• ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా ప్రయోజనం ఉండదు. కాస్సేపటికి పౌడర్ పోయి నలుపు కనిపిస్తుంది. ముందుగా కన్సీలర్ వేసుకుని పౌడర్ వేసుకోవాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదవులు పైన మృత కణాలు తొలగించి లిప్ బామ్ వేసుకుని లిప్ లైనర్ వేసుకుని మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలి. హేయిర్ స్ప్రే ని టూల్ బ్రష్ పై తీసుకుని కనుబొమ్మల్ని దువ్వుకుంటే రోజంతా చెదరకుండా ఉంటాయి. ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్ వేసుకున్నట్లుగా ఉండాలంటే ప్రైమర్ వాడాలి. ప్రైమర్ అంటే ప్రాధమిక అలంకరణ వస్తువు. ఐలైనర్ వేయాలంటే ప్రైమర్ ఖచ్చితంగా వాడాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేయాలన్నా ప్రైమర్ వాడాల్సిందే. ప్రైమర్ వేసి ఆపై అలంకరణ చేస్తే సాయంత్రం వరకు బెదరకుండా ఉంటాయి. కంటికింద నలుపు ఉన్నప్పుడు నేరుగా పౌడర్ వేసినా ప్రయోజనం ఉండదు. కాస్సేపటికి పౌడర్ పోయి నలుపు కనిపిస్తుంది. ముందుగా కన్సీలర్ వేసుకుని పౌడర్ వేసుకోవాలి. మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలంటే ముందుగా పెదవులు పైన మృత కణాలు తొలగించి లిప్ బామ్ వేసుకుని లిప్ లైనర్ వేసుకుని మ్యాటీ లిప్ స్టిక్ వేసుకోవాలి. హేయిర్ స్ప్రే ని టూల్ బ్రష్ పై తీసుకుని కనుబొమ్మల్ని దువ్వుకుంటే రోజంతా చెదరకుండా ఉంటాయి.

    ప్రైమర్ ఉంటేనే మేకప్ చెదరదు

    ఉదయం వేసుకున్న మేకప్ సాయంత్రం వరకు చెదిరిపోకుండా ఉండాలంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. కాటుక లిప్ స్టిక్ ఐ  లైనర్ వంటివి చెదిరిపోకుండా వేసుకున్న మేకప్…

  • సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత ఏమాయ చేసావే షూటింగ్ రోజుల్లో నుంచే అక్కినేని కుటుంబం గ్రూప్ ఫోటోల బొమ్మలు సమంత చైతూ ఇద్దరు బైక్ పైన వెళుతున్న ఫోటోలు బొమ్మలుగా ఎంబ్రాయిడరీ చేయించుకుంది ఈ చీర డిజైన్ చేసిన క్రెడిట్ ఫ్యాషన్ డిజైనర్ క్రెషా బజాజ్ కు ఎప్పుడో వెళ్లపోయింది. క్రెషా తన పెళ్లి దుస్తుల కోసం పది లక్షల రూపాయల ఖర్చుతో తన భర్త తో పరిచయం అయినప్పటినుంచి నిశ్చితార్ధం వరకు తీయించుకున్న ఎన్నో ఫోటోలను పసిడిపువ్వుల్లా ఎంబ్రాయిడరీ ద్వారా చీరపై డిజైన్ చేయించుకుంది . నెల రోజుల పాటు ఈ డిజైన్ లెహెంగా ను వంద మంది డిజైనర్లు కొట్టారు. క్రెషా వ్యాపార కుటుంబానికి చెందిన అమ్మాయి. విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదివి ముంబై లో ఒక బ్రాండ్ ప్రారంభించింది. పెళ్లి కూతుళ్ళకు ప్రత్యేక డిజైనింగ్ చేయరు. 233 దేశాలకు పంపుతోంది.ఇప్పుడు తాజా సమంత నిశ్చితార్ధపు చీరలో క్రెషా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రెటీ అయిపోతుంది.

    నిశ్చితార్ధపు స్పెషల్స్

    సమంత పెళ్లి నిశ్చితార్ధం పేపర్లలో టీవీ ల్లో వచ్చాక ఎక్కువగా చెప్పుకొంది. ఆమె నిశ్చితార్ధం సమయంలో కట్టుకున్న చీర గురించే. తన ఎంగేజ్మెంట్ చీర పైన సమంత…

  • ఫుట్ బాల్ క్రీడ ఆరోగ్య పరంగా స్త్రీలపై మంచి ఫలితాలను చూపిస్తూందని చెపుతున్నారు శాస్త్రవేత్తలు/ యూనివర్సిటీ ఆఫ్ సౌథరన్ డెన్మార్క్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రోస్ట్రేప్ ఆడవాళ్లకు ఫుట్ బాల్ లో శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రాక్టికల్ గా ఈ అంశాన్ని నిరూపించారు.ఫుట్ బాల్ ఆట శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఫుట్ బాల్ ఫిట్నెస్ ట్రైనింగ్ హైపల్స్ ట్రైనింగ్ ఉంటుంది. స్టామినా ట్రైనింగ్ ఉంటుంది స్త్రెంగ్థ్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కమాట లో చెప్పాలంటే ఈ క్రీడ ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. శరీరానికి సంబంధించి అధిక కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ ఎముకల దృఢత్వం జండర్ వెల్ ఫిట్ నెస్ లపైన ఇదిమంచి ఫలితాలు ఇస్తుంది. ఆడవాళ్లు రోజూ ఒక గంట చొప్పున వారానికి రెండు మూడు సార్లు ఫుట్ బాల్ క్రీడ శిక్షణ పొందితే ఎంతో మంచిది. ఒకవేళ రక్త పోటు వుంటే దాన్ని తగ్గించటంలో ఇది మంచి మందులా పని చేస్తుంది.

    ఫుట్ బాల్ తో మంచి ఫిట్ నెస్

    ఫుట్ బాల్  క్రీడ ఆరోగ్య పరంగా స్త్రీలపై మంచి ఫలితాలను చూపిస్తూందని  చెపుతున్నారు శాస్త్రవేత్తలు/ యూనివర్సిటీ ఆఫ్ సౌథరన్  డెన్మార్క్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రోస్ట్రేప్  ఆడవాళ్లకు ఫుట్…

  • చాలా మందికి రాత్రి వేళ చాలా సేపు మేలుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. కానీ కొత్త పరిశోధన సారాంశం ఏమిటంటే ఇలా ఆలస్యంగా నిద్ర లేస్తే షుగర్ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని . 40 నుంచి 50 ఏళ్ల లోపు వాడిపై ఒక పరిశోధన నిర్వహించారు. ఆలస్యంగా తెస్తే చక్కెర వ్యాధితో పాటు కండరాల మోతాదు తగ్గే ప్రమాదం కూడా ఉందని పరిశోధనలో తేలింది. స్త్రీలలో అయితే పొట్ట దగ్గర కొవ్వు పేరుకోపోవటం . జీవ క్రియల్లో అసమానతలు వచ్చే అవకాసం ఎక్కువగా ఉందంటున్నారు. రాత్రి షిఫ్ట్ ల్లో పనిచేసే వారిపై ఈ పరిశోధన జరిగింది. రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకోవటం నిద్ర మెలుకునేందుకు కాఫీ టీ లేదా ఎదో ఒకటి తినటం వీటి రీత్యా కొవ్వు పేరుకుంటోందని అలాగే ఆలస్యంగా నిద్రలేవటం లో ఆహారం తీసుకునే సమయం అరిగించుకునే సమయం మేలుకుని వున్న సమయం విశ్రాంతి లోనే గడపటం ఆ తరువాత రాత్రివేళల్లో కేవలం కుర్చీలకే పరిమితం కావటం ఇవన్నీ కలిసి అనారోగ్యాలని పెంచుతున్నాయని రిపోర్ట్ .

    ఆలస్యంగా నిద్ర లేస్తే అనారోగ్యం

    చాలా మందికి రాత్రి వేళ  చాలా సేపు మేలుకుని ఉదయం ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. కానీ కొత్త పరిశోధన సారాంశం ఏమిటంటే ఇలా ఆలస్యంగా నిద్ర…

  • కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్ మిట్ట నదే . విశ్వ సుందరి కిరీటం దక్కించుకుంది. పోటీల ఫెనాల్స్ లో టాప్ త్రీ లో మిస్ ఫ్రాన్స్ మిన్ హైతీ మిస్ కొలంబియా మిగిలారు. మనాలీ లో జరిగిన మిస్ యూనివర్సిటీ 2016 పోటీల చివరి దశలో జడ్జిలో ఏ ఈముగ్గురిలో ఎవరు విజేతన్న విషయాన్నీ తేల్చుకోలేక అనేక పరిశీలనల తర్వాత ఇరీస్ మిట్టనరే ను ఎంపిక చేశారు. మిస్ హైతీ రాక్వెల్ పెలిస్పియర్ రెండో స్థానంలో మిస్ కొలంబియా ఆండ్రా టోవేర్ మూడో స్థానంలో నిలిచారు. ఈ పోటీలకు హాజరైన బెంగుళూరు అమ్మాయి రొష్మిత హరిమూర్తి టాప్ - 13 కు కూడా చేరుకోలేదు. ఇక విశ్వసుందరి గా నిలిచినా ఇరిస్ మిట్టనరే డెంటిల్ సర్జరీ తో డిగ్రీ చేస్తోంది. తనకు కిరీటం సాధించటం వల్ల వచ్చిన పేరును ఖ్యాతిని ప్రపంచంలో పంటి ఆరోగ్యం పట్ల చైతన్యానికి నోటి శుభ్రత పట్ల శ్రద్ధ కు అవసరమైన ప్రచారానికి ఉపయోగిస్తానని చెపుతోంది ఇరీస్

    విశ్వ సుందరి ఇరిస్

    కోట్లాది మంది టెలివిజన్ లో చూస్తుండగా కన్నుల పండుగలా జరిగిన విశ్వ సుందరి పోటీల్లో మిస్ ఫ్రాన్స్ పోటీ రాదు. ఇరిస్  మిట్ట నదే . విశ్వ…

  • విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు తరిగిన పండు మిరపకాయల్లో 107.8 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుందిట. కాప్సికం లోనూ ఇంతే పరిమాణంలో ఉంటుంది. రెడ్ కాప్సికం లో ఆరెంజ్ కంటే మూడు రెట్లు అధికమైన విటమిన్ సి ఉంటుంది. కీళ్లు కండరాల నొప్పుల్ని బాగా తగ్గిస్తుంది కూడా . అలాగే బ్రోకిలీ లో 132 మిల్లీ గ్రాముల సి విటమిన్లు చక్కని పీచు పదార్ధం కేవలం 30 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇక బొప్పాయి వంటి అముల్యమైన పండు ఇంకోటి లేదు. ఒక కప్పు బొప్పాయి ముక్కల్లోనే 88. 3 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. స్ట్రా బెర్రీలు 84. 7 శాతం ఒక చిన్న కప్పు కాలీఫ్లవర్ లో 127. 7 మిల్లీ గ్రాములు ఒక చిన్న క్యాబేజీ ముక్కలు 74.8 పైనాపిల్ పండు ముక్కలు 79 గ్రాములు కివీ పండులో 137. 2 ఇక మామిడి పండులో అయితే 122. 3 మిల్లీ గ్రాముల విటమిన్ సి దొరుకుతుంది. చిన్నప్పటినుంచి పండ్లు తినే అలవాటు గనుక ఉంటే ఈ విటమిన్స్ కోసం పీచు పదార్ధం కోసం పోషకాల కోసం ఏం తినాలన్నా బెంగ అక్కర్లేదు.

    లెక్కలు చుస్తే చాలు తప్పకుండా తింటాం

    విటమిన్ సి అనగానే మనకు నిమ్మ నారింజ బత్తాయి గుర్తొస్తాయి. కానీ ఎన్నో పండ్ల కూరగాయల్లో కూడా సి విటమిన్ నిల్వలు ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు అరకప్పు…

  • ఎంతో బిజీ లైఫ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇళ్లల్లో అంతులేని పని వత్తిడి పది నిముషాలు విశ్రాంతి తీసుకునే పాటి అవకాశం లేకుండా ఒక్కరోజు గడుస్తూ ఉంటుంది. ఇక బయటకొస్తే అంతులేని ట్రాఫిక్. పది నిముషాలు పోవాలిసిన చోటికి గంట ప్రయాణాలు. ఇలాంటి సందర్భాల్లో చిరాకు దిగులు నిస్పృహ అన్నీ కలుగుతాయి. మనసుకి శాంతి నిచ్చే సెరోటోనిన్ రసాయనం పూర్తిగా ఎండా కున్నంత పనవుతుంది. ఇలాంటప్పుడు మస్సాజ్ ట్రై చేయండి. అంటున్నారు. ఎక్సపెర్ట్స్ . ఆధునిక జీవితంలో దీని అవసరం ఎవ్వరు తెలుసుకోవటం లేదు. ఇది కండరాలకు హాయి నివ్వటమే కాదు. కార్టిసాల్ అనే ఒత్తిడి కారక హార్మోన్ ను 30 శాతం దాకా అడ్డుకుంటుందని పరిశోధనలు నిరూపించాయి. కార్టిసాల్ తగ్గటం అంటే సెరోటోనిన్ పెరగటమే కదా. అలాగే ధాన్యం కూడా ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత ఇస్తుందంటారు. ధాన్యం వల్ల మెదడులో 4- హెచ్ఎఎ 1 అనే ఆమ్లం విడుదలవుతుంది. సెలటోనిన్ ఉత్పత్తికి దోహదం చేసేది ఇదే. నిత్యం కాస్త ఉత్సాహంగా ఉండేందుకు ధాన్యం ఎంచుకోవచ్చు. ఉదయ సాయంత్రాలు లేలేత ఎండలో వుండటం వ్యాయామం చేయటం ఇవన్నీ ఒత్తిడిని తగ్గించేవే !!

    మసాజ్ తో కండరాలకు హాయి, మనసుకి ఆనందం

    ఎంతో బిజీ లైఫ్ ఉద్యోగాల్లో టార్గెట్స్ ఇళ్లల్లో అంతులేని పని వత్తిడి పది నిముషాలు విశ్రాంతి తీసుకునే పాటి అవకాశం లేకుండా ఒక్కరోజు గడుస్తూ ఉంటుంది. ఇక…

  • ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు బహు చురుగ్గా పనిచేస్తుందని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం పరిశోధకులు మ్యాట్ కెన్సెల్ చెపుతున్నారు. పైగా వాళ్లకు జంతువుల మహాభావాలు చాలా ఈజీగా అర్ధం అవుతాయట. అవి తమ ప్రేమ అరుపులతో చేష్టలతో ఎలా చెప్పినా పిల్లలు అర్ధం చేసుకుంటారు. దీనితో పాటు పెట్స్ కూడా పిల్లల్ని అంత బాగా ప్రేమిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులంటే పిలల్లు ఆరోగ్యాంగా ఉంటారు మానసికంగా సంతోషంగా ఉంటారని చెపుతున్నారు. పిల్లల్లో సామాజిక అనుబంధాలు ఎమోషన్ పరంగా పాజిటివ్ స్పందన పెట్స్ తో వస్తుందని తేలింది. పిల్లల భద్రత విషయంలో కూడా పెట్స్ చాలా శ్రద్ధగా వుంటాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కాకపోతే ఒక్కటే. పిలల్లు తమకు తాము రక్షించుకునే వయస్సు వచ్చే దాకా తల్లి తండ్రులు వాళ్లనోకంట కనిపెట్టుకొనే ఉండాలని ప్రమాదం అన్న పదానికి పిల్లలకు అర్ధం కూడా తెలియదని చెపుతున్నారు.

    పిల్లలు పెట్స్ ప్రేమించటం మంచిదే

    ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు…

  • ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలున్నాయని హెచ్చరిస్తూన్నారు డాక్టర్లు. ముఖ్యంగా జంక్ ఫుడ్ అస్సలు వేడి చేయకూడదని చెపుతున్నారు. చికెన్ బచ్చలి కూర గుడ్డు బంగాళా దుంపలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేడి చేసి తినకూడదు. జంక్ ఫుడ్ విషయంలో ఈ పదార్ధాల్లో మొత్తం మళ్ళీ మళ్ళీ వేడి చేసి ఇస్తూనే ఉంటారు. కట్ లెట్స్ సమోసాలు ఎప్పుడో ఉదయం చేసి పెట్టినవే కష్టమర్స్ అడగ్గానే వేడి చేసే ఇస్తుంటారు. వేడిగా తినేటప్పుడు మిగతా విషయాలు దాదాపు పట్టించుకోము. సాంబారులో వేసే దుంపలు ముక్కలు కూడా వేడి చేయటంలో మొత్తం పోషకాలు పోతాయని అనారోగ్యాలు వస్తాయని చెపుతున్నారు. ఒకసారి వండిన అన్నాన్ని వేడి చేస్తే బాక్టీరియా పునరుత్పత్తి అవుతుందిట. అంటే అన్నాన్ని వండే క్రమంలో నశించిన బాక్టీరియా దాన్ని తరిగి వేడి చేయటంలో జీవం పోసుకుంటుంది . ఇదే క్రమం జంక్ ఫుడ్ విషయంలో కూడా జరుగుతుందని చెపుతున్నారు.

    మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే చాలా నష్టం

    ఉదయం వండిన వంట ను ఫ్రిజ్ లో పెట్టుకోవటం మళ్ళీ వేడి చేసి తినటం అందరికీ అలవాటే. అయితే ఆహార పదార్ధాలు మళ్ళీ మళ్ళీ వేడి చేయటం…

  • నీహారికా , నీకు బుక్స్ చదివే అలవాటు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక పుస్తకం అంటే ఒక మనిషి జీవితకాలపు అనుభవం కదా. మన ఒకళ్ళు జీవితంలో మన అనుభవం మాత్రమే తెలుస్తుంది. ఒక అనుభవం ఉన్న రచయిత రాసిన పుస్తకం చదవటం అంటే అయినా జీవితంలో నేర్చుకున్నది అనుభవించినదీ మనకు తెలిసిరావటం. ఒక మంచి రచయిత ఒక యుద్దాన్ని గురించి ఏం చెప్తారో తెలుసా.. యుద్దమంటే ఇద్దరు శత్రువులు తలపడి బలా బలాలు చూసుకోవటం అనుకుంటాం కదా. రచయిత ఏం చెపుతున్నాడంటే , పోరంటే అనుక్షణ జీవితానుభవం నీ ప్రాణాన్ని నువ్వెంతగా ప్రేమిస్తావో ఎదుటివాడి ప్రాణాన్ని అంతే ప్రేమించటం పోరంటే నువ్వు పూర్తిగా మనిషిగా జీవించటం ... అంటే అర్ధం అయిందా .. పోరంటే యుద్ధం . మనం మనుషులుగా జీవించటం కూడా యుద్ధమే. అంటే ఎపుడు సాటి మనుషులతో పక్షులతో వృక్షాలతో కలిసికట్టుగా ప్రేమగా బతకటం నిర్విరామంగా కృషి చేసి అసలు తప్పులే చేయకపోవటం ఒక వేళ తెలియక చేస్తే ఆ తప్పుని ఖచ్చితంగా వప్పుకోవటం అహాన్ని ద్వేషాన్ని వదులుకోవడం ఎదుటి వాళ్ళ బరువు భుజాన మోయటం ఎప్పుడూ ఎదుటివాళ్ళ సంతోషాన్నే కోరుకోవటం. .. ఇది నిజంగా పోరాటమే.. ఇంత చేయాలంటే మనిషి ఎంత మంచి వాడై పోవాలి. అచ్ఛంగా దేవుడల్లే వుండాలన్నమాట బావుంది కదూ.. కాస్త స్వార్ధం వదులుకొంటే ఇందులో పది శాతం అయినా మనమూ చేయచ్చు. ఏమంటావమ్మా .. ఇలాంటివి చదవటం ఎంత సంతోషం ఎంత అవసరం !!

    ఒక పుస్తకం ఎంతో నేర్పుతుంద

    https://scamquestra.com/sozdateli/5-aleksandr-prochuhan-35.html