• అనుష్కా శెట్టి అనగానే మనకెన్నో ప్రయోగాలు గుర్తొస్తాయి. అరుంధతి, పంచాక్షరి, వేదం, బాహుబలి, రుద్రమ్మదేవి.. ఏదైనా ఒక్క సినిమా ఒక సాహసం . ఇక సైజ్ జీరో అయితే ఏ నటి చేయని సాహసం. దక్షినాది ప్రజల అభిమానం పొందే యాభై మంది మహిళల్లో అనుష్క పేరు వుండాలిసిందే. నగలంటే ఏ మాత్రం ఇష్టం లేని అనుష్క, అరుంధతి సినిమాలో 12 కేజీ ల బరువైన నగలు ధరించింది. ఇక నగలు ఆమెకి నచ్చడం మొదలైంది. బైక్ రైడింగ్ అంటే అనుష్కకి ఎంతో ఇష్టం. ఇప్పటి వరకు ఒక్క వ్యాపార ప్రకటలో కూడా నాటించ లేదు. బాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు. ఏనుగు, గుర్రం స్వారీలు సినిమాల కోసమే నేర్చుకుంది. బ్రెజిల్ రచయిత పాల్ కొయిలో నవల ఆల్ కెమిస్ట్ అంటే ఆమెకి చాలా ఇష్టం. చికెన్ అంటే చాలా ఇష్టం, నలుపు రంగు దుస్తులు ఇష్టం, అత్యధిక పారితోషకం తీసుకునే జాబితాలో అనుష్క వుంది. కధానాయిక గా స్థిర పడక ముందు యోగా శిక్షకురాలిగా పని చేసింది. ఈమె సామాన్య మైన యువతి. సినిమా వృత్తిలో రాణించడం కోసం తనను తానూ తీర్చి దిద్దుకుంది. అనుష్క పరిచయం చదివాక ఏ అమ్మాయైనా ఒక కొత్త పని నేర్చుకోవడం మొదలుపెడితే బావుండు.

    సినిమా గురించి ఎన్ని నేర్చిందో ఈమె

    అనుష్కా శెట్టి అనగానే మనకెన్నో ప్రయోగాలు గుర్తొస్తాయి. అరుంధతి, పంచాక్షరి, వేదం, బాహుబలి, రుద్రమ్మదేవి.. ఏదైనా ఒక్క సినిమా ఒక సాహసం . ఇక సైజ్ జీరో…

  • 'ఐ యామ్ ఎ ర్యాగ్ పికర్' అంది అనుష్క శర్మ. వెండి తెర పైన తళుకు మనే తారలంతా చినప్పుడు మాములు పిల్లల్లా ఆడి, పాడి అల్లరి చేసిన వాళ్ళే. బాలీవుడ్ అగ్ర కధానాయిక అనుష్క శర్మ కూడా చినప్పుడు తన హాబీల గురించి చెపుతూ ఆర్మీ కంటోన్మెంట్ లో వున్న ఇంటికి, స్కూలుకు మధ్య దూరంలో నడిచి వెళుతూ రోడ్డు పైన పడేసి వున్న చాక్లెట్ కవేర్లను, చుట్టూ పడేసిన వస్తువులను ఏరి, వాటిని బూట్ల డబ్బాలో దాచుకునే దానిని చీమలు పుట్టలు పెట్టిన ఆ పెట్టేని వాళ్ళమ్మ కనిపెట్టి వాటిని అవతల పారేయాలని చుస్తే అవన్నీ నాకు నచ్చిన కలక్షన్స్ వాటిని ముట్టుకుంటే అన్నం తినను అని మా అమ్మను బెదిరించే దాన్ని. ఇంకా స్టాంప్స్ , నాణేలు రకరకాల కలక్షన్స్ చినప్పుడు పోగు చేసినవి ఇప్పటికీ వున్నాయి అంది. ఎవరి అభిప్రాయాలూ వాళ్ళవిగా వుంచాలి పెద్దవాళ్ళు. మాఇంట్లో అంత వరకు ఓ.కే కానీ ప్రపంచలో చాలా మంది ఇతరుల అభిప్రాయాల పట్ల చాలా సెన్సిటివ్ గా వుంటారు. వాళ్ళ అభిప్రాయాలు ఇతరుల పై రుద్దేందుకు చూస్తారు. అది పొరపాటనను అంటోంది అనుష్క శర్మ. కరక్టే కదా ఎవళ్ళ పాటికి వాళ్ళను వదిలేయడం బెస్ట్.

    ఇతరుల్ని ఎందుకు ఒప్పుకోరో అర్ధం కాదు

    ‘ఐ యామ్ ఎ ర్యాగ్ పికర్’ అంది అనుష్క శర్మ. వెండి తెర పైన తళుకు మనే తారలంతా చినప్పుడు మాములు పిల్లల్లా ఆడి, పాడి అల్లరి…

  • 'లాలీ కీషాదీమై లడ్డు దివానా' చిత్రంలో నటిస్తోంది అక్షరహాసన్ చాలా మంది నటుల్లా నేను సినిమా నెపధ్యాన్ని ఉపయోగించుకుని పరిశ్రమలోకి రాలేదు. చిత్రపరిశ్రమలో సహాయదర్శకురాలిగా అడుగు పెట్టాను. కష్ట పడి ఇంతవరకు వచ్చాను అంటోంది అక్షర నా పని నేను సక్రమం గా చేస్తున్నాననీ సరైన దిశలో వెళుతున్నానని అమ్మా నాన్న సంతోషంగా ఉన్నారు. నన్ను ఎక్కువ విమర్శించే వాళ్ళే. నేను చేసిన పలు సన్నివేశాల్ని ఎందుకలా చేసాననో, ఇలా చస్తే బాగుండదనో చెప్పుతారు. కొన్నిసార్లు వాళ్ళ మాట వింటాను. నా తల్లిదండ్రులు కమల్హాస్సన్ సారికలు తొలిసారి ఆనందంగా ఉంటుందని చెప్పుతుంది అక్షర. షమీలాబ్ చిత్రంలో హాలీవుడ్ లో అడుగు పెట్టింది అక్షర. తల్లి దండ్రుల తో తన అనుభందం ఎంతో అదృష్టమని కెరీర్ పరంగా వాళ్ళిచ్చే సలహాలు తప్పని సరిగా ఆచరిస్తుంది అక్షర.

    సినిమా నేపధ్యాన్ని పక్కన పెట్టను

    ‘లాలీ కీషాదీమై లడ్డు దివానా’ చిత్రంలో నటిస్తోంది అక్షరహాసన్ చాలా మంది నటుల్లా నేను సినిమా నెపధ్యాన్ని ఉపయోగించుకుని పరిశ్రమలోకి రాలేదు. చిత్రపరిశ్రమలో సహాయదర్శకురాలిగా అడుగు పెట్టాను.…

  • లండన్ లోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్ననటాషా అనే యువతి 'ది బిగ్ హాగ్ ఫౌండేషన్' పేరు తో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించింది. విలాస వంతమైన జీవనానికి కారు, బంగ్లాలు తెలిసిన నటాషా పుట్టిన ఊరు కోయంబత్తూరు. లండన్ నుంచి తల్లి దండ్రులను చూసేందుకు వచ్చిన నటాషా స్నేహితులు పని చేస్తున్న ఒక అనధాశ్రమమం చూసింది. అక్కడ పిల్లల దుర్భర పరిస్తితి చూసి ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ పారిసరాలు, వసటి గృహం శుబ్రంగా లేవు. నీళ్ళు పదిహేను రోజులకోసారి వస్తాయి. ఒక్క ట్యాంక్ నీళ్ళని ౩౦ మంది పిల్లలు 15 రోజుల పాటు వాడుకోవాలి. పైగా అక్కడంతా పాములు తిరుగుతున్నాయి. లండన్ వెళ్ళిన నటాషా ఈ పిల్లల గురించే ఆలోచించింది. సహృదయులు విదేశాలలో ముందుకొచ్చారు. మళ్ళి లండన్ నుంచి కోయంబత్తుర్ కి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని ది బిగ్ హాగ్ ఫౌండేషన్ స్థాపించి , ౩౦ మంది పిల్లల కోసం , సకల సౌఖ్యాలు ఏర్పాటు చేసింది. లండన్ లో సైకాలజీ చదివిన ఇప్పుడు కోయంబత్తూర్ లో స్థిరపడి ఫౌండేషన్ విజయ వంతంగా నడిపిస్తుంది.

    అనాధ పిల్లల కోసం లండన్ నుంచి

    లండన్ లోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్ననటాషా అనే యువతి ‘ది బిగ్ హాగ్ ఫౌండేషన్’ పేరు తో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించింది. విలాస వంతమైన జీవనానికి…

  • ఏదైనా ఒక్క సినిమా మన అంచనాకు అందక పొతే బావుండక పొతే విసుక్కుంటాం. మరి ఒక సినిమా ఫెయిల్ అయితే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అవ్వుతారు. ఈ మాట విద్యాబాలన్ ను అడిగితే, ఆమె నటించిన హమారీ, అధురీ కహానీ ఫ్లాప్ అయిందిట. ఏ చిత్ర పరాజయానికి ఆమె ఎంతో బాధ పడిందిట. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యే సరికి తట్టుకోలేక ఏడ్చేసిందిట. "నేను నటంచిన ప్రతి చిత్రాన్ని పసి పాపలా భావిస్తాను. హమారీని ఇంకాస్త ఇంకాస్త ఎక్కువగానే ప్రేమించాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. చివారికి నాకు నేను నచ్చజెప్పుకున్నాను. ఇప్పుడు నా దృష్టంతా బేగం జాన్ పైనే వుంది. అది తప్పకుండా అందరి అంచనాలు మించి వుంటుంది. అని చెప్పింది విద్యాబాలన్.

    చిత్రం ఫెయిల్ అయితే తట్టుకోలేను

    ఏదైనా ఒక్క సినిమా మన అంచనాకు అందక పొతే బావుండక పొతే విసుక్కుంటాం. మరి ఒక సినిమా ఫెయిల్ అయితే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్…

  • సోనీ రియాలిటీ మ్యూజిక్ షోలో తనని తాను పరిచయం చేసుకుంది నహీద్ అఫ్రీన్. తేజ్ పూర్ బన్వనాద్ చరియాలీ ఆమె ఊరు. టెన్త్ చాడువుటింది. అస్సామీ, హిందీ, బెంగాలీ భాషల్లో పాడుతుంది. చక్కని పొడవాటి జుట్టు తో యువరాణిలాగా వుంటుందీ పదహారేళ్ళ భరతీయ గాయిని. సోనీ మ్యూజికల్ షోలో బెంగాలీ సింగర్ యాష్ కింగ్ పాట పాడితే సల్మాన్ ఖాన్ ఏగ్జాయిట్ అయ్యారు. నువ్వు స్వరాల ఖజానా అన్నాడో జుడ్జ్. కానీ ఇలా పాటలు పాడుతున్నందుకు అస్సాం లోని ఉడాలి సోనాయినా బీబీ కాలేజీ లో అఫ్రన్ మ్యూజికల్ నైట్ వుంది. కానీ చుట్టూ మసీదులు, మదరసాలు, ముస్లిం సమాధులు వుంటే మ్యూజికల్ నైట్ పేరు తో పాటలు పాడతారా అని ఈ అమ్మాయిని కరపత్రాలు పంచి మరీ బెదిరిస్తున్నారు. అఫ్రిన్ అభిమాని అయిన పూర్వ ముఖ్యమంత్రి తరుష్ గాగోయ్, ప్రస్తుత ముఖ్య మంత్రి శరవానంద్ సోనావాల్ పూర్తిగా అప్రిన్ కు మద్దతు పలుకుతున్నారు. ఫత్యాజీదీ చేయడం అంటే అఫ్రిన్ కుటుంభాన్ని వెలివేయడం మరి ఇన్ని అవరోధాల మధ్య అఫ్రిన్ 25వ తేదిన పాడుతుందా? భయపది పాడటం మానేస్తుందా? తెలియదు.

    ఈ స్వరం వినిపిస్తుందా?

    సోనీ రియాలిటీ మ్యూజిక్ షోలో తనని తాను పరిచయం చేసుకుంది నహీద్ అఫ్రీన్. తేజ్ పూర్ బన్వనాద్ చరియాలీ ఆమె ఊరు. టెన్త్ చాడువుటింది. అస్సామీ, హిందీ,…

  • బాహుబలి లో 'ధీవరా' పాడిన గాయని రమ్యా బెహరా ప్లేబాక్ సింగర్ గా ఐదేళ్ళ కెరియర్ లో వందకు పైగా పాటలు పాడింది. టాప్ ట్వంటీ సాంగ్స్ తీసుకుంటే అన్నీ సంగీత ప్రియులు మెచ్చినవే. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఆమె పాట పాడింది. మెల్లగా తెల్లారిందో-శతమానంభవతి, నాయుడోరిఇంటికాడ- బ్రహ్మోత్సవం, రాంగ్ దే రే- అ ఆ, కొత్తగున్న హాయి నువ్వా-ప్రేమ కధా చిత్రంలో. ఇవన్నీ రమ్యాబెహరా పాడిన పాటలే 2007 లో జరిగిన తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల వేదిక పైన కీరవాణి పూర పరిచిన పాటలో ఆమె కెరీర్ మొదలైంది. వందకు పైగా పాటల్లో ౩౦ పాటలు సూపర్ డూపర్ హిట్ నాకు సింగర్ గా లక్ష్యలున్నాయి. తక్షణ లక్ష్యం సింగర్ గా తెలుగుకే పరిమితం కాకుండా వీలైనన్ని భాషల్లో పడటం, సంపాదించిన దాన్లో పలు చారిటీల కోసం కొంత పక్కన పెట్టడం. నాకు ఇష్టమైన పనులు అంటోంది రమ్యా బెహరా.

    ఎంతో పేరు తెచ్చినా ఆ ఒక్క పాట

    బాహుబలి లో ‘ధీవరా’ పాడిన గాయని రమ్యా బెహరా ప్లేబాక్ సింగర్ గా ఐదేళ్ళ కెరియర్ లో వందకు పైగా పాటలు పాడింది. టాప్ ట్వంటీ సాంగ్స్…

  • ఒక్క దివ్యసుందరి అనడంలో సందేహం లేదు. అందంతో పాటు చెక్కని నటన కూడా ఆమె ప్రత్యేకం దశాబ్ద కాలంగా చిత్రా సీమలో రాణిస్తోంది. ఎంత గొప్ప నటి అయినా కొన్ని సందర్భాల్లో తడబాటు తప్పదు. మీ సినీమా జీవితంలో ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా అని అడిగీతే కాజల్ మనస్సు విప్పి చెప్పింది. రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా మోహమటంగా వుంటుంది. కానీ అవన్నీ నటనలో భాగం అని మనస్సుకి చెప్పుకుని ఒప్పించుకోవాలి. కధలో పాత్ర లో లీనం అయినప్పుడు అవన్నీ సహజం అనుకుని నటిస్తాం అంతే కానీ ఒక్కో సారి కెమెరా ముందు చిన్ని చిరునవ్వు నవ్వడం కూడా కష్టమనిపిస్తుంది, కానీ ఆ చిరునవ్వు ఆ సినిమా ఆ సంఘటనలో చాలా అవసరం. కానీ సందర్భం లేకుండా నవ్వడం ఎంత కష్టమో ఆ సన్నివేశంలో నాకు చాలా సార్లు అనుభవం అయింది. అంటోంది కాజల్ పైగా అనుభవం కూడా ప్రతి కధ పైనా ప్రేక్షకుల్లో అంచనాలుంటాయి. అలా అంచనాలుండటం నకోవరం, అదేసమయంలో అది నాకు పెద్ద వోత్తిడి. ఎవ్వాళ్ళం నూరు శాతం నిర్ణయాలు తీసుకోలేము ఇండస్ట్రీ లో అంటోంది కాజల్.

    ఒక్క చిరునవ్వు చిందించడం కూడా చాలా కష్టం

    ఒక్క దివ్యసుందరి అనడంలో సందేహం లేదు. అందంతో పాటు చెక్కని నటన కూడా ఆమె ప్రత్యేకం దశాబ్ద కాలంగా చిత్రా సీమలో రాణిస్తోంది. ఎంత గొప్ప నటి…

  • నాయన తార చేతి నిండా సినిమాల తో క్షణం తీరిక లేకుండా వుంది. హారర్ సినిమాల్లో నటిస్తూ, సినిమా భాగం మొత్తం తనే మోనే నాయన తారకు హర్రర్ చిత్రమంటే చచ్చే భయమట. హర్రర్ అంటే చాలా భయం కానీ చూడ కుండా వుందా లేను. గది మొట్ట లైట్లు వేసుకుని. చుట్టూ మనుషులు ఎవరి పనుల్లో వాళ్ళుంటే మరీ భయంకర సన్నివేశాల్లో కళ్ళు మూస్తూ తెరుస్తూ హర్రర్ సినిమాలు చూస్తుంటే ఆ కిక్కే వేరనుకోండి. అలాగే నాకు చిన్న పిల్లల కబుర్లు అంటే చాలా ఇష్టం ముద్దు ముద్దుగా వాళ్ళు మాట్లాడుతుంటే అలసట అంతా ఇట్టే పోతుంది అని చెపుతున్న నాయన నటించిన డోర విడుదలకు సిద్దంగా వుంది. ఈ మధ్య చెన్నై రచయితల సంఘం ఆ కధ తనదని ఫిర్యాదు చేసారు. కానీ ఆత్మ కధకు డోరా కు సంబంధం లేదని సౌత్ ఇండియన్ రైట్స్ అసోసియేషన్ తేల్చింది. ఇంకోసారి హర్రర్ కధాంశం తో ప్రేక్షకులను భయ పెట్టేందుకు వస్తోంది నాయనతర డోరా మూవీ తో టీజరె భయం వేసేలా వుంది. నాయన అందంగానే వుంది అనుకోండి.

    చేస్తుంది హర్రర్ మూవీనే అయినా భయం

    నాయన తార చేతి నిండా సినిమాల తో క్షణం తీరిక లేకుండా వుంది. హారర్ సినిమాల్లో నటిస్తూ, సినిమా భాగం మొత్తం తనే మోనే నాయన తారకు…

  • స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్ లో భాగస్వామ్యులుగా వుంది. నిర్మాణంలో వున్న ఇళ్ళను గ్రూప్ గా కొంటె తక్కువ ధరలకు ఇస్తాననే ఒక సంస్థ ఇది. అలాగే శిల్పాశెట్టి, రాజ్ కుంద్ర్రా, అక్షయ్ కుమార్లు కలిసి సెలబ్రెటీ షాపింగ్ షాపింగ్ ఛానల్ లో బెస్ట్ డీల్ టీ.వి ప్రారంభించారు. అలాగే పిల్లలకి సంబందించిన ఉత్పత్తులని అమ్మె బేబీఓయ్ డాట్ కామ్ లో కరిష్మాకపూర్ భాగస్వామిగా వున్నారు. ఫస్ట్ క్రై డాట్ కామ్ లోనూ ఈమె వాటా వుంది. వ్యాపారం ప్రారంబించాలనుకుంటే వాళ్ళకి ఈ సెలబ్రెటీలు ఇప్పటికే ఓ అడుగు ముందే వునారని చెప్పేందుకు ఈ కబురు మంచి ఆలోచన వుంటే ఇలాంటి స్టార్టప్ ని అతి వేగంగా మొదలు పెట్టోచ్చు. ఇలాంటి వ్యాపారాలకు ఆలోచనే పెట్టుబడి.

    ఇప్పటికే హీరోయిన్స్ మొదలెట్టేసారు

    స్టార్టప్స్ ని సినీతారలు బాగానే వాడుకుంటున్నారు. సాంకేతిక వ్యాపార రంగాలు అంకర సంస్థల్లో భాగస్వామయులుగా ఉంటున్నారంటే ఒక రకం. ఇప్పుడు శిల్పాశెట్టి గ్రూప్ హౌసింగ్ డాట్ కామ్…

  • నిను చూడక నేనుండలేను తో మొదలు పెట్టి, నాగ, ఒక్కడు, విజయం, సింహాద్రి, 7/G బృందావనం కాలనీ వంటి ఎన్నో సినిమాల్లో శ్రేయా ఘోషల్ పాడిన అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకులు వున్నారు. తన గానం తో భారతీయులకు వీనల విందు చేసిన శ్రేయ కు అరుదైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్ ఢిల్లీలో నెలకొల్పనున్న మ్యుజియంలో ఆమె మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తోలి సింగర్ కూడా శ్రేయా ఘోషలే. గీతా లావన స్టైల్ లో ఆమె విగ్రహాన్ని తాయారు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. 2002 లో పడటం మొదలు పెట్టిన 15 సంవత్సరాలుగా ఎన్నో పాటలు పాడారు. ఈ మ్యుజియం లో ప్రధాని మోడీ తో పాటు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లతో పాటు ఇతర ప్రముఖుల విగ్రహాలు కూడా పెడతారు.

    ఢిల్లీ టుస్సాడ్స్ లో శ్రేయా ఘోషల్ విగ్రహం

    నిను చూడక నేనుండలేను తో మొదలు పెట్టి, నాగ, ఒక్కడు, విజయం, సింహాద్రి, 7/G బృందావనం కాలనీ వంటి ఎన్నో సినిమాల్లో శ్రేయా ఘోషల్  పాడిన అద్భుతమైన…

  • సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా రిచ్ లుక్ లో మళ్ళి శ్రీదేవి అందంగా మెరిసిపాయింది. ఫిప్టీ ప్లస్ లోనూ ఆమె తిరుగు లేని అందం తో స్టున్నింగ్ పర్ఫోమెన్స్ తో ఇప్పుడు 'మామ్' గా టైటిల్ రోల్ లో ప్రేక్షకులకు తన గ్లమమౌర్ ఏ మాత్రం తగ్గలేదంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది శ్రీదేవి. ట్విట్టర్ లో మామ్ ఫస్ట్ లుక్ పోస్ట్ చేసి 'ఒక స్త్రీకి సవాలు ఎదుర్కునేటప్పుడు మామ్ పోస్టర్ ను అవిష్కరిస్తున్నా' అని పోస్ట్ పెట్టింది. నీలి రంగు దుస్తుల్లో సీరియస్గా చూస్తునట్లు పోస్టర్ లో వివిధ భాషల్లో అమ్మను ఏమంటారో రాసి వుంది తన సవతి కుమార్తె కు న్యాయం చేయడానికి మామ్ ఏంచేసింది. అన్న కధంసం తో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని శ్రీ దేవి భర్త భోనికపూర్ నిర్మిస్తున్నారు. అదే దేశానికి చెందిన బాలనటి సాజల్ అలీ కూతురిగా చేస్తుంది.

    మామ్ సినిమాలో మళ్ళి శ్రీ దేవి

    సినిమాలు చేయడం ఆపేసిన ఎనిమిదేళ్ళ తర్వాత ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో ప్రేక్షకుల ముందు ప్రత్యేకమైన నటిగా స్థాయి నిరూపించుకుంది శ్రీదేవి. తమిళ చిత్రం పులి లో మహారాణిగా…

  • సెల్ఫీ సరదా వరకే వుంచుకుంటే పర్లేదు, అది ఇతరుల గౌరవానికి భంగం వచ్చేలా వుంటే మాత్రం సమస్యే. ఈ మధ్య కాలంలో విద్యాబాలన్ బీగమ్ జాన్ సినిమా పని గురించి నిర్మాత ముకేష్ భచ, దర్శకుడు శ్రాజిల్ ముఖర్జీ తో పాటు, కలకత్తా ఎయిర్ పోర్టు నడుస్తూ వస్తుంది. ఒక్క వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ఫీ తిసుకొబోయాడు. విధ్యాబాలన్ సరేనంది. అతను చొరవగా ఆమె భుజం పైన చెయ్యి వేసి సెల్ఫీ తీసుకోబోయాడు. అతని చెయ్యి అసభ్యంగా తన విపు పైన కదులుతుంటే విద్య షాక్ తిని చేయి తిసేయమంది. ఆటను విననట్లే చేయి తీయకుండా సెల్ఫీ తిస్తునట్లే వున్నాడు. విద్య సహనం పోయి ఏమనుకుంటున్నావ్, నువ్వేం చేస్తున్నావో తెలుసా, ఇది తప్పు అని కేకలు పెట్టింది. అతని ప్రవర్తన తనను ఎంతో బాధ పెట్టిందని ఒక అపరిచుతుడు చొరవగా చెయ్యి వేస్తె ఎలా వుంటుంది. మేం పబ్లిక్ ఫిగార్లమే కానీ, పుబ్లిక్ ప్రోపర్టి కాదు అని చాలా బాధ పాడింది విద్యా. అభిమానం వుంటే సంతోషం, అరాదించినా సంతోషమే, కానీ అవమానించడం ఎంత వరకు సభ్యత? విద్యాబాలన్ కష్టపెట్టుకున్నట్లు ఆడవాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ కాదు కదా?

    మేం పబ్లిక్ ప్రోపర్టిలు కాదు

    సెల్ఫీ సరదా వరకే వుంచుకుంటే పర్లేదు, అది ఇతరుల గౌరవానికి భంగం వచ్చేలా వుంటే మాత్రం సమస్యే. ఈ మధ్య కాలంలో విద్యాబాలన్ బీగమ్ జాన్ సినిమా…

  • అంకితా కుమారి, పదో తరగతి పరీక్ష రాస్తోంది. ఏముంది? ఎంతో మంది రాస్తున్నారు అనొచ్చు. కానీ అంకిత పరీక్ష రాస్తుంది కాలి బొటన వేళ్ళ మధ్య పెన్ను తో, అంటే కాలి తో రాస్తోంది పరీక్ష బీహార్ లోని నరన జిల్లాకి చెందిన బనియా పూర్ జిల్లాలోని పదో తరగతి అమ్మాయి అంకితా కుమారి.ఐదేళ్ళ వయస్సులో పోలియో వచ్చింది. చేతులు చచ్చుపడి పోయాయి. మాటలు సరిగ్గా రావు. ఇప్పుడు ఆ పాప అమ్మమ్మ తోడుగా పరీక్ష సెంటర్ కి వస్తుంది. కార్పెట్ పైన కూర్చొని పరిక్షలు రాస్తోంది. ఆమెకి ఎంతో మానసిక ధైర్యం వుంది. తప్పకుండా మంచి జాబ్ సంపాదించే ప్రతిభ వుంది అంటున్నారు ఆమె క్లాస్ టీచర్లు. జీవితం ఏదిచ్చినా సరే దాన్ని మనసారా స్వీకరించి దాన్ని గెలవాలనే అంకిత ఇవ్వాల సోషల్ మీడియా అభినందనలు పొందుతుంది.

    అద్భుతమైన గొప్ప కధ అంకితా కుమారి.

    అంకితా కుమారి, పదో తరగతి పరీక్ష రాస్తోంది. ఏముంది? ఎంతో మంది రాస్తున్నారు అనొచ్చు. కానీ అంకిత పరీక్ష రాస్తుంది కాలి బొటన వేళ్ళ మధ్య పెన్ను…

  • లక్షల విలువైన అందమైన నగలను ఆమె తాయారు చేస్తుంది. ఆమె తాయారు చేసిన నగలకు బ్రిటన్ లోనే కాదు దేశ విదేశాల్లో మంచి డైమెండ్ వుంది. చాలా మంది డిజైనర్లు వుండగా అన్నెట్టి గబేడే గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఆమె చేతులకు వెళ్ళే లేవు.ఈ వైకల్యం ఆమె లోని సృజనకు అడ్డకట్ట వేయలేక పోయింది. వెడ్డింగ్ రింగ్స్, ఎంగేజ్మెంట్ రింగ్స్. సిల్వర్, గోల్డ్, డైమెండ్స్, ఎమరాల్డ్స్ వంటి ఎంతో ఖరీదైన స్టోన్స్ ఉపయోగించి ఆమె అద్భుత సృష్టి చేస్తుంది. నెక్లెస్ లు, ఇయర్ రింగ్స్, బ్రేస్ లెట్స్, బాంగిల్స్, బ్రూచ్ లు, కఫ్ లింక్స్ ఆమె ప్రత్యేకతే అనొచ్చు. చేతులకు వెళ్ళు లేకుండా ఇవన్నీ ఎలా సాధ్యం అంటే, పట్టుదలతో ఇలా వున్నాను కనుక నాకిది లోపం అనిపించదు. వేళ్ళు లేకపోయినా నాపనులు చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత డిజైనర్ గా నగల్ని తాయారు చేయడం నాకు కష్టం అనిపించ లేదు అంటుంది అన్నెట్టి.

    ఈ అద్భుత సృజన ఎలా సాధ్యం

    లక్షల విలువైన అందమైన నగలను ఆమె తాయారు చేస్తుంది. ఆమె తాయారు చేసిన నగలకు బ్రిటన్ లోనే కాదు దేశ విదేశాల్లో మంచి డైమెండ్ వుంది. చాలా…

  • 2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు లేని ప్రతిభ చూపించారు. కిరణ్ మంజుదాస్ షా, ఫోబ్స్ ప్రకటించిన 2016 జాబితా లో ఈమె పేరు శక్తి వంతమైన మహిళల జాబితాలో వుంది. బయోకాన్ స్థాపించి నాదిపిస్తున్నారు కిరణ్ మంజు దాస్. డయాబెటిక్ రోగాలుని ప్రణాలు కాపాడే ఇన్సులిన్ ని తాయారు చేసే అతి పెద్ద కంపనీ అమెది. బయోకాన్ పరిశోధన విభాగం నుంచి 950 పేటెంట్స్ కి వెళ్ళారంటే ఆ పరిశ్రమ ఎంత గొప్ప స్థానం లో వుందో తేలింది. దేశ ఆరోగ్యం పెంపొందించడంలో తన వంతు కర్తవ్యం నిర్వహించిన కిరణ్ స్ఫూర్తి నిచ్చే మహిళల్లో ముందుంటారు.

    దేశ ఆరోగ్యం కోసం బయోకాన్

    2017 మహిళా దినోత్సవానికి స్పూర్తినిచ్చే మహిళల జాబితా పెద్దదే వుంది. ఎందరో మహిళలు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు, భారత దేశపు బయోటిక్ రంగంలో తిరుగు…

  • ట్రాక్టర్స్ రాణి అంటారు మల్లికా శ్రీనివాసన్ ను . సాంప్రదాయ తమిళ కుటుంబంలో పుట్టిన మల్లికా టాఫే పరిశ్రమ చైర్ పర్సన్ గా , సిఇఓ గా వ్యవరహిస్తూ దాన్ని లాభాల బాట లో నడిపిస్తున్నారు. అమెరికాలోని విజిసిఓ సంస్థ బోర్డులో ఆమె సభ్యురాలు. టాటాస్టీల్ , టాటా గ్లోబల్ బెవరేజస్ లో మల్లికా డైరెక్టర్. అమెరికాలో బిజినెస్ స్కూల్ లో ఎం.బి.ఏ చేసిన మల్లిక పర్యవేక్షణ లో టుఫే అంటే ట్రాక్టర్ అండ్ ఫర్మా ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఇప్పుడు లక్షకు పైగా ట్రాక్టర్లు తయారు చేస్తుంది. పద్మశ్రీ అవార్డు గ్రహిత. ఫస్ట్ బిజినెస్ విమెన్ అవార్డుని బిబిసి నుంచి అందుకొన్న ఆమె 2016 ప్రపంచ ప్రభావిత మహిళ అయ్యారు. ఆమె అందుకొని అవార్డులు లేవు. సామాజిక సేవలో భాగంగా శంకర్ నేత్రలయం మద్రాస్ కాన్సర్ ఇన్ స్టిట్యుట్ కి అండగా నిలబడుతుంది.

    ట్రాక్టర్స్ రాణి మల్లికా

    ట్రాక్టర్స్ రాణి  అంటారు  మల్లికా  శ్రీనివాసన్ ను . సాంప్రదాయ  తమిళ  కుటుంబంలో  పుట్టిన  మల్లికా టాఫే పరిశ్రమ చైర్ పర్సన్ గా  , సిఇఓ గా…

  • ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారాయణన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ల ను నడిపిస్తున్న పర్యావరణ వేత్త సునీతా నారాయణన్. బహుళ జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్ధాలు వున్నాయి అని లేబరేటరీ రిపోర్ట్స్ ద్వారా నిరూపించి కొక్, పెప్సీ, కోలా కంపెనీలకు హడలెత్తించారు సునీత. పండ్లు ముగ్గపెట్టడం లో వాడుతున్న రసాయినాలు నిషేదపు ఉత్పత్తులు ప్రభుత్వం ఇబ్బందన్నా, ఢిల్లీ విధుల్లో డిజిటల్ ఆటో లో వాహనాలు పోయి సి.ఎన్.జి వాడకం వచ్చిందన్న నీడలా దాని వెనక వున్నది సునీత జల కాలుష్యం వచ్చిందన్న, వాయు కాలుష్యం , కాలుష్య కారణాలు డాక్యుమెంటేషన్ చేస్తారు సునీత. పద్మశ్రీ అవార్డు తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థల అవార్డులు, ఎన్నో గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు సునీత.

    పర్యావరణ పరిరక్షణ లక్ష్యం.

    ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారియన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్…

  • హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానికి ప్రోచాన్సులర్ కూడా వున్నారామే. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. ఎండెవర్ ఇండియాకి ఆమె ప్రస్తుత చైర్మన్. ఆమె తండ్రి కె.కె బిర్లా తాత జి.జి బిర్లా, శక్తి వంతమైన వ్యాపార కుటుంబంలో పుట్టిన శోభన పత్రికా రంగంలో అతి చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏనాడో ఆమెను గ్లోబల్ లీడర్ ఆఫ్ టుమారో గా కీర్తించింది. ఔట్ స్టాండింగ్ బిజినెస్ విమెన్ అవార్డు, కార్పోరేటే ఎక్స్ లెన్స్ అవార్డు, జర్నలిజం రంగంలో పద్మశ్రీ , ఆమెను వరించాయి. మింట్ పత్రిక, ఫీవర్ 104, ఎఫ్ ఎమ్ రేడియో ఛానల్ ఆమె రూపం పోసినవే మీడియా రంగం లో తిరుగు లేని మహిళ శోభనా భార్తియా.

    మీడియాలో తిరుగులేని శోభనా

    హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక…

  • ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ ఆఫీసర్ గా ఆపైన ఏడేళ్ళ పాటు సిస్కో కి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేసారు. ‘నెక్ట్స్ఇవి’ అనే చైనా కు చెందిన ఎలక్ట్రికల్ కార్ల కంపనీకి అమెరికా విభాగంలో సి.ఇ.ఓ గా పద్మశ్రీ బాధ్యతలు తీసుకున్నారు. ఐ.టి రంగంలో తిరుగులేని రాణిగా పేరు పొందిన పద్మశ్రీ భూగోళం పైన మొబైల్ ఫోన్ గురించి ఆలోచించిన అత్యున్నత సంకేతిక నిపుణురాలు పద్మశ్రీ ఒకరని ఆమె కితాబులు అందుకున్నారు. స్వయం బోదిత వాహనాల రూప కల్పన, ఎలక్ట్రిక్ కారు రూపకల్పనలో ఆమె పోషించిన పాత్రకు ఫోబ్స్ మేగజైన్ ఆమెకు ఆమెకు క్వీన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్ బిజ్ అని పేర్కొన్నారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే మహిళల జాబితాలో పద్మశ్రీ ఒక్కరు.

    ఐటీ లో తిరుగు లేని పద్మశ్రీవారియర్

    ఢిల్లీ ఐఐటీలో చదివేందుకు వెళ్ళిన తోలి తరం ఆడపిల్లల్లో పద్మశ్రీ వరియర్ ఒక్కరు. ఇరవై మూడు సంవత్సరాల పాటు మోటరోలా కంపెనీ చీఫ్ టెక్నాలజీ అండ్ స్ట్రాటజీ…