• అందం కోసం ఇంట్లో అలంకరించుకునే గాజు బొమ్మల్లాగే ఆహారం అందంగా కనిపించడం కోసం ప్రత్యేక బొమ్మలోస్తున్నాయి. షుగర్ షో పీసెస్. అచ్చంగా అందమైన కళాకృతులు ల్లాంటి పంచదార బొమ్మలు చూస్తుంటే అందమైన గాజు బొమ్మని టాబుల్ పైన పెట్టి నట్లు కనిపిస్తాయి. పంచదార నీరు పోసి బాగా వేడి చేసి సిలికాన్ రబ్బర్ మ్యాట్ పైన పోసి కావాలనుకున్న రంగు కలిపి గాజు వంటి పదార్ధం తాయారు అవుతుంది. దీన్ని వుల్డ్ షుగర్ అంటారు. బొమ్మలు చేసే క్లే లాంటిది ఇప్పుడు ఇది కాస్త వేడిగా ఉండగానే దేనితో నెమళ్ళు, పక్షులు, పువ్వులు, జలపాతాలు అందమైన ప్రక్రుతి మొత్తం ఈ సాగరాన్నే ఈ ముద్ద లో నుంచి రూపం పోసుకుంటాయి. ఈ బొమ్మలు చూసేందుకు కొన్ని అచ్చుల సాయం లేదా గాలి వూరే పరికరం ద్వారా బోలుగా ఉచ్చేట్టు చేస్తూ ఈ చూడ చెక్కని బొమ్మలు చేస్తారు. ఎండ తడి తగలక పొతే ఈ పంచదార బొమ్మలు ఏడాది దాకా చెక్కగా ఉంటాయి. ఈ షుగర్ శ్వ పిసెస్ కోసం ఇమేజస్ ఎన్నో వున్నాయి. చూస్తేనే కళ్ళు చేడురుతాయి.

    కళ్ళను కట్టేసే పంచదార బొమ్మలు

    అందం కోసం ఇంట్లో అలంకరించుకునే గాజు బొమ్మల్లాగే ఆహారం అందంగా కనిపించడం కోసం ప్రత్యేక బొమ్మలోస్తున్నాయి. షుగర్ షో పీసెస్. అచ్చంగా అందమైన కళాకృతులు ల్లాంటి పంచదార…

  • మైక్రో వేవ్ లో పదార్ధాల తయారీ మంచిదా కాదా అన్న సందేహాలు, చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పోషకాలు పోతాయని, అంత వేడిలో సహజమైన రుచి పోతుందని చాలామంది అంటున్నారు కానీ ఇది నిజాం కాదు ఏ రకం వంట పద్దతిలో అయినా కొన్ని పోషకాలు, విటమిన్లు పోవడం సహజం. మిగతా వాటి తో పోలిస్తే మైక్రో వేవ్ లో తక్కువ పోషకాలు తక్కువ పోతాయి. పోషకాలు పోవడం అనేది ఉష్ణోగ్రత వంటి సమయం పై ఆధార పడి వుంటుంది. మైక్రో వేవ్ లో విటమిన్లు వేడి తక్కువ సమయంలో మాత్రమే ఎక్స్ పోజ్ ఆవుతాయి. ఎక్కువ భాగం హీట్ సెన్సిటివ్ న్యూట్రిషన్లే నీటిలో కరిగే విటమైన్లు ఫాలిక్ యాసిడ్, బి,సి విటమిన్లు వంటివే కనుక పాలకూర(ఫోలెట్), బెండకాయ(విటమిన్-సి), మాంసం(విటమిన్-బి) ఇవి అతిగా ఉడికిస్తే విటమిన్లు పోతాయి. అందుకే మైక్రో వేవ్ లో అతి తక్కువ సమయంలో కావాల్సినంత వేడెక్కుతాయి కనుక సందేహం లేకుండా ఉపయోగించ వచ్చు.

    మైక్రో వేవ్ మంచిదే

    మైక్రో వేవ్ లో పదార్ధాల తయారీ మంచిదా కాదా అన్న సందేహాలు, చర్చలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. పోషకాలు పోతాయని, అంత వేడిలో సహజమైన రుచి పోతుందని…

  • దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన దేశాన్ని ఎంతో ప్రేమించారు. భారత భాగ్య విధాత అనే శీర్షిక 1911 లో రాసిన ఈ గీతం దేశ భవిష్యత్తును ఒక రధసారధి లా ఎలా ముందుకు నడిపించాలో చెపుతుంది. జనగణమన ఇక నుంచి మన కొత్త గణ తంత్ర రాజ్యానికి జాతీయగీతమని దాన్ని అందరూ గౌరవించాలని 1950 జనవరి 29 న రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఓ ప్రకటన చేసారు. ఆ ప్రకటనే ఒక శాసనంగా ఇప్పటివరకు అమలు జరుగుతూ వుంది. జాతీయ గీతం జాతీయ పతాకం వల్ల గౌరవం ప్రేమాభిమానాలు ప్రదర్శించటం అంటే మాతృ భూమిని గౌరవించుకోవటమే. దీన్ని గౌరవించి ఆదరించటం ప్రజల్లో సహజ సిద్ధంగా రావాలని సుప్రీమ్ కోర్టు తన ఉత్పాదుల్లో వ్యాఖ్యానించింది. ఇప్పుడు సినిమా హాళ్లలో వేస్తున్నారు. తప్పనిసరిగా లేచినిలబడి గౌరవించండి.

    లేచి నిలబడి గౌరవించండి

    దేశంలోని సినిమా హాళ్లలో తప్పనిసరిగా జాతీయ గీతాన్ని వినిపించాలని ఇటీవల సుప్రీం కోర్టు ఉత్పాదులు జారీ చేసింది. ఈ గీతాన్ని రచించిన రవీంద్ర నాథ్ ఠాగూర్ మన…

  • ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్ సొయా బీన్స్ సొయా మిల్క్ సొయా యోగర్ట్ సొయా ఇసోలెన్స్ సొయా లెసిటిన్స్ మన మార్కెట్ నింపేస్తున్నాయి. శాఖాహారులకు అవసరం అయ్యే ప్రోటీన్లు అందేది సొయా ద్వారానే సొయా అనేది మాంసానికి ప్రత్యామ్నాయం అన్నది ప్రచార అంశం . సొయా ఎడమేమ్ అనేది ఉడికించి ఉప్పుతో కలిపి చిరుతిండిగా తినచ్చు. సోయాను సూప్ లు సలాడ్స్ లో కలుపుకుని తినచ్చు. సొయా సూప్ మంచిదే. ఆవుపాలు బదులు సొయా పాలు వాడటం మొదలు పెట్టచ్చు. సోయా ఉత్పత్తులు ఉదయపు అల్పాహారం మధ్యాహ్నం చిరుతిండిగా బేకింగ్ చేసిన వంటకాల్లో శాండ్ విచెస్ కాస్ రోల్స్ స్టెరిఫీడ్ ద్వారా సోయాకి ఎదో రకంగా తీసుకుంటే ఈ పోషక విలువల్ని సోయా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

    ప్రోటీన్ల మయం సోయా

    ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్…

  • సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి దాకా తగ్గిపోతుంది. బద్ధకం వదిలించుకోవటం కోసం సూర్యకిరణాలు తగిలేలా గడపటమే పరిష్కారం. మంచి పోషకాలున్న టిఫిన్ తీసుకుంటే శరీరంలో శక్తి నిల్వలు పెరుగుతాయి. తప్పనిసరిగా సింపుల్ ఏరోబిక్స్. ధ్యానం ప్రాణాయామం రిలాక్సేషన్ పద్ధతులు ఉపకరిస్తాయి. శరీరంలో తగినంత నీరు లేకపోతే కూడా పని సామర్ధ్యం తగ్గిపోతుంది. అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గి మెదడు పని విధానం నెమ్మదిస్తుంది. దప్పిక అయ్యేవరకు ఆగకుండా నీళ్లు తాగాలి. కార్బోహైడ్రాట్స్ చక్కర తక్కువగా వుండే పదర్ధాలు తినాలి. దీనివల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. చల్ల గాలి వస్తున్నా కిటికీలు తీసేవుంచాలి. పడుకునేముందర వేడినీళ్లు స్నానం వల్ల కొత్త ఉత్తేజం కలుగుతుంది. చక్కని నిద్రకోసం ఉపకరిస్తుంది. సీజన్ ఏదైనా వాతావరణం ఎలా వున్నా దేనినైనా హాయిగా ఎంజాయ్ చేయాలి.

    అలసటగా వుందా

    సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి…

  • సంక్రాంతి పండుగ మొదలైంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. దేవునికి సంబందించిన కార్యాలనే చేయాలనే ఓ నియమాన్ని చేస్తూ సూర్యుడు ధనరాశి లోకి ప్రేవేశించిన రోజుని నెల పెట్టడం అనే పేరు తో పిలిచారు పెద్దలు. ఈ నెల రోజులు నెల నిండగా తెల్లని ముగ్గులు శ్రీ హరిని కీర్తిస్తూ హరి దానుల దాకా, జంగమ దేవరల పలకరింపు కాలపు మార్పులను సూచిస్తూ వినోదాన్ని పంచే పిట్టల దోరలు బూడ బుక్కల పాటలు ఇవన్నీ సంక్రాంతి పర్వ దినాల్లో పల్లెటూరులో సందడి చేసేవి. కాలం మారి పోయి పట్టణాలకు తరలి వచ్చిన ఈ సంప్రదాయపు పండుగని జరుపుకుంటునే ఉన్నారు. చివరకు అమెరికాలో స్థిరపడిన ఆంధ్రులు కూడా ఈ పండుగని మరచిపోలేదు. అలాగే గోదాదేవి రచించిన ౩౦ పాశుణలనీ పాడుతూ ఈ నెల రోజులు పండుగ జరపడం ద్రవిడ దేశాల్లో ఆచారంగా వుంది.

    సంక్రాంతి వేడుక మొదలైంది

    సంక్రాంతి పండుగ మొదలైంది. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం. దేవునికి సంబందించిన కార్యాలనే చేయాలనే ఓ నియమాన్ని చేస్తూ సూర్యుడు ధనరాశి లోకి ప్రేవేశించిన రోజుని నెల పెట్టడం…

  • ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి సంతానం అమ్మయి ఐతే తర్వాత అబ్బాయి కావలనుకుంటారు. కాని అధి కుడా అమ్మాయి ఐతే నిర్ధక్షాణ్యంగా వద్దనుకుంటారు. దినిని ఉపాధి కొణం నుంచి విశ్లేషించారు. వ్యవసాయ రంగంలో పని చెసే మహిళలు ,ఉద్యోగినులు,గృహిణులు ఇలా మూడు కోణాలలో విశ్లేషిస్తే వ్యవసాయ రంగంలో మహిళలకు ఇద్దరు ఆడపిల్లలుంటే ముడో సంతానం అబ్బాయి కావలనుకుంటారు. గృహిణులైతే మొదటి సంతానం అమ్మయి ఐతే రెండవ సంతానం అమ్మాయి వద్దనుకుంటారు.ఉద్యోగినులు మాత్రం ఇద్దరు అమ్మయిలు ఐనా ఎలాంటి భారం లేకుండా కనిపెంచుకుంటున్నారు. చదువు,విషయపరిజ్నానం ఉంటాయి కనుక ఆడపిల్లలైన మగ పిల్లలైన పర్లేదు  అనుకుంటారు. గృహినులు మాత్రం రెండో సంతానం కుడా ఆడపిల్ల ఐతే మాత్రం వద్దనుకుంటారు. ఈ కారణం తోనే ఈ వర్గంలో ఆడపిల్లల కోరత ఏర్పడింది. ఎదో ఒక రంగంలో ఉపాధి లొ ఉన్న మిగిలిన్ వర్గాలలో ఈ పరిస్థితి లేదు.

    ఆర్ధిక పరిస్థితులే ఈ సమస్యలకు కారణం

    ఈది తప్పనుసరిగా అందరు తెలుసుకోవల్సిన వార్తా. ఒక మంచి రిపోర్ట్ కుడా.రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 2011 జనాభా లెక్కల ప్రకారం ఒక విశ్లేషణ చేశారు. మొదటి…

  • క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క మంచి లేస్ దొరికితే అదే పంచదార లేస్. ఎలా చేయాలో చుదాలనుకుంటే sugar lace అని యుట్యూబ్ వీడియో లో చూడొచ్చు. ఇది ఆషా మాషీగా వుండదు అందమైన ముగ్గులాగా, లేస్ డిజైన్ లాగా పల్చని పొరలాగా పంచదార తో తాయారు చేసిన షుగర్ లేస్ తినే పదార్ధం అలా వండేసి వెండి గిన్నె లో పోస్తే సరిపోదు. దానికో అందమైన డిజైనర్ అలంకరణ ఉంటేనే ఇంట్లో పిల్లలు అతిధులు ఆనందిస్తారు. పంచదార ఎండబెట్టిన తెల్ల గుడ్డు సోన, మొక్క జొన్న పిండి, డేక్ట్రిన్ మొదలైనవి కలిపి తాయారు చేసిన ముద్ద తో మోల్డ్ పైన ఇలా రాస్తే చాలు, ఐదే నిమిషాల్లో లేస్ మన చేతుల్లో వుంటుంది. ఈ లేస్ కి పిండి తాయారు చేసే మౌల్ద్ డిజైన్లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. ముగ్గులా ముద్దుగా వుండే వీటిని పువ్వుల ఆకారంలో మౌల్ద్ లో నుంచి తీసి వేడి కాఫీ లో వేసిచ్చినా అతిధులు ముగ్ధులైపోతారు.

    ముగ్గులా ముద్దుగా పంచదార లెస్ లు

    క్రిస్మాస్ కేక్స్ తాయారై పోతున్నాయి. ఇళ్ళల్లో కూడా మంచి రుచితో అందంగా తాయారు చేయడం చాలా మంది నేర్చుకున్నారు. మరి ఈ కేక్స్ అలంకరణ కోసం ఒక్క…

  • కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ దుంపలో ఎన్నో రకాలున్నాయి. మన దగ్గర తెలుపు లేదా లేత పసుపు రంగు గుజ్జు వున్న చిలకడ దుంపలుంటాయి. కానీ పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగు ఇలా ఎన్నో విభిన్నమైన రంగుల దుమ్పలున్నాయి. ఈ రంగుల దుంపలు మరింత తియ్యగా ఉంటాయి.చైనా, కొరియా వంటి దేశాల్లో ఈ దుంపలు కాల్చి లేదా బేక్ చేసి అమ్ముతారు. రక్తంలోని చెక్కని నిల్వల్ని నియంత్రించే గుణం గల చిలకడ దుంపలని, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ మధుమేహం రోగులకి మంచి ఆహారం అని సిఫార్సు చేసింది. పిండి పదార్ధాలు, పిచు, విటమిన్-ఎ,బి,సి,బి9, లు కాల్షియమ్ ఇవన్నీ కలిగి వున్న ఈ తియ్యని దుంప మంచిది ఆహారం. కాల్చి తిన్న, ఉడికించి తిన్న ఎంతో రుచి.

    పోషకాలతో నిండిన చిలకడ దుంప

    కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ…

  • ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం సమస్యలు చర్మం దెబ్బతినకుండా కాపాడుటుంది. దీన్ని ఒక్క సహజమైన మాయిశ్చురైజర్ గా కూడా వాడుతారు. ఇక దానిమ్మ పండు చెర్మంలో తేజస్సు నింపుతుంది. చర్మ రంద్రాల్ని శుబ్రం చేయడంతో పాటు ముడతలను పోగొడుతుంది. పైనాపిల్ ఇది విటమిన్-సి పుష్కలంగా వున్నా పండు. మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది. ఇక అరటిపండు లో వున్న పొటాషియం చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ఋతువులతోనే సంబంధం లేకుండా కూడా సహజంగా దొరికే ఏ పండైనా వదలకుండా తినేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

    చర్మ సంరక్షణ కోసం ఈ పండ్లు

    ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార…

  • ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని చెప్పుతుంటారు తల్లులు ఇది వరకోసారి సమంతా లి అనే మలేషియా కు చెందిన పిల్లల తల్లికి ఇదే ప్రాబ్లం వాళ్ళతో వేగ లేక వాళ్ళ బోజనాల ప్లేట్ లో అన్నం క్యారెట్, టొమాటో, ఆపిల్, వంటివి ఉపయోగించి ఎన్నో రకాల బొమ్మలు చేసి ఆ బొమ్మల గురించి కధలు చెప్పేదిట. పిల్లలు బొమ్మలు చూసి అమ్మా కదల మాయాజాలం లో పడి ప్లెటు ఖాలీ చేసేవారంట. ఇవన్నీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెడితే లక్ష మంది మెచ్చుకున్నారు. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళ కోసం fruit carving, vegetable carving స్టాక్ ఫొటోస్ చూసి ఆ కోర్సు నేర్చుకుని పిల్లల్ని మంచి ఫుడ్ తినేలా చేయొచ్చు. ఇంత అందమైన ఫుడ్ ఇంట్లో చూసి పిల్లలు పిజ్జాలు అడిగితె ఆప్పుడు చెప్పండి.

    అమ్మ చేతి బొమ్మలు

    ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని…

  • మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం శాతం, ఇష్టం ఇవన్నీ మన భాష లోనే తలిసిపోతాయి. మన మాటల్లో నిత్యం వండర్ ఫుల్, ఫ్రెండ్స్, బావున్నాం, బావున్నారా, సంతోషం, ఎంత చెక్కని పాట, ఎంత అందమైన ప్రకృతి వంటి భావజాలాలకు సంబందించిన మాతలుంటే మనం ఆశావాద దృక్పదంతో ఉన్నట్లు అర్ధం. అలా శాతంగా వుండే వారికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు పరిశోధకులు.

    శాంతంగా ఉంటేనే ఆరోగ్యం

    మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో…

  • టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు గణాంకాలు. ప్రపంచంలో నానారకాల టీ లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అస్సాం టీ , డార్జిలింగ్ టీ , నీలగిరి టీ లకు అద్భుతమైన గిరాకీ వుంది. ఇన్ని చెప్పుకున్నాక చక్కని టీ తాగాలి అనుకుంటే అన్ని సందర్భాలకు ఒక టీ పనికి రాదు అంటారు ఎక్సపర్ట్స్. శరీరంలో ఏమాత్రం చురుకుదనం లేకపోతే జీవన క్రియ వేగం పడిపోతే గ్రీన్ టీ తాగాలట. నిద్ర లేక శరీరం అలసట తో ఉంటే చామంతి పూలు వేసిన టీ తాగాలి. ఒత్తిడి కలిగించే ఆలోచనలు వదిలించుకోవాలిఅంటే నిమ్మ పరిమళపు లెమన్ టీ తాగాలి. కడుపులో వికారంపెడితే అల్లం టీ ఉబ్బరంగా ఉంటే పుదీనా ఆకుల టీ తాగాలి. అవన్నీ పక్కనపెట్టి మనకు అందుబాటులో వుండే ఎదో ఒక టీ తాగాలి ఏమంటారు?

    టీ లేనిదే వెరైటీ నే లేదు

    టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు…

  • రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట అటుంచి చివరకు ఉత్సాహాన్ని ఒత్తిడిని జయించే అవకాశాన్ని ఇచ్చే వ్యాయామం కూడా చేసేందుకు సమయం దొరకదు. స్త్రీలు వాయిదా వేయగలిగిన విషయం ఇదొక్కటే. అయితే పనులు చేస్తూనే వ్యాయామం చేయమంటున్నారు నిపుణులు. ఫోన్ లో నడుస్తూ మాట్లాడవచ్చు. ఎవరికైనా ఏదైనా చెప్పాల్సివస్తే నడిచివెళ్లి చెప్పచ్చు. పనిలో విరామం దొరికితే నాలుగు అడుగులు నడవచ్చు. కుర్చీలో కూర్చుని పాదాలను సవ్య అవసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పటం చేతుల్ని మూసి తెరవటం గుండ్రంగా తిప్పటం పైకెత్తటం మెట్లు దిగటం లిఫ్ట్ ఉపయోగం తగ్గించటం ఇంట్లో టీవీ చూస్తున్నపుడు శరీరాన్ని వీలైనంత వంచి పనిచేయించటం ఇలా యాక్టివ్ గా ఉండే పనులు ఎన్నో మనం కూడా కొత్త పరిస్థితులు కనిపెట్టచ్చు. అదే పనిగా కూర్చున్నా బరువై పోతాం కదా.

    పోనీ ఇలాంటి వ్యాయామం ట్రై చేస్తే

    రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట…

  • ఆడవాళ్లు ఎంత మాత్రం గ్రహించకుండా శ్రద్ధ తీసుకోకుండా తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆలోచించకుండా చాలా రుగ్మతలు కొనితెచ్చుకుంటారు. నీరసం అనిపిస్తుంది ఏదైనా పోషకాహారలోపం లేదా శారీరిక రుగ్మత అనుకోరు. ఉదయం నుంచి రెస్ట్ లేకపోవటం అనేసుకుంటారు. కానీ ఈ నీరసం డిప్రెషన్ వల్ల రావచ్చు. శరీర వ్యవస్థను కుంగదీసే దాన్ని గుర్తించరు. కీళ్ల నొప్పులు తలా నొప్పి నిద్ర తిండి ఎక్కువగా తినటం ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలు. సాధారణంగా నిద్ర సరిగా పోకపోయినా అదే డిప్రెషన్ కు దారి తీస్తుంది. ఉదయపు పనుల భారం అప్రమత్తంగా ఉండటం నిద్రమేళకువ రాదేమోనన్న భయం ఇవన్నీ కలిసి మాటమాటికి నిద్రా భంగం కలిగిస్తాయి. అలంటి రోజులు గడుపుతుంటే సరైన నిద్రపోక సరైన ఆహరం తీసుకోక ఆరోగ్యం పాడవుతుందని గ్రహించలేక నిజంగానే అనారోగ్యం కొనితెచ్చుకుంటారు, ఇలాంటి లక్షణాలు ఉంటే డిప్రెషన్ ప్రభావం వుండమేమో కానీ డాక్టర్ ని కన్సల్ట్ చేయమంటున్నారు పరిశోధకులు.

    డిప్రెషన్ వల్లే నీరసం రావచ్చు

    ఆడవాళ్లు ఎంత మాత్రం గ్రహించకుండా శ్రద్ధ తీసుకోకుండా తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆలోచించకుండా చాలా  రుగ్మతలు కొనితెచ్చుకుంటారు. నీరసం అనిపిస్తుంది ఏదైనా పోషకాహారలోపం లేదా శారీరిక…

  • వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. మరీ మంచాన పడితేనే డాక్టర్ మొహం చూసేది. చాలా చిన్ని చిట్కాలకు బోలెడన్ని అనారోగ్యాలు తలవంచేవి. బెల్లం అల్లంరసం కలిపితాగితే జాండీస్ తగ్గిపోతుంది. శొంఠి పొడి నీళ్లలో కలిపి నుదిటిపై పెడితే తలా నొప్పి తగ్గుతుంది. అల్లం నిమ్మరసం అజీర్తి కి మందు. అల్లం రసం తేనె ముక్కుదిబ్బడ ను తగ్గిస్తుంది. వెల్లులి రేకలు తేనె యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తీసుకుంటే బరువు పెరగటం జరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సాధారణ ఆరోగ్యం బావుంటుంది. తమలపాకులో రెండు మిరియాల గింజలు పెట్టి చుట్టి తినేస్తే ఏడ తెరిపి లేని దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. వేడి పాలలో పసుపు వేసి తాగితే నిద్ర పడుతుంది. దగ్గు కూడా తగ్గుతుంది. ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేని ఈ చిట్కాలు ప్రయోగించి చూడండి . ఫలితం వంద శాతం ఉంటుంది

    ప్రకృతి సహజమైన ఉపశమనం ఇవి

    వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్…

  • ఒక అపూర్వమైన అనుభవం స్త్రీకి గర్భవతి కావడం కవుల కల్పనల్లో, బొమ్మల్లో తల్లి గా వుండటాన్ని అద్భుతంగా వర్ణించారు కానీ నిజంగా కడుపులో బిడ్డను మోయడం అంత సులభం ఎవీ వుండదు గర్భం దాల్చాక ఎదుర్కొనే తోలి ఇబ్బంది వేవిళ్ళు. ఉదయం వేళ వికారంగా, నీరసం గా వుండటం, వాంతులు నోరు అరుచిగా వుండటం, అయితే ఈ మార్నింగ్ సిక్ నెస్ మంచిదే అంటున్నాయి పరిశోధనలు. ఆరోగ్యవంతమైన గర్భానికి ఇదో సూచన అని పరిశోధకుల అభిప్రాయం. ఇలా వేవిళ్ళు వుండని గర్భావతుల్లో గర్భ విచ్చిత్తి అవకాశాలు ఎన్నో వున్నాయి. కాబట్టి ఈ ఉదయపు వేల విసిగించే వికారం, వాంతులు గురించి చిరాకు పడకుండా పుట్టే బిడ్డ గురించి ఆలోచిస్తూ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం ఆలోచిస్తూ, కడుపులో పాపాయి తో కబుర్లు చెప్పండి అంటున్నారు పరిశోధకులు.

    మార్నింగ్ సిక్ నెస్ మంచిదే

    ఒక అపూర్వమైన అనుభవం స్త్రీకి గర్భవతి కావడం కవుల కల్పనల్లో, బొమ్మల్లో తల్లి గా వుండటాన్ని అద్భుతంగా వర్ణించారు కానీ నిజంగా కడుపులో బిడ్డను మోయడం అంత…

  • ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు కలిపి ఎండుఫలాలు వాల్నట్స్ బాదం పలుకులు కలిపి తింటే రోజంతా ఉత్సాహమే. ఓట్స్ ఎంతో మంచివి. బరువు తగ్గటమే కాదు ఆరోగ్యానికీ మంచివే. వెన్న లేని పాలతో తింటే కేలరీలు తగ్గుతాయి. అరటి పండ్లు ముక్కలు. ఎండు ద్రాక్ష పండ్లు నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు తింటే బలానికి బలం. ఆరోగ్యం రాగి జావ ఎంతో మంచిది. ఇనుము కాల్షియం ఎక్కువ. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తహీనత దూరం అవుతుంది. బెల్లం యాలకులు వెన్న లేని పాలు బాగా మగ్గిన పండ్లు కలిపి తీసుకుంటూ త్వరగా ఆకలివేయకుండా పైగా ఎంతో బలం కూడా.

    బరువు తగ్గించి శక్తి నిచ్చే అల్పాహారం

    ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు…

  • అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

    విడాకుల సంఖ్యా తగ్గాలంటే ………!

    అన్నదమ్ములూ  అక్కాచెల్లెళ్లు  ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య …

  • ఈ మధ్య అందరూ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎటిఎం లకు వెళ్తుంటే మురికిపట్టి ఎన్నడూ వాడనట్లు అనిపిస్తున్న జోలికి వెళ్ళకూడదు. అవి బహుశా పనిచేయని ఎటిఎం లు కావచ్చు. లావాదేవీలు పూర్తీ కావాలంటే పిన్ నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేయమని అడుగుతున్నా తేడా ఎదో ఉందని గమనించండి. సొంత బ్యాంక్ ఎటిఎం లు వాడటం మంచిది. మన అకౌంట్ ఉన్న బ్యాంకులైతే మోసాలకు తావుండదు. ఇక ఇ -షాపింగ్ కోసం సెక్యూర్ సాకెట్స్ లేయర్ S.S.L సర్టిఫైడ్ సైట్లనే వాడాలి. స్మార్ట్ ఫోన్ లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని వల్ల మాల్వేర్ అరికట్టటం ఈజీ అవుతుంది. పబ్లిక్ వైఫై నెటవర్క్ లైన్ డబ్బు లావాదేవీలు జరిపినా నష్టమే. పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చితే ఐడెంటిటీ థెఫ్ట్ కు అవకాశం పోతుంది.

    కార్డులో వాడుతుంటే జాగ్రత్త

    ఈ మధ్య అందరూ  క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని…