• ఇమాకైథల్ అంటే మణిపూర్ భాషలో తల్లులు నిర్వహించే మార్కెట్ అని అర్ధం. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో వుంది చారిత్రాత్మక మార్కెట్ ఇమాకైథల్. ఇది మణిపూర్ మహిళల శక్తికి చిహ్నమే కాదు ఆసియాలోనే అతి పెద్ద మహిళల మార్కెట్. 16వ శతాబ్దంలో ఏర్పాటైనట్లు భావిస్తున్న ఈ మార్కెట్ లో 500 మంది వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పెళ్ళయిన మహిళలు మాత్రమే ఇక్కడ వ్యాపారం నిర్వహించవచ్చు. ఇక్కడ వ్యాపారం కోసం మహిళలు కేవలం 40 రూపాయలు చెల్లిస్తే చాలు. వీళ్ళకి యూనియన్ వుంది. సభ్యులకు రుణాలిస్తుంది కూడా. ఇది కేవలం మార్కెట్ మాత్రమే కాదు మణిపూర్ మహిళల జీవన దర్పణం. 16వ శతాబ్దంలో జీవనోపాధి కోసం మగవాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల, ఇంకా యుద్దాల్లో పాల్గొనడం వల్ల ఆడవాళ్ళ కోసం ఇమాకైథల్ ఏర్పడిందని చెప్తారు. ఈ మార్కెట్ మహిళలు ఆంగ్లేయుల నుంచి తమ సరుకులను రక్షించుకొనేందుకు తుపాకులను పట్టుకొని పోరాటం చేశారు ఆ పోరాటం నూపిలాన్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ పోరాటం లో ప్రాణాలు ధారపోసిన మహిళల గుర్తుగా ఇంఫాల్ లో ఒక మ్యూజియం వుంది.

    ఇది మణిపూర్ మహిళల శక్తికి ప్రతీక

    ఇమాకైథల్ అంటే మణిపూర్ భాషలో తల్లులు నిర్వహించే మార్కెట్ అని అర్ధం. మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలో వుంది చారిత్రాత్మక మార్కెట్ ఇమాకైథల్. ఇది మణిపూర్ మహిళల…

  • కొన్ని మాటలు అనుభవంతో చెప్పినవి విని తీరాలి. చెప్పినవాళ్ళు ఏ వృత్తిలో వున్నారు వాళ్ళ అనుభవం ఏమిటన్న లెక్కలు అనవసరం. సమంత తిరుగులేని టాప్ స్టార్. ఎన్నో సినిమాల్లో కొన్ని వందల మందితో పని చేసిన అనుభవం ఆమెది. జనతా గ్యారేజ్ తో ఒక సక్సెస్ సంపాదించుకొన్న సమంత, ‘సమయo’, ‘ డబ్బు‘ ఈ రెండూ ఒక్కటే. ఉన్నప్పుడు విలువ తెలియదు అవి దూరమైతే తిరిగి రావు అంటోంది. నేను ఖాళీ, నేను బిజీ అన్న రెండు పదాలకు నేను పెద్దగ ప్రాధాన్యత ఇవ్వను. ఖాళీగా ఉన్నమనుకొంటూనే చేతి నిండా పని పెట్టుకోవచ్చు. చేయాల్సిన పని చాలా ఉన్నా ఖాళీ గా ఉండవచ్చు. ఖాళీనా, బిజీనా అన్నది పనిని మనం ఎంత ఆస్వాదిస్తున్నాం అనే దానిపైనే ఆధారపడి వుంటుంది. డబ్బుని, సమయాన్ని వాడుకోవడం తెలియాలి అది తెలిస్తే రెండింటికీ కొరత వుండదు అంటోంది సమంత. కరక్టే కదా పని వుంటే పని ఎక్కువైందనీ, పనిలేకపోతే పనిలేక ఇబ్బందిగా వుందని చెబుతుంటాం! మరి సమంత కరక్టే కదా!

    డబ్బు, సమయం రెంటినీ కరెక్ట్ గా వాడాలి

    కొన్ని మాటలు అనుభవంతో చెప్పినవి విని తీరాలి. చెప్పినవాళ్ళు ఏ వృత్తిలో వున్నారు వాళ్ళ అనుభవం ఏమిటన్న లెక్కలు అనవసరం. సమంత తిరుగులేని టాప్ స్టార్. ఎన్నో…

  • మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార వేసి ఆ తరువాత కాఫీ పొడి, వేడి నీళ్ళు పోస్తే కాఫీ టేస్టీ గా వుంటుందట. ఇలా ట్రై చేసి వుందం కదా. ఇంకోటి కోడి గుడ్డు సొనలో కొన్ని పాలు లేదా టేబుల్ స్పూన్ నీళ్ళు కలిపి ఆమ్లెట్ వేస్తే రుచిగా వుంటుంది, చూసేందుకు కూడా బావుంటుంది. కాలీఫ్లవర్ వండేప్పుడు ఓ టేబుల్ స్పూన్ పాలు పోస్తే కాలీఫ్లవర్ రంగు మారదు. బెండ కాయలు వేయించేప్పుడు పెరుగు ఓ స్పూన్ కలిపితే వేపుడు కరకరలాడుతుంది. ముక్కలు అతుక్కోవు. మిక్సీ లో ఇడ్లీ పిండి రుబ్బితే ఇడ్లీలు గట్టిగా వస్తుంటే ఇడ్లీ రవ్వ వేడి నీళ్ళలో నాననివ్వాలి. వెల్లుల్లి, అల్లo పేస్టు ఎక్కువగా మిగిలిపోతే అందులో కాస్త వేడి నూనె పోసి కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. పకోడీ పిండి కలిపాక అందులో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే పకోడీలు కరకరలాడతాయి.

    ఈ టిప్స్ తో వంట అదుర్స్

    మనకి వంట బాగా వచ్చినా సరే అనుభవం ఉన్నవాళ్ళు చెప్పిన కిటుకులు పాటిస్తే వండే వంట మరింత టేస్టీ గా వుంటుంది. కాఫీ ఫిల్టర్ లో పంచదార…

  • మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం గనుల్లో పని చేయాలనే నిర్ణయించుకొన్నారు. మైనింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోసం దరఖాస్తు చేస్తే ఒక్క కాలేజీ కూడా ఈమెకు సీటు ఇవ్వలేదు. చదువు విషయంలో లింగ వివక్షకు తావుండకోడదని వాదిస్తూ ఆమె హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. 1996 లో ఆమెకు అడ్మిషన్ దొరికింది. నాగపూర్ లోని రామ్ దేవ్ బాబా ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మైనింగ్ ఇంజనీర్ గా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. అదే కాలేజీ లో లెక్చరర్ గా కొనసాగుతున్నారు డాక్టర్ చంద్రణీ ప్రసాద్ వర్మ. మొట్ట మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్. అండర్ గ్రౌండ్ మైన్స్ లో ఇప్పటికీ మహిళలకు అనుమతి ఇవ్వడం లేదనే చంద్రణీ వర్మ ఆవేదన. మైనింగ్ రంగంలోకి చంద్రణీ వర్మని స్పూర్తిగా తీసుకొని మరింత మంది మహిళలు వస్తే బావుంటుంది.

    మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్

    మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం…

  • వెడ్డింగ్ సీజన్ లో కంచి పట్టు చీరలను రీప్లేస్ చేసే చీరలు ఏవైనా ఉన్నాయా అంటే లేవనే సమాధానం. నిజమైన నేతకారుల చేతుల్లో, ఆధునిక డిజైన్ లతో కంచి పట్టు ఎప్పుడూ ఎంత ఖరీదైనా వద్దన లేని చీరే. ఇప్పటికీ అందమైన చీరలన్నీ, చీర మొత్తం నేశాక అంచు కలిపి వేయడమే కంచి చీర ప్రత్యేకత. మాష్టర్ చేతుల్లో థ్రెడ్ టెంపుల్ బోర్డర్ చీరలు, ఇతర కాంచీపురం లేటెస్ట్ డిజైనర్ శారీస్ తో సహా ఎప్పుడూ పెళ్లి వేదికపై మేరిసిపోయేవే! అంత దాకా ఎందుకు ఆడ పిల్లల కళ్ళలో ఎట్రాక్షన్ కూడా లేత రంగులున్న పెద్ద కొంగు, చిన్న బోర్డర్ తో ఉండే కాంచీపురం చీరలే. సక్సెస్ సూత్రం మాత్రం కాలానికి అనుగుణంగా డిజైనర్స్ సృష్టించడం. ఆధునిక హంగులతో తీర్చి దిద్దిన ఈ వస్త్ర శ్రేణి ఎప్పుడూ ఆడవాళ్ల దృష్టిలో వంద మార్కులు వేయించుకోనేవే!!

    ఆకట్టుకొనే రంగులతో కంచి పట్టు

    వెడ్డింగ్ సీజన్ లో కంచి పట్టు చీరలను రీప్లేస్ చేసే చీరలు ఏవైనా ఉన్నాయా అంటే లేవనే సమాధానం. నిజమైన నేతకారుల చేతుల్లో, ఆధునిక డిజైన్ లతో…

  • ఈ రోజుల్లో మంచి జామ పళ్ళు వస్తున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జామ పండ్ల అన్ని వయసులవాళ్ళు షుగర్ కంప్లయింట్ వున్నవాళ్లు కూడా హాయిగా తినచ్చు. వీటిలో గ్లేసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. A ,C విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ,కెరోటిన్లు ,జామపండులో అధికం. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వృధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. ప్రతిరోజు ఒక పండు తినచ్చు. జామ పండులో వుండే సోడియం ,పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో వుండే విటమిన్ A కారణంగా కంటి చూపు బావుంటుంది. ఫోలిక్ యాసిడ్ ,విటమిన్ B9 అధికంగా ఉండటం వల్ల గర్భిణులు తింటే గర్భ శిశువు ఎదుగుదల బావుంటుంది. జామలో వుండే మెగ్నేషియం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కండరాలు నొప్పులు బాధించవు.

    పోషకాలున్న జామపండ్లు

    ఈ రోజుల్లో మంచి జామ పళ్ళు వస్తున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జామ పండ్ల అన్ని వయసులవాళ్ళు షుగర్ కంప్లయింట్  వున్నవాళ్లు కూడా హాయిగా…

  • దక్షిణాదిలో అగ్ర తారలంతా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కు రెడీ అయిపోతున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు. ఈ పాటకు రెండు మూడు రోజుల షెడ్యుల్. పారితోషకం మాత్రం అడిగినంత. అదే అట్రాక్షన్. జాగ్వార్ లో తమన్నా తన ఐటమ్ సాంగ్ కు 75 లక్షల పారితోషకం అందుకుందిట. ఆగడు ఐటమ్ సాంగ్ శృతి హాసన్ కు 40 లక్షల రూపాయిల పారితోషకం అందింది. రెగ్యులర్ ఐటమ్ గర్ల్ హంసా నందిని, ముమైత్ ఖాన్ లు అయితే 20 నుంచి ౩౦ లక్షలు. జనతా గ్యారేజ్ ఐటమ్ కోసం కాజల్ 63 లక్షల రూపాయిల చెక్ అందుకుంది. అంజలికి సరైనోడు లో పాట కు 45 లక్షల రూపాయిలు ముట్టాయి. లక్ష్మి రాయ్ పారితోషకం ఆర కోటి రూపాయిలంట. మరి ఐటమ్ సాంగ్స్ కి సరే అంటే నష్టం ఏముందీ ?

    ఐటమ్ సాంగ్స్ తో కనక వర్షం

    దక్షిణాదిలో అగ్ర తారలంతా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కు రెడీ అయిపోతున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు. ఈ పాటకు రెండు మూడు రోజుల షెడ్యుల్.…

  • సెల్ ఫోన్ తో సెల్ఫీస్ తీసుకోవడం ఇప్పటి ట్రెండ్ కదా. అప్పుడు మనం మనకి మనమే అందంగా ఫోటోలు దిగడం కష్టమే. ఈ బాధ లేకుండా సెల్ఫీ ఎన్ హాన్సింగ్ లైవ్ ఫీడ్ ఇమేజ్ ఇంజిన్ (సెల్ఫీ అన్నమాట) అనిపించే ఒక అద్దం వచ్చేసింది. ఈ అద్దం ముందు నిలబడి ఓ నవ్వు నవ్వితే అద్దమే ఫోటో తీసి దాన్ని ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తుంది. ఈ అద్దానికి కెమేరా తో పాటు మన ముఖాన్ని గుర్తించే సెన్సార్లు కూడా వుంటాయి కాబట్టి మనం అద్దం ముందు నిలబడి నవ్వగానే దాని పైన వుండే ఎల్ ఇ డి లైట్లు ఫోటో తీయడానికి సిద్ధంగా వునట్లు వెలుగుతాయి. మనకు కావాల్సిన ఫోజు పెడితే అద్దం ఫోటో తీసి ట్విట్టర్ అకౌంట్ కి అప్లోడ్ చేసేస్తుంది. ఈ మయాదర్పణాన్ని కావాలంటే ఆర్డర్ చేసి కొనుక్కో వచ్చు.

    ఇది ఫోటో గ్రాఫర్ అద్దం

    సెల్ ఫోన్ తో సెల్ఫీస్ తీసుకోవడం ఇప్పటి ట్రెండ్ కదా. అప్పుడు మనం మనకి మనమే అందంగా ఫోటోలు దిగడం కష్టమే. ఈ బాధ లేకుండా సెల్ఫీ…

  • ఇటు ఇంటి పనులు, అటు ఉద్యోగ బాధ్యతలతో క్షణం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు మహిళలు. ఈ యాంత్రికత పెరిగే కొద్దీ ఒత్తిడి తప్పదు. ఇందుకోసం పది నిముషాలు కేటాయించుకొండి, ఆ సమయంలో ఇలా చేయండి అంటున్నారు నిపుణులు. హాయిగా నవ్వుకోవడం, ఓ పాట పడుకోవడం లేదా ఒక్క పది నిమిషాలు విశ్రాంతిగా నిద్రపోవడం అయినా పర్లేదు. ఈ నిద్రని కూడా పవర్ న్యాప్ అంటారట. ఇలా చేస్తే కూడా ఒత్తిడి మాయమై జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు. జర్మనీ అధ్యయిన కారులు లేదా తోట పని మనస్సు ప్రశాంతత కోసం ధ్యానం అన్నింటికంటే బెస్ట్ పుస్తకం చదివే అలవాటు డెవలప్ చేసుకుంటే అన్ని రకాల వటత్తిడిలు మాయమైపోతాయంటున్నారు. తప్పని సరిగా సాహిత్యపు ఉద్యానవనం లోకి తలుపులు తెరవండి, సుఖంగా వుంటారు.

    పది నిమిషాలు కేటాయించినా చాలు

    ఇటు ఇంటి పనులు, అటు ఉద్యోగ బాధ్యతలతో క్షణం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు మహిళలు. ఈ యాంత్రికత  పెరిగే కొద్దీ ఒత్తిడి తప్పదు. ఇందుకోసం…

  • నోరు కట్టేసుకుని తిండి మానేసి వయామం చేస్తే తప్పని సరిగా బరువు తగ్గిపోతారు. ఇందులో షార్ట్ కార్ట్స్ ఏమి వుండవు. కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తూ పది రోజులకో సారి బరువు చూసుకుంటే ఎంత తగ్గుతున్నారో తెలుతుంది. ఆ తగ్గిన బరువు ఇంక పెరగనీయ వద్దు. వండుకునే విధానంలో మార్పు రావాలి. వేపుళ్ళు మానేసి గ్రిల్, బేక్, ఆవిరి మీద ఉడికించిన పదార్దాలే ఎంచుకోవాలి. ఇంట్లో వాళ్ళతో స్నేహితులతో బయటకు వెళ్ళినా నూనె, వెన్నా, నెయ్యి, క్రీమ్ లాంటివి, మైదా తో వండినవి ఎప్పుడూ ముట్టుకోవద్దు. సరదాగా కాలక్షేపం చేస్తూ కూడా సలాడ్లు, పళ్ళ రసం ఓ గ్లాసుతో సరిపెట్టుకోవాలి. మొత్తానికి బరువు తగ్గాలంటే తిండి పైన ఓ కన్నేసి వుంచాలి, అంతే.

    తగ్గాక మళ్ళి బరువు పెరగ వద్దు

    నోరు కట్టేసుకుని తిండి మానేసి వయామం చేస్తే తప్పని సరిగా బరువు తగ్గిపోతారు. ఇందులో షార్ట్ కార్ట్స్ ఏమి వుండవు. కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తూ…