• ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు కలిపి ఎండుఫలాలు వాల్నట్స్ బాదం పలుకులు కలిపి తింటే రోజంతా ఉత్సాహమే. ఓట్స్ ఎంతో మంచివి. బరువు తగ్గటమే కాదు ఆరోగ్యానికీ మంచివే. వెన్న లేని పాలతో తింటే కేలరీలు తగ్గుతాయి. అరటి పండ్లు ముక్కలు. ఎండు ద్రాక్ష పండ్లు నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు తింటే బలానికి బలం. ఆరోగ్యం రాగి జావ ఎంతో మంచిది. ఇనుము కాల్షియం ఎక్కువ. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తహీనత దూరం అవుతుంది. బెల్లం యాలకులు వెన్న లేని పాలు బాగా మగ్గిన పండ్లు కలిపి తీసుకుంటూ త్వరగా ఆకలివేయకుండా పైగా ఎంతో బలం కూడా.

    బరువు తగ్గించి శక్తి నిచ్చే అల్పాహారం

    ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు…

  • అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

    విడాకుల సంఖ్యా తగ్గాలంటే ………!

    అన్నదమ్ములూ  అక్కాచెల్లెళ్లు  ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య …

  • ఈ మధ్య అందరూ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎటిఎం లకు వెళ్తుంటే మురికిపట్టి ఎన్నడూ వాడనట్లు అనిపిస్తున్న జోలికి వెళ్ళకూడదు. అవి బహుశా పనిచేయని ఎటిఎం లు కావచ్చు. లావాదేవీలు పూర్తీ కావాలంటే పిన్ నెంబర్ రెండు సార్లు ఎంటర్ చేయమని అడుగుతున్నా తేడా ఎదో ఉందని గమనించండి. సొంత బ్యాంక్ ఎటిఎం లు వాడటం మంచిది. మన అకౌంట్ ఉన్న బ్యాంకులైతే మోసాలకు తావుండదు. ఇక ఇ -షాపింగ్ కోసం సెక్యూర్ సాకెట్స్ లేయర్ S.S.L సర్టిఫైడ్ సైట్లనే వాడాలి. స్మార్ట్ ఫోన్ లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని వల్ల మాల్వేర్ అరికట్టటం ఈజీ అవుతుంది. పబ్లిక్ వైఫై నెటవర్క్ లైన్ డబ్బు లావాదేవీలు జరిపినా నష్టమే. పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మార్చితే ఐడెంటిటీ థెఫ్ట్ కు అవకాశం పోతుంది.

    కార్డులో వాడుతుంటే జాగ్రత్త

    ఈ మధ్య అందరూ  క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులతో కొత్త నోట్ల కోసం బ్యాంకుల ఎటిఎం లకు వెళుతున్నారు. కార్డుల వినియోగంలో ఎటిఎం ల వాడకంలో కొన్ని…

  • ఈ సర్వే ఎప్పుడూ తారలు మరీనా మారని మహిళల జీవిత చిత్రంలా కనిపిస్తూవుంటాయి. నాలుగు దేశాల్లో చేసిన ఒక సర్వే లో మహిళలు 19 సంవత్సరాలలోపు నుంచే ఎన్నో రకాల వేధింపులకు లోనవుతున్నారని తేలింది. మన దేశంలో పదిమంది ఆడవాళ్ళలో నలుగురు ఇలాంటి హింసలకు గురవుతున్నారు. గత నెలలో 73 శాతం మంది మహిళలు ఎదో ఒక రూపంలో హింస లేదా వేధింపులు ఎదుర్కొన్నారు. గత నెలలో శరీరం పై తగలరాని చోట తమను తడిమారని ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు చెప్పారు మన దేశంలో ఆరు శాతం మంది ఆడపిల్లలు పది సంవత్సరాలు నిండకుండా వేధింపులు హింసకు లోనవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్న పదేళ్ల లోపు ఆడపిల్లలు బ్రెజిల్ లో 16 శాతం బ్రిటన్ లో 12 శాతం థాయిలాండ్ లో ఎనిమిది శాతంగా ఉన్నారు. వేధింపులకు గురికాకుండా తగిన రక్షణ చర్యలు అనుసరిస్తున్నట్లు ఇండియా లోని 82 శాతం స్త్రీలు చెప్పారు. 35 శాతం పార్కులు లైట్లు లేని చోట్లకు వెళ్ళటం తగ్గించారు. 36 శాతం నిత్యం తాము ప్రయాణించే రూట్ మార్చారు. రేప్ అలారం మిరియాల పొడి లాంటివి రక్షణగా వాడుతున్నారు.

    19 ఏళ్లకే వేధింపులు

    ఈ సర్వే  ఎప్పుడూ తారలు మరీనా మారని మహిళల జీవిత చిత్రంలా కనిపిస్తూవుంటాయి. నాలుగు దేశాల్లో చేసిన ఒక సర్వే లో మహిళలు 19 సంవత్సరాలలోపు నుంచే…

  • ఒక టెక్నాలజీ వేరబుల్ సర్వేలో స్మార్ట్ వాచ్ ల కంటే ఎక్కువగా ఫిట్ బిట్ ల, మార్కెట్ వుందిట. ఫిట్ బిట్ తర్వాత చైనా కంపెనీ జియోమీ బిబ్ రెండో స్థానంలో వుంది. చేతికి కట్టుకునే ఈ ఫిట్ బిట్ మన రొజువారీ లైఫ్ లో చేయాల్సినవన్ని నోటిఫికేషన్ తో అలర్ట్ చేస్తుంది. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు పరుగెత్తే దూరం, నడచిన అడుగుల సంఖ్య, హార్ట్ రేట్, నిద్రపోయిన సమయం గేమ్స్ ఆడినప్పుడు ఖర్చయిన కేలరీలు మీటింగ్ అలెర్ట్స్ ఇలా ఎన్నో అప్ డేట్స్ తో మాయాజాలం చేస్తుంది. స్మార్ట్ వాట్ చేసే పనులతో పాటు అధనంగా ఉపయోగ పడే ఈ ఫిట్ బిట్ సర్వే రిపోర్ట్ ల్లో అత్యధికంగా ధరిస్తున్నారని తేలింది. యూత్ కి ఇప్పుడు తమ పైన శ్రద్ద పెట్టే తోడుగా పోయింది ఫిట్ బిట్. రంగులు, ఖరీదు, వివరాల కోసం చూడొచ్చు.

    యూత్ మనస్సు దోచిన ఫిట్ బిట్

    ఒక టెక్నాలజీ వేరబుల్ సర్వేలో స్మార్ట్ వాచ్ ల కంటే ఎక్కువగా ఫిట్ బిట్ ల, మార్కెట్ వుందిట. ఫిట్ బిట్ తర్వాత చైనా కంపెనీ జియోమీ…

  • ఇప్పుడు యూత్ షాపింగ్ అంతా ఆన్ లైన్ లోనే కొన్ని పనికొచ్చే సైట్స్ ఇవి. స్టయిల్ గా కనిపించే నగలు కావాలంటే 20 DRESSES.COM క్లిక్ చేయండి. జంక్ జ్యూవెలరీ కాకుండా ఆన్ లైన్లో గోల్డ్ డైమండ్ నగలు కొంటుంటే కట్ క్లారిటీ వెయిట్ క్యారెట్ మొదలైన విషయాలలో మంచిపట్టుండాలి. సెక్యూర్ ప్రోటోకాల్ విషయంలో ఫ్లిప్కార్ట్ ,స్నాప్ డీల్, అమెజాన్ ,గ్రూపాన్ , మిత్ర వంటి వెబ్సైట్ ల వద్ద వినియోగదారుల సమాచారం భద్రంగా ఉంటుంది. ఈ సైట్లు సురక్షితమే అలాగే వెరైటీ ఫ్యాషన్ డ్రెస్ ల కోసం KOORS.COM లో వెతకవచ్చు. సైజు రంగు క్లాత్ టైపు వంటివి చక్కగా చూసుకోవాలి. షర్ట్స్ టాప్స్ కోసం ASOS.COM వెబ్సైట్ లలో వెతకచ్చు. బోలెడన్ని వెరైటీలు సుమారైనా ధరలో దొరుకుతాయి. ఇక హ్యాండ్ బాగ్స్ కోసం అయితే ఎన్నో ఆన్ లైన్ పోర్టల్స్ caprese.com లో మంచి హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ కొనేటప్పుడు స్టయిల్ లుక్ ట్రెండీస్ పార్టీలు ఫంక్షన్ల కోసమూ అనేది దృష్టి లో ఉంచుకుంటే మంచి వెరైటీ ఎంచుకోవచ్చు.

    నగలు డ్రెస్సులు బ్యాగుల కోసం చూడండి

    ఇప్పుడు యూత్ షాపింగ్ అంతా  ఆన్ లైన్ లోనే కొన్ని  పనికొచ్చే సైట్స్ ఇవి. స్టయిల్ గా కనిపించే నగలు కావాలంటే 20 DRESSES.COM  క్లిక్ చేయండి.…

  • పిల్లల్ని ప్రేమగా బాగా పెంచటంలో భాగంగా వాళ్లకు చదువులు స్కూళ్ళు తప్ప ఇంకో ప్రపంచం వుండకుండా చేస్తున్నారనీ వాళ్ళు సరిగా ఎదగటం అంటే వాళ్లకి ప్రాపంచిక జ్ఞానం అలవాటు చేయాలనీ సామజిక సత్సంబంధాలు అలవర్చుకునేలా చేయాలనీ ఎక్సపర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ మనసుకి నచ్చింది చేసే అవకాశం మంచిచెడులు ఆలోచించే విజ్ఞత వారికి కలిగించాలి. పిల్లల్లకు తల్లితండ్రులు మానసికంగా అండగా ఉండాలనీ వాళ్లకు దగ్గర వుంది ప్రపంచాన్ని పరిచయం చేయాలనీ చెపుతున్నారు. ముఖ్యంగా పిల్లల జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని తల్లితండ్రులతో షేర్ చేసుకునే నమ్మకం ఇవ్వాలంటున్నారు. వాళ్ళను ఎదిగే క్రమంలో ప్రోత్సహించండి గానీ అభిప్రాయాలు వాళ్లపై రుద్దే ప్రయత్నం తప్పంటున్నారు. వాళ్ళను తప్పనిసరిగా ఒకటి రెండు భాషలు నేర్చుకునేలా ప్రోత్సాహించాలనీ క్రమశిక్షణ తో ఎదిగేలా చేయాలనీ ఎక్సపర్ట్స్ చెపుతున్నారు.

    వాళ్లకు ప్రపంచాన్ని పరిచయం చేయండి

    పిల్లల్ని ప్రేమగా బాగా పెంచటంలో భాగంగా వాళ్లకు చదువులు స్కూళ్ళు తప్ప ఇంకో ప్రపంచం వుండకుండా చేస్తున్నారనీ వాళ్ళు సరిగా ఎదగటం అంటే వాళ్లకి ప్రాపంచిక జ్ఞానం…

  • ఆరోగ్యానికి వ్యాయామం మంచిదేనని తెలిసిందే కనుక ఉదయము, సాయంత్రము నడవడం అలవాటు చేసుకొంటున్నారు. అయితే వారానికి ఐదు రోజులు పరుగెడితే మంచిదఅంటున్నారు వైద్యులు. పరుగు వల్ల ఎండోకెనాచినాయిడ్ల అనే హార్మోన్లు విడుదల కావడంతో ఆనందం లభిస్తుంది అంటున్నారు. పరుగెడితే మోకాళ్ళ పనితీరు మేరుగవుతుంది అంటున్నారు. అలాగే ఒకే రకమైన వయామం వల్ల కూడా అంత ప్రయోజనం ఉండదని వారంలో వివిధ రకాలైన వ్యాయామాలు ట్రై చేయమంటున్నారు. పరుగుతో పాటు సైకిల్ తొక్కడం హిట్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ వంటివి చేయడం తో శరీరం మొత్తానికి వ్యాయామం అందే కళ్ళు, చేతుల్లో వుండే కొవ్వు తగ్గిపోతుంది. శరీరం మొత్తానికి పని చేస్తే స్ట్రెచ్, క్రంచెను తో పాటు చతురంగా దండాసవం వ్యాయామాలు చేస్తే ఫలితం ఎక్కువ వుంటుంది. శరీరం లో అన్ని భాగాలకు కదలిక వుండే వ్యాయామాలు చేయడం వల్ల శరీరం మొత్తం చురుగ్గా, వేగంగా కదులుతుంది.

    శరీరం మొత్తానికి వ్యాయామం అందాలి

    ఆరోగ్యానికి వ్యాయామం మంచిదేనని తెలిసిందే కనుక ఉదయము, సాయంత్రము నడవడం అలవాటు చేసుకొంటున్నారు. అయితే వారానికి ఐదు రోజులు పరుగెడితే మంచిదఅంటున్నారు వైద్యులు. పరుగు వల్ల ఎండోకెనాచినాయిడ్ల…

  • రేగి పండులో నిండగా పోషకాలు

    రేగి పండులో నిండగా పోషకాలు

    రేగి వడియాలు తిన్నారా? రేగి పండ్లు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒత్తిడిగా, ఆదుద్దాగా అనిపించినప్పుడు రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం వుంటుంది. రేగి…

  • ప్రపంచం మారిపోయిందని అప్పుడప్పుడు చాలా భ్రమ కలుగుతూవుంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనపడుతుంది. నింగిన మెరిసిన తరల్లాంటి కొందరు విజేతలను చూసి ముచ్చట పడేంత లోపే ఎక్కడో అంధకారపు ఒక ఆర్తనాదం కాళ్ళు నెలకు ఆనేలా చేస్తుంది. రుతుస్రావం పై అపోహలు అపవిత్రత ముద్రలు కొత్తవి కావు. మన దేశంలో ఆ మూడు రోజులు ప్రత్యేకమైన గది కేటాయించే పద్దతి వుంది. పొరుగు దేశం నేపాల్ లో చౌపది అనే పేరుతో ఊరికి దూరంగా గుడిసెలు కడతారు. అమ్మాయిలు అక్కడే ఉండాలి. అక్కడి ప్రభుత్వం 2005 లో చట్టం తెచ్చినా ప్రయోజనం లేదు. ఈ దురాచారానికి వ్యతిరేకంగా నేషనల్ పబ్లిక్ రేడియో ప్రచారం చేస్తుంది. ఈ గుడిసెల్లో గ్రామం బయట ఉండటం వల్ల కూడా జంతువుల భయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇరవై ఆరేళ్ళ అమ్మాయి గుండె పోటుతో అరుపులు ఊరివారు వినక నిస్సహాయంగా చనిపోయిందని రేడియో చెపుతోంది. గత తొమ్మిదేళ్లలో మహిళలు పురుగు పుట్రా కుట్టి చనిపోయారట.

    ఇంకా ఈ దురాచారం పోలేదు

    ప్రపంచం మారిపోయిందని అప్పుడప్పుడు చాలా భ్రమ కలుగుతూవుంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనపడుతుంది. నింగిన మెరిసిన తరల్లాంటి కొందరు విజేతలను చూసి ముచ్చట పడేంత లోపే…

  • బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు కూడా విండో షాపింగ్ చేస్తూ వుంటారు . అలాగే హోటల్లో దొరికే అన్ని రకాల పదార్ధాలను ప్రదర్శనకు పెడితే బావుంటుందననుకున్నాడు జపాన్ కు చెందిన రెస్టారెంట్ యజమాని. రంగులద్దిన మైనంతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలను నోరూరించేలా దృష్టిని ఆకర్షించేలా తయారుచేయించాడు. అప్పటినుంచి రెస్టారెంట్ లో పదార్ధాల ప్రదర్శన మొదలైంది . ప్లాస్టిక్ తో రకరకాల ఆహార పదార్ధాల నమూనాలు తయారుచేసే కంపెనీలు వెలిసాయి. ఇప్పుడది కోట్ల విలువ చేసే మార్కెట్. జపాన్ ,కొరియా ,చైనా రెస్టారెంట్లలో కొత్తకొత్త రకం పదార్ధాల నమూనాలు పెడితే మెనూ పైన చదివి కాకుండా ఇలా కళ్ళతో చూసి ఆర్దరించేందుకు కస్టమర్లు ఇష్టపడుతున్నారట. అచ్చమైన వంటకాలకంటే ఇంకా నిండైన రూపంలో ప్లాస్టిక్కో ,మైనంమో ఏదైనా కనిపించే ముందు నోరూరటం ఖాయం. పోనీ తినేద్దామనుకోవటం కస్టమర్స్ బలహీనతే కదా.

    కళ్లకింపుగా ప్లాస్టిక్ ఆహారం

    బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు…

  • బంగారం అరవై తులాలకు మించి ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. ప్రభుత్వం అలా ఏమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారం ఎలా సమకూర్చుకోగలిగారో వివరణ ఇవ్వగలగాలి. వారసత్వంగా వచ్చిందనుకోండి. విల్లు ప్రకారం వచ్చిన బంగారం పైన ఇద్దరు సాక్షి సంతకాలు ఉంటే చాలు. బహుమతిగా వచ్చిన బంగారాన్ని అమ్మాలంటే ఆనాటి ధర ఇప్పటి ధరల మధ్య వ్యత్యాసం పై పన్ను కట్టాలి. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ డిపాజిట్ స్కీం 1999 ప్రకారం 2000-01 నుంచి గోల్డ్ డిపాజిట్ బ్రాండ్లను జ్యూవెలరీ కేంద్రం పరిగణించకుండా సెక్షన్-2 కి సవరణ ఇచ్చింది. గోల్డ్ డిపాజిట్ బ్రాండ్లు ఆస్తులుగా పరిగణించారు. వ్యయసాయ ఆధారిత కుటుంబాలైతే వ్యవసాయ ఆదాయం పై పన్ను లేనట్లే వ్యవసాయ ఆదాయం తో కొనుగోలు చేసిన బంగారం పై ఎలాంటి పన్ను ఉండదు. పుట్టింటి నుంచో బహుమతిగానో మరేవిధంగానో వచ్చిన బంగారానికి ఆధార పత్రం ఉండేలా చూసుకుంటే చాలు. ఒక చిన్న మధ్య తరగతి కుటుంబంలో 60 తులాల కంటే ఎక్కువ బంగారం వుండే అవకాశం వుంటుందా చెప్పండి. ఆదాయానికి మించిన అక్రమార్జన ఉంటేనే లెక్కలు బయటకి వస్తాయి.

    బంగారం గురించి కంగారొద్దు

    బంగారం అరవై తులాలకు మించి ఉంటే ప్రభుత్వం లాగేసుకుంటుందా అనే సందేహం చాలా  మందిని వేధిస్తోంది. ప్రభుత్వం అలా  ఏమీ లాక్కోదు. పరిమితికి మించిన బంగారం ఎలా…

  • టీనేజ్ లోకొచ్చాక పిల్లల్ని గాజు బొమ్మల్లాగా హ్యాండిల్ చేయాలి. అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాళ్ళతో భావోద్వేగాలు ఎక్కువే వుంటాయి. కానీ పెద్దవాళ్లలాగా వాటిని నియంత్రించుకోలేరు. వాళ్ళు ముభావంగా ఉన్నా కోపంగా వుంటున్నా ప్రతి దానికీ కనీళ్ళు పెట్టుకున్నా కారణాలు తెలుసుకునేందుకు సున్నితమైన ప్రయత్నం చేయాలి. తోటి పిల్లల్తో సర్దుకోలేకపోతున్నా ఏదైనా లైంగిక హింసకు గురవుతున్నారా లేదా ఏదైనా సున్నితమైన విషయాన్ని బయటకు చెప్పలేకపోతున్నారా? ఏదైనా వత్తిడి లోనయ్యారా ? అన్ని విషయాలను తరచి అడిగి తెలుసుకోవాలి. తల్లితండ్రుల కంటే దగ్గరైనవాళ్లు వాళ్ళకెవరూ ఉండరు. ఎలాంటి సమస్యకైనా అండదండలుగా ఉంటామనే నమ్మకాన్ని పిల్లలో చిన్నపటినుంచి కలిగించగలిగే గొడవే లేదు. వాళ్లకు సంబంధించిన ఈ ప్రాబ్లమైన మొదటిగా తల్లితండ్రికే చెప్పుకుంటురు. మార్కులు వచ్చినా తెలివిగా ప్రవర్తించలేకపోయిన ఇతరుల ముందు వాళ్ళను చిన్నపుచ్చటం చాలా తప్పు. ఆరోగ్యంగా లేకపోయినా శారీరిక లోపం ఒత్తిడీ సరిగా చదవలేక పోయినా వాళ్ళు భయపడాయి చెప్పుకోలేకపోతారు. లేదా దృష్టి లోపం విరికిది సమస్యలు తలెత్తినా వాటిని చెప్పుకోలేక మౌనంగా ఉన్న తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎదిగే క్రమంలో ఎదురయ్యే ఎలాంటి అనుభవానికైనా తోడుగా ఉండాలి.

    పిల్లలకు నమ్మకం ఇవ్వండి

    టీనేజ్ లోకొచ్చాక పిల్లల్ని గాజు బొమ్మల్లాగా హ్యాండిల్ చేయాలి. అంటున్నారు ఎక్స్పర్ట్స్. వాళ్ళతో భావోద్వేగాలు ఎక్కువే వుంటాయి. కానీ పెద్దవాళ్లలాగా వాటిని నియంత్రించుకోలేరు. వాళ్ళు ముభావంగా ఉన్నా…

  • నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో బోలెడన్ని ప్రోటీన్స్ పొటాషియం మాంగనీస్ జింక్ విటమిన్ కె వంటి నిల్వలు పుష్కలంగా వున్నాయి. కనుక ప్రతి రోజు ఆహారంలో తినండి అంటున్నారు. పీచు విటమిన్ సి విటమిన్ బి6 ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పండ్లు కూరగాయల్లో సెలెనియం ఖనిజం అంతగా దొరకదు. సెనగల్లో పుష్కలంగా దొరికే సెలీనియం కాన్సర్ లు రాకుండా కాంతులు పెరగకుండా కాపాడుతుందంటున్నారు. అలాగే డిఎస్ఏ తయారీకి కారణమయ్యే ఫోలేట్ కూడా ఉంటుంది. నిద్రకీ కండరాల కదలికకు అధ్యయనానికి జ్ఞాపక శక్తికీ ఎంతో అవసరమైన కొలీన్ కూడా ఉంటుంది. కనుక సెనగల్ని పచ్చిగా అంటే నానబెట్టి లేదా ఉడికించి రెగ్యులర్ గా కూరల్లో వేసి ఎదో రకంగా ప్రతి రోజూ తినమంటున్నారు.

    విటమిన్లు ఖనిజాల నిండుగా వుండే సెనగలు

    నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో…

  • శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా కొద్ది పాటి నూనె లేదా ఆవిరిపైన వుడికించడం మేలు అంటున్నారు. టొమాటో, కారెట్, క్యాబేజీ, మిర్చీ వంటివి పచ్చిగా కంటే కొంచం ఉడికాక తింటేనే ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి అంటున్నారు పరిశోధకులు. నాన బెట్టి, పచ్చిగా కట్ చేసి తింటే మంచి దనుకోవడం కేవలం అపోహే అంటున్నారు.

    పచ్చి కురలకంటే వండినవే బెస్ట్

    శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్…

  • పిల్లలు కోరిన రుచుల్ని అందమైన బాక్స్ ల్నిఇంకెంతో అందమైన వాటర్ బాటిల్స్ సమకూర్చి వాళ్ళు కడుపునిండా మంచి కలర్ ఫుల్ లంచ్ కష్టపడి చేసి ఇస్తున్నా సరే.. ఊహు.. మాకొద్దు మాకు పేస్ట్రీలు పఫ్ లు కేకులే కావాలి. అని పంతం పట్టి కూర్చున్న పిల్లల సంఖ్యే 90 శాతంగా ఉందని డయాబెటిక్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యయనం చెపుతోంది. లంచ్ బాక్స్ లో సమతులాహారం వుందా ? శరీరానికి కావాల్సిన కొవ్వులు పోషకాలు అందుతున్నాయా లేదా అని తల్లులు ఫుడ్ కోర్సులు చేస్తున్నా పిల్లలు మాత్రం జంక్ ఫుడ్ స్టాల్ల్స్ ఉండటంతో పిల్లల లంచ్ బాక్స్ అవతల పారేసి ఈ క్యాంటిన్లకే ఎగబడిపోతున్నారు. మన దేశంలో 50శాతం మంది ఒక్కపండు గానీ ఒక్క కూర గాని తినని పిల్లలున్నారు. 40 శాతం మంది బ్రేక్ ఫాస్ట్ చేయనేచేయరు. ఇవన్నీ కూడా చిన్న వయసులోబ్ డయాబెటిస్ కు దారితీస్తున్నాయి. 25 శాతం పిల్లలు లావుగా ఆయిపోతున్నారన్నమాట. అందుకే చెన్నయ్ లోని ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ల కాంపస్ లో జంక్ ఫుడ్ సాఫ్ట్ డ్రింక్ ల అమ్మకాల పైన నిషేధం విధించారట. పిల్లలు విధిగా లంచ్ బాక్స్ లు తేవాలనీ అందులో పండ్లు కూరగాయలు ఎక్కువగా ఉండేలా టీచర్లు కూడా పర్యవేక్షించాలనీ నిషేధించి మరీ మన రాష్ట్రాలు ఎప్పుడు కళ్ళు తెరుస్తాయో ?

    వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది

    పిల్లలు కోరిన రుచుల్ని అందమైన బాక్స్ ల్నిఇంకెంతో అందమైన వాటర్ బాటిల్స్ సమకూర్చి వాళ్ళు కడుపునిండా మంచి కలర్ ఫుల్ లంచ్ కష్టపడి చేసి ఇస్తున్నా సరే..…

  • అసలు ఎండ తగలేకపోవటం సరైన పోషకాహారం లేకపోవటం వల్ల దక్షిణాది మహిళల్లో డి విటమిన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఒక అధ్యయనం సారాంశం. రోజు కొద్దిసేపు ఎండలో నిలబడగలిగితే శరీరానికి కావలిసిన డి విటమిన్ అందుతుంది, ఆ విటమిన్ లోపం శరీరం లోని కీలక అంగాలు వ్యవస్థల పైన ప్రభావం చూపెడుతుంది, ముందుగా పనితీరు మందగిస్తుంది. డిమేనేషియా ఆల్ఫామార్త్ రెండింటిలోనూ డి విటమిన్ పాత్ర ఉంది. గుండె కండరాలు బలహీనమవుతాయి. శ్వాసంగాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం పెరుగుతుంది. ఎముకలు బలహీన పడతాయి. డి విటమిన్ లోపం ఉంటే 50శాతం ఎలాంటి బాహ్య లక్షణాలు కనిపించవు . కండరాలు వాపు వెన్ను నొప్పి సమస్య ఉంటే డి విటమిన్ లోపమని అర్ధం చేసుకోవచ్చు. ఖరీదైన పాఠశాలల్లో చదివే పిల్లలో 90 శాతం మందికి డి విటమిన్ లోపం కనిపిస్తుంది. పూర్తిగా శాఖా హరం తీసుకున్న డి విటమిన్ లోపం ఎక్కువవుతుంది. తీవ్రమైన భావోద్వేగాలు నిద్రలేకపోయినా ఎక్కువ చెమటలు పడుతున్నా వైద్యులను సంప్రదించి సరైన పోషకాహారం డి విటమిన్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు.

    ఎండపడనివ్వని సుకుమారులకో హెచ్చరిక

    అసలు ఎండ తగలేకపోవటం సరైన పోషకాహారం లేకపోవటం వల్ల  దక్షిణాది మహిళల్లో డి విటమిన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఒక అధ్యయనం సారాంశం. రోజు కొద్దిసేపు ఎండలో…

  • ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన విటమిన్లను గ్రహించటం తో నెయ్యిదే కీలకపాత్ర. కొబ్బరి ఇది చర్మానికి శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. జీడిపప్పు కాల్షియం మెగ్నీషియం అధికంగా వుండే జీడిపప్పు కండరాలకు ఎముకలకు బలం. డయాబెటిక్ ఉంటే దాని కనిష్ట గ్లైనమిక్ ఇండెక్స్ ఎంతోమంచి చేస్తుంది. అరటి పండులో కొవ్వులు వుండవు. అరటి ఆనందం కలిగిస్తుంది. బూడిద గుమ్మడి శరీరంలో నీరు నిల్వ నివ్వదు. విషపూరిత పదార్దాలను శరీరం నుండి బయటకు పంపుతుంది. ఉల్లి పాయలో సల్ఫేర్ అధికం. వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సముద్రపు ఉప్పులో పోషకాలు 88 సూక్ష్మ లవణాలు వున్నాయి. బంగాళా దుమ్పలో కొవ్వులేదు. కార్బోహైడ్రాట్స్ పోషక పదార్ధాలున్నాయి. కాలీఫ్లవర్ లో పీచు యాంటి ఆక్సిడెంట్ గుణాలున్నాయి. పాల ఉత్పత్తుల్లో ఎన్నో ఆమ్లాలు లభిస్తాయి. తెల్ల నువ్వులు ఇది వెన్నకు ప్రత్యామ్నాయం. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. తెల్లని పదార్దాలకీ ఆరోగ్యానికీ ఎంతో దగ్గర సంబంధం ఉంది.

    తెల్లనివి తింటేనే ఆరోగ్యం

    ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం  అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన…

  • రోజు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు రొటీన్ కు భిన్నంగా చిన్న చిన్న మార్పులు చేయూస్కుంటే మనమెంతో విశ్రాంతిని పొందగలుగుతాం. ఆ కొత్తదనం విసుగును మాయం చేస్తుంది. మెదడు రోజువారీ గందరగోళం నుంచి బయటపడి విశ్రాంతిగా ఉంటుంది. ముందుగా ఫోన్ చెక్ చేసుకోవటం కొద్ది సేపు ఆపండి లేదా రెండు మూడు గంటలపాటు ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచండి. ఓ వారంలో రెండు రోజులు ఇల్లంతా శుభ్రం చేసుకోవటం పై మనసుపెట్టి ఆ రెండు రోజులు బయట భోజనం ఎంజాయ్ చేయండి. అతిధులు ఇంటికొచ్చినా మనం కష్టపడి చేసిన పనులు శుభ్రంగా ఉండే ఇల్లు ప్రత్యేకంగా వాళ్ళకోసంగా ఉండే టవల్స్ సోప్స్ చూసి మనం ఆదరణ కు ఫిదా అయిపోతారు. ఇంట్లో అందరూ కలిసి కాసేపు టీవీలు గేమ్స్ సెల్ ఫోన్లు లాప్ టాప్ లు శుభ్రంగా ఆపేసి హాయిగా హలో వండిన వన్నీ పరుచుకుని కబుర్లతో సగం భోజనంతో కడుపు నింపుకోండి. రెండు వారాలకు రోజు ఇంటికి భోజనానికి స్నేహితులనో బంధువులనో పిలవండి. ఒక్క రోజు కాస్త పనిఎక్కువైన మార్పుగా ఉంటుంది. వీకెండ్ ఒక్కరోజు సినిమాకో అప్పుడప్పడూ గాలి విలువ వాసనొస్తున్నా సరే హుస్సేన్ సాగర్ మీదకు చుట్టూ మనుషుల్ని గమనిస్తూ కాలక్షేపం చేయండి. మనం జీవితం నవ నవ్యంగా మనమే వుంచుకోలేకపోతే ఇంకోళ్ళు ఇవన్నీ ఎందుకు చేసిపెడతారు?

    ఇలా చేసి చుడండి ఫిదా అవుతారు

    రోజు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు రొటీన్ కు భిన్నంగా చిన్న చిన్న మార్పులు చేయూస్కుంటే మనమెంతో విశ్రాంతిని పొందగలుగుతాం. ఆ కొత్తదనం  విసుగును మాయం…

  • ఇల్లు చిన్నదిగా ఉన్నా పర్లేదు. ఇంటి తోట కోసం మనం వుండే చోటునే కాస్త కేటాయిస్తే ఇల్లు బావుంటుంది. మన కళ్ళకి పచ్చదనం కనిపిస్తుంది. మంచి ఆక్సిజన్ పైగా ఎర్రని పచ్చని ఆకుపచ్చ వర్ణాలతో ఇల్లు వర్ణ మిశ్రమంగా అయిపోతుంది. ఈ చలికాలంలో మన ప్రాణం వాతావరణానికి పిటానియా ,అంధురియం , సినరేరియా ,జినియా , చామంతి , బంతి వంటివి పెంచుకునేందుకు బావుంటాయి. ఇవన్నీ వివిధ రంగుల్లో పూలు పూసే కుండీల్లో పెంచుకునే ,మొక్కలు. పోషకాలు ఎక్కువ వుండే నీళ్లు నిలవని మట్టిని తెచ్చుకోవాలి. కుండీల్ని కొని వాటిలో ఈ మట్టి నింపుకొని తెచ్చుకోవచ్చు. ఈ కాలంలో మొక్కలు నెమ్మదిగా పెరుగుతాయి. కనుక ఎండలోకి మారుస్తూ ఉండాలి. ఉదయం వేళ వీటికి నీళ్లు పోయటం మనం కాఫీ తాగేంత అలవాటుగా చేసుకోవాలి. చిన్న చిన్న మొక్కలకు మరీ నీళ్లు కూడా అవసరం ఉండదు. అనుభవంతో ఈ చక్కని పూల తోట పెంచుకోటం మనకి బాగా వస్తుంది. నీళ్లు కారి ఇల్లంతా పరుచుకోకుండా ప్లేట్లు ఉండే కుండీలు ఎంచుకుంటే మన ఇంటి తోట మీద మనకు ప్రేమలో పడిపోతాం.

    వీటి ప్రేమలో పడతాం తప్పదు

    ఇల్లు చిన్నదిగా ఉన్నా పర్లేదు. ఇంటి తోట కోసం మనం వుండే చోటునే కాస్త కేటాయిస్తే ఇల్లు బావుంటుంది. మన కళ్ళకి పచ్చదనం కనిపిస్తుంది. మంచి ఆక్సిజన్…