యానంలో ఉన్న ఓబిలిస్క్ టవర్ అచ్చంగా పారిస్ లోని ఈఫిల్ టవర్ లాగా ఉంటుంది . దాదాపు 18 ఎకరాల స్థలంలో గారియం పేట గ్రామంలో దీన్ని నిర్మించారు . వంద మీటర్ల పైనే ఎత్తు ఉంటుంది . భూమి పై నుంచి వంద అడుగుల వరకు సిమెంట్ కాంక్రీట్ తోను ఆపైన స్ట్రక్చరల్ స్టీల్ తోనూ కట్టడం నిర్మించారు . పై అంతస్థులో చక్కని గ్యాలరీ ఉంది . గోదావరి అందాలు ,రమణీయమైన ప్రకృతి ని ఇక్కడి నుండి చక్కగా చూడచ్చు . దీన్ని ఇండియన్ ఈఫిల్ టవర్ అని పిలుస్తారు .

Leave a comment