ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబు జానీ ,సందీప్ కోస్లా పరిశ్రమకు వచ్చి 33 ఏళ్ళు పూర్తయ్యాయి . ఈ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఒక ఫ్యాషన్ షో లో  దీపికా పడుకొనే ఒక వెండి రంగు లెహంగాతో రాంప్ వాక్ చేశారు . ఆ లెహంగా అందానికి  ఫ్యాషన్ ప్రేమికులు  మురిసిపోయారు . వెన్నెల సింగారించుకొన్న దేవకన్యలా ఉందని దీపికను పొగడ్తలతో ముంచెత్తారు . ఈ రాంప్ పైన నడవటంతో సరిపెట్టు కోలేదు . దీపికా డిస్కో దివానీ పాటకు చక్కగా డిజైనర్లతో కలసి సరదాగా అడుగులు వేసింది . దీపికా ధరించిన లెహంగా ఇద్దరు ఫ్యాషన్ డిజైనర్ల క్రియేటివిటీకి అర్ధం పట్టేలా ఉందన్నారు  ఫ్యాషన్ ప్రేమికులు  . కానీ చక్కని లెహంగాకే అందం వచ్చేలా ఉంది దీపికా పడుకొనే .

Leave a comment