పుట్టిన వెంటనే తల్లిని పోగొట్టుకున్న ఎందరో బిడ్డల కోసం ప్రారంభమైంది మామ్..అహ్మదాబాద్ కు చెందిన ఆఫీస్ బేబీ కేర్ సెంటర్ కు చెందిన ఈ సంస్థ తల్లి పాల కోసం అలమటించే నవజాత శిశువుల ఆకలి తీర్చేలా తల్లులను ప్రోత్సహిస్తుంది. కొన్ని పాలను అనాధ బిడ్డలకు ఇవ్వాలని అవగాహన కల్పిస్తోంది. వీరి పిలుపుకు  250 మంది తల్లులు స్పందించారు. పాల దాతగా పేరు నమోదు చేయించుకున్నారు ఇప్పటివరకు వీరంతా కలిసి 90 లీటర్ల పాలు దానం చేశారు.ఆ పాలు తాగి 600 మంది శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు.

Leave a comment