• ఒక్కో సారి చూస్తుంటే వంటిల్లు మించిన 'బ్యూటీషియన్' ఇంకెవరు లేరనిపిస్తుంది. ఆయుర్వడంలో చర్మం సహజ సిద్దమైన మెరుపు పోకుండా వుండాలి అంటే వంటింటి వస్తువులనే ప్రస్తావించాలి. అల్లంలో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువగా వుంటుంది. మొహం పైన మచ్చలు, చారలు పోతాయి స్కిన్ టాన్ పోగొడుతుంది. ట్యాన్ తీసేస్తుంది. ఒక్క స్పూన్ చప్పున అల్లంరసం, నిమ్మ రసం, రోజ్ వాటర్ కలిపి ముఖ చర్మాన్ని ఈ మిశ్రమంతో నెమ్మదిగా రుద్దేసి, చెక్కని నీళ్ళతో కడుక్కోవాలి. అలాగే మిరియాలు పిగ్మెంటేషన్ పోగొడతాయి. మిరియాల పొడిలో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి రాసుకోని ఐదు నిమిషాల్లోపె కడిగేయాలి. ఒక స్పూన్ జాజి కాయ పొడిలో హోల్ మిల్క్ కలిపి పేస్టు లా చేసి కాసేపయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో కడిగేయాలి. అలాగే దాల్చిన చెక్క కూడా మొటిమల సమస్య పరిష్కరిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనె, మెంతుల పొడి కలిపి మొహానికి రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి. దాల్చిన చెక్క పొడి, ఓట్స్, పాలు కలిపి ఫేస్ స్క్రబ్ లాగా చేసి వాడుకుంటే మొహం మెరుపు తో వుంటుంది.

    వంట ఇంటి సుగంధాలతో అందం

    ఒక్కో సారి చూస్తుంటే వంటిల్లు మించిన ‘బ్యూటీషియన్’ ఇంకెవరు లేరనిపిస్తుంది. ఆయుర్వడంలో చర్మం సహజ సిద్దమైన మెరుపు పోకుండా వుండాలి అంటే వంటింటి వస్తువులనే ప్రస్తావించాలి. అల్లంలో…

  • భారతీయ వనిత రాసిన తోలి ఆత్మ కధాత్మిక నవల సగుణ. కృపాబాయ్ సత్యనాధన్ రాసిన ఈ నవల 1887-88 సంవత్సరాలలో క్రెస్తవ కళాశాలలు పత్రికలో సీరియల్ ప్రచురితమై 1895 లో పుస్తకంగా వచ్చింది. కృష్ణాభాయ్ తల్లిదండ్రులు బాంబే ప్రెసిడెన్సిలో క్రిస్తావ మతం పుచ్చుకున్న మొదటి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. చిన్న తనంలో తండ్రిని పోగొట్టుకున్న కృష్ణా భాయ్ అన్నగారైనా భాస్కర్ ప్రోత్సాహంతో చదువుకుంది. ఈ నవల ద్వారా తన పూర్వికుల మతాన్ని విడిచే క్రమంలో అత్యధ్మిక సంరక్షణకు లోనైనా అనుభవాలను చెప్పాలి అనుకుంది కృష్ణా భాయి. 19వ శతాబ్దంలో మత మార్పిడి జరిగిన కుటుంబాల్లో స్త్రీల ఆలోచనా ధోరణివారి సంరక్షణను 'సగుణ' నవలలో చిత్రం భాలమో. ఇది ఆత్మ కధేనా అన్నంత దగ్గరగా ఉందీ నవల. అయితే స్త్రీల పైన పురుషాధిక్యపు పట్టు వదలలేని, ఆమె అన్నా లేదా భర్త పైననో ఆధారపడి జీవిస్తున్నట్లే నవలలో స్పస్టపరిచారు. రచయిత్రి కృష్ణా భాయ్. ఇంగ్లీషులో వున్న నవలను ఇప్పుడు చదువుకోవాలంటే "Saguna's first autobiographical novel in english by an Indian women Krupabhai sattimandhan".

    తోలి ఆత్మ కధాత్మిక నవల సుగుణ

    భారతీయ వనిత రాసిన తోలి ఆత్మ కధాత్మిక నవల సగుణ. కృపాబాయ్ సత్యనాధన్ రాసిన ఈ నవల 1887-88 సంవత్సరాలలో క్రెస్తవ కళాశాలలు పత్రికలో సీరియల్ ప్రచురితమై…

  • భయాన్ని ఎలా పక్కన పెట్టాలి

    నీహారికా, ఎప్పుడూ ఎదో ఒక కొత్త పని ఎదురవ్వుతోంది. చడుకోవడం,  వంటరిగా వెళ్ళడం, హాస్టల్ లో వుండటం, కొత్త కొర్సులకు పోవడం అవన్నీ రకరకాల అనుభవాలు. కొత్త…

  • డిప్రషన్ లో వున్న వారికి మందులు చికిత్స కన్నా ఆత్మీయులు, బంధువుల అభిమానం ఎక్కువ ఉపయోగ పడుతుందని. పరిశోధనలు చెప్పుతున్నాయి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపాడేది స్నేహమే. ఒక వయస్సు ఒకేలా ఆలోచించడం ప్రేమను పంచడం ఇవన్నీ మానసిక ప్రశాంతతను ఇచ్చి డిప్రెషన్ నుంచి దూరం చేస్తాయని చెపుతున్నారు. కష్టాల్లో తోడుగా వుంటూ, మనను అర్ధం చేసుకుంటూ తప్పుదారిన నడిస్తే మందలిస్తూ, మంచి పని చేస్తే మెచ్చుకుంటూ, స్నేహితుడి బాధ్యత, సాన్నిహిత్యం ఏ మనిషికైనా కొండంత బలమే అంటున్నాయి అధ్యయనాలు. ఒకళ్ళని గురించి ఇంకొకళ్ళు పట్టించుకునే తీరిక ఓపిక లేని ఈ రోజుల్లో వ్యక్తి గత పరిసోధనలకి రాగలిగిన ఒక్క స్నేహితుడు వుంటే ఎన్నో మానసిక సమస్యలు దూరంగా వుంటాయి అంటున్నారు. అందుకే స్నేహం అపూర్వం. అనుభూతులు, భావోద్వేగాలు పంచే స్నేహితుల్ని ఎంత కష్ట సమయం లోనూ చేజార్చుకొ వద్దు అంటున్నారు. ఒక వేళ మన వైపు నుంచి అవతల స్నేహితులకు కాస్త కష్టం కలిగిన వెంటనే సారీ చెప్పడంలో తప్పేం లేదు అంటున్నారు. అలవాట్లు, అభిరుచులు కలసిన వెంటనే సారీ చెప్పటంలో తప్పేం లేదంటున్నారు. అలవాట్లు, అభిరుచులు కలసిన మంచి ఫ్రెండ్ వుండటం జీవితానికో నిండుతనం కుడా.

    ఒక్క స్నేహం వుంటే చాలు

    డిప్రషన్ లో వున్న వారికి మందులు చికిత్స కన్నా ఆత్మీయులు, బంధువుల అభిమానం ఎక్కువ ఉపయోగ పడుతుందని. పరిశోధనలు చెప్పుతున్నాయి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపాడేది…

  • సెలవులు ఇచ్చేసాక అంటే ఇంట్లో వానర సేన వున్నట్లే. వున్న సెలవుల్లో ఏ సమ్మర్ స్కూలో వెతికి రెండు నెలల పాటు ఏవో కొన్ని క్రియేటివ్ పనులను నేర్చుకుంటారులే అనుకుంటాం. కానీ పిల్లల సమయం సద్వినియోగ చేసే దిశగా కూడా ఆలోచనలు మళ్ళించ వచ్చు. సంగిఇతం మనస్సుని ఉత్తేజితం చేస్తుంది. మెదడుని చురుకుగా ఉంచుతుంది. గొంతులో రాగాలు పలకవనిపిస్తే. ఏదైనా ఇష్టమైన వాయిధ్వని నేర్పించవచ్చు. ఇది మెదడుకి శరీరానికి మధ్య సమయంలో పూర్తి చేసే కొర్టులో ఎంచుకోవచ్చు. అవన్నీ చదువుకి సంబందించినవి కాకపోయినా పర్వాలేదు. ఉదాహరణకు వాళ్ళకు మంచి మంచి స్వీట్లు, కేక్స్ తయారీ, లేదా మంచి ఆహారం పట్ల ఆసక్తి వుంటే కేక్స్ తయారీ, లేదా రకరకాల జామ్ లు, జెల్లీలు, ఇంకా ఇష్ట పడితే ఏదైనా సరే వందేయడం పట్ల శిక్షణ తిసుకోనిస్తే వాళ్ళకు ఫ్యుచర్ లో ఉపయోగ పడతాయి. రెండు నెలల సమయం సద్వినియోగం అవుతుంది. అలాగే ఎన్నో భాషలున్నాయి వాటి పై ద్రుష్టి పెట్టవచ్చు. కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల సామాజికంగా వాళ్ళ పరిధులు పెరిగినట్లే.

    సెలవులు సద్వినియోగం చేసుకోనివ్వండి

    సెలవులు ఇచ్చేసాక అంటే ఇంట్లో వానర సేన వున్నట్లే. వున్న సెలవుల్లో ఏ సమ్మర్ స్కూలో వెతికి రెండు నెలల పాటు ఏవో కొన్ని క్రియేటివ్ పనులను…

  • సాధరణంగా ప్రసవంలో పెద్ద జాగ్రత్తలు అవసరం లేదు కానీ సిజేరియన్ అయితే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తప్పవు. సిజేరియన్ తర్వాత అటు ఇటు కదలడం లేవడానికి ప్రయత్నం చేయడం వంటివి అస్సలే కుదరదు. 24 గంటల పాటు పూర్తి విశ్రాంతి లో నే వుండాలి. వైద్యుల సలహాలతో లేచి అటు ఇటు అడుగులు వేయొచ్చు. ఇలా నడవడం వల్ల శరీర భాగాలలో రక్తం గడ్డ కట్టకుండా వుంటుంది. ఇది తల్లి పాల పైన ప్రభావం చూపెడుతుంది. మెట్లు ఎక్కడం దిగడం చేయకపోవడమే మంచిది. పొట్టభాగంలో నొప్పి వుంటుంది. కానీ మరీ వేడి ననీరు కాకుండా గోరు వెచ్చని నీటి తో స్నానం చేస్తేనే నొప్పుల నుంచి ఉపసమనం గా శరీరం తేలికగా వుంటుంది. మంచం పైన కుర్చుని గోడకు అనుకునే సమయంలో వీపు వెనక భాగంలో దిండు లేదా మెత్తని దుప్పటి పెట్టుకోవాలి. మంచంపైన కుర్చుని మోకాళ్ళను గుండెల దాకా తెచ్చె ఎక్సర్ సైజ్ చేయాలి. వత్తిడి కలిగేలా రెండు పాదాలు ఒకే సారి అంచి లేవడం మంచిది కాదు, ఒక కాలు ముందుకు వేసి ఇంకో కాలు తర్వాత వేసి దిగాలి. గట్టిగా నవ్వడం, కదలడం కూడా నొప్పి కలిగిస్తాయి. కొన్ని జాగ్రత్తల తో ఆరోగ్యం తిరిగి పొందొచ్చు.

    సిజేరియన్ తర్వాత కాస్త జాగ్రత్త

    సాధరణంగా ప్రసవంలో పెద్ద జాగ్రత్తలు అవసరం లేదు కానీ సిజేరియన్ అయితే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తప్పవు. సిజేరియన్ తర్వాత అటు ఇటు కదలడం లేవడానికి ప్రయత్నం…

  • వేప పువ్వు వాసన చాలా బావుంటుంది. మంచి వాసన వేసే వేప పువ్వులో ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. అందుకే ఈ కాలంలో వచ్చీ వేప పువ్వు సేకరించి ఎండబెట్టి పొడి చేసి ఏడాది పొడువునా వాడుకుంటారు. ఈ పువ్వును పారిశ్రామికంగా అనెక ఔషధాలు గాయాల నివారణకు వాడే ఆయిట్ మెంట్స్ లో సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. కొన్ని రకాల ఆహార పదార్ధాలు వ్యాదుల నివారణ్ కోసం వాడుకో వచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. జీలకర్ర, వేప పూల పొడి కలిపిన పానీయం తాగితే ఆకలి పెరుగుతుందింట. ఈ పొడి ఆహార పదార్ధాల్లో చల్లుకుని తింటే కంటి చూపు మెరుగు అవ్వుతుంది. ఆకులూ పువ్వులు కలిపి మెత్తగా రుబ్బి, మొహం పైన రస్తే మొటిమలు పోతాయి. ఈ పువ్వుల్లో వుండే సువాసనను పరిమళ చికిత్సలో కూడా ఇతర పువ్వులతో కలిపి వాడతారు. ఎదో ఒక రూపంలో ఈ పువ్వుల్ని తీసుకుంటే జీవక్రియ బాగుంటుంది. రక్త నాళాలు చెక్కగా పనిచేస్తాయి. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రక్తలో చెక్కర శాతం నియంత్రణ లో వుంటుంది. బరువు టో పాటు పొట్ట తగ్గాలనుకొంటె మంచి ఔషదం ఇంకొకటి లేదు.

    పరిమళ చికిత్స లో వేప పువ్వు

    వేప పువ్వు వాసన చాలా బావుంటుంది. మంచి వాసన వేసే వేప పువ్వులో ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో సుగుణాలున్నాయి. అందుకే ఈ కాలంలో వచ్చీ వేప…

  • నిజం మాటాడితే నీ నోటికి భయపడాలి అంటారు. నేను ప్రాక్టికల్ గా చూసినవి అనుభవించినవె కదా మాట్లాడేది. అందుకే వాళ్ళు ఎవళ్ళు ఖండించరు కానీ ఒప్పుకోరు అంటుంది కంగనా రనౌత్. నేను నీటిలో పుట్టి పెరగలేదు, హిమాచల్ ప్రదేశ్ లోని ఒక చిన్న టౌన్ లో పుట్టాను. ముంబాయి కి వచ్చిన కొత్తలో ఇక్కడి పద్దతులు తెలియవు. నా ఇంగ్లీష్ యాక్సెంట్ చూసి నా డ్రెస్ చూసి నవ్వేవాళ్ళు. వారి ప్రవర్తనే నాలో కసి పట్టుదల పెంచాయి. వేషం మార్చుకున్నాను. భాష నేర్చుకున్నాను. అన్ని విధాలా మారిన నన్ను చూసి నవ్విన వాళ్ళే ఆశర్య పోతున్నారు. బాలివుడ్ లో నాకంటూ ఒక రహదారి ఏర్పరుచుకొన్నాను. ఒక చదువు రాని పల్లెటూరు అమ్మాయి ఈ స్తాయికి రావడం ఆషామషి కాదు. ఇప్పుడు వున్న స్టార్ హీరోయిన్స్ కి సినీ బాక్ గ్రౌండ్, లేదా కుటుంబం అండో వున్నాయి. నా విషయంలో ఆ రెండులేవు. అలంటి స్తితి నుంచి బాలీవుడ్ స్వాన్ అనిపించికోవడం పెద్ద అచీవ్ మెంట్ అని నా ఉద్దేశ్యం అంటోంది కంగనా. కంగనా కూడా గొప్ప ఆత్మవిశ్వాసం స్వాతంత్ర భావాలు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయనడం సందేహం లేదు.

    నా సక్సెస్ వెనకో చెక్కని కధ

    నిజం మాటాడితే నీ నోటికి భయపడాలి అంటారు. నేను ప్రాక్టికల్ గా చూసినవి అనుభవించినవె కదా మాట్లాడేది. అందుకే వాళ్ళు ఎవళ్ళు ఖండించరు కానీ ఒప్పుకోరు అంటుంది…

  • జుట్టుకు మంచి ఉపయోగ పడే మందార పువ్వును రక్త పోటును తగ్గించడానికి సహాయ పడుతుంది అని ఇటీవల పరిశోధనలు రుజువు చేసాయి. మందార పువ్వులతో దాచిన టీ తాగితే తోలి దశలో వున్న రక్త పోటును తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఈ పూవుల్లో అద్భుతమైన ఔశాదాలున్నాయి. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల్లో దొరికే ఈ మందుల షాపుల్లో ఎరుపు రంగు పువ్వుకు ఆయుర్వేదం మందుల్లో ఉపయోగిస్తారు. మందార నూనె తలవెంట్రుకలు రావడమే కాకుండా చర్మ రక్షణకు కూడా ఉపయోగ పడుతుంది. వయస్సు పైబడే లక్షణాలనునిలువరించే శక్తి వంతమైన మొక్క మందారం. అందుకే దీన్ని బొటాక్స్ ప్లాంట్ అని కూడా అంటారు. మందార పూలు ఎండ బెట్టి పొడిగా చేసి వాటిని నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీటిలో మొహం కడుక్కొంటే అలసి చర్మం తేటగా అయిపోతుంది. మందార పూల పొడి, తేనె, పాలు కలిపి పేస్టులా చేసి ముఖానికి మర్దనా చేస్తే మ్రుతకనాలు పోయి చర్మం మృదువుగా అయిపోతుంది. మందారంలోని యాంటీ బక్టిరియల్ గుణాలు మొటిమల్ని, గాయాల తాలూకుమచ్చలు పోగొడతాయి.

    మందార పువ్వులతో ముఖ సౌందర్యం

    జుట్టుకు మంచి ఉపయోగ పడే మందార పువ్వును రక్త పోటును తగ్గించడానికి సహాయ పడుతుంది అని ఇటీవల పరిశోధనలు రుజువు చేసాయి. మందార పువ్వులతో దాచిన టీ…

  • ఎంతో మంది అనుభవం ద్వారా చెప్పాక, డాక్టర్లు కూడా తెల్చేసాక మనం కొన్నింటిని ఎంతో శ్రద్దగా ప్రతి దినం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు పరిశోధన కాదంటే, ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎన్నో ఏళ్లుగా అలవాటు పడ్డ ఆ వస్తువులను ఎలా వదిలేయాలి? గోధుమలు ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరం స్నుకున్తున్నాం. కానీ ఇప్పుడో కొత్త పరిశోధన ఇది నిజం కాదంటోంది. వరిలాగా గోధుమలు అంత త్వరగా జీర్ణం కావని, దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలని అంటోంది. అజీర్తి తలనొప్పి, కడుపులో అసౌకర్యం ఇవన్నీ గోధుమలు తినడం వల్ల షుగర్ అదుపులో వుంటుంది అనడం కూడా శాస్త్రీయంగా రుజువు కాలేదని, కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని వారు చేఅప్పుతున్నారు.

    గోధుమలతోనే సగం సమస్యలు

    ఎంతో మంది అనుభవం ద్వారా చెప్పాక, డాక్టర్లు కూడా తెల్చేసాక మనం కొన్నింటిని ఎంతో శ్రద్దగా ప్రతి దినం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు…