ఈ రోజుల్లో చాలామందికి చాలా చిన్న వయసులోనే నెలసరి ఆగిపోయి మెనోపాజ్ దశ వచ్చేస్తోంది. ఇలా వస్తే ఎముకలు బలహీన పడటం గుండె జబ్బులు రావటం జరగవచ్చు సంతాన సాఫల్యత ఉండదు. ఇవన్నీ లేకుండా సరైన సమయానికే మెనోపాజ్ రావాలంటే మాంసకృత్తులు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలని చెపుతున్నారు మసాచు సెట్స్ విశ్వ విద్యాలయి అధ్యయనకారులు శాఖాహార భోజనం నుంచే ఆ మృతకణాలు అందితే సరైన సమయానికి మెనోపాజ్ దశ వస్తుందని తేల్చారు. మొత్తం 2000 కేలరీలు అందించే ఆహారం తీసుకొంటే అందులో పాస్తా టోఫు గింజల రూపంలో కనీసం 32 గ్రాములు అందేలా తీసుకొంటే మనోపాజ్ సంబంధిత సమస్యలు రావు అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment