ఏకశిల గణపతి

ఏకశిల గణపతి

ఏకశిల గణపతి

భారతదేశం లోని ఎత్తైన గణపతి విగ్రహం తెలంగాణ రాష్ట్రం, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం లోని  ఆవంచ గ్రామంలో ఉంది. 30 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పు ఉన్న ఏకశిలా విగ్రహం ఇది. ఈ విగ్రహం 9.144 మీటర్ల ఎత్తు ఉంది ఉంటుంది. దాన్ని ఐశ్వర్య గణపతి, ఆవంచ గణపతి అని కూడా పిలుస్తారు. 12వ శతాబ్దంలో ఆవంచ లో పశ్చిమ పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన తైలంపుడు పెద్ద గ్రానైట్ బండ రాతిపై ఆ పురాతన గణపతి విగ్రహాన్ని చెక్కించాడు. ఈ విగ్రహం వ్యవసాయ క్షేత్రంలో ఉంది. విగ్రహానికి గుడి చుట్టూ గోడ లేదు.