• హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కధ లాంటి సమాచారం ఒకటి వచ్చింది. బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. ఇక వీటి వినియోగంలో మతి మరుపు వాళ్ళు మేధావులైపోతారన్నమాట. ఇప్పటివరకు ఎలుకలు కోతులపైన ఈ మెమొరీ చిప్స్ ఉపయోగించి ప్రయోగాలు చేసారు. వాటి జ్ఞాపక శక్తి పెరిగిపోయి చాల తెలివిగా వున్నాయట. ఇక మనుషుల కోసం బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయట. కాలిఫోర్నియా లోని బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ Dr. థయోడోర్ బెర్గర్ ఈ బ్రెయిన్ చిప్ డిజైనింగ్ చేస్తున్నాడు. మెదడు లో మెమొరీ ని పెంచే వివిధ రకాల డిజైన్లతో కృత్రిమ పరికరాలు తయారుచేస్తున్నారు. ఇవి మనుషుల్లో వుండే షార్ట్ టర్మ్ మెమొరీ పవర్ ని లాంగ్ టర్మ్ మెమోరీ గా మారిపోతుంది. ఈ చిప్ మెదడు లో ఇన్స్టాల్ చేస్తే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని ప్రసారం చేసి లింకులు కలుపుతూ మెమొరీ ని వృద్ధి చేస్తాయన్నమాట. మనుషుల పరిస్థితులు బ్లడ్ గ్రూపులు కామన్ జీన్స్ వారీగా ఈ చిప్స్ ఇన్స్టాల్ చేస్తారన్నమాట. మెదడు బదులు మిషనే ఆలోచించి పెట్టేస్తుంది.

    మెమొరీ బ్రెయిన్ చిప్స్ వస్తున్నాయి

    హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కధ లాంటి సమాచారం ఒకటి వచ్చింది. బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. ఇక వీటి వినియోగంలో మతి మరుపు వాళ్ళు మేధావులైపోతారన్నమాట. ఇప్పటివరకు…

  • ఇంటా బయటా ద్విపాత్రాభినయం తో కలిగే వత్తిడి కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం ప్రస్నార్ధకమైంది. నిత్యం అనేకమైన పనులు ఇంటి చాకిరీ వృత్తి పరమైన బాధ్యతల వల్ల ఎక్కువ వత్తిడికి గురవుతున్నది మహిళలే అని అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఈ వత్తిడి వల్ల హార్మోన్ల పనితీరు దెబ్బతింటోంది. ఫలితంగా సంతాన లేమి అధిక బరువు మధుమేహం గుండె సంబంధిత సమస్యలు స్త్రీలలో తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ధ్యానం ఒకటే మార్గం అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. అసలు ధ్యానమంటే ఏమిటి? శారీరిక మానసిక భావోద్వేగాల సమతుల్యతలకు మేలైన సాధనం. ధ్యానం అసలెలా చేయాలి. ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకుని ఆలోచనను శ్వాస పైన కేంద్రీకరించాలి. ఒక వస్తువు పై దృష్టి కేంద్రీకరించి మిగతా ఆలోచనల్ని పక్కన పెడితే మనసు నెమ్మదిగా ఆ వస్తువు పైన లగ్నం అవుతుంది. ఇలా ఏకాగ్రత అలవాటై సహజ సిద్ధంగా అభివృద్ధి అవుతుంది. మనసును ఏకాగ్రత చేయగలిగితే నిర్మాణాత్మకమైన ఆలోచనలు కలుగుతాయి. ప్రతికూలమైన ఆలోచనల నుంచి అంటే కోపం వేదన పని వత్తిడి ఇవన్నీ మనసులోంచి మాయం చేసి కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని మంచి జరుగుతుందేమో ప్రయత్నిస్తే తప్పేముంది.

    ధ్యానాన్ని అలవర్చుకుంటే శాంతి

    ఇంటా బయటా ద్విపాత్రాభినయం తో కలిగే వత్తిడి కారణంగా మహిళల మానసిక ఆరోగ్యం ప్రస్నార్ధకమైంది. నిత్యం అనేకమైన పనులు ఇంటి చాకిరీ వృత్తి పరమైన బాధ్యతల వల్ల …

  • మహిళలు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు సామజిక బాధ్యత విషయంలో కూడా ఒక్కడుగు ముందే ఉన్నారు. టామ్ గిల్ట్ అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది మీరా శర్మ. కేన్సర్ బాధిత మహిళల కోసం విగ్గులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. చెన్నయ్ కు చెందిన మీరా శర్మ క్రిస్టియన్ కాలేజీ లోని రొటో రాక్ క్లబ్ చైర్ పర్సన్. క్లబ్ తరఫున సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేన్సర్ వచ్చిన మహిళలు వాడుతున్న సింథటిక్ విగ్గులు చూసింది. అవి ఒక్కోటి 30 వేల ఖరీదు చేస్తాయి. పైగా వాటివల్ల అలర్జీలు కూడా వస్తాయి. వాళ్ళ కోసం అసలైన శిరోజాలతో విగ్గులు తయారు చేసి ఇస్తే బావుందనుకుంది. ముందుగా తన జుట్టే ఒక విగ్గు కోసం కత్తిరించి ఇచ్చింది. ఆమె స్నేహితురాళ్ళు క్లబ్ సభ్యులు ముందుకొచ్చారు. ఒక విగ్గులు తయారుచేసే కంపెనీ తో కలిసి 4500 రూపాయలకే విగ్గు తయారీ చేసి ఇచేలా మాట్లాడుకున్నారు. వీటిని కేన్సర్ ఇన్స్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న మహిళలకు ఉచితంగా ఇస్తూ వస్తున్నారు. దాతల నుంచి విరాళాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ టామ్ గిల్ట్ ను విస్తరించి కేన్సర్ బాధితులకు విగ్గులు ఇవ్వాలనేది మీరా శర్మ ఆశయం.

    కేన్సర్ బాధితుల కోసం విగ్గులిస్తున్న మీరా శర్మ

    మహిళలు ఉద్యోగ వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాదు సామజిక బాధ్యత విషయంలో కూడా ఒక్కడుగు ముందే ఉన్నారు. టామ్ గిల్ట్  అనే స్వచ్చంద సంస్థ స్థాపించింది మీరా…

  • సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసే ఎంతో మంచి చిన్నారుల కోసం 18 సంవత్సరాల వయసులోనే లక్ష్యం అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది రాశీ ఆనంద్. ఢిల్లీ లో వుండే రాశి చదువుకునే వయసులో శ్రమ దోపిడీ కి గురవుతున్న పిల్లలకు టాయ్ లైబ్రరీ నిర్వహిస్తున్న చదువుకు సంబంధించిన బొమ్మలు బొమ్మల పుస్తకాల ఇస్తోంది. సంపన్న వర్గాల పిల్లలు చదివే స్కూళ్ల నుంచి బొమ్మలు పుస్తకాలు సేకరించి ఢిల్లీ తో సహా జార్ఖండ్ ఉత్తరాఖండ్ తమిళనాడు కర్ణాటక లాంటి నగరాల వీధుల్లోని 2 లక్షల మంది పిల్లలకు పుస్తకాలు పంచింది రాశి. వీధి బాలల కోసం సాక్ష్యం అనే పేరుతో స్కూలు ప్రారంభించింది. ఫ్లై ఓవర్ల కింద రైల్వే స్టేషన్లు రెడ్ వైట్ ఏరియాల పిల్లలకు చదువు చెప్పటంతో పాటు వారికి సత్ప్రవర్తన బోధిస్తూ మాదక ద్రవ్యాల సేవనం పిక్ పాకెటింగ్ లాంటి నేరాల పై అవగాహన పెంచుతూ వాటికి దూరంగా ఉండాలని ప్రచారం చేస్తోంది రాశి. రెండు చేతులా పనిచేసినా ఇంకెంతో చేయాల్సిన అవసరం ఉన్నచోట రాశి లాంటి యువతులు మేమున్నామంటూ ముందుకురావటం ఆనందించదగిన విషయం.

    2 లక్షల మందికి పుస్తకాల పంచింది రాశి

    సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసే ఎంతో మంచి చిన్నారుల కోసం 18 సంవత్సరాల వయసులోనే లక్ష్యం అనే స్వచ్చంద సంస్థను స్థాపించింది రాశీ ఆనంద్. ఢిల్లీ లో…

  • రెండు చేతులా ఏదైనా ఎవరికైనా ఏదీ ఆశించాకుండా పంచే రోజు ఇది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ స్వచ్చంధ సేవలో తరించారు. అతి సామాన్యులు కూడా తోటి వాళ్ళ కష్టానికి చాలించరు. సాయి పడ్డారు. వాళ్ళందరికీ, సాటి మనుష్యులను అందుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ, సాటి మన్యుషులను ఆదుకోవాలనే సత్సంకల్పం వున్న వాళ్ళందరికీ అంజలి షుటిస్తూ ఈ రోజు మదర్ ధెరిసాను గుర్తుకు తెచ్చుకుందాం. మిషనరీస్ ఆఫ్ చారిటీ స్వచ్చంధ సేవా సంఘంలో మదర్ నెలకొల్పిన తిరుగులేని మెయిలు రాయి. అల్టేనియాలో పుట్టి డార్జిలింగ్ లో కొన్నాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పారు మదర్. తర్వాత నన్ గా మారారు. ఆకాలంలో బెంగాల్ కరువు, మతకల్లోలాలు కలకత్తాను కుదిపేసాయి. ప్రజలు రోగాలతో దుర్భర దరిద్రయంతో అల్లాడారు. ధెరీసా ఆ పనులకు అనాధలకు తల్లయ్యారు. ఆమె నిస్వార్ధమైన సేవకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి తో పాటు మరణానంతరం సెయింట్ హుడ్ కూడా లబించింది. సేవకు ఎన్నో మర్పులున్నాయి. అటుగా నడవటం, అలా నడవమని మన పిల్లలకు బోధించడం మన ధర్మం, కర్తవ్యం.

    సేవా సంకల్పం మనిషిలోని అద్భుత సౌందర్యం

    రెండు చేతులా ఏదైనా ఎవరికైనా ఏదీ ఆశించాకుండా పంచే రోజు ఇది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ఈ స్వచ్చంధ సేవలో తరించారు. అతి సామాన్యులు కూడా…

  • ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక సేవకు భారత ప్రభుత్వం నేషనల్ యూత్ అవార్డు ఇచ్చింది. అంజలి స్వస్థలం చెన్నయ్. మంచి ఆర్టిస్ట్ చిన్నపటినుంచి బొమ్మలు గీస్తోంది. తన చిత్రాల ద్వారా బాల కార్మికులు ప్రక్రుతి వైపరీత్యాలు పునరావాస బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరిస్తోంది. భారత దేశంలో మధుమేహం తో బాధపడే పసివాళ్ల కోసం ఇన్సులిన్ ఇతర మందులు కొనేందుకు తన చిత్రాల ద్వారా ఇంటెర్నేషనల్ డయాబెటిస్ చారిటీ కి మూడు లక్షల విరాళం ఇచ్చింది. అంజలి చిత్రానికి యునైటెడ్ నేషన్స్ పోస్టర్ ఫర్ పీస్ కాంటెస్ట్ లో మూడో బహుమతి వచ్చింది. పిక్చర్ ఇట్ అన్న ప్రాజెక్ట్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది అంజలి. ఈమె గీసిన బొమ్మలు యూనిసెఫ్ యూనిస్కో లాంటి సంస్థలు కొనుగోలు చేసాయి. 22 ఏళ్ల వయసులో అంజలి చాలా సమయం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తోంది.

    తన ప్రతిభ తోనే ఇతరులకు చేయూత

    ఇవాళ్టి తరం అమ్మాయిలకు కెరీర్ పైన ఉన్న శ్రద్ధ  సమాజం పైన కూడా వుంది. అందుకు నిదర్శనం న్యూయార్క్ లో వుండే అంజలీ చంద్రశేఖర్. ఈమె సామజిక…

  • కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే వుంటాయి. రల్ స్కెబ్ ల దగ్గర నుంచి ప్రోట్రెయిట్ ఆయిల్ పెయింటింగ్స్ ఎంతో మంది గొప్ప చిత్రకారులు వస్తే ముగ్ధులైపోయి వుంటాం. ఇప్పుడిది తక్కువ కాదు. సీసాల్లో రంగుల ఇసుక పోస్తే గొప్ప గొప్ప పెయింటింగ్స్ సృష్టించడం మాములు సంగతి జోర్బాన్ లోని పెట్రులో రకరకాల రంగుల్లో వున్న ఇసుక పర్వతాలున్నాయి. పర్వతాలను ఇసుక పొరలుగా సీసాల్లో పోసి అమ్మేవారు స్థానికులు. నెమ్మదిగా ఈ ఇసుక పొరల్లో ఎడారి ఒంటెను సృష్టించారు ఆర్టిస్ట్ లు. ఇక ఆ బాటిల్ సాండ్ ఆర్ట్ సోషల్ మీడియా ద్వారా విదేశాలకు వారి సృజనకారుల చేతుల్లో పడి అందమైన పెయింటింగ్స్ సీసాలో ప్రత్యక్షమై గృహాలంకరణ లో భాగమయింది. ఇసుక రంగులు ముగ్గు కలిపి ఏనాటి నుంచి మన ఆడపిల్లలు నెలపైన వెన్నెల ముగ్గులు తీర్చిదిద్దేస్తారు. ఇది నేర్చుకోవడం కష్టమా ఒక సారి ఈ బాటిల్ శాండ్ ఆర్ట్ గొప్పదనం చూడండి. ఎన్నో ఇమగెస్ వున్నాయి.

    ఇసుక సీసా ఉద్యానవనాలు

    కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూనే వుంటాయి. రల్ స్కెబ్ ల దగ్గర నుంచి ప్రోట్రెయిట్ ఆయిల్ పెయింటింగ్స్ ఎంతో మంది గొప్ప చిత్రకారులు వస్తే ముగ్ధులైపోయి వుంటాం.…

  • నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి ఎంత మేలు చేస్తాయని యువత పైన పరిశోధనలు నిర్వహించారు. ఎనర్జీ విటమిన్ పానీయాల్లో ఎలాంటి శక్తి లేదనీ వాటివల్ల శారీరిక మానసిక ఆరోగ్యం మెరుగుపడదనీ పరిశోధనల్లో వెల్లడైంది. ఎనర్జీ డ్రింక్ లు తాగి మిగతా పౌష్టికాహారం ఏమీ తీసుకోకుండా ఒక నెలరోజులపాటు ఉన్నా ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ఎంతో బరువు తగ్గిపోయి శరీరం శక్తిహీనమై పోవటం గమనించమన్నారు. కొద్ది రోజుల పాటు రెగ్యులర్ గా తినే ఆహారం తినకపోతేనే తేడా తెలిసిందన్నారు. వాస్తవానికి మనం తినే ఆహారంలో విటమిన్లు పోషకాలు వుంటాయని కొద్ది పాటి మార్పులు చేర్పుల వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుందని ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఒక్క అణువంత కూడా లాభం లేదని తేల్చారు. విటమిన్లు మినీరల్సు నేరుగా లేదా ద్రవంగా తీసుకున్న పెద్దగా ఒరిగేదేమీలేదని వెల్లడైంది.

    ఎనర్జీ డ్రింక్స్ పరమ వేస్ట్

    నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి…

  • వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు వీళ్ళు. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందంటే ఎన్నో గాసిప్స్. వాళ్ళకి ఎందరితోనో సంబంధాలు అంటగడతుంటారు. ఎంతకాలం సహించటం. సహనానికి కుడా ఒక హద్దు ఉంటుంది. అందుకే ఈ కాలం హీరోయిన్లు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో ఫేస్ బుక్,ట్విట్టర్ లలో షేర్ చేస్తున్నారు. తమ గురించి వచ్చే రూమర్స్ ,ఎఫైర్స్,లవ్ ,సెక్స్, విడిపోవటం దేని గురించి అయిన చాల బోల్డ్ గా మాట్లడేస్తున్నారు. ఎలాంటి సీరియస్ విషయాన్ని అయిన తెలికగా తీసుకుంటున్నారు. తమ జీవితాలలోవచ్చే ప్రేమను సంతోషాన్ని చేబుతున్నారు. మొన్నటికి మొన్న శృతి బిచ్ అంటే తనదైన స్టైల్ లో స్పందించింది. సమంత తన ప్రేమకు సంబందించి ప్రతి విషయాన్ని పోస్ట్ పెడుతుంది. సోనాక్షి ఎవరో లావుగా ఉన్నవంటే నటించటానికి వచ్చా కాని జీరో సైజ్ కోసం రాలేదని ఘాటుగా స్పందించింది. పరిణితి చోప్రా ఎవరో జర్నలిస్ట్ బహిష్టు గురించి ఏదో ప్రశ్నిస్తే మగవాళ్ళు అర్ధం చేసుకోవల్సిన ప్రాసెస్ కాదిది అదోక ఆరోగ్యకరమైన సహజసిద్దం అయిన విషయం అని సిగ్గు పడిపోయింది.

    సందేహించకుండా సమాధానాలిస్తున్నారు

    వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు వీళ్ళు. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందంటే ఎన్నో గాసిప్స్. వాళ్ళకి ఎందరితోనో సంబంధాలు…

  • ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ స్టార్ట్ అప్ అమ్మాయి అను గుప్తా,స్వప్న చౌదరి. వీళ్ళిద్దరు మేక్ మై విషెష్.కమ్ పెట్టారు. అను ఐటీ అయ్యాక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో పని చేశారు. అను బ్యాంకర్ ఐసిఐసిఐ ,స్టార్టప్ చార్టర్డ్ వంటి ప్రముఖ బ్యాంక్ లలో పని చేశారు. ఇద్దరి అభిరుచి ఒకటే వినియోగదారునుకి పనికొచ్చే చిన్న అవసరాన్ని బిజినెస్ గా మలచాలని ప్రతి వేడుకకు గిఫ్ట్ పంపి శుభాకాంక్షలు చెప్పే ఈనాటి యువతరం ఆలోచనను ఆ సంస్కృతిని పట్టుకుని స్టార్టప్ మొదలు పెట్టారు. వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకుని గిఫ్ట్ ను ఎంచుకుంటే పంపాల్సిన వాళ్ళకి సమాయానికి డెలివరి చేస్తుంది ఈ సంస్థ.ఈ కోత్త ఐడియా బాగానే వర్కవుట్ అవుతుందంటున్నారు పారిశ్రామిక వేత్తలు.

    బహుమతులు పంపేస్తారు వాళ్ళు

    ఏన్నో రకాల అకేషన్స్ వస్తుంటాయి. ఏదైన గిఫ్ట్ పంపితే వెళ్ళాల,కోనాల ఫంక్షన్ కు హజరవ్వాలి. అక్కడ ఇవ్వాలి టైమేది..అక్కర్లేదు మేము ఆపని చేసి పెడతాం అంటున్నారు యువ…