చర్మం పై పేరుకోన్నా మృతకణాలు తొలిగించుకొనేందుకు కాసిన పాలు చాలు . పాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి . ఇవి సహజ క్లెన్సర్ లు . పాలలో దూదిని ముంచి ముఖం పై మృదువుగా రెండు నిముషాల పాటు రుద్దినా చాలు మురికి పోయి చర్మం మృదువుగా అయిపోతుంది . ముల్తానీ మట్టి ,గంధం ,సెనగపిండి ,వీటిలో దేనికైనా పాలని జతచేస్తే చాలు చక్కని పేస్ పాక్ రెడీ అయిపోతుంది . ఆ మిశ్రమాన్ని మొహానికి అప్లయ్ చేసి అరగంట పోయాక కడిగేస్తే చాలు ముఖం తాజాగా అయిపోతుంది . మురికి మచ్చలు పోతాయి చర్మం మెరిసిపోతుంది . వట్టి పచ్చిపాలు ప్రతిరోజు మొహం పైన రాసుకొని కాస్సేపు అలాఉంచి కడిగేసినా చర్మం పొడిబారదు .

Leave a comment