• పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. తల్లి పాలకు పిల్లల జీవితంలో ప్రదర్శించే తెలివితతేటలకు సంబందం లేదని లండన్ కు ఛేందిన గోల్డ్ స్మీత్ యూనివర్సీటి శాస్త్రవేత్తలు వెల్లడించారు. పోతపాలు తాగిన పిల్లల్లు 18 నెలల వయసు వారు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ధీర్ఘకాలం పాటు ఈ అధ్యాయనం కోనసాగించామంటున్నారు. మొత్తం 11 వేల మంది పిల్లల విషయంలో అధ్యయనం సాగింది. పిల్లల ఎదుగుదలలో వారి అధికస్థితిగతులు సామాజిక కుటుంబ నేపథ్యం తల్లిదండ్రుల విధ్యర్హతలు ముఖ్యపాత్ర పోషిస్తాయని పోతపాలు పట్టిన తల్లులు ఏ మాత్రం విచారించాల్సిన అవసరం లేదని అధ్యాయనం రిపోర్టులు చెప్పాయి.

    ఏ పాలు తాగిన ఒకటే

    పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు…

  • అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్తీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో సృజనాత్మకంగా తయారుచేస్తారు. కలప ఇనుమూ ప్లాస్టిక్ ఉండగా పేపర్ తో ఎందుకూ అంటే గతంలో ఎన్నెనో వస్తువులు పేపర్ గుజ్జుతో తయారుచేసారు. ఇవి కూడా దృఢంగా వుంటాయని నేను పరిశోధించి తెలుసుకున్నారు. ఏదైనా కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తే బావుంటుంది కదా అంటుందామె. వేస్ట్ పేపర్ తో తయారుచేసిన ఏ వస్తువులు విభిన్న ఆకృతులతో 200 కిలోల కంటే ఎక్కువ బరువు మోయగల సామర్ధ్యంతో ఉంటాయి. వీటిని తయారు చేయటం వెనక నాలుగేళ్ళ శ్రమ దాగుంది అంటోంది స్పృహా చొఖాని. ఒక్కసారి అస్సాం పల్ప్ ఫ్యాక్టరీ శోధించండి. మోడరన్ డిజైన్స్ ఎన్నెన్ని వస్తువులున్నాయో అందులో ఎంత కళాత్మకత వుందో ఇంటీరియర్స్ గా అవెంత బావున్నాయో చూడండి.

    కాగితపు కళా ఖండాలు

    అస్సాంలో వుంది పల్ప్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఆలోచన చేసింది. స్పృహా చొఖాని. ఇక్కడ కుర్చీలు టేబుళ్లు కేవలం పేపర్ గుజ్జు ఉపయోగించి ఎంతో దృఢంగా ఎంతో…

  • ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ వేడుకలు వచ్చాయి కదా అని ఘాటైన మసాలాలు వేపుళ్ళు వేడి వేడి స్వీట్లు తినేస్తేనే ప్రాబ్లమ్. ఆకలి పొట్టతో వంద వెరైటీలు ముందు నిలబడి నోరు కట్టేసుకోవటం కష్టం అన్యాయం కూడా అందుకే ఎక్కడైన విందుకు హాజరయ్యేప్పుడు చక్కగా ముచ్చటగా తయారైపోయి ఇంట్లోనే సగం పొట్ట నింపేసుకుని వెళ్ళటం ఉత్తమం. ఇక విందు సూపులు రోటీలు పచ్చి ముక్కలు రైతాలు ఎంచుకుంటే గొడవే లేదు. చలికాలం కదా దాహంగా అనిపించదు గని ఎదురుగ కూల్ డ్రింక్స్ ఊరిస్తుంటే మొహం తిప్పుకోలేం కదా . మంచినీళ్లు అవసరం లేకపోయినా తాగాలి. విందులో కొబ్బరినీళ్లు నిమ్మరసాలు కావాలన్నా దొరకవు కనుక నీళ్లతో సరిపెట్టుకుని ఏ డ్రింక్ నయినా పక్కన పెట్టేయటం ప్రాక్టీస్ చేయాలి. అక్కడ కాఫీ టీ లు సప్లయ్ చేస్తున్నా సరే మళ్ళా మనసు నొక్కి పట్టుకుని ఇక్కడ హెర్బల్ టీ వుందా అని అడగండి నో అన్నారనుకోండి మంచి నీళ్ల స్టాల్ వైపు అడుగులేయండి. పదార్ధాల ఎంపికలో తప్పటడుగు వేస్తె పోదున్నే లేచి 10 మైళ్ళు నడవాలని గుర్తు తెచ్చుకోండి.

    పదార్ధాల ఎంపికలో జాగ్రత్త సుమా !

    ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం  సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ …

  • మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే కళ్లు మూసుకుని ఆలోచించమంటున్నారు సైకియాట్రిస్టులు. 200 మంది స్త్రీ పురుషులకు ఒక క్రైమ్ హారర్ సినిమా చూపించారట. సినిమా చూసిన వెంటనే అందులో సన్నివేశాల గురించి ప్రశ్నిస్తే వచ్చిన సమాధానాలు రాసుకుని వాళ్ళని కళ్ళు మూసుకుని ఆ సినిమా గురించి ఆలోచించమంటున్నారట. 71 శాతం మంది కళ్ళు మూసుకుని ఆలోచించి కరెక్ట్ సమాధానాలిచ్చారట. సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే మనం ఇంట్లో మరచిపోయే వస్తువుల గురించి ఆలోచించాలంటే కళ్ళు మూసుకున్న తరువాత చుట్టూ విషయాలు మాయమై మనసు ఆ సంభంధితమైన విషయం పైనే లగ్నం అవుతోందని ఆలా ఎక్కడ ఏది మరిచిపోయామో మెదడు రివైండ్ చేసుకోగలదని చెప్పారు. పోలీసులు కూడా ఇంటరాగేషన్ సమయంలో అనుమానితులను ప్రశ్నించే సమయంలో వాళ్ళని కళ్ళు మూసుకుని ఆలోచించమని చెపుతారట.

    కళ్ళు మూసుకుని ఆలోచిస్తే గుర్తొస్తాయి

    మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే కళ్లు మూసుకుని ఆలోచించమంటున్నారు సైకియాట్రిస్టులు. 200 మంది స్త్రీ పురుషులకు ఒక క్రైమ్…

  • అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో మార్కెట్ లోకి వస్తే ముందు కన్ను చెదిరే రంగులకే కళ్ళు అతుక్కు పోతాయి లెనిన్, క్రేప్ చీరాలపైన డిజిటల్ ప్రింట్స్ చాలా అందంగా వుంటున్నాయి. అసలే అతి నాజూకైన చీరలు, వాటి పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన ఎవరో చేయి తిరిగిన కళాకారులు మనస్సు పెట్టి కాన్వాస్ పైన అందమైన ప్రకృతిని తీర్చిదిద్దినట్లు డిజిటల్ డిజైన్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు చీరకి అందం ఎలావుంటుంది.ఈ ప్రింట్స్ ప్రత్యేక సందర్భాలలోనే కాదు, స్టయిల్ గా మోడ్రన్ గా క్యాజువల్ వేరేగా కూడా ఎంతో బాగుంటాయి. క్రీమ్, మాస్టర్ కలర్, ఉదా రంగు, ఎరుపు, నలుపు క్రేప్ సారీల పైన పువ్వుల డిజిటల్ ప్రింట్లు ఎంత బాగుంటాయో ఓ సారి చూడండి.

    నాజూకు చీరల పై డిజిటల్ ప్రింట్స్

    అది నేత చీర అయినా, సిల్క్ అయినా సరే డిజిటల్ డిజైన్ లో మార్కెట్ లోకి వస్తే ముందు కన్ను చెదిరే రంగులకే కళ్ళు అతుక్కు పోతాయి…

  • ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ హత్యల్ని వ్యతిరేకిస్తూ పెద్ద ప్రచారం నిర్వహించింది. ఇప్పుడీమెకు 22 సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డుకెక్కింది. టీవీల్లో కనపడుతూ వుంటుంది. అమెరికన్ హారర్ సిరీస్ లో ముఖ్య పాత్ర నటించింది. బిగ్ బాస్ కార్యక్రమంలో గెస్ట్ గా కనిపించింది. ఫ్యాషన్ అంటే చాలా క్రేజ్ ఎత్తు బరువుకు తగట్టు మందమైన దుస్తులు కుట్టించుకుంటుంది. చక్కగా తయ్యారు అవుతుంది. అంత పొట్టిగా కనిపిస్తే విచిత్రంగా చూస్తుంటే, తాకేందుకు ప్రయత్నిస్తుంటే ఇచ్చిందే కానీ నన్ను తక్కువగా అంచనా వేస్తే నాకు నచ్చదు అంటుంది జ్యోతి. అంత పసి దానిలా కనపడే ఈ యువతి మహిళా శక్తి ప్రధాన్యాత ను ప్రచారం చేయడం అంటే గొప్పే కదా జ్యోతికి కంగ్రాట్స్ చెప్పేద్దాం.

    రెండడుగుల సూపర్ స్టార్

    ఈమె ఎత్తు రెండడుగుల ఆరు అంగుళాలు. బరువు కేవలం ఐదు కిలోలు. ఈ మరగుజ్జు రూపాన్ని అత్యంత పాజిటివ్ గా రిసీవ్ చేసుకుని జ్యోతి ఆడపిల్లల బ్రుణ…

  • ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఊహా తెలిసినప్పటి నుంచి బొమ్మలేసే ఈమె పెన్సిల్ చర్కోల్, కలర్ పెన్సిల్ ఇలా అన్ని మాధ్యమాలలో బొమ్మలు వేస్తుంది. వాటర్ కలర్స్ ప్రాక్టిస్ చేసి హైదరాబాద్ కళామందిర్ లో మొదట గ్రూప్ షో, తర్వాత సోలో ఎగ్జిబిషన్స్ నిర్వహించింది. ఢిల్లీ లోని పిబిసి ఆర్ట్ గ్యలరీలో షో చేసాక, చైనాలో వర్క్ షాప్ లో లండన్ లోని స్లేర్ స్కల్ లో చిత్ర కళను అభివృద్ధి చేసుకుంది. లండన్ లో భరతీయ సాంస్కృతిక విభాగం నెహ్రు నెంటర్ చేసిన షో కు మంచి రెస్పాన్స్ వచ్చిందంటారామె. గతంలో ఈమె గర్ల్ చైల్డ్ ధీమ్ లో బొమ్మలు వేసేది ఇప్పుడు కామాసూత్ర పుస్తకం స్పూర్తి తో కపుల్ సిరీస్ స్టార్ట్ చేసింది. ఎలాంటి టార్గెట్ లేకుండా ఎప్పుడు బొమ్మలు వేస్తూనే వుండాలి అన్నది దీపానాథ్ ధ్యేయం.

    నిరంతరం బొమ్మలు వేయాలన్నదే దీపా ధ్యేయం

    ఆర్టిస్ట్ దీపానాథ్ హైదరాబాద్ నిజాం కాలేజీ లో గ్రాడ్యుయేషన్ చేసి పూనే లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఊహా తెలిసినప్పటి నుంచి బొమ్మలేసే ఈమె పెన్సిల్…

  • పట్టు దారం కోసం పట్టు పురుగులను (కకూన్) వేడి నీళ్ళల్లో పడేసి ఆ దారాన్ని వలుచుకుంటారు. కానీ జ్ఞానం వున్న మనిషిగా జీవన వైవిధ్యాన్ని ప్రకృతి ధర్మాన్ని కాపాడాలని నోరు లేని పట్టు పురుగులను హింసించకూడదు అని అలోచించి వరంగల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన కుసుమ రాజయ్య అహింసా పద్దతిలో ఆలోచించారు. పట్టు పురుగులను చంపకుండా దారం తీసే పద్దతిని కనిపెట్టారు. ఈ దారానికి కొంచం మెరుపు తక్కువ. కానీ మృదువుగా వుంటుంది. నాణ్యతలో లోపం ఉండదు. ఈ పట్టుకి అహింసా పట్టు అని పేరు పెట్టారు.ఈ అహింసా పట్టుకు పేటెంట్ హక్కులు సంపాదించుకున్నారు. దేశ విదేశాల్లోని పలు రాష్ట్రల్లో అనేక ఎగ్జిబిషన్స్ లో ఈ అహింసా సిల్క్ ప్రదర్శించి చూపారు. ఈ వస్త్రాల నాణ్యత వాటిలో ఉపయోగించే రంగుల మేళవింపు, ముఖ్యంగా పట్టు పురుగును చంపకుండా దారం తీయడం ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ప్రముఖ దేశాల్లో దేవతా మూర్తులను ఈ పట్టు వస్త్రాల తో అలంకరిస్తున్నారు. తనకు దివంగత రాష్ట్రపతి వెంకటరామన్ సతీమని జానకీ వెంకటరామన్, ఈ పట్టు పురుగులను చంపకుండా తీసిన దారంతో నేసిన వస్త్రం కావాలని అడిగి స్ఫూర్తినిచ్చారు అంటాడు రాజయ్య. ఎన్నో పట్టు పురుగులకు ప్రాణదానం చేసిన కీర్తి జానకీ వెంకటరామన్కి దక్కుతుంది అన్నమాట.

    అత్యంత మృదువైన అహింసా పట్టు

    పట్టు దారం కోసం పట్టు పురుగులను (కకూన్) వేడి నీళ్ళల్లో పడేసి ఆ దారాన్ని వలుచుకుంటారు. కానీ జ్ఞానం వున్న మనిషిగా జీవన వైవిధ్యాన్ని ప్రకృతి ధర్మాన్ని…

  • ప్రపంచంలో చాలా మందికి కొన్ని నమ్మకాలుంటాయి. కొందరు శకునాలను నమ్ముతారు. 13 వ సంఖ్య అంటే ఇంగ్లాండ్ లో చాలా భయపడతారు. ఆ నెంబర్ తమ ఇళ్ళకి పెట్టుకోరు. అక్కడ హోటల్స్ లో 12వ గది తర్వాత 14వ గది ఉంటుంది. కొందరు లక్కీ చీర లక్కీ నెంబర్ లక్కీ కలర్ అంటుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల వ్యక్తిగతంగా అవి పాటిస్తారు. గనుక ప్రమాదం ఉండదు. సామజిక ఇబ్బందులు తెచ్చే నమ్మకాలనే మూఢ నమ్మకాలంటారు. ఉదాహరణకు ఇలాంటి మూఢ నమ్మకాల వల్లే దేశంలో ఒక శాతం సిజేరియన్ ఆపరేషన్లు పెరిగాయంటే నమ్ముతారా. ముఞ్చి నక్షత్రంలో బిడ్డ పుట్టాలని కోరుకునే వాళ్ళ సంఖ్య పెరిగే అది డాక్టర్లకు మేలు చేస్తోంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి మూఢ నమ్మకాలే జీవితాలను ప్రమాదంలోకి నెడతాయి. మనుషులను శాశ్వతంగా భయంలోకి ఉంచుతాయి. ఎన్నో రకాల అనారోగ్యాలకు దేవుళ్ళ కారణమని కొలువులు నైవేద్యాలు పెట్టటం చూస్తుంటాం. కొందరు ఎదురొస్తే శకునం మంచిది కాదనో తుమ్మితే తప్పనో ఇలాంటి వల్లే మనుషులు బలహీన పడతారని చెప్పక తప్పదు.

    ఇలాంటి నమ్మకాల వల్ల నష్టమే ఎక్కువ

    ప్రపంచంలో చాలా మందికి కొన్ని నమ్మకాలుంటాయి. కొందరు శకునాలను నమ్ముతారు. 13 వ సంఖ్య అంటే ఇంగ్లాండ్ లో చాలా భయపడతారు. ఆ నెంబర్ తమ ఇళ్ళకి…

  • హాయిగా నవ్వడం ఒక అద్భుతమైన వరం. ఇళ్ళలో అస్తమానం నవ్వటం తప్పని చెపుతారు కానీ ఎప్పుడు ఎలా నవ్వొచ్చో మాత్రం నేర్పారు. కొందరు పిల్లలు అందుకే కదిలిస్తే కారుస్తామన్నట్లుంటారు. అలా వుంటే పిల్లాలతోనే కాదు పెద్ద వాళ్ళతో కూడా ఎవ్వళ్ళు మాట్లాడరు. నవ్వటం, నవ్వించటం చేతగాక పోతేనే వంటరితనం వస్తుంది. అందుకే నవ్వటం కూడా ఒక కళే అనుకుని దాన్ని సాధన చేయాలి. నవ్వు ఒక్కటే కష్టాల్ని, జీవితంలో ఎదురయ్యే అంతరాలని ఎదుర్కునే శక్తినిస్తుంది. మూడ్ మార్చుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. మనిషి కొచ్చే 60శాతం అనారోగ్యాలు నవ్వు అనే టానిక్ తోనే దూరం అవుతాయంటారు. ఉచితంగా లభించే ఈ టానిక్ ని ఉపయోగిన్చుకోక పొతే ఎట్లా మనసుని ఉల్లాసంగా వుంచుకో గాలిగితే శరీరంలో ఏర్పడిన ప్రిరాడికల్స్ ని నియంత్రించే హార్మోన్స్ తయారవుతాయి. మంచి జోక్స్ పుస్తకాలు చదవాలి. హాస్యం నిండిన సినిమాలు చూడాలి. ఎలాగోలా నవ్వుని జీవితంలోకి ఆహ్వానించగలగాలి.

    ఈ అద్భుతమైన టానిక్ గురించి విన్నారా?

    హాయిగా నవ్వడం ఒక అద్భుతమైన వరం. ఇళ్ళలో అస్తమానం నవ్వటం తప్పని చెపుతారు  కానీ ఎప్పుడు ఎలా నవ్వొచ్చో  మాత్రం నేర్పారు. కొందరు పిల్లలు అందుకే కదిలిస్తే…