కరోనా వైరస్ వణికిస్తున్న సమయంలో అయుర్వేదం కొన్ని చిట్కాలు చెపుతోంది. దగ్గు వంటి కరోనా లక్షణాల కు పసుపు అమోఘంగా పని చేస్తుంది అంటోంది. జలుబు,దగ్గు తగ్గాలంటే అల్లం ,పసుపు అమోఘంగా పని చేస్తాయి. అల్లాన్ని ఇండియన్ ఆస్ప్రిన్ అంటారు. అల్లం చిన్న ముక్కలు చేసి నీటిలో మరిగించి అందులో కాస్త పసుపు ,బెల్లం కలిపి గోరు వెచ్చగా తీసుకొంటే దగ్గు తగ్గుతుంది. అల్లం రసం,మిరియాల పొడి ,తేనె ,పాలు కలిపి తాగిన మంచిదే. పాలల్లో పసుపు కలిపి తాగావచ్చు. అలాగే వెల్లుల్లి కూరల్లో కలిపి తీసుకోవచ్చు. మిరియాల పొడి ,దాల్చిన చెక్క పొడి, పసుపు గ్రాము మోతాదులో పాలలో కలిపి తీసుకొంటే దగ్గు,జలుబు తగ్గుతాయి.

Leave a comment