యువతరం ఎన్నెన్నో కారణాలతో శాఖాహారానికి మొగ్గుతున్నారు . కానీ మాంసాహార రుచులు కోరుకొనే నాలుకను సంతృప్తి పరచటం కోసం ఎన్నోపదార్దాలు తయారవుతున్నయి . మొక్కల నుంచి తయారయ్యే వెజ్ మీట్. ఇప్పుడు ఎన్నో పదార్దాల తో అచ్చం మాంసం రుచితెచ్చే వంటలు తయారవుతున్నాయి . తియ్యని పనస పండు తో కూడా బిర్యానీ వంటి  వంటలు తయారు చేస్తున్నారు . శాఖాహారులు ఇష్టంగా తినే ఈ బిర్యానీ లో  పనస ముక్కలు అచ్చం మాంసం లాగే అనిపిస్తాయి పనస లో మాంసకృత్తులు అధికం . ప్రత్యామ్నాయ మాంసంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నారు . పనసకాయతో ఎనో ప్రయోగాలు చేసి ఇప్పుడు మాంసానికి ప్రత్యామ్నాయం గా ఈ పనసను వాడుతున్నారు .

Leave a comment