• కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ దుంపలో ఎన్నో రకాలున్నాయి. మన దగ్గర తెలుపు లేదా లేత పసుపు రంగు గుజ్జు వున్న చిలకడ దుంపలుంటాయి. కానీ పసుపు, నారింజ, ఎరుపు, గోధుమ, వంకాయ రంగు ఇలా ఎన్నో విభిన్నమైన రంగుల దుమ్పలున్నాయి. ఈ రంగుల దుంపలు మరింత తియ్యగా ఉంటాయి.చైనా, కొరియా వంటి దేశాల్లో ఈ దుంపలు కాల్చి లేదా బేక్ చేసి అమ్ముతారు. రక్తంలోని చెక్కని నిల్వల్ని నియంత్రించే గుణం గల చిలకడ దుంపలని, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ మధుమేహం రోగులకి మంచి ఆహారం అని సిఫార్సు చేసింది. పిండి పదార్ధాలు, పిచు, విటమిన్-ఎ,బి,సి,బి9, లు కాల్షియమ్ ఇవన్నీ కలిగి వున్న ఈ తియ్యని దుంప మంచిది ఆహారం. కాల్చి తిన్న, ఉడికించి తిన్న ఎంతో రుచి.

    పోషకాలతో నిండిన చిలకడ దుంప

    కూరగాయల్లో అత్యంత రుచికరమైన స్నాక్ ఫుడ్ ఏది అంటే చిలకడ దుంప అంటారు. ఇందులో ఉన్నన్ని అద్భుతమైన పోషకాలు ఇంకెందులోనూ వుండవంతున్నారు. అందమైన పొదలా పాకే చిలకడ…

  • ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార నిపుణులు. ఘూస్ బెర్రీ ని సహజ సిద్దమైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఎక్కువగా వాడతారు. శరీరంలోని మలినాలను తొలగించడంలో రక్త సుద్ధి చేయడంలో ఈ పండ్లు ఎంతో ఉపయోగ పడతాయి. ఎంజైమ్స్ పుష్కలంగా వుండే బొప్పాయి చర్మానికి మృదుత్వాన్ని, మెరుపును ఇస్తుంది వృద్దాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అవకాడో చలికాలం సమస్యలు చర్మం దెబ్బతినకుండా కాపాడుటుంది. దీన్ని ఒక్క సహజమైన మాయిశ్చురైజర్ గా కూడా వాడుతారు. ఇక దానిమ్మ పండు చెర్మంలో తేజస్సు నింపుతుంది. చర్మ రంద్రాల్ని శుబ్రం చేయడంతో పాటు ముడతలను పోగొడుతుంది. పైనాపిల్ ఇది విటమిన్-సి పుష్కలంగా వున్నా పండు. మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది. ఇక అరటిపండు లో వున్న పొటాషియం చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. ఋతువులతోనే సంబంధం లేకుండా కూడా సహజంగా దొరికే ఏ పండైనా వదలకుండా తినేయడం మంచిది అంటున్నారు నిపుణులు.

    చర్మ సంరక్షణ కోసం ఈ పండ్లు

    ఈ రుతువు లో ఎంత సేపు వేడిగా తిన్నా తాగిన బాగుంటుంది అనుకుంటాము కానీ చర్మాన్ని మృదువుగా వుంచడంలో పండ్లు చాలా ఉపయోగ పడతాయి అంటున్నారు పోషకాహార…

  • ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని చెప్పుతుంటారు తల్లులు ఇది వరకోసారి సమంతా లి అనే మలేషియా కు చెందిన పిల్లల తల్లికి ఇదే ప్రాబ్లం వాళ్ళతో వేగ లేక వాళ్ళ బోజనాల ప్లేట్ లో అన్నం క్యారెట్, టొమాటో, ఆపిల్, వంటివి ఉపయోగించి ఎన్నో రకాల బొమ్మలు చేసి ఆ బొమ్మల గురించి కధలు చెప్పేదిట. పిల్లలు బొమ్మలు చూసి అమ్మా కదల మాయాజాలం లో పడి ప్లెటు ఖాలీ చేసేవారంట. ఇవన్నీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెడితే లక్ష మంది మెచ్చుకున్నారు. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళ కోసం fruit carving, vegetable carving స్టాక్ ఫొటోస్ చూసి ఆ కోర్సు నేర్చుకుని పిల్లల్ని మంచి ఫుడ్ తినేలా చేయొచ్చు. ఇంత అందమైన ఫుడ్ ఇంట్లో చూసి పిల్లలు పిజ్జాలు అడిగితె ఆప్పుడు చెప్పండి.

    అమ్మ చేతి బొమ్మలు

    ఇద్దరు, ముగ్గురు పిల్లల తల్లులు చేరిన చోట తప్పని సరిగా మాట్లాడుకునే విషయం వాళ్ళ పిల్లల భోజనం విషయమే. ముద్ద చూపిస్తే చాలు పరుగెత్తి పోతారు అని…

  • టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు గణాంకాలు. ప్రపంచంలో నానారకాల టీ లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో అస్సాం టీ , డార్జిలింగ్ టీ , నీలగిరి టీ లకు అద్భుతమైన గిరాకీ వుంది. ఇన్ని చెప్పుకున్నాక చక్కని టీ తాగాలి అనుకుంటే అన్ని సందర్భాలకు ఒక టీ పనికి రాదు అంటారు ఎక్సపర్ట్స్. శరీరంలో ఏమాత్రం చురుకుదనం లేకపోతే జీవన క్రియ వేగం పడిపోతే గ్రీన్ టీ తాగాలట. నిద్ర లేక శరీరం అలసట తో ఉంటే చామంతి పూలు వేసిన టీ తాగాలి. ఒత్తిడి కలిగించే ఆలోచనలు వదిలించుకోవాలిఅంటే నిమ్మ పరిమళపు లెమన్ టీ తాగాలి. కడుపులో వికారంపెడితే అల్లం టీ ఉబ్బరంగా ఉంటే పుదీనా ఆకుల టీ తాగాలి. అవన్నీ పక్కనపెట్టి మనకు అందుబాటులో వుండే ఎదో ఒక టీ తాగాలి ఏమంటారు?

    టీ లేనిదే వెరైటీ నే లేదు

    టీ లేకపోతే మానవ జీవితంలో వెరైటీ వుండదండీ అన్నాడొకమహానుభావుడు. అదేమో గానీ మన జనాభా లో అత్యధికులకు అభిమాన పానీయం ఏమిటీ అంటే టీ నే అంటున్నారు…

  • వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్ లేవు. మరీ మంచాన పడితేనే డాక్టర్ మొహం చూసేది. చాలా చిన్ని చిట్కాలకు బోలెడన్ని అనారోగ్యాలు తలవంచేవి. బెల్లం అల్లంరసం కలిపితాగితే జాండీస్ తగ్గిపోతుంది. శొంఠి పొడి నీళ్లలో కలిపి నుదిటిపై పెడితే తలా నొప్పి తగ్గుతుంది. అల్లం నిమ్మరసం అజీర్తి కి మందు. అల్లం రసం తేనె ముక్కుదిబ్బడ ను తగ్గిస్తుంది. వెల్లులి రేకలు తేనె యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి తీసుకుంటే బరువు పెరగటం జరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సాధారణ ఆరోగ్యం బావుంటుంది. తమలపాకులో రెండు మిరియాల గింజలు పెట్టి చుట్టి తినేస్తే ఏడ తెరిపి లేని దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. వేడి పాలలో పసుపు వేసి తాగితే నిద్ర పడుతుంది. దగ్గు కూడా తగ్గుతుంది. ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేని ఈ చిట్కాలు ప్రయోగించి చూడండి . ఫలితం వంద శాతం ఉంటుంది

    ప్రకృతి సహజమైన ఉపశమనం ఇవి

    వంటింట్లో వుండే మందుల నిక్షేపాలను మనం పట్టించుకోము కానీ ఎన్నో ఖరీదైన మందులు ఇవ్వలేని ఉపసమానాలు ఇస్తాయివి. పూర్వం ఇన్ని మందులు లేవు ఖరేడీనా కార్పొరేట్ హాస్పిటల్స్…

  • ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు కలిపి ఎండుఫలాలు వాల్నట్స్ బాదం పలుకులు కలిపి తింటే రోజంతా ఉత్సాహమే. ఓట్స్ ఎంతో మంచివి. బరువు తగ్గటమే కాదు ఆరోగ్యానికీ మంచివే. వెన్న లేని పాలతో తింటే కేలరీలు తగ్గుతాయి. అరటి పండ్లు ముక్కలు. ఎండు ద్రాక్ష పండ్లు నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు తింటే బలానికి బలం. ఆరోగ్యం రాగి జావ ఎంతో మంచిది. ఇనుము కాల్షియం ఎక్కువ. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తహీనత దూరం అవుతుంది. బెల్లం యాలకులు వెన్న లేని పాలు బాగా మగ్గిన పండ్లు కలిపి తీసుకుంటూ త్వరగా ఆకలివేయకుండా పైగా ఎంతో బలం కూడా.

    బరువు తగ్గించి శక్తి నిచ్చే అల్పాహారం

    ఉదయపు అల్పాహారం మంచి శక్తిని ఇచ్చేదిగా కొవ్వు తగ్గించేదిగా ఉండాలంటున్నారు డైటీషియన్లు. వాల్నట్ బాదం శరీరానికి శక్తి ఇస్తాయి. కొవ్వు తగ్గిస్తాయి. పెరుగు పాల పదార్ధాలు పండ్లు…

  • రేగి పండులో నిండగా పోషకాలు

    రేగి పండులో నిండగా పోషకాలు

    రేగి వడియాలు తిన్నారా? రేగి పండ్లు కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒత్తిడిగా, ఆదుద్దాగా అనిపించినప్పుడు రెండు రేగి పండ్లు తింటే ఎంతో ఫలితం వుంటుంది. రేగి…

  • బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు కూడా విండో షాపింగ్ చేస్తూ వుంటారు . అలాగే హోటల్లో దొరికే అన్ని రకాల పదార్ధాలను ప్రదర్శనకు పెడితే బావుంటుందననుకున్నాడు జపాన్ కు చెందిన రెస్టారెంట్ యజమాని. రంగులద్దిన మైనంతో ఎన్నో రకాల ఆహార పదార్ధాలను నోరూరించేలా దృష్టిని ఆకర్షించేలా తయారుచేయించాడు. అప్పటినుంచి రెస్టారెంట్ లో పదార్ధాల ప్రదర్శన మొదలైంది . ప్లాస్టిక్ తో రకరకాల ఆహార పదార్ధాల నమూనాలు తయారుచేసే కంపెనీలు వెలిసాయి. ఇప్పుడది కోట్ల విలువ చేసే మార్కెట్. జపాన్ ,కొరియా ,చైనా రెస్టారెంట్లలో కొత్తకొత్త రకం పదార్ధాల నమూనాలు పెడితే మెనూ పైన చదివి కాకుండా ఇలా కళ్ళతో చూసి ఆర్దరించేందుకు కస్టమర్లు ఇష్టపడుతున్నారట. అచ్చమైన వంటకాలకంటే ఇంకా నిండైన రూపంలో ప్లాస్టిక్కో ,మైనంమో ఏదైనా కనిపించే ముందు నోరూరటం ఖాయం. పోనీ తినేద్దామనుకోవటం కస్టమర్స్ బలహీనతే కదా.

    కళ్లకింపుగా ప్లాస్టిక్ ఆహారం

    బట్టలు చెప్పులు లాంటివి అమ్మే షోరూం లలో తమ దగ్గరుండే అన్నిరకాల వస్తువులు షోకేస్ లో ప్రదర్శనకు పెడుతూవుంటారు. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పటికీ అదే పద్దతి. మనవాళ్ళు…

  • నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో బోలెడన్ని ప్రోటీన్స్ పొటాషియం మాంగనీస్ జింక్ విటమిన్ కె వంటి నిల్వలు పుష్కలంగా వున్నాయి. కనుక ప్రతి రోజు ఆహారంలో తినండి అంటున్నారు. పీచు విటమిన్ సి విటమిన్ బి6 ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పండ్లు కూరగాయల్లో సెలెనియం ఖనిజం అంతగా దొరకదు. సెనగల్లో పుష్కలంగా దొరికే సెలీనియం కాన్సర్ లు రాకుండా కాంతులు పెరగకుండా కాపాడుతుందంటున్నారు. అలాగే డిఎస్ఏ తయారీకి కారణమయ్యే ఫోలేట్ కూడా ఉంటుంది. నిద్రకీ కండరాల కదలికకు అధ్యయనానికి జ్ఞాపక శక్తికీ ఎంతో అవసరమైన కొలీన్ కూడా ఉంటుంది. కనుక సెనగల్ని పచ్చిగా అంటే నానబెట్టి లేదా ఉడికించి రెగ్యులర్ గా కూరల్లో వేసి ఎదో రకంగా ప్రతి రోజూ తినమంటున్నారు.

    విటమిన్లు ఖనిజాల నిండుగా వుండే సెనగలు

    నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో…

  • శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్ చేస్తాయని అనుకోవడం దండగే పలు పరిశోధనలు చెప్పుతున్నాయి. పచ్చి కూరలు ఎంత కడిగినా వాటి పైన సుక్ష్మ జీవులు నసించవు. అంచేత వాటిని ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే పచ్చి వాటికంటే మేలు చేస్తాయి. కూరగాయలు అతిగా నూనెలో వేయించడం,మసాలాలు దట్టించి మైళ్ళ కొద్ది సువాసనలు వచ్చేలా వండటం చేయకుండా కొద్ది పాటి నూనె లేదా ఆవిరిపైన వుడికించడం మేలు అంటున్నారు. టొమాటో, కారెట్, క్యాబేజీ, మిర్చీ వంటివి పచ్చిగా కంటే కొంచం ఉడికాక తింటేనే ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి అంటున్నారు పరిశోధకులు. నాన బెట్టి, పచ్చిగా కట్ చేసి తింటే మంచి దనుకోవడం కేవలం అపోహే అంటున్నారు.

    పచ్చి కురలకంటే వండినవే బెస్ట్

    శరీరానికి మంచి చేస్తాయనో, నిపుణులు చెపుతున్నారనో కష్ట పడి పచ్చి కూరగాయాలు తినాలని ప్రయత్నిస్తాం. కారెట్ తో ఆగిపోతూవుంటుంది మన వ్రతం. కానీ పచ్చి కూరగాయలు మంచ్…

  • ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన విటమిన్లను గ్రహించటం తో నెయ్యిదే కీలకపాత్ర. కొబ్బరి ఇది చర్మానికి శిరోజాలకు చేసే మేలు అంతా ఇంతా కాదు. జీడిపప్పు కాల్షియం మెగ్నీషియం అధికంగా వుండే జీడిపప్పు కండరాలకు ఎముకలకు బలం. డయాబెటిక్ ఉంటే దాని కనిష్ట గ్లైనమిక్ ఇండెక్స్ ఎంతోమంచి చేస్తుంది. అరటి పండులో కొవ్వులు వుండవు. అరటి ఆనందం కలిగిస్తుంది. బూడిద గుమ్మడి శరీరంలో నీరు నిల్వ నివ్వదు. విషపూరిత పదార్దాలను శరీరం నుండి బయటకు పంపుతుంది. ఉల్లి పాయలో సల్ఫేర్ అధికం. వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సముద్రపు ఉప్పులో పోషకాలు 88 సూక్ష్మ లవణాలు వున్నాయి. బంగాళా దుమ్పలో కొవ్వులేదు. కార్బోహైడ్రాట్స్ పోషక పదార్ధాలున్నాయి. కాలీఫ్లవర్ లో పీచు యాంటి ఆక్సిడెంట్ గుణాలున్నాయి. పాల ఉత్పత్తుల్లో ఎన్నో ఆమ్లాలు లభిస్తాయి. తెల్ల నువ్వులు ఇది వెన్నకు ప్రత్యామ్నాయం. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. తెల్లని పదార్దాలకీ ఆరోగ్యానికీ ఎంతో దగ్గర సంబంధం ఉంది.

    తెల్లనివి తింటేనే ఆరోగ్యం

    ఒక చిన్న తమాషా. మనకి ఆరోగ్యం  అందించేవన్నీ తెల్లని రంగులోనే ఉంటాయి. గమనించారా ? నెయ్యి తెల్లగా ఉంటుంది. మెదడు పనితీరు కీళ్లు మెరుగ్గా ఉండటం కీలకమైన…

  • పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా వగరు రుచితో వుండే సీమచింత పక్వానికి వస్తున్న కొద్దీ బంగారు రంగు గులాబీ ,ఊదీ, ఎరుపు రెంగుల్లోనే మారిపోతుంది. పండిందంటే పై తొక్క ఊడి వచ్చేస్తూ ఉంటుంది లోపల ఒక్కొక కణాలపు తో తెల్లని గుజ్జు మధ్యలో నల్లని గింజ ఉంటాయి. దాన్ని సీమ తమ్మ అని కూడా పిలుస్తారు. తమిళనాడు కేరళ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఆంద్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో విరివిగా మొలుస్తాయి. ఈ చెట్టు. నీటిశాతం ఎక్కువ వుండే సీమచింత కాయల్లో పోషకవిలువలు ఎక్కువే. కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ నియాసిన్ విటమిన్ సి లు పుష్కలంగా వుండే సీమచింత గొంతు చిగుళ్లు నోటిపూత నివారణకు ఉపయోగపడుతుంది. ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను సబ్బుల తయారీలో వాడతారు. క్షయ వ్యాధి నివారణకు ఈ చెట్ల వేర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు సీమచింతకాయలు కూడా అమ్మకానికి పెడుతున్నారు చూడండి.

    తెల్లని గుజ్జు వలిస్తే నల్లని రంగు

    పల్లెటూర్లలో పొలాల గట్ల వెంబడి స్వేచ్ఛగా పెరిగే చెట్లలో సీమ చింత కూడా ఒకటి. కాయగా ఉన్నప్పుడు ఆకు పచ్చగా గట్టిగా  వగరు రుచితో వుండే సీమచింత…

  • గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి చేరింది. గ్రీన్ టీ తాగితే మొటిమలు మాయం అయిపోయాయంటున్నాయి ఈ సరికొత్త అధ్యయనాలు. మరీ ముఖ్యంగా ,ముక్కు గదమ ప్రాంతాల్లోకి మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీ వల్ల కేసంలోని అంకుర ప్రాంతంలో నూనె స్రవించే గ్రంధుల వద్ద బాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు కారణమయ్యే బాక్టీరియా అంతగా పెరిగే అవకాశం ఉండదు అంటున్నారు తైవాన్ లోని నేషనల్ యాంగ్ మింగ్ యూనివర్సిటీ పరిశోధకులు గ్రీన్ టీ లోని ఎపిగాలోకే టెచిన్-3 గాల్వేజ్ అనే పోషకం మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలో బాక్టీరియా పెరగకుండా చేస్తుందిట. దానికి తోడు ఆ పోషకం లోని వాపు మంట తగ్గించే యాంటీ ఇన్ఫలమేటరీ గుణం సైతం మొటిమలు రాకుండా వుండేందుకు దోహదం చేస్తుందని పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి.

    గ్రీన్ టీ తో మొటిమలు తగ్గుతాయి

    గ్రీన్ టీ గురించి మాట్లాడుకునివుంటాం. ఎన్నో ఉపయోగాలున్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడో సరికొత్త అధ్యయనం వల్ల  ఇంకో కొత్త అంశం ఈ ఉపయోగాల్లోకి వచ్చి…

  • సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా అనే హైట్రాడ్ పండు సృష్టించారు. తైవాన్ లో దొరికే ఈ పండు పేరు పైనాపిల్ షుగర్ ఆపిల్. మళ్ళీ తొక్కలు వుండే లక్ష్మణ ఫలాన్ని దక్షిణ అమెరికా లో బిరిబా అని పిలుస్తారు. సీతా ఫలం తో పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. దీన్ని షుగర్ ఆపిల్ అంటారు. మహబూబ్ నగర్ ,బాలా నగర్ ,షహరాన్ పూర్ ,ఇలా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన మేలు జాతి సీతా ఫలాన్ని తియ్యని గుజ్జుతో ఉంటాయి. ఇప్పుడు హైద్రాబాద్ లో సీతా ఫలాల గుజ్జుతో చేసే ఐస్ క్రీమ్ చాలా పాపులర్ కూడా. ఈ మధురమైన సీతాఫలం లో పోషకాలు ఎక్కువే. వంద గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలుంటాయి. ఆపిల్ .మామిడి బొప్పాయి తో పోలిస్తే ఇందులో ఎక్కువే. తక్కువ బరువు ఉంటే హాయిగా రోజుకు పండు తిని బరువు పెరగచ్చు. అరిస్టోక్రాట్ ఆఫ్ ఫ్రూట్స్ గా వేరు పడ్డ సీతా ఫలం ఔషధ విలువలు ఎంత ఎక్కువంటే సీతా ఫలం సీజన్ ఎప్పుడూ ఉంటే ఎంత బావుంటుందో అనుకునేంత అసలు సీజనల్ ఫ్రూట్స్ ఏవి దొరికినా వాటిని ఆ కాలంలో తినేయటం శరీరానికి లాభం.

    సీతా ఫలం ఎంతో మధురం

    సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా  అనే హైట్రాడ్…

  • చాక్లేట్లు తయారుచేసే కోకోవా గింజలు అనడాన్ని పెంచే సెరటోనిక్ విడుదలకు ఎంతగానో తోడ్పడతాయట. అందుకేనేమో శుభాకాంక్షలు చెప్పేందుకు చాక్లేట్స్ పంచుతుంటారు. అన్నట్లు లక్షల విలువ చేసే చాక్లేట్లు ఉంటాయి. నిప్ షీల్డ్ ఫ్రిట్జ్ కంపెనీ తయారుచేసిన చాకోపాలజీ ప్రపంచంలో కెల్లా ఖరీదైంది. అత్యుత్తమ ట్రిఫిల్ కరోవా బీన్స్ తో తయారు చేసే అరకిలో విలువ రెండు లక్షలు దాని తర్వాత స్థానం నోకా వింటేజ్ కలెక్షన్ ది. దీనికోసం ట్రిన్డాప్ ఈక్వెడార్ వెనిజులా కోట్ డీవార్ నుంచి కోకోవా గింజల్ని స్వీకరిస్తారు. నాణ్యమైన కోకోవా గింజల తోనూ 24 క్యారట్ల బంగారు ఆకుల తోనూ చేసే డెలాఫీ ది మూడో స్థానం. ఇక చాకో లెట్ బార్ విషయానికొస్తే క్యాడ్ బరీ విస్సా దే ప్రధమ స్థానం. దీని ఖరీదు ఒక లక్షా ఆరువేలు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల చాక్లేట్ ఉత్పత్తులను తినేస్తున్నారు. వీటిలో సగం వాటా అమెరికన్లది. మిల్క్ చాక్లేట్లంటే వాళ్ళకి మరీ ఇష్టం. వంటల్లోనూ చాక్లేట్ రుచే !

    అరకిలో ఖరీదు సుమారు రెండు లక్షలు

    చాక్లేట్లు తయారుచేసే కోకోవా గింజలు అనడాన్ని పెంచే సెరటోనిక్ విడుదలకు ఎంతగానో తోడ్పడతాయట. అందుకేనేమో శుభాకాంక్షలు చెప్పేందుకు చాక్లేట్స్ పంచుతుంటారు. అన్నట్లు లక్షల విలువ చేసే చాక్లేట్లు…

  • ఐస్ క్రీమ్ తినటం వల్ల పళ్ళు పాడైపోతాయని జలుబు చేస్తుందని సాధారణంగా పిలల్లకు తల్లులు చెప్పే అపోహలు. నిజమే ఐస్ క్రీమ్ వల్ల జలుబు చేస్తుందని చెప్పటం కేవలం అపోహ. ఐస్ క్రీమ్ లో వాడే పాలు అందులోని చక్కర కారణంగా గొంతు బొంగురుపోతుందని చాలా మంది చెప్పే మాటలు పూర్తిగా నిరాధవం అంటున్నారు. మాయో క్లినిక్ వైద్య నిపుణులు. పడిసెమ్ పడితే చల్లని ఐస్ క్రీమ్ తినటం మేలనీ దాని వల్ల బొంగురు పోయిన గొంతుకు కాస్త స్వాంతన కలుగుతుందనీ చెపుతున్నారు. సాధారణంగా జలుబు చేస్తే వళ్ళు భారమై కడుపు నిండా ఏదైనా తినాలన్నా విసుగ్గానే ఉంటుంది. అప్పుడు ఐస్ క్రీమ్ తింటే అందులోని చక్కర వల్ల తక్షణ శక్తి వస్తుందనీ వెంటనే రిలాక్స్ అవుతుందనీ వైద్య నిపుణులు గట్టిగ చెప్పేశారు. అంచేత ఈసారి ఐస్ క్రీమ్ కనిపిస్తే పెద్దలు వద్దని మొత్తుకుంటున్నా పిల్లలు అమ్మే కదా ఏంచేయలేదులే అన్న భరోసా తో పిల్లలు ఐస్ క్రీమ్ లాగించవచ్చన్నమాట.

    ఐస్ క్రీమ్ హాయిగా తినండి ఏం పర్లేదు

    ఐస్ క్రీమ్  తినటం వల్ల పళ్ళు పాడైపోతాయని జలుబు చేస్తుందని సాధారణంగా పిలల్లకు తల్లులు చెప్పే అపోహలు. నిజమే ఐస్ క్రీమ్ వల్ల జలుబు చేస్తుందని చెప్పటం …

  • కాఫీ ఇష్టం లేనిదెవరికి? ఫిల్టర్ కాఫీ తాగినా లేదా ఇన్స్టెంట్ రుచి అయినా అన్నీ బానేవున్నాయనిపిస్తోంది. వేడిగా కాఫీ వాసనొస్తే చాలనిపిస్తుంది. కానీ కాఫీ మేకింగ్ గొప్ప ఆర్ట్ అనీ దీన్ని ఒక పద్దతి లో కలిపి తేనె అసలైన రుచి అంటారు నిపుణులు. ముందు నాణ్యమైన గింజల్ని రోస్ట్ చేసిన డేట్ చూసి మరీ కొనాలి. గాలి చొరబడని డబ్బాలు నిల్వచేయాలి. ఫ్రీజర్ లో ఉంచకూడదు. వాడే ముందర గింజల్ని గ్రైండ్ చేయాలి. మాములు మంచి నీళ్లు మరగనిచ్చి పొడిని ఫిల్టర్ లో వేసి అందులో నీళ్లు పోసేయాలి. ఫ్రెష్ డికాషన్ దిగుతుంది. వేడి వేడి పాలలో చక్కగా దిగిన డికాషన్ కలిపి పంచదార తగినంత వేసి తాగితే అదే స్వర్గం అనుకోవచ్చంటారు నిపుణులు. సరైన కొలత అంటే ఒక న్యూస్ కాఫీ పొడి అయితే ఆరు జెన్సుల నీళ్లు. అలాగే ఎన్ని కప్పులు కావాలో లెక్కేసుకుని అన్ని స్పూన్లు అన్ని జెన్సుల నీళ్లు పోయాలి. కాఫీ అద్భుతంగా వుండాలంటే ఇదీ పద్దతి. ముందు మంచి గింజలు ఎక్కడ దొరుకుతాయో వెతకాలి.

    కాఫీ మేకింగ్ నాట్ ఈజీ

    కాఫీ ఇష్టం లేనిదెవరికి? ఫిల్టర్ కాఫీ తాగినా లేదా ఇన్స్టెంట్ రుచి  అయినా అన్నీ బానేవున్నాయనిపిస్తోంది. వేడిగా కాఫీ వాసనొస్తే చాలనిపిస్తుంది. కానీ కాఫీ మేకింగ్ గొప్ప…

  • రొటీన్ కి భిన్నంగా చేసే ఏదైనా ఎక్సర్ సైజ్ చేయాలనుకుంటే magenetic dumb bell ట్రై చేయొచ్చు. చేతి కండరాళ్ళు ధృడంగా వుండేందుకు బరువైన డంబెల్స్ వాడతారు కదా. అవి బరువుగా వుంటాయి పైగా వాటిని మోస్తూ వుండాలి. ఈ మాగ్నెటిక్ డంబెల్స్ చూసేందుకు గాజుల్లా వున్నాయి. వాటిని బుజానికి ఒకటి మణికట్టు దాటి మరొకటి తగిలించుకుంటే చాలు. ఎంత బరువు ఎత్తాలనుకుంటున్నారు సెట్ చేసుకుంటే చాలు. వాటిల్లోని అయిస్కాంత శక్తి కారణంగా ఒక దాన్ని ఒకటి ఆకర్షించుకుంటాయి. మాములుగా వీటిని పట్టుకున్నా చతికి తోడుకున్నా తెలికగ్గా వున్న చేతుల్ని ముందుకు వెనక్కు చాచడం మాత్రం చాలా కష్టం. డంబెల్స్ ఎత్తేటప్పుడు ఎంత శక్తిని వినియోగించాలో ఇక్కడ కూడా అంతే శక్తిని వినియోగించాలో ఇక్కడ కూడా అంతే శక్తిని ఉపయోగించాలి. వీటిని ఊరు వెళ్ళేటప్పుడు కూడా బాగ్ లో పడేసుకుని తీసుకు పోవొచ్చు.

    గాజుల్లా తొడుక్కునే డంబెల్స్

    రొటీన్ కి భిన్నంగా చేసే ఏదైనా ఎక్సర్ సైజ్ చేయాలనుకుంటే magenetic dumb bell ట్రై చేయొచ్చు. చేతి కండరాళ్ళు ధృడంగా వుండేందుకు బరువైన డంబెల్స్ వాడతారు…

  • మంచి నిద్రకు ఆహారానికీ సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా ప్రభావం చూపించక పోయినా పరోక్షంగా ఆరోగ్యాన్ని దాని ద్వారా నిద్రనూ దెబ్బ తీస్తాయి. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం మాత్రం సంపూర్ణాహారం అని మనం పిలిచే పాలు ఒకటే. ఇందులో అన్ని పోషకాలతో పాటు ట్రెప్టోఫాన్ ,అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇవి గోరువెచ్చగా ఉండేలా నిద్రకు ఉపక్రమించేముందర తీసుకోవాలి. అలాగే ఓట్ మీల్ వరి వంటి కార్బోహైడ్రేట్స్ తిన్నాక కూడా నిద్రవస్తుంది. వీటిలోని మెలటోనిన్ అనే పదార్ధం కండరాలకు రిలాక్స్ చేసి నిద్రను ఇస్తుంది. అలాగే విటమిన్ సి వుండే బొప్పాయి అనాస నిమ్మజాతి పండ్లు సెలెరియం ఎక్కువగా వుండే చేపలు బాదాం వంటి నట్స్ కూడా ఆరోగ్యకరమైన నిద్రను ప్రోత్సహిస్తాయి. బెడ్ రూమ్ నిశబ్ధంగా ప్రశాంతంగా వుంది. మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా ఉండాలి. ఎక్కువ వెలుగు లేకుండా ఉండాలి మసక చీకట్లో నిద్రకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతోంది.

    మంచి నిద్రకు మంచి భోజనం వాతావరణం

    మంచి నిద్రకు ఆహారానికీ  సంబంధం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి వేళల్లో వేడి కాఫీ టీ లు తాగితే నిద్రపట్టని వాళ్ళుంటారు. అలాగే ఎన్నో రకాల పదార్ధాలు నేరుగా…

  • నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న స్వీట్ రుచి గొప్పదనం ఇదే. మాములుగా డాక్టర్లు ఎం చేపుతరంటే ఒత్తిడి, అలసట శరీరానికి తినాలనిపించడానికి కారణాలు శక్తి తగ్గితే తీపి ద్వారా శరీరానికి తక్షణ సాయం అందుతుంది. ఈ కబుర్లు అలా వుంచి స్వీట్లు జోలికి వెళ్ళకుండా వుండాలంటే ముందస్తుగా వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు, అలాగే శరీరంలోని నీటి శాతం తగ్గినప్పుడు కూడా చెక్కర తినాలని పిస్తుందిట. ఈ ఫిలింగ్ వదిలించుకునేలా మనసుని కంట్రోల్ చేసుకుని తీరాలి. అలా తీపీ లేని జీవితాన్ని అలవరుచుకునే క్రమంలో మరీ వుండలేక పోతే 70 శాతం డార్క్ చాకొలెట్ ను రెండు ముక్కలు మాత్రం తినాలి. స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, ఖర్జూర పళ్ళు, అప్రికాట్స్, ఎండు ద్రాక్ష, అంజీర ఎదో ఒకటి తినాలి. స్వీట్స్ ఎంతో బాగుంటాయి. కానీ తింటే నష్టం మరీ ఎక్కువ.

    స్వీట్ బదులు ఇవి ట్రై చేస్తే బెటర్

    నాలుక ఎప్పుడు తియ్యదనాన్ని కోరుతూనే వుంటుంది. అనారోగ్యం రానీ, శరీర బరువు పెరగనీ, ఇలాంటి సమస్యలున్నా సరే స్వీట్ తినాలన్న కోరిక పోదు. స్వీట్ లో వున్న…