2019లో నేనొకటి కనిపెట్టాను . మనం ఏదైనా కష్టాల్లో ఉంటె దేవదూతలు స్నేహితుల రూపంలో వచ్చి మనకు సహాలు ,సూచనలు ఇచ్చి మనల్ని ప్రమాదం నుంచి తప్పిస్తారు అంటోంది శృతి హాసన్ . గత సంవత్సరం మీరు నేర్చుకొన్న జీవిత పాఠం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు . మనం చేయగల మంచిపని  ఏదైనా ఉందీ అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి ,అదే నేను నేర్చుకొన్న కొత్తపాఠం అంది శృతి . ఎలాటి ఉద్వేగాలకు ,ఆవేశాలకు లోనుకాకుండా కూల్ గా ఉండాలి అనుకొన్నాను అంటోందామె . ఇది ఎవరైనా అనుసరించవలసిన సలహానే మనసు శరీరం ఆరోగ్యంగా ఉంచగలిగే చిట్కా ఇది .

Leave a comment