• వేసవి వస్తే, సెలవులు మొదలైతే పిల్లలూ, పెద్దల ద్రుష్టి సమ్మర్ వెకేషన్ పైనే వుంటుంది. సంవత్సరపు బడలిక తీరేలా, ఏ బరువు బాధ్యత పట్టించుకోకుండా సొంత ఊరికో, లేదా ఏదైనా టూరో వెళ్ళాలి అనుకుంటారు. ఇది ముందే ప్లాన్ చేసుకుంటే రూమ్ రిజర్వేషన్లు మంచి ప్రదేశాలు వెతుక్కుని పెట్టుకోవడం ఆహారపు ఏర్పాట్లు ఎన్నో ఉంటాయి. ఆన్ లైన్ ఆఫ్ లైన్ లలో వేలాడి ప్రయాణపు పాకెజీలు కనిపిస్తున్నాయి. ఈ కుటుంబ ట్రిప్స్ వల్ల కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని వారి నడుమ ప్రేమ వసివాడదని నిపుణులు చెప్పుతున్నారు. ప్రతి రోజు ఇంటరాక్ట్ అయ్యేందుకు వీలుకాని ఈ బిజీ రోజుల్లో ఇలాంటి వెకేషన్ ట్రిప్స్ ఫ్రీగా రిలాక్స్డ్ గా కబుర్లు చెప్పుకునే వీలుంటుంది. అలాగే మంచి హోలీడే ఆప్షన్ లోనూ బస ఏర్పాట్లు ప్రయాణ సౌకర్యాలుచూసి పెట్టుకుంటే ఇలాంటి టిప్స్ తో జేవిత కాల మధుర స్మృతుల్ని పదిలపరుచుకునే వీలుంటుంది. మళ్ళి ఏడాది పాటు పని చేయగల కొత్త ఉత్సాహం వస్తుంది.

    సెలవుల్లో సరదాగా జాలీ ట్రిప్

    వేసవి వస్తే, సెలవులు మొదలైతే పిల్లలూ, పెద్దల ద్రుష్టి సమ్మర్ వెకేషన్ పైనే వుంటుంది. సంవత్సరపు బడలిక తీరేలా, ఏ బరువు బాధ్యత పట్టించుకోకుండా సొంత ఊరికో,…

  • వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత మాత్రం కోల్పోతాయి అయితే వండటం వల్ల బీటాకెరోటిన్, లికోపెన్ వంటి కాన్సర్ తో పోరాడగల వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. పోషకాలు ఎక్కువగా ఉండాలంటే వండే సమయాన్ని తగ్గించాలి. మైక్రోవేవ్ లో కూరగాయలు వుడికే వాసన వచ్చేదాకా అంటే ఏడు నుంచి పది నిముషాలు. క్యారెట్స్, బంగాళ దుంపలు వంటివి ఐడు నిముషాలు ఉడికిస్తే సరిపోతుంది. కూరగాయల్ని పల్చని స్లైసులుగా కట్ చేస్తే త్వరగా వుడుకుతాయి. ముక్కలు వుడికించే ముందే బాగా వేడి చేస్తే త్వరగా కూర ముక్కలు వేడిగా అయిపోతాయి. ఎక్కువ పోషకాలు పోవక్కరలేదు. తరచూ కలియబెడుతూ వుండాలి. ఒకటి రెండు నిమిషాలకు రుచి చూడాలి. ప్యాన్ అడుగున ఏదైనా లిక్విడ్ మిగిలిపోతే మళ్ళి కలియబెట్టాలి. కూరగాయలు ఉడికించిన నీటిని ఎప్పుడు వృధా చేయకూడదని. ఆ నీటితో చారు వంటివి చేసుకున్న ప్రయోజనమే.

    వండే సమయం తగ్గిస్తే చాలు

    వంటలో సాధారణ పద్దతిగా కురగాయల్ని ఉడికిస్తే పోషకాలు పోతాయి అంటున్నారు. కురగాయల్ని వుడికించే సమయంలో నీటిలో కరిగే పోషకాలు, విటమిన్ బి, సి లు వంటివి కొంత…

  • శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు హాని జరిగి ఆస్టియో ఆర్దరైటిస్ రోగాల భయం చాలా మందిలో వుంటుంది. కానీ పరుగెత్తడం వల్లనే కర్డిలేజ్ ఆరోగ్యంగా వుంటుంది. దీని వల్ల మోకాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దృఢమైన కండరాళ్ళు లిగ్మెంట్లకు పరుగె అవసరం. ఇవి మోకాళ్ళ పై వత్తిడి తగ్గించి ఆస్టియో ఆర్ధరైటీస్ రాకుండా కాపాడతాయి. సరైన పడరక్షకులువేసుకోకుండా పరుగేడితేనే హాని జరుగుతుంది. పరుగెత్తే సమయంలో వత్తిడి తట్టుకోగల సహజగుణం మోకాళ్ళకు వుంటుంది. ఆర్ధరైటీస్ వచ్చే అవకాశమే లేదు. మనస్పూర్తిగా ఇష్టపడుతూరోజుకు ఒక అరగంట రన్నింగ్ చేసిన మంచి ఫలితం వుంటుంది. శరీరం చక్కని సౌష్టవం యవ్వన రూపంలో వుంటుంది.

    చక్కని రూపం సౌష్టవం కోసం

    శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు…

  • ఇటలీలో ప్రజలు సన్నగా నాజూగ్గా ఉంటారట. దానికి కారణం వాళ్ళు ఆహారం తీసుకునే పద్దతి అంటారు ఎక్స్ పర్ట్స్. మనం తినే ఆహారంలో రకరకాల కూరలు, అన్నం, పప్పు, పులుసు ఇలా ఉంటాయి. వీటిని అన్నంతోనో, ఇంకో రావ్వతోనో కలుపుకు తినటాం. నంజుకోవడం అనేది మన అలవాటు. కానీ ఇటలీ వాళ్ళు అలా కాదు. ఆకు ఐటమ్స్ వుంటే అన్నింటినీ విడివిడిగానే తింటారట. అలా ఒకసారి ఒక ఐటెం తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. పరిమితంగా తిని ఆపేస్తారు. మన దేశంలో రకరకాల రుచులు కలిపి అవసరానికి మించి తినటం కనుక పొట్ట పెరుగుతుంది. అలాగే వాళ్ళకున్న మంచి అలవాటు కండరాల్లను చెక్కని రూపంలో ఉంచుకునేందుకు కండరాల్ల నొప్పులు రానివ్వరు. ఆలివ్ నూనె, కర్పూరం కలిపి శరీరం పై మర్దనా చేసుకోవడం . ఈ మర్దనా వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఆరోగ్యం, కండరాల్ల రూపం బావుంటాయి. అలసట లేని వ్యాయామం ఇది.

    ఇటలీ వాళ్ళ నాజుకు రహస్యం ఇదే

    ఇటలీలో ప్రజలు సన్నగా నాజూగ్గా ఉంటారట. దానికి కారణం వాళ్ళు ఆహారం తీసుకునే పద్దతి అంటారు ఎక్స్ పర్ట్స్. మనం తినే ఆహారంలో రకరకాల కూరలు, అన్నం,…

  • నీహరికా, ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికోసం వచ్చిన అద్భుతమైన రిపోర్టు. మనల్ని మనం ప్రేమించుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా ఉంటేనే అన్ని రకాల ఆందోళనలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రేమించుకోవడం అంటే ముందర సుఖంగా నిద్రపోవడం ఫస్ట్. అనవసరమైన ఆందోళన, పని వత్తిడి, రేపు ఉదయపు కార్యక్రమాలు మనస్సులో నింపుకుని మంచం పైన వాలినా నిద్రెలా పడుతుంది. అలాగే ఆనందంగా వుండటం కోసం కాకుండా మనపై మనకున్న ప్రేమకు గుర్తుగా చెక్కగా అలంకరించు కోవడం. ఏ స్పాకొ, సెలూన్ కొ వెళ్ళడం చెక్కగా తీర్చిదిద్దుకోవడం ఇవీ అవసరమే. ఎలాగోలా లెద్దూ, అబ్బా ఇంత పని పెట్టుకుని అనుకొనే నిర్లక్ష్యం చేసుకోకండి అంటున్నారు. ఇది మరి మంచి పాయింటే కదా. అలాగే ఇప్పటి వరకు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో వాటిని ప్రయత్నించి చూడటం అన్నింటికంటే ముఖ్యం . అది చిన్నదా పెద్దదా అని కాదు, మన వల్ల కాదులే అని వదిలేసేవి. కానీ ఒక్కసారి ట్రై చేస్తే ఆ పని చేయగలిగితే.... ఎందుకు కాదో ఏపనైనా అస్సలు మన వల్ల కాకపోతే అసలు ఇంకెవరి వల్లా కాదనుకోండి. ఇంక అవన్ని అయిపోయినట్లే అంటున్నారు. అనుభవంతో చెపుతున్న విషయాలు ఆచరిస్తే పోలేదూ! నీహరికా, ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికోసం వచ్చిన అద్భుతమైన రిపోర్టు. మనల్ని మనం ప్రేమించుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా ఉంటేనే అన్ని రకాల ఆందోళనలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రేమించుకోవడం అంటే ముందర సుఖంగా నిద్రపోవడం ఫస్ట్. అనవసరమైన ఆందోళన, పని వత్తిడి, రేపు ఉదయపు కార్యక్రమాలు మనస్సులో నింపుకుని మంచం పైన వాలినా నిద్రెలా పడుతుంది. అలాగే ఆనందంగా వుండటం కోసం కాకుండా మనపై మనకున్న ప్రేమకు గుర్తుగా చెక్కగా అలంకరించు కోవడం. ఏ స్పాకొ, సెలూన్ కొ వెళ్ళడం చెక్కగా తీర్చిదిద్దుకోవడం ఇవీ అవసరమే. ఎలాగోలా లెద్దూ, అబ్బా ఇంత పని పెట్టుకుని అనుకొనే నిర్లక్ష్యం చేసుకోకండి అంటున్నారు. ఇది మరి మంచి పాయింటే కదా. అలాగే ఇప్పటి వరకు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నామో వాటిని ప్రయత్నించి చూడటం అన్నింటికంటే ముఖ్యం . అది చిన్నదా పెద్దదా అని కాదు, మన వల్ల కాదులే అని వదిలేసేవి. కానీ ఒక్కసారి ట్రై చేస్తే ఆ పని చేయగలిగితే.... ఎందుకు కాదో ఏపనైనా అస్సలు మన వల్ల కాకపోతే అసలు ఇంకెవరి వల్లా కాదనుకోండి. ఇంక అవన్ని అయిపోయినట్లే అంటున్నారు. అనుభవంతో చెపుతున్న విషయాలు ఆచరిస్తే పోలేదూ!

    నేనంటే నాకెంతో ఇష్టం

    నీహరికా, ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికోసం వచ్చిన అద్భుతమైన రిపోర్టు. మనల్ని మనం ప్రేమించుకోకుండా శ్రద్ధ తీసుకోకుండా ఉంటేనే అన్ని రకాల ఆందోళనలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.…

  • ఒక సర్వే లో 22 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత ముఖ్యంగా ఆడపిల్లల్లో డిప్రెషన్ కు కారణం సరైన ఆదాయ వనరులు లేకపోవడమే నని తేలింది. 65 శాతం మందికి చేతిలో ఒక్క పైసా కుడా వచ్చే దారి లేకపోవడమే నని రిపోర్టులు చెప్పుతున్నాయి. కనీస సదుపాయాలు చుట్టూ అందరికి చేతుల్లో వుండే గాడ్జేట్స్, ఇతర వస్తువులు, మంచి దుస్తులు ఎవీ కొనుక్కో లేకపోతున్నామనే భాధ యువతను కుంగదీస్తుందిట 64 శాతం మందికి ఈ లేమి పట్ల తీవ్ర అసహనం అసంతృప్తితో నిద్ర వుండదు. మగవాళ్ళతో పోలిస్తే ఈ డిప్రెషన్ స్త్రీలకే ఎక్కువని సర్వే తేలింది. ఇక పెద్దవాళ్ళతో తమంకు దొరికిన వసతులతో సరిపెతుకోలేక డిప్రెషన్ పాలవ్వుతున్నారని రిపోర్ట్ నివేదిక. ముఖ్యమైన విషయం పల్లెలు, చిన్న పట్నాలతో పోలిస్తే నగరాల్లో వుండే యువత ఎక్కువగా డిప్రెషన్ కు గురవ్వుతున్నారని మన దేశంలోనే ఈ సమస్య కొంత తీవ్ర స్థాయిలో వుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

    ఆర్ధిక సమస్యే డిప్రేషన్ కి కారణం

    ఒక సర్వే లో 22 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత ముఖ్యంగా ఆడపిల్లల్లో డిప్రెషన్ కు కారణం సరైన ఆదాయ వనరులు…

  • అస్తమానం చదువులో మునిగి తేలే పిల్లల్ని కాస్త రిలాక్స్ డ్ గా వుంచడం కోసం హాబీల వైపు మళ్ళించమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఫజిల్స్, వర్డ్ గేమ్స్ పిల్లల మెదడుకు పదును పెడతాయి. చిన్న వయస్సు నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక సుడోకు, చెస్ వంటి ఆటల పట్ల శ్రద్ధ చూపిస్తారు. మెదడును చైతన్య పరచే ఈ ఆటలు సమస్య పరిష్కరించుకునే సమాధ్యంతో పాటుఇతర సవాళ్ళ ను ఎదుర్కొనే శక్తి ని కూడా ఇస్తాయి. మాతృ భాషతో పాటు ఇంకో భాష నేర్చుకునే దిశగా ప్రోత్సహించాలి. దేశ విదేశాల నాణాలు, పోస్టల్ స్టాంపులు సేకరించే ఆసక్తి కూడా మంచిదే. పిల్లలు ఎప్పుడైనా సంగీత వాయిద్యాలని పలకరించడానికి ట్రై చేస్తే ఆశ్చర్యపోవద్దు. పిల్లల్లో ఐక్యును విద్యావిషయ సమాధ్యాన్ని పెంచే శక్తి సంగీతానికి వుంది. పిల్లలకు అవసరమైన దేహదరుడ్యం లేకపోతె నీరసం తో చదువు పట్ల శ్రద్ధ చూపలేకపోవచ్చు. దేహ పుస్టి క్రిడల్ని ప్రోత్సహించాలి. ఒక టీమ్ గా ఆడే ఆటల వల్ల నాయకత్వ లక్షణాలు కుడా పెరుగుతాయి. పిల్లల్ని సక్రమంగా పెంచమంటే వాళ్ళలో దాగి వున్న సృజనాత్మకమైన విషయాలను వెలికి తీసి ప్రోత్సహించడమే.

    పిలల్ని ఎన్నో నేర్చుకోనివ్వండి

    https://scamquestra.com/sozdateli/8-konstantin-mamchur-38.html

  • తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు తగ్గించుకోవడం రెండూ వెర్వేరు విషయాలంటారు శిక్షకులు. ఎనభై శాతం ఆహారపు అలవాట్లు బరువు తగ్గించే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. వ్యాయామం కేవలం ఇరవై శాతమే పనిచేస్తుందిట. జిమ్, జాగింగ్, వర్కవుట్స్ ఏవైనా కానీ బరువు తగ్గించే ప్రక్రియలో ఉపయోగ పాడేది ఇంతే. శరీరంలో జీర్ణక్రియలు అత్యంత చురుకుగా ఉంచేందుకు అద్భుతమైన పద్దతి రోజుకు ఐదు నుంచిఆరు సార్లు కొద్ కొద్దిగాది తినడం, భోజనం చేస్తున్నప్పుడు టీవి చూస్తున్నామా అదుపు కాస్త తగ్గినట్లే, ఫోన్ మాట్లాడామా ఇంకొంత బాటింగ్, కబుర్లు ఎదో ఒక్కటి చేస్తూ ఆహారం తింటే అన్ లిమిటెడ్ గా కడుపులోకి పంపిస్తున్నట్లే. బరువు తగ్గాలంటే తగ్గించి తింటేనే, రుచికి ప్రాధాన్యత తగ్గిస్తేనే, వర్కఔట విషయంలో బద్దకించక పోతేనే ఫలితం దక్కేది.

    మూడు విషయాల్లో కఠినంగా వుండాలి

    తిండి తగ్గిస్తాం, ఎంతో కష్టమైన వర్కవుట్ చేస్తాం, అయినా ఎందుకు బరువు తగ్గడం లేదు అని దిగులు పడతారు. అమ్మాయిలు. కానీ శరీరంలో కొవ్వు తగ్గించుకోవడం, బరువు…

  • ఏదైనా ఒక వ్యాసనం ప్రభావం మెదడు పైన ఎలా వుంటుందో చేసిన పరిశోధనలో మత్తు పదార్ధాలకు బానిసైన వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టేక్స్ భాగం మార్పుకు గురైనట్లు, ఇంటర్నెట్ వ్యాసనానికి గురైన వారిలోనూ అదే మార్పులు గమనించారు. మెదడులో మాటలు జ్ఞాపక శక్తి కండరాళ్ళ కదలిక భావోద్వేగాల కేంద్రాలతో 10 నుంచి 20 శాతం కుచించుపోవడం ఇంటర్నెట్ వ్యసన పరుల్లో గమనించారు. మత్తుపనీయాలు తీసుకునే వారిలో శారీరక వ్యాయామం లేకపోవడం నిద్ర లేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. వాటివల్ల శరీరంలో, మెదడులో మార్పులు వస్తాయి. అటువంటి పరిస్థితులే నెట్ అడిక్షన్ లో కూడా కనిపించాయి. వీడియో గేమ్లు, కంప్యుటర్, ఇంటర్నెట్ వాడకం పెరిగితే మరింత డిప్రేషన్ పెరుగుతుంది. ఒత్తిడికి గురవ్వుతారు. గర్భిణీ స్త్రీలలో పిల్లలకు పాలిచ్చే స్త్రీలు సెల్ ఫోన్ ఇంటర్నెట్ వ్యసనానికి లోనై వుంటే దాని ప్రభావం గర్భస్థ శిశువు, పసి పిల్లల పైన వుండటం గమనించారు. పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు సెల్ ఫోన్ మేసేజ్లు ఇవ్వొద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.

    ఇంటర్నెట్ వ్యసనం మత్తుపానీయం లాంటిదే

    ఏదైనా ఒక వ్యాసనం ప్రభావం మెదడు పైన ఎలా వుంటుందో చేసిన పరిశోధనలో మత్తు పదార్ధాలకు బానిసైన వారి మెదడులో ప్రీఫ్రంటల్ కార్టేక్స్ భాగం మార్పుకు గురైనట్లు,…

  • గర్భిణీల న్యూట్రిన్స్ ఎక్కువగా వుండే ఫుడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యం బావుంటుంది అని డాక్టర్లు చెప్పుతున్నారు. మన దేశం లో దాదాపు 90 శాతం మంది ప్రోటీన్స్ లేని ఆహారమే తీసుకుంటున్నారు. శరీరం బరువును బట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్, బీన్స్ లో ప్రోటీన్స్ ఎక్కువ. మెదడు అభివృద్ధికి చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పాలల్లో ఐరన్ అధికంగా వుంటుంది. పుట్టే బిడ్డలో కండరాళ్ళు, ఎముకల అభివృద్ధి జరగాలంటే కాల్షియం వుండాల్సిందే. సూర్య రశ్మి ద్వారా కూడా కాల్షియం వుండాల్సిందే. సూర్యరశ్మి ద్వారా కూడా కూడా కాల్షియం అందుతుంది. కాకపొతే ఎంత సేపు ఎండలో తిరగాలి సరైన లెక్కలు లవు గనుక, కాల్షియం వుండే డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్, నారింజ పండ్లు, చేపలు తినాలి. సాధారణంగా ఈ రోజుల్లో గర్భినిలుగా వున్న అమ్మాయిలు రేగ్యులర్ డాక్టర్ చెకప్ లు, డైట్ ల గురించి తెలుసుకొంటూనే వుంటారు కానీ డాక్టర్ సలహాలు పాటించకపోతేనే నష్టం. ఆ విషయంలో గుర్తు చేసేందుకే ఈ గర్భిణీల ఆహారం గురించి ప్రస్తావించడం.

    గర్భిణీలకు పోషకాహరం

    గర్భిణీల న్యూట్రిన్స్ ఎక్కువగా వుండే ఫుడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యం బావుంటుంది అని డాక్టర్లు చెప్పుతున్నారు. మన దేశం లో దాదాపు 90 శాతం మంది…

  • కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల నుంచి తుంచేసి ఎందినవో, కాస్త వాడిపోయినవో తీసేసి మిగతా తాజా ఆకుల్ని పేపర్ టవల్ లోనో లేదా శుబ్రమైన నూలు గుడ్డలో కానీ చుట్టేసి పెట్టేయాలి. రెండు రోజులు శుబ్రంగా బాగుంటాయి. ఆలుగడ్డ, ముల్లంగి, చిలకడ దుంప, అయితే కట్ చేసి ఫ్రిజ్ లో పడితే రంగు మారిపోతుంది, మృదుత్వం కూడా పోతుంది. తేమ కూడా తగ్గిపోయి మృదుత్వం పోతుంది, రుచి మారిపోతుంది. ఇలాంటి వాటిని గిన్నెలో నీళ్ళు పోసి అందులో వదులుగా ముత పెట్టి వుంచాలి. క్యాబేజీ, కాలీ ఫ్లవర్, బ్రోకలి వంటివి కట్ చేసి గాలి తగలని బాక్స్ లో పెట్టి వున్నా కవర్ లో పెడితే తాజాగా వుంటుంది. అరటి పండ్లు, కర్భుజా, ఉల్లిపాయలు, అవకాడో, వెల్లుల్లి ఉల్లి వంటివి ఫ్రిజ్ లో పెడితే వీటి వాసన మిగతా కురగాయలకు పట్టి చాలా సార్లు కడిగి వండుకోవాల్సి వస్తుంది.

    కూరగాయలన్నీ కలిపి ఫ్రిజ్ లో పెట్టొద్దు

    కూరగాయలు అన్నీ ఒకే కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే ఊరికే పాడైపోతాయి. ఇప్పుడు ఆకు కూరల్ని ఫ్రిజ్ లో పెట్టే ముందరే ఆకుల్ని కొమ్మల…

  • చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే రసాయినాలు కలుపుతారు. ఇందులో చక్కెర ఎక్కువే. అలా దాహం తీరేలా చలువ చేసేలా కావాలంటే ఫ్రెష్ గా కొట్టిన కొబ్బరి నీళ్ళు తాగచ్చు. ఇంట్లో అయితే ఉప్పు జీలకర్ర వేసిన పచ్చి మామిడి రసం కుడా వాడదెబ్బకు ప్రత్యామ్నాయమె అవ్వుతుంది. ఎక్కువ చమట పోస్తుంది కనుక చమట తో పాటు కీలకమైన కొన్ని పోషకాలు పోతాయి. సోడియం పొటాషియం వంటివి శరీరం కోల్పోతుంది. వీటి పని శరీరంలో జీవక్రియలు తిన్నగా జరిగేలా చూడటం. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకుంటే నిస్సత్తువ లేకుండా వుంటుంది. అన్నం, చపాతిలు తేలికగా అరిగే ఆకుకూరలు, తాజాగా వుండే మాంసాహార పదార్ధాలు మంచివే. పళ్ళ రసం, చెరుకు రసం ఇవి కూడా తీయగానే తగేయడం ఉత్తమం.

    ఎండల్లో వాడిపోకుండా ఇవే రక్షణ

    చలువ చేస్తుందనో, దాహం వేస్తుందనో గబుక్కున రోడ్డు పక్కన కనిపించే సోడాలు, పండ్లరసాలు, శీతల పానీయాలు తాగేయకండి వాటిలో నిలువ ఉంచేందుకు కానీ చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే…

  • కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ ప్రియులకు కూడా అద్భుతం అనిపిస్తుంది. రకరకాల కారణాలతో తల్లులు ఐస్ క్రీమ్ తినరు. పిల్లలు తింటే తిడతారు. ఇవన్నీ అర్ధం లేని భయాలు అని కొట్టి పరేస్తుందో రిపోర్ట్. ఎంతో మందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కేవలం ఐస్ క్రీమ్ మాత్రం ఇచ్చారట. ఆ అంతమందికి అద్భుతమైన జ్ఞాపక శక్తి, మెదడు తెలివి తేటలు పెరిగిపోయాయట. అంతేనా కఠినమైన ఫజిల్స్ ఇట్టే పూర్తి చేసారంటున్నారు. పరిశోధకులు. ఇది కొట్టి పారేసే విషయం మాత్రం కాదు. ఎందుకంటే అసలే ఎండలు. అందులో ఐస్ క్రీమ్ ఈ రిపోర్టును ఏదయితే అది అయ్యిందిలే అని నమ్మి ఐస్ క్రీం హాయిగా తినేయమని చెప్పడం బెస్ట్ అనిపిస్తుంది. నోట: పళ్ళ డాక్టర్ ని ఓసారి కలసి మాట్లాడి మరీ తినండి.

    ఐస్ క్రీం తో ఎంతో చురుకుతనం

    కొన్ని రిసెర్చిలు కొందరి బిజినెస్ లను అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడో రిసెర్చ్ ఫలితం అలాంటిదే. అలాగే ఐస్ క్రీమ్ ప్రియులకు కుడా అద్భుతం అనిపించేస్తుంది. రకరకాల కారణాలతో…

  • నేను ప్రత్యేకంగా ఉండాలన్న కోరికే బహుశా ఫ్యాషన్ అన్నపదానికి తెర తీసిందేమో. ఎదో ఒక్కటి ఎలాగో ఒకలా మందిలో ఒక్కరుగా.... ఎలాగా అంటే అది అందంగా అంద విహినంగా, కొత్తగా, వింతగా, తమాషాగా తయ్యారవ్వాలి. ఈ కాన్సెప్ట్ లోకి చెప్పులు కుడా వచ్చి చేరాయి. అనేక రకాల కొత్త చెప్పులు. ఇవి కుక్క పిల్లల్లాగా, చేపల్లాగా, అరటి పండు తొక్కల్లాగా, మొలిచిన గడ్డిలాగా....... సందేహం వద్దు. ఇవన్నీ చెప్పుల డిజైన్సే. ఎదో ఒక ప్రేత్యేకత చూపిద్దాం అనుకుని చెప్పుల పైన గడ్డి మొలిచినట్లు కనిపించే జత వేసుకోవచ్చు. ఈ యూనిక్ డిజైన్ లు ఇవ్వాల్టి లేటెస్ట్ ఫ్యాషన్. అప్పుడే ఆన్లైన్ లో సందడి చేస్తున్నాయి. లెక్కలేనన్ని రకాల అరటి పండు తొక్కలు, కుక్క తోకలు, కాట్ బాల్స్ అనుకోండి. అన్నీ చెప్పులే!

    ఇవి చెప్పులేనండీ బాబు

    నేను ప్రత్యేకంగా ఉండాలన్న కోరికే బహుశా ఫ్యాషన్ అన్నపదానికి తెర తీసిందేమో. ఎదో ఒక్కటి ఎలాగో ఒకలా మందిలో ఒక్కరుగా…. ఎలాగా అంటే అది అందంగా అంద…

  • సేవలో కూడా సెలబ్రెటీలే

    నీహారికా, సాటివాళ్ళకు ఎంతో కొంత సేవ చెయ్యడం ముఖ్యమైన బాధ్యతేనంటావా అన్నావు. కొంతమంది అందరు ఎంతో కొంత చేయాలి. అందాల సామంత నీకు ఇష్టం అన్నావు కదా.…

  • మనిషి పుట్టుకతో వరంగా తెచుకున్న నవ్వుని సక్రమంగా ఉపయోగించుకోలేక ఎన్నో అనారొగ్యాలకు గురవ్వుతున్నారని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి మానవ స్థితికీ సంబంధం ఉందన్న విషయం వైద్య శాస్త్రం అంగికరించినదే ఒత్తిడికి గురవ్వుతున్న అనవసరపు బెంగ ప్రదర్శించే వారికి రోగాలు త్వరగా సోకుతాయంటున్నారు. మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరంలో ఏర్పడే ప్రీరాడికల్స్ ప్రభావాన్ని నియంత్రించేహార్మోన్ లు ఉత్పత్తి అవ్వుతాయి. అందుకే మానసికంగా నవ్వడం నేర్చుకోవాలి. నవ్వుతో శరీరానికి బాహ్యంగా అంతర్గతంగానే కాదు మనస్సుకి ఎంతో మేలు కలుగుతుంది. మనసారా నవ్వే నవ్వు ప్రభావం మొత్తం 16 శరీర అంగ్ల పైన ప్రత్యక్ష ప్రభావం చుపుతుంది. ముఖ కండరాళ్ళు మొదలుకుని, ఊపిరి తిత్తులు, గుండె రక్త ప్రసరణ, ఇతర శరీర భాగాల కండరాళ్ళు , జీర్ణ వ్యవస్థ వంటివి నవ్వుతోనే మేలు పొందుతాయి. పదినిమిషాలు నవ్వితే శరీరంలో కండరాళ్ళ శక్తి వినియోగామవ్వుతుంది. అలా ఏడాది పాటు ప్రతి రోజు నవ్వితే ఐదు పండ్ల బరువు తగ్గుతారట. నవ్వటం అంటే అంతర్గత అవయువాల చేత జాగింగ్ చేయించటమని ఒక నిపుణుడి అభిప్రాయం. రోగ నిరోధక వ్యవస్థలో భాగంగా అనారోగ్యంతో ఆస్పత్రుల్లో వున్న వారి చికిత్స్య లో భాగంగా నవ్వు ఉపయోగిస్తున్నారు. మనస్పూర్తిగా నవ్వితే మనుషుల మూడ్ మార్చేసే, భాదను తొలగించే ఎండార్ఫన్ విడుదలవ్వుతాయి.

    ఆరోగ్యం కోసం హాస్యం

    మనిషి పుట్టుకతో వరంగా తెచుకున్న నవ్వుని సక్రమంగా ఉపయోగించుకోలేక ఎన్నో అనారొగ్యాలకు గురవ్వుతున్నారని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి మానవ స్థితికీ సంబంధం ఉందన్న విషయం…

  • ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత మంది ఎప్పుడూ చాలా సన్నగా ఓపిక లేనట్లు ఉంటారు. బరువు పెరగాలి అనుకుంటారు. అయితే వాళ్ళు తినే పదార్ధాలు ఎంపిక చేసుకోవాలి. బరువు పెరగాలి అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా తీసుకోవాలి. పండ్లు, నట్స్, బీన్స్, అనేక కురగాయాల్లో మంసాల్లో ఇవి లభిస్తాయి. తగినంత ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అవసరం. చేపలు, అవిసెగింజలు చాలా మంచివి. తప్పకుండా తినాలి కుడా. కాల్షియం కావాలి. అంటే ఓ అరలీటర్ పాలు లేదా రెండు కప్పుల పెరుగు తీసుకోవాలి. క్యాలరీల మోతాదు ఎక్కువ వుంటే బరువు పెరగడం సాధ్యం అవుతుంది. ఆహారం తీసుకుంటేనే శరీరం పుష్టిగా ఆరోగ్యవంతంగా తయ్యారవ్వుటుంది. ఈ తీసుకునే ఆహారం వల్ల చర్మం మెరుపు వస్తుంది. వార్దక్య భయాలు కుడా దూరంగా పోతాయి.

    బరువు పెరగాలి అనుకుంటే

    ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత…

  • గులబీ పూలు ఎంత అందంగా అయినా వుందనీ, ఎంత జాగ్రత్తగా కాపాడనీ, ఎంత కాలం తాజాగా ఉంటాయి. మహా అయితే వరం. కానీ కష్టం ఇంకో రెండురోజులు. కానీ లండన్ కు చెందిన లగ్జరీ పూల కంపెనీ వాళ్ళు ఎప్పటికీ వాడని రోజాను సృష్టించారు. ఎలాగనీ? ప్రత్యేక పద్దతుల్లో నిల్వ చేస్తే పువ్వులు ఎప్పటికీ తాజాగా వుండేట్లు రకరకాల గులాబీ పువ్వులను గ్లాస్ డామ్స్ లో భద్రపరచి అమ్ముతున్నారు. ఒక్క రోజా పువ్వు ధర 13 వేల నుంచి రెండున్నర లక్షల వరకు ఉంటుందిట. ఎంత గిరాకీ ఎందుకంటే ఈ వాడిపోని గులాబీ గిఫ్ట్ గా ఇచ్చేసి అమ్మాయిల ప్రేమ సంపాదించాలనుకునే వాళ్ళు పుట్టిన రోజుకీ, పెళ్లి రోజుకీ ఇలాంటి అద్భుతమైన బహుమతి ఇచ్చి భార్యను సంతోష పెట్టాలనే భర్తలు ఇష్టంగా డబ్బు సంగతి చూడకుండా కోనేస్తున్నారట. ఓ సారి వికసించాక ఇంకేప్పటికీ వాడిపోని రోజా పువ్వులు చూసేయండి.

    ఈ రోజాలు ఎప్పటికీ వాడవు

    గులబీ పూలు ఎంత అందంగా అయినా వుందనీ, ఎంత జాగ్రత్తగా కాపాడనీ, ఎంత కాలం తాజాగా ఉంటాయి. మహా అయితే వరం. కానీ కష్టం ఇంకో రెండురోజులు.…

  • ఇప్పుడు సెలబ్రెటీల డ్రెస్ ఖాదీ

    ఖాదీ జాతీయ చేనేత వస్త్రం. ఉతికే కొద్దీ ఇంకా మెత్తగా సౌకర్యంగా వుండటం దీని స్పెషాలిటీ. ఇప్పుడు ఖద్దరు దుస్తుల్ని ప్రోత్సహిస్తూ, నాగార్జునా, సామంత లాంటి వాళ్ళు…

  • కొన్ని విషయాలు చెప్పుకుని గర్వ పడొచ్చు. ఇవన్నీ జరిగాయా యధాలాపంగా జరుగుతున్నాయో చెప్పుకోలేము కానీ సంతోషించ వలసిన విషయమే మరి. మన దేశాలో మొదటి హైకోర్టులు, మొదట కలకత్తా, రెండుముంబాయి, తర్వాత చెన్నాయ్, తర్వాత ఏర్పడ్డ హైకోర్ట్ దేశ రాజధాని ఢిల్లీలో ఈ నాలుగు హై కోర్ట్ లో న్యాయ మూర్తుల స్థానంలో స్త్రీలే వున్నారు. చరిత్ర లో ఎప్పుడూ ఇలా జరిగి వుండదు. ఇలాంటి విషయం. ఢిల్లీలో జస్టిస్ రోహిణి 2014 ఏప్రిల్ లో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కలకత్తా హైకోర్టుకి నిషితా నిర్మల్ వచ్చారు. బొంబాయి హైకోర్టుకు జస్టిస్ మంజులా చెల్లుకు, ఇప్పుడు మద్రాసు హైకోర్టుకు ఇందిరా బెనర్జీ ప్రధాన న్యాయమూర్తులుగా పదవీస్వీకారం చేసారు. మొత్తానికి న్యాయం మహిళల చేతుల్లోనే వుంది.

    నాలుగు హైకోర్టుల న్యాయమూర్తులు స్త్రీలే

    కొన్ని విషయాలు చెప్పుకుని గర్వ పడొచ్చు. ఇవన్నీ జరిగాయా యధాలాపంగా జరుగుతున్నాయో చెప్పుకోలేము కానీ సంతోషించ వలసిన విషయమే మరి. మన దేశాలో మొదటి హైకోర్టులు, మొదట…