరు. ఆలివ్ నూనె, కర్పూరం కలిపి శరీరం పై మర్దనా చేసుకోవడం . ఈ మర్దనా వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యం, కండరాల్ల రూపం బావుంటాయి. అలసట లేని వ్యాయామం ఇది.

భోజన వేళలు మారిస్తే చాలు

ఉపవాసం చేయడం కంటే భోజన వేళలు మార్చుకుంటే ప్రయోజనం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఫాస్టింగ్ వైపు ఆలోచిస్తారు. కాని అలా పొట్ట మార్చడం ప్రమాదం అంటున్నారు యూనివర్సీటి ఆఫ్ సర్రే కి చెందిన నిపుణులు. ఉదయం తినే అల్పాహారం 8 ,9 గంటల మధ్య తినమంటున్నారు. లంచ్ టైం మార్చకుండా రాత్రి భోజనాన్ని 5,6 గంటలకే ముగిస్తే మంచిది అంటున్నారు. ఇలా చేస్తే ఫాస్టింగ్ చేయకుండా బరువు తగ్గడం ఈజీ అంటున్నారు. సూర్య అస్తమయం తర్వాత జీవక్రియ మందగిస్తుంది. మళ్ళి ఉదయం వరకు అంటే పన్నెండు నుంచి పదిహేను గంటల పాటు ఏమి తినరు కనుక అది ఉపవాసంతో సమానమని పేరుకున్న కొవ్వులు కరుగుతాయినెమ్మదిగా శరీరం బరువు తగ్గుతుందంటున్నారు.

Leave a Reply