• కాళ్ళని ఎంతో అందంగా చూపించే లెగ్గింగ్స్ అంటే అమ్మాయిలందరూ ఇష్టపడతారు. మోస్ట్ ఫ్యాషనబుల్ డ్రెస్ లో లెగ్గింగ్స్ ముందుంటాయి. మంచి పార్టీలకు, ఇంట్లో తేలిగ్గా తిరిగేందుకు ఈ లెగ్గింగ్స్ ని ఫ్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడో అధ్యయినం ఈ లెగ్గింగ్స్ అందం తో పాటు బరువునీ పెంచుతాయని చెపుతుంది. బిగుతుగా వుండే లెగ్గింగ్స్ వల్ల తొడలు, ఉదర భాగం పొత్తి కడుపు కండరాల్ల చలనం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ కొవ్వు పెరుగుతుంది. వేసవిలో ఈ ప్రాబ్లమ్ మరీ ఎక్కువ అందుకే లెగ్గింగ్స్ కుసాధ్యమైనంత దూరంగావుండమంటున్నారు. లేదా లెగ్గింగ్స్ లేకుండా వుండమంటున్నారు. లేదా లెగ్గింగ్స్ లేకుండా వుండ లేమంటారా. మంచి యోగా, వ్యాయామ నిపుణులను సంప్రదించి కొవ్వు పెరగకుండా చుసుకోమంటున్నారు. అధ్యయినం రిపోర్ట్ కరక్టే నంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ కూడా.

    లెగ్గింగ్స్ తో ప్రాబ్లమ్

    కాళ్ళని ఎంతో అందంగా చూపించే లెగ్గింగ్స్ అంటే అమ్మాయిలందరూ ఇష్టపడతారు. మోస్ట్ ఫ్యాషనబుల్ డ్రెస్ లో లెగ్గింగ్స్ ముందుంటాయి. మంచి పార్టీలకు, ఇంట్లో తేలిగ్గా తిరిగేందుకు ఈ…

  • పార్టీ వేర్ సారీస్ పేరు తో నే ప్రత్యేక సందర్భాల కోసం అని తెలసిపోతూనే వుంటుంది. ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించే ఈ పార్టీ వేర్ సారీస్,ఫ్యాబ్రిక్ లో కానీ డిజైన్స్ లో కానీ అద్భుతం అనిపించేలా వుంటాయి. ఇవన్నీ దాదాపు మైసూర్ సిల్క్, బెనారస్, కంజీవరం, జ్యుట్, నెట్, బ్రాసో, వెల్వెట్ వంటి వస్త్రాల శ్రేణిలోంచే ఎంచుకుని, ట్రెండ్స్, సీజనల్ పార్టీ వేర్ గా రూపొందిస్తారు. వీటిలో ప్రత్యేకంగా మల్టీకలర్ రెయిన్ బో సారీ, వైట్ షిమ్మేర్ సారీ, గ్రీన్ పార్టీ వేర్, ఫ్లోరల్ ప్రింట్ తో సహా మొత్తం 1500 డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ తో ఇక్కత్, రేషమ్ కుందన్, స్టోన్ వర్క్, జెమ్ వర్క్, మిర్రర్ వర్క్, లేస్ రిబ్బన్స్ వంటివి ఫుంకి మోడల్స్ ప్రస్తుతం మార్కెట్ లో కనిపిస్తూ వున్నాయి. ఎక్స్ క్లోజివ్ కలక్షన్స్ 'కోసం పార్టీ వేర్ సారీస్' లో చూడండి.

    ప్రత్యేక సందర్భాల కోసం పార్టీ వేర్ సారీస్

    పార్టీ వేర్ సారీస్ పేరు తో నే ప్రత్యేక సందర్భాల కోసం అని తెలసిపోతూనే వుంటుంది. ఇంటర్నేషనల్ రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించే ఈ…

  • www.fb.com/Glowtide చూడండి. ఈ సంస్థ నిర్వాహకురాలు రీనా. ఈ ఎన్జీవో లో ఎంత మంది యువత భాగస్వాములు హైదరాబాద్ లోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్ళలో మిగిలిపోయిన ఆహారం సేకరించి అదే రోజు అనాధలకు పేద పిల్లలకు అందజేస్తారు. 15 సంవత్సరాల పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలోని పని చేసి వచ్చారు రీనా. పెళ్ళిళ్ళు వేడుకల్లో మిగిలిపోయిన ఆహారం ఇచ్చేందుకు కూడా ఈ సంస్థకు సమాచారం ఇస్తాం. హైదరాబాద్ లో అంత పాప్యులర్ అయింది ఈ ఎన్జీఓఎక్కడ ఆహారం వృధా అయిపోతుంది అని మెసేజ్ అందగానే ఆ చుట్టు పక్కల శరణాలయాల వివరాలు చూస్తారు. ఆ ఆహారం అక్కడికి వెళ్ళేలా చేస్తారు. ఇప్పుడు ఇంకో ఆలోచన చేస్తున్నారు. హోటళ్ళు పెద్ద రేస్తురెంట్ల ముందు ప్రీజర్లు ఏర్పాటు చేయడం. రాత్రి మిగిలిన ఆహారం అందులో ఉంచితే అది పాడైపోకుండా మరునాటి ఉదయం పేద పిల్లలు, దీన్ని కలక్ట్ చేసుకుంటారు. ఆహారం వృధా కాకుండా చూడటం ఈ ఎన్జీఓ లక్ష్యం. ఆలోచన బాగుంది. ఈ సమాచారం హైదరాబాద్ మొత్తం అందేలా చేదాం.

    పిల్లల ఆకలి తీరుస్తున్నGlowTide

    www.fb.com/Glowtide చూడండి. ఈ సంస్థ నిర్వాహకురాలు రీనా. ఈ ఎన్జీవో లో ఎంత మంది యువత భాగస్వాములు హైదరాబాద్ లోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్ళలో మిగిలిపోయిన…

  • తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్. ఇక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన మధ్య ఎన్నో పాఠశాలలు కళాశాలల్లో అతిధిగా వెళ్ళిందిట. తాను మాట్లాడటం అయ్యాక ఎంతో మంది ఆడపిల్లలు మా తల్లితండ్రులు క్రీడల్లో మమ్మల్ని ప్రోత్సహించరు. పెళ్ళికే వాళ్ళ ప్రాధాన్యత అని చెపుతుంటే సాక్షికి కనీళ్ళు ఆగటం లేదట. నేను నా తల్లితండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థితికి వచ్చాను. చాలిచాలని స్థితిలో అమ్మ నన్ను కంటికి రెప్పలా కాపాడింది. తాహతుకు మించిన పోషకాహారం ఇచ్చింది. 2014 లో మోకాలు విరిగింది. నేను బరి లోకి వెళ్ళలేనను కొన్నా. కానీ నా తల్లితండ్రులు నన్ను నిలబెట్టారు. నాకు అన్ని విధాలా అండగా ఉన్నారు. నేను దేశానికీ గర్వకారణంగా ఉన్నానంటే న తల్లితండ్రుల త్యాగమే కారణం అన్నరామె. నా జీవితం ఆధారంగా వస్తున్నా దంగల్ చూస్తున్న తల్లితండ్రులు మారాలి అంటున్నారామె. సాక్షి మాలిక్ సాధించిన పతాకం చాలదా. తల్లి తండ్రులైనా తన బిడ్డ అంత స్థాయిలో నిలబడాలని కోరుకొనేందుకు?

    వాళ్ళ త్యాగం వల్లనే నేనింతదానయ్య

    తల్లిదండ్రులను తలుచుకోవడం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పటం పిల్లల కనీస బాధ్యత. రియో ఒలంపిక్స్ లో మన దేశానికీ తోలి పతాకం  అందుకుని మల్ల యోధురాలు సాక్షి మాలిక్.…

  • పిల్ల తెమ్మెర లాంటి సుగంధ పరిమళం వంటి యవ్వన దశ కరిగిపోవటం సహజాతి సహజం. కానీ మీదపడే వయసు తగ్గుతున్నా ఓపిక తీరాల్సిన బాధ్యతలు ఇవి ఇంకెముందిలే మన పనయి పోయిందనే భావన కలిగిస్తాయి. కానీ ఎక్సపర్ట్స్ ఈ ఆలోచనే పొరపాటుంటున్నారు. యువత లో ఉరిమే ఉత్సాహం వుంది. తుళ్ళిపడే జలపాత వేగం వుంది. వాళ్ళతో స్నేహం చేయండి. మీ యవ్వనం మీ దగ్గరే ఉంటుంది అంటున్నారు. అలాగే అవకాశం వచ్చిందంటే ఎపుడూ ఎదో ఒక కొత్త ప్రాంతానికి ప్రయాణానికి సిద్ధం అయిపోండి. ఈ అలవాటు మీ ఆలోచనలు చైతన్యవంతంగా ఉంచుతుంది. అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఎప్పుడూ చిన్నవయసు వాళ్ళ చుట్టూ చేరినప్పుడు వాళ్ళకిసలహాలివ్వటం లేదా గత అనుభవాలు చెప్పటం లాంటి పనులు చేయద్దు. అసలు ముఖ్యంగా మీకు వయసుమీరి పోతుందన్న విషయం మీకు మీతో పాటు అవతలివాళ్ళకీ గుర్తొచ్చేదిప్పుడే. అలాగే వీలైనంత సౌకర్యంగా ఎలా ఉండాలో ఆలోచించుకుని ఆహారం చదివేపుస్తకాలు రోజూ వారి కార్యక్రమాలు విషయంలో కూడా కొత్తగా వచ్చే జీవితానికి అనుగుణమైన ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి రొమాంటిక్ జీవితాన్ని గడపాలి. అన్ని బాధ్యతలు తీరిపోయాక జీవిత భగస్వాములతో మంచి జీవితం గడిపే సమయం ఇదే. తలుచుకుంటే 90 వ సంవత్సరంలో కూడా ఫుల్ యూత్ ఫుల్ గా ఎంజాయ్ చేయచ్చు అంటున్నారు నిపుణులు.

    అది కేవలం మీ ఆలోచనలో వచ్చిన మార్పు

    పిల్ల తెమ్మెర లాంటి సుగంధ పరిమళం వంటి యవ్వన దశ కరిగిపోవటం సహజాతి సహజం. కానీ మీదపడే  వయసు తగ్గుతున్నా ఓపిక తీరాల్సిన బాధ్యతలు ఇవి ఇంకెముందిలే…

  • ఒక పరిశోధన ప్రకారం నిదానంగా ప్రశాంతంగా వుండే వారి తో పోల్చితే తరచూ కోపం వచ్చే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట. అందుకే ప్రతి దానికి హైరానా పడకుండా లైట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. నెదర్లాండ్ పరిశోధనల ప్రకారం రోజుకు కనీసం ఏడు గంటలు నిద్ర పోయే వారిలో గుండె నొప్పి వచ్చే అవకాశం 65 శాతం తక్కువట. అలాగే గుండె ఆరోగ్యం కోసం డి-విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలంటున్నారు. వంటకాల్లో ఉప్పు తక్కువగానే వాడాలి. వేరు వేరు రంగుల పండ్లను రోజుకు కనీసం ఒక్కటైనా తినాలి. వంటనూనెలో గుండెకు మేలు చేసే ఫ్యాటి యాసిడ్స్ ఒక్కో నూనెలో ఒక్కో రకంగా వున్నాయి. కనుక రెండు మూడు రకాల నూనెలు కలిపి వాడాలి. మెంతులు, ఆవాలు, అవిసలు, పాలకూర, చేపలు వుండేలా చూసుకోవాలి. గుండె ఆరోగ్యం కోసం ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.

    ఈ అలవాట్లు, ఆహారం ఆరోగ్యం కోసం

    ఒక పరిశోధన ప్రకారం నిదానంగా ప్రశాంతంగా వుండే వారి తో పోల్చితే తరచూ కోపం వచ్చే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువట.…

  • పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా వగరు రుచితో వుండే సీమచింత పక్వానికి వస్తున్న కొద్దీ బంగారు రంగు గులాబీ ,ఊదీ, ఎరుపు రెంగుల్లోనే మారిపోతుంది. పండిందంటే పై తొక్క ఊడి వచ్చేస్తూ ఉంటుంది లోపల ఒక్కొక కణాలపు తో తెల్లని గుజ్జు మధ్యలో నల్లని గింజ ఉంటాయి. దాన్ని సీమ తమ్మ అని కూడా పిలుస్తారు. తమిళనాడు కేరళ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఆంద్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో విరివిగా మొలుస్తాయి. ఈ చెట్టు. నీటిశాతం ఎక్కువ వుండే సీమచింత కాయల్లో పోషకవిలువలు ఎక్కువే. కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ నియాసిన్ విటమిన్ సి లు పుష్కలంగా వుండే సీమచింత గొంతు చిగుళ్లు నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. క్షయ వ్యాధి నివారణకు ఈ చెట్ల వేర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు సీమచింతకాయలు కూడా అమ్మకానికి పెడుతున్నారు చూడండి.

    తెల్లని గుజ్జు వలిస్తే నల్లని రంగు

    పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా  వగరు రుచితో వుండే సీమచింత…

  • పెప్ లమ్ డిజైనర్ డ్రెస్ స్టైలిష్ లేటెస్ట్ అనుకోవాలి. ఇటు స్కర్ట్ లాగా పిటెడ్ జాకెట్ లాగా నడుము దగ్గర టైట్ చేసేలా వుండే పెప్ లమ్ ఫిట్టెడ్ జాకెట్స్ జీన్స్ ధోతీ ప్యాంట్ కు లూజ్ పటియాలా పైకి క్యాజువల్ కంఫర్ట్ లుక్ తో కనిపిస్తాయి. పెప్ లమ్ తో స్లిమ్ గా కనిపించాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. బాటమ్ గా పెన్సిల్ స్కర్ట్ ప్యాంటు ఎంచుకున్న లేటెస్ట్ స్టైల్ తో కనిపించచ్చు. దీనికి కాంట్రాస్ట్ గా వుండే ఆభరణాలు బావుంటాయి. రెడ్ కార్పెట్ వేదికలపైనా ప్రముఖ సినీ తారల స్టైలిష్ వెరైటీ గా మెరిసిన పెప్ లకు స్లిమ్ గా కనిపించాలనుకునే అమ్మాయిలకు సరైన డ్రెస్. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ని ఎంచుకుంటే సన్నగా కనిపిస్తారు. సంప్రదాయ వేడుకల్లో బరువైన మెరిసే లెహెంగా పైకి నెటెడ్ ఫ్యాబ్రిక్ తో చేసిన పెప్ లమ్ వేసుకుంటే ఇంకా ఆలుక్కే లేదు. ఓసారి చక్కని రంగు డిజైన్లు ఎంబ్రాయిడరీ వెరైటీలకు చూడండి.

    లేటెస్ట్ లో లేటెస్ట్ పెప్ లమ్

    పెప్ లమ్ డిజైనర్ డ్రెస్ స్టైలిష్ లేటెస్ట్ అనుకోవాలి. ఇటు స్కర్ట్ లాగా పిటెడ్ జాకెట్ లాగా నడుము దగ్గర టైట్ చేసేలా వుండే పెప్ లమ్…

  • ఎదో ఒక యాడ్ చాలా ఫ్యాషన్ గా ఉన్న అమ్మాయి చెప్పుల షాపులో కాళ్ళు చూపిస్తే ఆ పగుళ్లు చూసి షాపులో కుర్రాడు అబ్బా ఏమిటంత డర్టీగా అని మొహం పెడతాడు. నిజమే. సౌందర్య పోషణలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యం పాదాలకు ఇవ్వకపోతే అలాగే ఉంటుంది. మడమ దగ్గర మురికి పగుళ్లు లేకుండా ఉండాలంటే రాత్రివేళ పాఠాలు శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఫ్రూట్ క్రీమ్ లో గ్లైకోలిక్ యాసిడ్ వున్నది ఎంచుకుంటే పాదాల పగుళ్లు రావు. చర్మం మృదువుగా అయిపోతుంది. క్రీమ్ రాసుకుని సాక్స్ వేసుకుంటే దుప్పట్లు పాడైపోకుండా ఉంటాయి. ఫ్యూమిక్ స్టోన్ తో రుద్ది కడిగి బాదం నూనె కానీ ఆయిల్ కొబ్బరి నూనె ఎదో ఒకటి రాసి మసాజ్ చేస్తే పాదాలకు మంచి విశ్రాంతి లభిస్తుంది. కాండిల్ వాక్స్ ,ఆవ నూనె కలిపి వేడి చేసి పాదాల పగుళ్ల దగ్గర రాసి సాక్స్ వేసుకున్న చక్కగా ఉంటాయి. గోరు వెచ్చని నీటిలో మంచి సుగంధ నూనె వేసి పాఠాలు అందులో మునిగేలా వుంచితే ఎంతో రిలాక్స్ అయిపోవచ్చు.

    పాదాల అందం ఇలా పదిలం

    ఎదో ఒక యాడ్  చాలా ఫ్యాషన్ గా ఉన్న అమ్మాయి చెప్పుల షాపులో కాళ్ళు  చూపిస్తే ఆ పగుళ్లు చూసి షాపులో కుర్రాడు అబ్బా ఏమిటంత డర్టీగా…

  • గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి చేరింది. గ్రీన్ టీ తాగితే మొటిమలు మాయం అయిపోయాయంటున్నాయి ఈ సరికొత్త అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ,ముక్కు గదమ ప్రాంతాల్లోకి మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీ వల్ల కేసంలోని అంకుర ప్రాంతంలో నూనె స్రవించే గ్రంధుల వద్ద బాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు కారణమయ్యే బాక్టీరియా అంతగా పెరిగే అవకాశం ఉండదు అంటున్నారు తైవాన్ లోని నేషనల్ యాంగ్ మింగ్ యూనివర్సిటీ పరిశోధకులు గ్రీన్ టీ లోని ఎపిగాలోకే టెచిన్-3 గాల్వేజ్ అనే పోషకం మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలో బాక్టీరియా పెరగకుండా చేస్తుందిట. దానికి తోడు ఆ పోషకం లోని వాపు మంట తగ్గించే యాంటీ ఇన్ఫలమేటరీ గుణం సైతం మొటిమలు రాకుండా వుండేందుకు దోహదం చేస్తుందని పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి.

    గ్రీన్ టీ తో మొటిమలు తగ్గుతాయి

    గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల  ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి…

  • మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. వాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. 'బెస్ట్ కంపెనీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా' పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 350 కంపెనీల అవతార గ్రూప్ ఇండియా అండ్ వర్కింగ్ మదర్ మీడియా గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టాప్ వంద కంపెనీల్లో మహిళా ఉద్యోగినులు 25 శాతంగా ఉన్నారు. వంద శాతం ప్రసూతి సెలవు అనంతరం వచ్చిన తల్లులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇచ్చారు. వంద శాతం లైంగిక వేధింపుల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 2015 లో 18 శాతం కంపెనీలు ఉద్యోగినులకు ఆరు నెలల వేతనంలో ప్రసూతి సెలవలు ఇచ్చారు. 70 శాతం బిడ్డను దత్తత టీయూస్కున్న తల్లులకు 28 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చారు. పని ప్రదేశంలో మహిళలు స్వేచ్ఛగా హాయిగా పనిచేసే వాతావరణం సృష్టిస్తున్నాయి బెస్ట్ కంపెనీలు.

    ఉద్యోగినులకు అదనపు సౌకర్యాలిస్తున్న కంపెనీలు

    మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు.…

  • చలి రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు. తీవ్రమైన చలి గాలుల కారణంగా కంటిలోని తేమ ఆవిరైపోయింది. కళ్ళు పోదిబరిపోయి ఎరుపెక్కడం, దురద పెట్టడం సాధారణంగా జరిగే అసౌకర్యం కళ్ళకు హాని జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల్లో మొదట గోరు వెచ్చని నీళ్ళు మాటి మాటి కి తాగుతూ వుండటం. వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమ్మ జాతి పండ్లు, ముదురు రంగు ఆకు కూరలు తీసుకోవడంతో పాటు అన్ని రకాల సూప్స్ మేలు చేస్తాయి. ఫ్యాట్ ఆమ్లాలు అధికంగా వుండే ఆహారం తీసుకోవడం తో పాటు విటమిన్-ఏ, విటమిన్-బి లు అధికంగా వుండే ఆహారం తీసుకోవడం తో పాటు హీటర్, ఏసి, బస్సు కిటికీలు వీటిల్లో దేనికి మరీ దగ్గరగా కూర్చోకూడదు. కంప్యూటర్ ముందుకు ఎక్కువ సేపు పని చేసే సమస్యే ఇరవై సెకేన్లకొకసారి విరామం విరామం అనుకోవాలి. ప్రతి ఇరవై నిమిషాలకు కంప్యూటర్ కు దూరంగా 20 అడుగుల దూరం వెళ్ళాలి.

    చలి గాలికి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి

    చలి రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు. తీవ్రమైన చలి గాలుల కారణంగా కంటిలోని తేమ ఆవిరైపోయింది. కళ్ళు పోదిబరిపోయి ఎరుపెక్కడం, దురద పెట్టడం సాధారణంగా జరిగే అసౌకర్యం…

  • గోళ్ళ అందం గురించి ఇప్పుడు ఖరీదైన జ్యూవెలరీలు , రంగులు డిజైన్లు వస్తున్నాయి. కానీ అసలు గోళ్ళ అందం గురించి ఆరోగ్యం గురించి సంరక్షణ విషయంలోనూ జాగ్రత్తను తీసుకుంటేనే చక్కగా చూసేందుకు బావుంటాయి. అలావుంటేనే వాటిని అలంకరించుకోగలం. వేడి నీళ్ళలో ఆలివ్ ఆయిల్ వెయిస్ గోళ్లను అందులోముంచి కొన్ని నిముషాలు ఉంచాలి. కాస్సేపయ్యాక మర్దనా చేస్తే గోళ్లు బావుంటాయి. రోజ్ వాటర్ తో తుడిస్తే కూడా గోళ్లకు తేమ అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ప్రతి రోజూ ఏ బేబీ ఆయిల్ తోనో మర్దనా చేసినా గోళ్లు పొడిబారకుండా ఉంటాయి. కీరా రోజ్ ముక్కలతో గోళ్ళని తుడిస్తే మెరుస్తుంటాయి. కొబ్బరినూనెలో వుండే ఆరోగ్యకరమైన కొవ్వులు పోషకాలు గోళ్లకు మేలు చేస్తాయి. పళ్ళుతోమే పేస్ట్ ను గోళ్ళపైన రాసి మృదువుగా రుద్ది కడిగితే వాటిపై పేరుకున్న మురికి పోతుంది. మొహం విషయం లోనే కాదు. చేతులు కళ్ళు గోళ్లు పదాలు పగుళ్లు విషయంలో కూడా శ్రద్ధగా ఉంటేనే అందంగా శుభ్రంగా ఉన్నట్టు.

    ఆలివ్ ఆయిల్ మస్సాజ్ తో మెరుస్తాయి

    గోళ్ళ అందం గురించి ఇప్పుడు ఖరీదైన జ్యూవెలరీలు , రంగులు డిజైన్లు వస్తున్నాయి. కానీ అసలు గోళ్ళ అందం గురించి ఆరోగ్యం గురించి సంరక్షణ విషయంలోనూ జాగ్రత్తను…

  • జీవితంలో ప్రాధాన్యత క్రమాన్ని సరిగా ఆచరించి తీరాలి. లేకపోతే చేసే పని జీవితసమతౌల్యం గాడి తప్పి లేని సమస్యలు వస్తాయి. ప్రతి పనికీ అది చిన్నదైనా పెద్దదైనా ఒక ప్రాధాన్యతా క్రమం ఉంటుంది. ఉదయం నిద్ర లేవటం కూడా ఒక ముఖ్యమైన పనే. అలా అని కాల్కులేటెడ్ గా యాంత్రికంగా సాగనక్కర్లేదు. ఒక అలవాటుగా పద్దతిగా అన్ని పనులు చేసుకుపోవాలి. సరైన వేలకు ఆఫీస్ కు చేరాలి. ఇది అవసరమైన క్రియ కనుక దానికి తగట్టు సరైన వేళల్లో అన్ని పనులు ప్రణాళికా బద్ధంగా చేసుకోవటం అలవర్చుకోవాలి. హడావుడి టెన్షన్ వద్దు. రేపటి ఉదయం గురించి ఈ సాయంత్రం రాత్రి కొంత ఏర్పాటు చేసుకుంటే ఉదయం పని తీరు తేలికవుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా. అవసరం అనవసరం అన్న ప్రాధాన్యతలు నిర్ణయించుకుంటే ఇష్టం లేకపోతే ఎలాంటి ఆపాలజీలు వివరణలు చెప్పుకోకుండానే 'నో' అన్న పదం వాడకుండానే ఇంటి పని ఉద్యోగం రెండు ఒక క్రమంలో పూర్తయి విశ్రాంతి దొరుకుతుంది . కాకపోతే దైనందిన జీవితంలో ప్రాధాన్యతా క్రమం అన్నది తప్పనిసరి అలవాటు కావాలి.

    ప్రాధాన్యతా క్రమాలు తప్పనిసరి

    జీవితంలో ప్రాధాన్యత క్రమాన్ని సరిగా ఆచరించి తీరాలి. లేకపోతే చేసే పని జీవితసమతౌల్యం గాడి తప్పి లేని సమస్యలు వస్తాయి. ప్రతి పనికీ అది చిన్నదైనా పెద్దదైనా …

  • ఒక్క ఊరికి ఒక్కో ప్రత్యేకత తాపేశ్వరం కాజాలు, బందరు లడ్లు, ఉప్పాడ చీరలు, కొండపల్లి బొమ్మలు ఇలాగే తమిళనాడు లోని కలయూర్ వంటలకూ ప్రసిద్ధి. ఇక్కడి మగవాళ్ళు వంటవాళ్ళుగా పేరు తెచ్చుకునేందుకు కష్టపడతారట. ఇందులో రకరకాల గ్రేడ్లు, ప్రమోషన్లు వుంటాయట. ఓ వ్యక్తి సీనియర్ వంటవాడి స్థానం రావాలంటే పదేళ్ళు కష్టపడి నేర్చుకోవాలిట. ప్రధాన వంటవాడి స్థానం కావాలంటే పాతికేళ్ళ అనుభవం కావాలి. ఇక్కడి వాళ్ళు ఎంత బాగా వంట చేస్తారంటే పాండిచరి, తిరుపతి, మదురై, చెన్నై, చిత్తూరు లో పెద్ద వేడుకలకు వాళ్ళని బుక్ చేస్తారట. ఈ ఊర్లో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్ధులు ఇంటర్న్ షిప్ కోసం వస్తారట. వీళ్ళు చెక్కని వంట చిట్కాలు, మేనేజ్మెంట్ పాఠాలు చెప్తారట. ఈ న్యూస్ ఎందుకంటే ఒక వ్యాపారం కోసం ధనసంపాదన కోసం స్త్రీ పురుషులనే వత్యాసాల గోడలు కూలిపోతున్నాయి. వంట ఆడవాళ్ళకే పరిమితమై వుండేది అది ఇవ్వాల లక్షలకొద్ది జితం ఇచ్చే షెఫ్ జాబ్ కింద మారిపోయింది. వంటా........... అని చిరాకు పడే వాళ్ళు ఇది ఓ పరిశ్రమగా గుర్తించండి.

    వంట ఇప్పుడో పెద్ద పరిశ్రమ

    ఒక్క ఊరికి ఒక్కో ప్రత్యేకత తాపేశ్వరం కాజాలు, బందరు లడ్లు, ఉప్పాడ చీరలు, కొండపల్లి బొమ్మలు ఇలాగే తమిళనాడు లోని కలయూర్ వంటలకూ ప్రసిద్ధి. ఇక్కడి మగవాళ్ళు…

  • మృదువుగా వుండే నాయికా పాత్రలో ఒదిగిన జయలలిత తనలోని నటిని వెనక్కి తోసి నాయకురాలయ్యారు. అలాగే రాజకీయ జీవితంలో తిరుగులేని స్థానం సంపాదించాక నాయకురాలి వెనక్కి తోసి విప్లవ నాయకి బిరుదుని వదిలేసి అమ్మగా ఆదరించే దేవతగా నిలబడ్డారు. రెండు చేతులా ఆమె అందించిన సంక్షేమ పథకాలతో ఆమెకు అన్ని వర్గాలు నీరాజనం పట్టాయి. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ద్రావిడ పార్టీలకు జయలలిత వంటి బ్రాహ్మణ స్త్రీ నాయకత్వం వహించిందీ అంటే రాజకీయాల్లో ఆమె ఎంత కఠినమైన నిర్దాక్షణ్యమైన నేతగా రూపం మార్చుకుందో తెలుస్తుంది. సొంత కుటుంబం అంటూ లేదు జయలలిత తమిళనాడు ప్రజలందరికీ అమ్మ అయిందని నిరూపించేందుకు ఆమె పార్థివ దేహాన్ని సందర్శించికొనేందుకు ఆమెకు చివరివీడ్కోలు పలికేందుకు మెరీనా బీచ్ లో హాజరైన జన సందోహంమే నిదర్శనం. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆమెదో ప్రత్యేక అధ్యాయం. వెండి తేర నేలిన ఈ ఒకనాటి తార అఖండ జ్యోతిగా వెలిగేందుకు ఆకాశానికి చేరింది పది కోట్ల మంది తమిళ ప్రజల అమ్మ అన్న పిలుపుకి అందనంత దూరoవెళ్లిపోయింది

    అమ్మకు అక్షరాంజలి

    వంటరి నడకతో అలసిపోయిందేమో 60 ఏళ్ళకి ఆగిపోయింది ఎక్కడానికి శిఖరాలేమీ లేవేమో శిఖరాగ్రాన సెలవు తీసుకుంది కోట్లాది మంది కన్నీరు తోడుగా కోమల వల్లి వెళ్ళిపోయింది బడుగు…

  • పాపాయికి జన్మ ఇచ్చాక కొత్త హోదాలోకి వచ్చాక అమ్మ శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అటువంటి మార్పుల్లో జుట్టు ఊడిపోవటం ఒకటి. దీన్ని పోస్ట్ పార్టమ్ హెయిర్ లాస్ అంటారు. ప్రసవం తర్వాత హార్మోన్లు నెమ్మదిగా సాధారణ స్థాయికి వచ్చేస్తుంటాయి. దీనితో పాటు జుట్టు సహజంగా రాలే ప్రక్రియ కూడా ఆరంభం అవుతుంది. మరో కారణం శారీరిక ఎమోషనల్ ఒత్తిడి. 360 డిగ్రీల కోణంలో జీవితం మారిపోయినందున దీనికి తగట్టుగా శరీరం తనను తాను సిద్ధం చేసుకునే క్రమంలో ఒత్తిడితో జుట్టు కాలిపోయి యధాతధంగా మళ్ళీ వస్తుంది. మరీ ఊడటం తగ్గకపోతే శిరోజాల నిపుణులు హెయిర్ సప్లిమెంట్లు మాడుకు అప్ప్లయ్ చేయవలిసిన పోషకాలు ఇస్తారు. శిరోజాలకు చక్కని ఫీడింగ్ కావాలి. గుడ్లు సొయా లెంటిల్స్ చేపలు చికెన్ ప్రోటీన్స్ వారంలో రెండు సార్లు హెయిర్ వాష్ చేసుకుని వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో దువ్వుకోవాలి.

    ఇది చాలా సహజం

    పాపాయికి జన్మ ఇచ్చాక కొత్త హోదాలోకి వచ్చాక అమ్మ శరీరంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. అటువంటి మార్పుల్లో జుట్టు ఊడిపోవటం ఒకటి. దీన్ని పోస్ట్ పార్టమ్  హెయిర్…

  • వాతావరణ కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని పోగొట్టుకుంటుంది. వీటిలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ సమస్యలొస్తాయి. చెంపలు ముక్కు దగ్గర సమస్య కనబడుతూ ఉంటుంది. చర్మం రంగు తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ముఖానికి శాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ లు వాడాలి. అలాగే క్లిందా మైసిన్ , బెంజైడ్, పేరాక్రైడ్, రెటినాయిడ్ ఉన్న క్రీములు ముఖ చర్మం స్మూత్ గా అయిపోయేందుకు ఉపయోగపడతాయి. లేదా బ్యూటీక్లినిక్స్ లో అయితే శాలిసిలిక్ యాసిడ్ క్రీములు అప్ప్లయ్ చేయటం కెమికల్ పీల్ చేస్తుంటాయి. వీటివల్ల చర్మం పైన పేరుకున్న జిడ్డు మృతకణాలు పోయి చర్మం నిగారింపుగా వస్తుంది. లేదా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్ లో తయారు చేసుకోవచ్చు. సున్నిపిండి సెనగపిండి సరిపాళ్ళ లో కలిపి నిమ్మరసం తేనె కలిపి మర్దన చేసినా చర్మం రంగు చక్కగా అయిపోతుంది. టమాటా గుజ్జు తేనె నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకున్న చర్మ కాంతి మెరుగవుతుంది. సమస్యలన్నీ పోతాయి.

    వెనకటి రంగొస్తుంది

    వాతావరణ  కాలుష్యం భయపెడుతున్న ఆఫీస్ కో. కాలేజీ కో , లేదా ఇంట్లో పనుల గురించి బయట తిరగక తప్పదు. దుమ్ము జిడ్డు పేరుకునిపోయి చర్మం మృదుత్వాన్ని…

  • సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా అనే హైట్రాడ్ పండు సృష్టించారు. తైవాన్ లో దొరికే ఈ పండు పేరు పైనాపిల్ షుగర్ ఆపిల్. మళ్ళీ తొక్కలు వుండే లక్ష్మణ ఫలాన్ని దక్షిణ అమెరికా లో బిరిబా అని పిలుస్తారు. సీతా ఫలం తో పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. దీన్ని షుగర్ ఆపిల్ అంటారు. మహబూబ్ నగర్ ,బాలా నగర్ ,షహరాన్ పూర్ ,ఇలా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన మేలు జాతి సీతా ఫలాన్ని తియ్యని గుజ్జుతో ఉంటాయి. ఇప్పుడు హైద్రాబాద్ లో సీతా ఫలాల గుజ్జుతో చేసే ఐస్ క్రీమ్ చాలా పాపులర్ కూడా. ఈ మధురమైన సీతాఫలం లో పోషకాలు ఎక్కువే. వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలుంటాయి. ఆపిల్ .మామిడి బొప్పాయి తో పోలిస్తే ఇందులో ఎక్కువే. తక్కువ బరువు ఉంటే హాయిగా రోజుకు పండు తిని బరువు పెరగచ్చు. అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్స్ గా వేరు పడ్డ సీతా ఫలం ఔషధ విలువలు ఎంత ఎక్కువంటే సీతా ఫలం సీజన్ ఎప్పుడూ ఉంటే ఎంత బావుంటుందో అనుకునేంత అసలు సీజనల్ ఫ్రూట్స్ ఏవి దొరికినా వాటిని ఆ కాలంలో తినేయటం శరీరానికి లాభం.

    సీతా ఫలం ఎంతో మధురం

    సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా  అనే హైట్రాడ్…

  • మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా, ఐరోపాలో జరిగిన మిస్ వరల్డ్ పోటిలలోను తలాపడింది. కేరళ లోని ప్రభుత్వ ఫ్యాషన్ షో లలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్, గ్లాస్ పెయిన్టింగ్ కళాకారిణి, నగల డిజైనర్ కూడా ఇంతేనా, స్కూటర్ నేర్చుకుని లైసెన్సు కోసం వెళితే అధికారులు చెవులు వినిపించవు మాటలు రావు ఇవ్వలేం అంటే హై కోర్ట్ కి ఎక్కి లైసెన్సు సంపాదించుకుంది. కేరళలో ఇలాంటి లైసెన్సు తీసుకున్న మొట్టమొదట అమ్మాయి సోఫియానే. ఇంతేనా షార్ట్ ఫుట్లో రాష్ట్ర స్థాయి క్రీడా కారిణిగా ఎనిమిది సార్లు జాతీయ విజేత, మూడు సార్లు నిలబడింది. ఈ అమ్మాయిని పోగిడెందుకు అక్షరాలు సరిపోవడం లేదు. సోఫియాను ఎంత మంది ఆదర్శంగా తీసుకోవచ్చు.

    వినిపించదు…. మాటాడదు…. ఇన్ని నైపుణ్యాలా?

    మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా,…